పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా రైతులకు సాగునీరు, తాగునీటికి ఊరటనిచ్చే పట్టిసీమ ఎత్తిపోతలతో పథకాన్ని గత అయిదేళ్లుగా ప్రభుత్వం పక్కన పెట్టివేసింది. గత ఏడాది తాగునీటి ఎద్దడిని తట్టుకోలేక కొద్ది రోజులు పట్టిసీమను వినియోగించి ప్రభుత్వం మమ అనిపించింది. ఈ ఏడాది నాగార్జున ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరటంతో .. కృష్ణా, గుంటూరు జిల్లాలు తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. కనీసం కృష్ణాజిల్లా రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో పట్టిసీమ మోటార్లతో నీటి తరలింపు ప్రారంభించారు. ఏలూరు జిల్లా పోలవరం మండలం విక్కిసిరావుపేట వద్ద శుక్రవారం ఉదయం పట్టిసీమ పైప్ లైన్ పగిలిపోయింది. ఎయిర్ వాల్ లీక్ ఘటనతో 20 అడుగులు ఎత్తులో నీళ్లు ఎగిసి పడుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతల నుంచి పైప్ లైన్ ద్వారా కుడి కాల్వలోకి నీళ్లు వెళ్లే మార్గంలో పైప్ లైన్ ధ్వంసమైంది.
జగన్ సర్కార్ నాలుగేళ్లుగా పట్టిసీమను నిర్లక్ష్యం చేసి వినియోగించకుండా వదిలేయడం వల్లే ఈ ఘటన జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైప్ లైన్ లీక్ తో గోదావరి జలాలు పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. గోదావరి నది నుంచి పోలవరం కుడి కాల్వ వరకు డెలివరీ ఛానల్ ఏర్పాటు చేశారు. రెండు రోజుల కిందట మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి 2,800 క్యూసెక్కుల గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు కుడి కాలవకు విడుదల చేశారు. పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం 14.74 మీటర్లకు పైబడి ఉండడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 8 పంపులు 8 మోటార్ల ద్వారా నీటి పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పైప్లైన్ లీకేజీ జరిగింది. ఇటుకల కోట డెలివరీ ఛానల్కు వెళ్లే పైపు లైన్ వాల్ ప్లేట్ ఊడిపోయింది.
పైప్ లైన్ లీకేజీతో తమ పొలాలు మునిగిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు నీటి లీకేజీ అరికట్టాలని కోరుతున్నారు. మరోవైపు పైప్లైన్ పగిలిపోయిన ప్రాంతానికి వెళ్లే మార్గం కూడా మూసుకుపోయింది. చెట్లు, పొదలతో నిండిపోయిన ప్రాంతానికి చేరాలంటే జంగిల్ క్లియర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోటార్లను నిలుపుదల చేస్తే తప్ప ఏ లైన్ పగిలిందో గుర్తించలేని పరిస్థితి ఉంది. దీంతో జలవనరుల శాఖ అధికారులు పైప్లైన్లలో ఏ మేరకు నష్టం జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు.
అటు, ఈ ఘటనపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత జలవనరుల శాఖ ఇంజినీర్లతో నిమ్మల ఫోన్లో మాట్లాడారు. వెంటనే లీకేజిని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశాలతో లీకేజీ నివారించే చర్యలను అధికారులు చేపట్టారు. నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపి జలవనరుల శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pattiseema-pipeline-leak-39-180136.html
కడప పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందని అంటున్నారు. అలా ఉప ఎన్నిక వస్తే ఊరూ వాడా తిరిగి ప్రచారం చేసే బాధ్యతను నేను తీసుకుంటా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోయిన వైఎస్ జగన్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలతో వాతలు పెట్టారు. సోమవారం నాడు విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్రెడ్డి, పరోక్షంగా అనిపించినప్పటికీ ప్రత్యక్షంగానే జగన్ మీదకి మాటల బాణాలు వదిలారు.
మనం మనం ఒకటే అని చెప్పి, తన సామాజికవర్గానికే చెందిన వారిని మాయచేసి 514 కోట్ల రూపాయల భారీ మోసం చేసిన మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలోని పలువురు దివ్యాంగ విద్యార్థులు ప్రతిభను కనబరిచి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వాళ్ళు మంత్రి లోకేష్ని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
బిఆర్ఎస్ నేతలు కెటీఆర్, హరీష్ రావులు తీహార్ జైల్లో కవితను పరామర్శించినట్టు వార్తలు పైకి వెలువడుతున్నప్పటికీ అసలు ఎజెండా మాత్రం ఢిల్లీ పెద్దలను కలవడం అని తెలుస్తోంది.
జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిమ్స్.కి నీటి సరఫరా ఆపేశారు. ఎందుకంటే, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించింది కదా.. అందుకని! నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదువుతున్నాయి మహాప్రభో అని ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు.
ఫ్రాన్స్ ప్రభుత్వం నెపోలియన్ వాడిన తుపాకులను జాతీయ సంపదగా ఇటీవలే ప్రకటించింది. అయినప్పటికీ, వీటిని బహిరంగ వేలంలో ఫ్రాన్స్ పౌరుడు ఒకరు కొనుగోలు చేశారు. వీటిని దేశం దాటించడానికి అవకాశం లేదు.
వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఇప్పటి వరకు భారీ వర్షాలు లేవు. నెల రోజులు దాటినప్పటికీ ఇంత వరకు భారీ వర్షాలు లేవు. కానీ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవంపై దృష్టి సారించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీ కచ్చితంగా తెలంగాణలో పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ సత్పలితాలను ఇస్తోంది. ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు,ఆరుగురు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నది. ఆ పార్టీ నుంచి వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో కింగ్ పిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.