ఆయన తొలి సారి ఎంపీగా ఎన్నికయ్యారు. అతి సామాన్య కుటుంబ నేపథ్యం ఆయనది. రెండు దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పని చేస్తూ వస్తున్నారు. ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదు. తన పనితీరు ద్వారానే పార్టీ అధినేతను మెప్పించారు. పార్టీ పట్ల ఆయన అంకిత భావాన్ని గుర్తించి తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇటీవలి ఎన్నికలలో ఆయనను విజయనగరం లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీలో నిలిపారు.
ఆయన పేరు కలిశెట్టి అప్పలనాయుడు. విజయనగరం లోక్ సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన పార్లమెంటులో అడుగుపెట్టారు. తొలి సారి లోక్ సభకు వెళ్లిన సమయంలో కూడా ఆయన పార్టీ జెండాను పట్టుకుని సైకిల్ పైనే వెళ్లారు. ఢిల్లీ వీధుల్లో ఆయన సైకిల్ పై లోక్ సభకు వెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
అత్యంత సామాన్య కుటుంబ నేపథ్యం ఉన్న అప్పల నాయుడు లోక్ సభకు ఎన్నిక కావడం ఒకెత్తు అయితే.. ఎంపీగా తన తొలి నెల వేతనాన్ని అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇవ్వడం మరోఎత్తుగా చెప్పుకోవాలి.
ఔను ఎంపీగా తన తొలి నెల వేతనాన్ని కలిశెట్టి అప్పలనాయుడు అమరావతి నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు లక్షా 57వేల రూపాయల చెక్కును ఆయన చంద్రబాబుకు అందించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఆయన ను కలిసిన అప్పలనాయుడు ఆ చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎంపీలు కూడా ఉన్నారు. చంద్రబాబు అప్పలనాయుడిని అభినందించారు.
కాగా అప్పలనాయుడు ఎంపీగా తన తొలి నెల వేతనాన్ని అమరావతికి విరాళంగా ఇవ్వడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. గతంలో పొందూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా పని చేసిన అప్పలనాయుడు ఆ తరువాత తెలుగుదేశం ఉత్తరాంధ్ర ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గా కూడా పని చేశారు. పార్టీ పట్ల అంకిత భావం, విధేయతతో పని చేసిన అప్పలనాయుడి సేవలను గుర్తించిన చంద్రబాబు ఆయనకు విజయనగరం ఎంపీ టికెట్ ఇచ్చారు. చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడుతూ అప్పలనాయుడు దాదాపు 2 లక్షల 50 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mp-appalanaidu-donates-1st-month-salary-to-amarawathi-39-180113.html
కడప పార్లమెంట్ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక వస్తుందని అంటున్నారు. అలా ఉప ఎన్నిక వస్తే ఊరూ వాడా తిరిగి ప్రచారం చేసే బాధ్యతను నేను తీసుకుంటా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా రాకుండా పారిపోయిన వైఎస్ జగన్కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలతో వాతలు పెట్టారు. సోమవారం నాడు విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్రెడ్డి, పరోక్షంగా అనిపించినప్పటికీ ప్రత్యక్షంగానే జగన్ మీదకి మాటల బాణాలు వదిలారు.
మనం మనం ఒకటే అని చెప్పి, తన సామాజికవర్గానికే చెందిన వారిని మాయచేసి 514 కోట్ల రూపాయల భారీ మోసం చేసిన మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
జగన్ అక్రమ ఆస్తుల కేసులో నిందితుడు, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్కు తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ చొరవతో రాష్ట్రంలోని పలువురు దివ్యాంగ విద్యార్థులు ప్రతిభను కనబరిచి ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఈ సందర్భంగా వాళ్ళు మంత్రి లోకేష్ని కలసి కృతజ్ఞతలు తెలిపారు.
బిఆర్ఎస్ నేతలు కెటీఆర్, హరీష్ రావులు తీహార్ జైల్లో కవితను పరామర్శించినట్టు వార్తలు పైకి వెలువడుతున్నప్పటికీ అసలు ఎజెండా మాత్రం ఢిల్లీ పెద్దలను కలవడం అని తెలుస్తోంది.
జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ఎయిమ్స్.కి నీటి సరఫరా ఆపేశారు. ఎందుకంటే, ఇది చంద్రబాబు నాయుడు హయాంలో నిర్మించింది కదా.. అందుకని! నీళ్లు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదువుతున్నాయి మహాప్రభో అని ఎయిమ్స్ డైరెక్టర్ మధువానందకర్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు.
ఫ్రాన్స్ ప్రభుత్వం నెపోలియన్ వాడిన తుపాకులను జాతీయ సంపదగా ఇటీవలే ప్రకటించింది. అయినప్పటికీ, వీటిని బహిరంగ వేలంలో ఫ్రాన్స్ పౌరుడు ఒకరు కొనుగోలు చేశారు. వీటిని దేశం దాటించడానికి అవకాశం లేదు.
వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఇప్పటి వరకు భారీ వర్షాలు లేవు. నెల రోజులు దాటినప్పటికీ ఇంత వరకు భారీ వర్షాలు లేవు. కానీ
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవంపై దృష్టి సారించారు. తెలంగాణ గడ్డపై పుట్టిన తెలుగుదేశం పార్టీ కచ్చితంగా తెలంగాణలో పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
పిసిసి అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ సత్పలితాలను ఇస్తోంది. ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలు,ఆరుగురు ఎమ్మెల్సీలు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిపోయారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా మారిపోతున్నది. ఆ పార్టీ నుంచి వలసలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాంలో కింగ్ పిన్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.