మళ్ళీ మరోసారి కేద్రానికి జగన్.. జీ హుజూర్

Publish Date:Jan 29, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి ... ఎవరి మాటా వినరు. ఆయన సీతయ్య, అంటారు. ఆయనకు భయం అంటే ఏమిటో తెలియదని కూడా కొందరి ఉవాచ. స్వయంగా జగన్ రెడ్డి కూడా ఏదో సందర్భంలో, దేనికైనా గుండె ధైర్యం ఉండాలి, అంటూ రొమ్మువిరిచి గుండెలు చూపారు. 
అయితే, అదంతా నిజమేనా అంటే, కాదు అనే వాళ్ళున్నారు. ఆయన చాలా విషయాలకు భయపడతారు. నిజానికి భయం ఆయన్ని నీడల వెంటాడుతుంది. అందుకే, ఆయన ఆ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకే, ఇద్గో ఇలాంటి  బింకపు ప్రకటనలు చేస్తుంటారని అంటారు.  నిజానికి కేంద్రం పేరెత్తితే, ఆయన వణికి పోతారు. అందుకే  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాన్ని, జగన్ రెడ్డి వ్యతిరేకించలేదని అంటారు. అది నిజం కూడా, ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే, ఢిల్లీ వెళ్లి, ప్రధాని నరేద్ర మోడీని కలిసి, ఏపీ ప్రజల ప్రధాన ఆకాంక్ష, ‘ప్రత్యేక హోదా’ను మోడీ పాదాల దగ్గర పెట్టి, ‘శరణాగతి’ వేడి వచ్చారని అంటారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే, ఆక్రమాస్తుల కేసుల నుంచి తమను తాము రక్షించుకోవడమే ముఖ్యమనే ద్దేశంతోనే  ప్రత్యేక హోదా గురించి ప్రార్దిస్తామే కానీ, డిమాండ్ చేయమని చెప్పారు.ఆఫ్కోర్స్, అందుకు ఆయన కేంద్రంలో తాము ఆశించిన విధంగా, సంకీర్ణం రాలేదు కాబట్టి .. అంటూ సన్నాయి నొక్కులు నొక్కరు అనుకోండి అది వేరే విషయం.  
ఇక అక్కడి నుంచి ఇంతవరకు ఏ ఒక్క విషయంలోనూ కేంద్రాన్ని ప్రశ్నించే సాహసం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేయలేదు. ఆయన ప్రభుత్వమూ చేయలేదు. ఇది కళ్ళముందు కనిపిస్తున్న సత్యం. కేంద్రం ఏదంటే దానికి,  జీ హుజూర్ అంటూ తల ఊపడమే కానీ, ప్రశ్నించిన పాపాన పోలేదు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే నిర్ణయాలను సైతం ముఖ్యమంత్రి సమర్ధించారని అంటారు. అందు వల్లనే కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోని అంశాలు సహా ప్రతి విషయంలోనూ రాష్ట్రానికి అన్యాయమే చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
కాగ తాజాగా, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వివదాస్పద  సివిల్ సర్వీస్ కేడర్ రూల్స్ సవరణ ప్రతిపాదనకూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పారని అంటున్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు తమిళ నాడు, కేరళ, తెలంగాణ ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు బహిరంగంగా కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించాయి. ఆయినా, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్వాగతించారు. ఈమేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇది మరో మారు, కేంద్రానికి ముఖ్యమంత్రి ఎంతగా భయపడుతున్నారో. ఎలా సరెండర్ అయ్యారో చెప్పకనే చెపుతోందని రాజకీయ, అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.   
నిజానికి, సమాఖ్య స్పూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, బీజీపీ ప్రత్యర్ధి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులే కాదు, బీజేపీ పాలిత రాష్ట్రాల  ముఖ్యమంత్రులు కూడా మనఃస్పూర్తిగా స్వాగతించడం లేదు. బహిరంగంగా వ్యతిరేకించక పోయినా పార్టీ చానల్స్ ద్వారా తమ వ్యతిరేకతను తెలియ చేస్తున్నట్లు సమాచారం. ఇలా బీజేపీ ముఖ్యమంత్రులు సైతం వ్యతిరేకిస్తున్నప్రతిపాదనను జగన్ రెడ్డి స్వాగతించడం వెనక ఉన్నది భయం కాదా , అని ప్రశ్నిస్తున్నారు. 
ఓ వైపు తెలంగాణ సీఎం కేసీఆర్ అది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే నిర్ణయంగా చెబుతూ ఘాటు లేఖ రాస్తే జగన్ రెడ్డి మాత్రం ఆ నిర్ణయాని స్వాగతించడం,ఎలాంటి సంకేతాలు పంపుతుందని అనటున్నారు. 
కేంద్ర నిర్ణయం అమలైతే, రాష్ట్ర కేడర్ సివిల్ సర్వీస్ అధికారుల్ని కేంద్రం ఎప్పడు కావాలంటే అప్పుడు పిలిపించుకునేందుకు తలుపులు తెరుచు కుంటాయి.  అదే జరిగితే సివిల్ సర్వీస్ అధికారులు కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయినట్లేనని అంటున్నారు.  
అందుకే బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఈ అంశంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. పునరాలోచన చేయాలని సూచిస్తున్నారు.  
తెలంగాణ, తమిళ నాడు, కేరళ సహా బీజేపీయేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలు అయితే, కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకించడమే కాదు, ఉమ్మడి పోరాటానికి కూడా సిద్దమవుతున్నారు. చివరకు బీజేపీ భాగస్వామిగా ఉన్న బీహారు సంకీర్ణ ప్రభుత్వం కూడా కేంద్రం ప్రతిపాదనను తిరస్కరించింది. కానీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాత్రం  కేంద్రం నిర్ణయాన్నిస్వాగతించారు. అంటే, కేంద్రం రాష్ట్ర ప్రయోజనాలకు, సమాఖ్య స్పూర్తికి పూర్తి వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా, ‘జీ హుజూరు’ అంటూ తల ఊపడం తప్ప.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం పడిపోయిందని,విపక్షాలు కాదు స్వపక్షీయులే గుసగుసలు పోతున్నారు.

By
en-us Political News

  
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామా ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.