జడ్జీలపై దూషణలకు.. జగన్ సర్కారుకు లింకు!?

Publish Date:Feb 11, 2022

Advertisement

న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిందెవరు? వైసీపీ నేతలు, అభిమానులు, జగన్ వీరాభిమానులు మాత్రమేనా? వారంతట వారే జడ్జీలను దూషించారా? లేక.. జగన్ సర్కార్ స్వయంగా కొందరి చేత ఈ పని చేయించిందా? 'దూషణల' మూలాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 'డిజిటల్ కార్పొరేషన్'లోనూ ఉన్నాయా? సీబీఐ తీసుకుంటున్న చర్యలను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ ఔను' అనే సమాధానం వస్తోంది. వెరసి.. ఈ వివాదం జగన్ సర్కార్ మెడకు చుట్టుకునే అవకాశం లేకపోలేదనిపిస్తోంది.

జడ్జీలపై దూషణలు, అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా కొనసాగుతోంది. ఈ కేసులో సీబీఐ అధికారులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. అవుతు శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, కిషోర్ కుమార్ దరిస అలియాస్ కిషోర్ రెడ్డి దరిస, సుద్దులూరి అజయ్ అమృత్లను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

జడ్జిలపై కొన్ని పోస్టులకు సంబంధించిన మూలాల ఆధారంగా వెతుకుతూ పోయినప్పుడు.. డిజిటల్ కార్పొరేషన్ లో డొంక కదిలినట్లు తెలుస్తోంది. జడ్జీలపై పోస్టులను అక్కడే తయారుచేయించి, అక్కడి నుంచే సోషల్ మీడియాలోకి వదిలినట్లు సీబీఐ అనుమానిస్తోంది. దీనికి సంబంధించి డిజిటల్ మీడియాకు చెందిన ఏడుగురు ఉద్యోగులను ప్రశ్నించినట్లు తెలిసింది. వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో జడ్జీలపై పెట్టిన అనుచిత వ్యాఖ్యలు అప్ లోడ్ అయిన ఐపీ అడ్రస్ లను సీబీఐ గుర్తించిందని, వాటిలో ప్రభుత్వానికి చెందిన ఈ-ప్రగతి, డిజిటల్ కార్పొరేషన్లకు చెందిన ఐపీ అడ్రస్ లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

'డిజిటల్ కార్పొరేషన్’ అనే ప్రత్యేక సంస్థను జగన్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసింది. మంగళగిరిలో దీనికి ఒకపెద్ద కార్యాలయం ఉంది. డిజిటల్ కార్పొరేషన్ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. కానీ.. అంతకుముందు వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసిన అనేకమందికి డిజిటల్ కార్పొరేషన్ ళక్షఉపాధి కల్పించారు. జగన్ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ కు చెందిన 'ఐ-ప్యాక్ బృందంలోని కొందరు కూడా ఇందులో పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా రూ.70 వేల దాకా జీతాలు అందుతున్నాయి. అంతకు ముందు వీరి జీతాలను వైసీపీయే చెల్లించేది. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఖాతా నుంచి చెల్లిస్తుండడం గమనార్హం. ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి వీరంతా ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ..వైసీపీ కోసం పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి.

జడ్జిలపై సోషల్ మీడియా పోస్టులకు మూలాలు 'డిజిటల్ కార్పొరేషన్ లో ఉన్నట్లు సీబీఐ ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. అది పూర్తిస్థాయిలో నిర్ధారణ అయితే.. సర్కార్ కు ఇక్కట్లు తప్పవని చెప్పొచ్చు. న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాలలో అనుచిత వ్యాఖ్యల పోస్ట్ పెట్టిన అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ వైసీపీ కౌన్సిలర్ మారుతీ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆయన ఎమ్మెల్సీ ఇక్బాల్ కు ముఖ్య అనుచరుడు. ఢిల్లీ,  బెంగళూరుకు చెందిన ఒక డీఎస్పీ, ఇద్దరు ఇన్ స్పెక్టర్లు మారుతీ రెడ్డి ఇంటిలో 12 గంటల పాటు విచారణ కొనసాగించారు. మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీని సీజ్ చేసి మరీ విచారించడం విశేషం. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అధికారులు హిందూపురం వెళ్లడం గమనార్హం. జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలపై ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు 2020 నవంబర్ 11న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది సీబీఐ.

ఇక.. ఇదే కేసులో ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బుడ్డాయిపల్లికి చెందిన గంజికుంట మల్లికార్జున్ అనే వ్యక్తిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఈ తతంగాన్ని చూస్తుంటే జగన్ సర్కార్ ఇరుకున పడే ఛాన్స్ లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
ముఖ్యంగా కవిత టీఆర్ఎస్ పార్టీ.. బీఆర్ఎస్ పార్టీని క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేసింది. బీఆర్ఎస్ అధినేత సొంత కుటుంబం నుంచే తిరుగుబాటు రావడం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయంలో, గందరగోళంలో పడేసింది. పైగా కవిత.. పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో బీఆర్ఎస్ పరిస్థితి వెంటిలేటర్ పైకి వెళ్లేలా మార్చిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ప్రతిపక్షాలు సమర్పించిన ఈ నోటీసులో ప్రధానంగా ఎన్నికల నిర్వహణలో పారదర్శకత లోపించిందని, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించాయి. ఈ వ్యవహారంలో వివిధ పార్టీలకు చెందిన సభ్యులు ఏకతాటిపైకి వచ్చి నోటీసు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో ఇదే 152 స్థానాల పరిధిలో బీజేపీ బలం కేవలం 59 సీట్లు మాత్రమే. అయితే ఇప్పుడు ఆ సంఖ్యను రెండింతలు చేసి 110కి చేర్చడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ ఎం. కోదండరాం, మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పేర్లకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా శనివారం ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ సంతకం చేయడంతో.. వీరిద్దరి నియామకానికి మార్గం సుగమమైంది.
బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ అధినేత, తన కన్న తండ్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఇప్పుడు మన మనిషి కాదన్నారు. ఆయనను మరమనిషిగా అభివర్ణించారు. గుంటనక్కల చేతిలో బందీ అయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తెలంగాణ ఆత్మను పూర్తిగా కోల్పోవడం వల్లే తాను కొత్త పార్టీ పెట్టాల్సి వచ్చిందన్న కవిత.. ఉద్యమ నాయకుడైన కేసీఆర్ అభివృద్ధి రథం గాడి తప్పిందన్నారు. గతంలో జరిగిన కొన్ని తప్పుల్లో భాగస్వామినేనని అంగీకరిస్తూనే.. ఆ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు.
ఢిల్లీ, పంజాబ్ ప్రభుత్వాలపై అవినీతి ఆరోపణలు వ‌స్తుండ‌టంతో ఈ టాపిక్ డైవ‌ర్ష‌న్ డ్రామాను ఆప్ తెర‌పైకి తెచ్చింద‌ని అంటారు రాఘ‌వ్ చ‌ద్దా. ఇది కేవలం చద్దా వ్యక్తిగత నిర్ణయం కాదు, ఒక పెద్ద రాజకీయ వ్యూహం. రాజ్యసభలో ఆప్ కి ఉన్న 10 మంది ఎంపీల్లో ఏడుగురు.. అంటే 2/3 వంతు బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఉన్న కీలక వ్యక్తులు.. రాఘ‌వ్ చ‌ద్దా, సందీప్ పాఠ‌క్, అశోక్ మిట్ట‌ల్, మాజీ క్రికెట‌ర్ హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్తా, విక్రమ్ సాహ్ని ఉన్నారు.
పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)గా ప్రకటించారు. రాష్ట్రంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం, సామాజిక సమానత్వమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉద్యోగం అడిగిన యువకుడికి చంద్రబాబు ఆటో ఇస్తానని చెప్పినట్లుగా రెండు వేర్వేరు సందర్భాలను కలిపి ఎడిట్ చేశారు. ఉద్యోగం అడిగితే ఆటోతో సరిపెట్టుకోమన్నారనే అర్థం వచ్చేలా ఈ వీడియోను సృష్టించి వైరల్ చేస్తున్నారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి లోకేశ్ వైసీపీ తన పాత అలవాట్లను మానుకోవడం లేదనీ.. బురదజల్లే రాజకీయాలే పరమావధిగా పెట్టుకుందని దుయ్యబట్టారు.
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.