తొలిసారి ఎంపీ... అందునా మహిళ.. ఏముందిలే 543 మంది ఎంపీలలో ఆమే ఒకరు అనుకున్నారంతా. కానీ ఆమె లోక్ సభలో తన తొలి ప్రసంగంతోనే అదరగొట్టేశారు. అందరి దృష్టినీ ఆకర్షించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒకరు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను బైరెడ్డి శబరి గట్టిగా తిప్పి కొట్టారు. ఆయన ప్రసంగంలోని తప్పులను ఎత్తి చూపారు. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో జగన్ సర్కార్ విధ్వంసాన్నీ ఎండగట్టారు. ఆమె అనర్గళంగా ఆంగ్లంలో చేసిన ప్రసంగాన్ని సభ మొత్తం స్పెల్ బౌండ్ అయ్యి ఆలకించింది. చప్పట్లతో అభినందనలు తెలిపింది.
ఇంతకీ తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు తన ప్రసంగంలో చంద్రబాబు ఈడీ కేసులో అరెస్టయ్యారనీ, అటువంటి వ్యక్తి మద్దతుతో మోడీ సర్కార్ మనుగడ సాగిస్తోందనీ అన్నారు. వెంటనే బైరెడ్డి శబరి చంద్రబాబును అరెస్టు చేసింది ఈడీ కాదు.. ఏపీ సీఐడీ అని కరెక్ట్ చేశారు. అలాగే చంద్రబాబును జగన్ సర్కార్ కేవలం కక్ష పూరితంగా అక్రమంగా అరెస్టు చేసిందని చెప్పారు. అలాగే చంద్రబాబు ఊతకర్ర కాదనీ, కత్తి అని చెబుతూ ఆయనను సీఐడీ నంద్యాలలో అరెస్ట్ చేశారు, అందుకే నంద్యాల జిల్లా మొత్తంలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పారు. తన తొలి ప్రసంగంలోనే శబరి హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర, విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని సంపన్న రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి బాటలో పరుగులు తీయించిన తీరును కళ్లకు కట్టినట్లు చెప్పారు.
అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిందనీ, వైసీపీ హయాంలో ఏపీ సర్వ విధాలుగా నాశనమైపోయిందని విమర్శించారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఏపీనే అంటూ విమర్శలు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలన కారణంగా ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు. ఏపీ రాజధాని అమరావతికి అప్పట్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన విషయాన్ని శబరి తన ప్రసంగంలో గుర్తు చేశారు. అలాగే వైసీపీ మూడు రాజధానులు అంటూ అమరావతిని నిర్వీర్యం చేసిందన్నారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ కు జీవనాడి వంటి పోలవరం ను కూడా వైసీపీ సర్కార్ పట్టించుకోలేదన్నారు. తెలుగుదేశం హయాంలో పోలవరం ప్రాజెక్టును 72 శాతం పూర్తి చేస్తే.. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క శాతం పనులు కూడా చేయలేదని, జగన్ హయాంలో మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిచాయని విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి బాట పడుతుందనీ, అందుకు కేంద్రం సహకారం అవసరమనీ తన ప్రసంగాన్ని ముగించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/loksabha-spellbound-with-sabari-speach-39-179914.html
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య శనివారం నాడు జరిగే చారిత్రక సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.
నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కి వచ్చిన చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ నగరం ఘన స్వాగతం పలికింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా రైతులకు సాగునీరు, తాగునీటికి ఊరటనిచ్చే పట్టిసీమ ఎత్తిపోతలతో పథకాన్ని గత అయిదేళ్లుగా ప్రభుత్వం పక్కన పెట్టివేసింది. గత ఏడాది తాగునీటి ఎద్దడిని తట్టుకోలేక కొద్ది రోజులు పట్టిసీమను వినియోగించి ప్రభుత్వం మమ అనిపించింది. ఈ ఏడాది నాగార్జున ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరటంతో .. కృష్ణా, గుంటూరు జిల్లాలు తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. కనీసం కృష్ణాజిల్లా రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో పట్టిసీమ మోటార్లతో నీటి తరలింపు ప్రారంభించారు.
కేతిరెడ్డికి జగన్ విజయవాడకి రమ్మని కబురు చేశారట. అయితే కేతిరెడ్డి మాత్రం నేను ఇప్పుడు రాలేను.. నా మనసేమీ బాగాలేదు అని రిప్లయ్ ఇచ్చారట.
ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా.. చేసిన పాపాలకు అసలు వడ్డీతో టి సిసలుగా ఫలితంబు అనుభవించుట తధ్యమన్నా.. అంటూ సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలో ఓ పాట ఉంది. జీవితంలో మనంచేసే మంచి చెడులకు ఫలితాలు తప్పకుండా అనుభవించాల్సి వస్తుందని దీని సారాంశం. ఈ పాట మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అతికినట్లు సరిపోతుంది.
తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పీక్స్ కు చేరాయి. హిందుత్వ భావజానం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజప రిణామంగా అంతా భావించేవారు. వామపక్ష పార్టీలు, బీజేపీలు కన్జర్వేటివ్ పొలిటికల్ పార్టీలకు భిన్నంగా సైద్ధాంతిక నిబద్ధతతో ఉంటాయని భావించేవారు. అయితే బీజేపీలో ఇప్పుడా పరిస్థితి లేదు.
కోడి సాధారణంగా పొయ్యి మీద వున్న గిన్నెలోకి చేరుతుంది.. కానీ, బ్రిటీష్ కొలంబియాలో ఒక కోడి గిన్నిస్ బుక్కులోకి చేరింది. ప్రపంచం మొత్తంలో అంకెలను, రంగులను గుర్తుపట్టి చెప్పగలిగే కోడిగా ఈ కోడి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది.
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రిమాండ్లో వున్న రేపిస్టు సుధాకర్ని పరామర్శించాల్సిన అవసరం వుంది. హత్యాయత్నం కేసులో జైల్లో వున్న తన పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పాతిక లక్షల రూపాయల ఖర్చు పెట్టించి పరామర్శించిన జగన్, ఇప్పుడు రేప్ కేసులో అరెస్టు అయిన సుధాకర్ని కూడా పరామర్శించాలి.
ఆయన తొలి సారి ఎంపీగా ఎన్నికయ్యారు. అతి సామాన్య కుటుంబ నేపథ్యం ఆయనది. రెండు దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పని చేస్తూ వస్తున్నారు. ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదు. తన పనితీరు ద్వారానే పార్టీ అధినేతను మెప్పించారు.
ఎక్కడో రంపచోడవరం గిరిజన గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేసే ఒక యువతి ఎమ్మెల్యే అవుతుందని ఎవరైనా ఊహించగలరా? ఎవరో వేరేవారు ఊహించడం కాదు.. సాక్షాత్తూ ఆ యువతి కూడా ఊహించలేదు.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో బిఆర్ఎస్ ఎల్ పిని కాంగ్రెస్ ఎల్ పిలో చేర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒక్కసారిగా ఆరుగురు కాంగ్రెస్ లో చేరిపోయారు.
టెక్సాస్లో వుండే మోనికా రిలే అనే ఓ బొద్దుగుమ్మ మాత్రం ఇలా అనుకోవడం లేదు. తాను బరువు బాగా పెరిగిపోవాలని కోరుకుంటోంది. అలా బరువు పెరగడం కోసం.... మూడు పూటలా కాదు... ఆరుపూటలా తింటూ కృషి చేస్తోంది.