దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎటు చూసినా కాకీ దుస్తుల పహారా, ఇంటెలిజెన్స్ వర్గాల ముమ్మర తనిఖీలతో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ , సీబీఎస్ఈ పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ కుదుపునకు దారితీసింది. ఈ పరీక్షల లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వేదికగా నిరసనకు పిలుపునిచ్చింది.
జంతర్ మంతర్ వేదికగా ఈ భారీ సభ గనుక జరిగితే ఊహించని విధంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా, ట్రాఫిక్ ఇబ్బందులను అదుపు చేయడానికి కాక్రోచ్ పార్టీ ప్రతిపాదించిన ఈ భారీ నిరసన సభకు ఢిల్లీ పోలీసులు తొలుత అనుమతి నిరాకరించినా చివరకు అనుమతి ఇచ్చారు. ఈ నిరసన ప్రదర్శనలో కాక్రోజ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే పాల్గొన్నారు. ఈ ఉదయం ఆయన అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్పోర్టు నుంచి బయటకు వచ్చిన అభిజిత్ దిప్కే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆత్మకథ ప్రతిని చేతిలో పట్టుకుని మీడియాకు కనిపించారు. ఈ నిరసన నేపథ్యంలో సెంట్రల్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎ నిరసన వేదిక వద్ద దాదాపు 2,000 మందికి పైగా పోలీస్ సిబ్బందిని, సాయుధ బలగాలను మోహరించారు.
దేశం నలుమూలల నుండి నిరసనకారులు, విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వైపు తరలివచ్చారు. జంతర్ మంతర్, దాని చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రధాన రహదారులను తమ పూర్తి నిఘా నీడలోకి తీసుకువచ్చారు.
నిరుద్యోగ యువత, పరీక్షల లీకేజీల వల్ల నష్టపోయిన విద్యార్థుల సమస్యలపై కేవలం సోషల్ మీడియా వేదికగా పుట్టుకొచ్చిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ, చాలా తక్కువ సమయంలోనే దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఈ పార్టీ చేపట్టిన ఈ తాజా నిరసన కార్యక్రమానికి కేవలం విద్యార్థుల నుంచే కాకుండా, పలువురు దేశీయ రాజకీయ ప్రముఖులు, ప్రతిపక్ష నేతలు కూడా తమ పూర్తి మద్దతును ప్రకటించడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు తేవాలని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఈ పోరాటం ఢిల్లీని ఎంతవరకు ఊపేస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/high-tension-in-delhi-36-222058.html
ఎన్టీఆర్ జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడుల పేరుతో హైదరాబాద్ కొల్లూరులో వివాదాస్పద భూములు తమవంటూ ఫ్రీ లాంచ్ కింద సుమారు రూ.100 కోట్ల రూపాయలు వసూలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో పలు కీలక రాజకీయ, పరిపాలనా అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 25న నేపాల్కు చెందిన మీనా, సబీనా, రాజేష్ తదితరులు పనిమనుషులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ ఇంట్లో చేరారు. ప్రారంభంలో వారు చాలా నమ్మకంగా, విశ్వాసంగా పని చేస్తూ యజమానుల మన్ననలు పొందారు. అంతేకాకుండా యజమానుల కుటుంబానికి, విదేశాల్లో ఉన్న వారి పిల్లలకు కూడా నమ్మకం కలిగించారు.
ఖైరతాబాద్ లో ని ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్మెంట్ ఐదవ అంతస్తులో నివాస ముంటున్న రాధ అనే మహిళ తన ఏడాది న్నర వయసున్న మనుమడు జియోల్ తో కలిసి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిం చారు.
సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.
చంబా, ధర్మశాల, డల్హౌసీ, భర్మౌర్, కాంగ్రా, కులు, సిమ్లా సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూమి కొన్ని సెకన్ల పాటు కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా ఈ ప్రకంపనల ప్రభావం పంజాబ్, హర్యానా, చండీగఢ్ లోనూ కనిపించింది.
ప్రారంభ దశలో 55 టూ-వీలర్ రైడ్స్తో పాటు 4 ఆటో రైడ్స్ను అందుబాటు లోకి తీసుకువచ్చామని తెలిపారు. సాధారణంగా డెలివరీ, క్యాబ్ రంగాల్లో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా కనిపిస్తుందని, అయితే ఇప్పుడు మహి ళలు కూడా రైడ్ సేవల్లో ముందుకు రావడం ఒక సానుకూల మార్పుగా ఆయన అభివర్ణించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం ఎదుట హాజరయ్యారు.
వచ్చే టీ20 ప్రపంచకప్ సైకిల్ను దృష్టిలో ఉంచుకుని యువ రక్తాన్ని ప్రోత్సహించే వ్యూహంతో సెలక్టర్లు భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే సీనియర్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్పై సెలక్టర్లు వేటు వేయడమే కాకుండా, ఆయనను జట్టు నుంచే తప్పించారు. అలాగే.. ఐపీఎల్ 2026 సీజన్ లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ కు టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ గా అవకాశం ఇచ్చారు. ఇక తెలుగుతేజం, యువ బ్యాటర్ తిలక్ వర్మను వైస్ కెప్టెన్గా నియమించారు.
డీఎస్సీ పరీక్షల్లో విఫలమైన లక్షలాది మంది నిరుద్యోగ యువతలో ఉండే సహజమైన అసంతృప్తిని, నిరాశను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూడటంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సమాజంలో ఉద్రిక్తతలు మరియు విభేదాలు సృష్టించేలా సాగుతున్న ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ జగన్ నైజానికి అద్దం పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎలాన్ మాస్క్ స్పేస్ఎక్స్ (SpaceX) ఐపీఓ తర్వాత ఎస్అండ్పీ 500 (S&P 500) ఇండెక్స్లోకి ఎంట్రీ ఆలస్యం కానుంది. నిబంధనల సడలింపుకు నో చెప్పిన ఎస్అండ్పీ డౌ జోన్స్. స్పేస్ఎక్స్ నష్టాల లెక్కలు మరియు కఠిన నిబంధనల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అమెరికా గ్రీన్ కార్డ్ మరియు వీసా నిలిపివేతపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి యూఎస్ ఫెడరల్ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 39 దేశాల వలసలపై విధించిన కఠిన ఆంక్షలను చట్టవిరుద్ధమని కొట్టివేస్తూ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.