మేడారంలో మొదలైన నిలువు దోపిడీ

Publish Date:Jan 29, 2022

Advertisement

హైదరాబాద్ లాంటి మహా నగరవాసులు కూడా ప్రతి రెండేళ్లకోసారి మేడారానికి క్యూ కడతారు. పేరుకు అతిపెద్ద గిరిజన కుంభమేళాగా చెబుతారే కానీ... మైదాన ప్రాంత, గిరిజనేతర ప్రజలతో అటవీ ప్రాంతమంతా కిక్కిరిసిపోతుంది. జాతరకు 20 రోజుల ముందు నుంచే భక్తుల పుణ్యస్నానాలు, శివసత్తుల పూనకాలతో జంపన్నవాగు పునీతమవుతుంది. ప్రతి జాతరకూ జనం పెరుగుతున్నారే తప్ప ఎక్కడా తగ్గింది లేదు. జాతర ముగిసేలోపు దాదాపు 3 కోట్ల మంది భక్తులు దర్శించుకునే జనజాతరగా మేడారాన్ని చెబుతారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందే తప్ప ఎక్కడా తగ్గిన జాడ లేదు. మొన్న జనవరి 26 రోజున సెలవు కావడం చేత దాదాపు 5 లక్షల భక్తులు హాజరయ్యారు. మాఘశుద్ధ పూర్ణిమ సమీపిస్తున్న దృష్ట్యా క్రమంగా భక్తుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. జనవరి 30 ఆదివారం ఉండడంతో ఈ సంఖ్య 10 లక్షలు తాకే అవకాశం ఉందంటున్నారు. జాతర  ఆ తరువాత ఇప్పుడు ప్రతిరోజూ  తగ్గే అవకాశం కూడా లేదు. సమ్మక్క-సారక్క జాతరకు పెరుగుతున్న ఆదరణ కారణంగానే ఏటేటా ప్రభుత్వం నిధుల కేటాయింపు పెంచుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఈసారి జాతరకు తెలంగాణ ప్రభుత్వం  అక్కడ ఏర్పాట్లు, సౌకర్యాల కోసం రూ. 75 కోట్లు కేటాయించింది. 

ఇక జనం ఎక్కడ చేరతారో అది ప్రముఖ వ్యాపార కేంద్రంగా మారడం సహజమే. దీన్నో అవకాశంగా తీసుకున్న వ్యాపార వర్గాలు అక్కడికి అన్ని రకాల వస్తువులు, తినుబండారాలు తరలించి రూపాయి పెట్టుబడికి 10 రెట్లు లాభాలు ఆర్జించేలా రేట్లు పెంచుతున్నారు. దీంతో ఖరీదైన భక్తుల సంగతి పక్కనపెట్టి.. కేవలం అమ్మవార్లను దర్శించుకొని వెళ్దాం అని వచ్చే సామాన్య భక్తులు, నిజాయతీగా మొక్కులు తీర్చుకుందామనుకునే పేదల చేతి చమురు విపరీతంగా వదులుకోవాల్సి వస్తోంది. ఫలితంగా ఏ మొక్కులూ మొక్కుకోనివారు సైతం వ్యాపారస్తుల లాభాపేక్ష కారణంగా దేవతల ముందు నిలువు దోపిడీకి గురికావాల్సి వస్తోంది. ఫిబ్రవరి 16-19 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. 16 రోజున సారక్క గద్దె మీదికి వస్తుండగా, 17న సమ్మక్కను తీసుకొస్తారు. 18న అమ్మవార్లు ప్రజలందరికీ దర్శనమిచ్చి 19న మళ్లీ వనాల బాట పడతారు. 

ఇక మేడారంలో ప్రస్తుతం రేట్లు ఎలా మండిపోతున్నాయో ఓసారి చూద్దాం. ధరల్లో స్థానిక వ్యాపారులు ఒకరకంగా, స్థానికేతర వ్యాపారులు ఒకరకంగా రేట్లు ఫాలో అవుతున్నారు.  అయితే స్థానికేతర వ్యాపారులు లేకపోతే జాతరలో భక్తుల అవసరాలు తీర్చడం సాధ్యం కాదన్నఅభిప్రాయాలు కూడా ఉన్నాయి. కానీ రేట్లు మరీ విచక్షణరహితంగా పెంచడం భావ్యం కాదంటున్నారు సామాన్య భక్తులు. 

బ్రాయిలర్ కోడి కిలో ప్రస్తుతం రూ. 180-200 నడుస్తోంది. అయితే ఇలాంటి అంశాల్లో స్థానిక వ్యాపారులు మార్కెట్ రేట్లు అనుసరిస్తుండగా స్థానికేతర వ్యాపారులు మాత్రం వీరు పెట్టిందే రేటు అమ్మిందే వస్తువు అన్నట్టుగా తయారైంది. ఇక నాటుకోడి విషయానికొస్తే కిలో రూ. 500 - 650 వరకు నడుస్తోంది. మద్యం రేట్లు ఆకాశానికంటాయి. ప్రతి క్వాటర్ బాటిల్ మీద రూ. 50-80 కి పెంచి అమ్ముతున్నారు. బయట రూ. 300 ఉండే బ్లెండర్ స్ప్రైడ్ క్వాటర్ ఇక్కడ రూ. 380 అమ్ముతున్నారు. ఇక బీర్లయితే అక్షరాలా డబుల్ రేట్లకు అమ్ముతున్నారు. గుడి ముందు వేలంపాటలో దుకాణాలు దక్కించుకున్నవారు పూజాసామగ్రి సెట్లను రూ. 150కి అమ్ముతున్నట్టు భక్తులు ఆరోపిస్తున్నారు. ఈ ప్యాకేజీలో రెండు కొబ్బరికాయలు, రెండు బంగారం కడ్డీలు (చిన్నసైజు బెల్లం ముక్కలు), 4 అగరువత్తులు, పసుపు-కుంకు ప్యాకెట్లు 2 చిన్నవి. దాదాపు రూ. 60 విలువ చేసే ఈ వస్తువులకు రూ. 150 వసూలు చేస్తున్నారు. అయితే తాము రూ. 10 వేలు చెల్లించి వేలంలో షాపులు దక్కించుకున్నామని, అందువల్ల తాము కూడా ఎక్కడి నుంచో ఎన్నో కష్టనష్టాలకోర్చి వస్తున్నాం కాబట్టి ఎంతోకొంత లాభం చూసుకోవాల్సిందే కదాని సర్ది చెబుతున్నారు. 

ఇక మేడారంలో రోడ్ల వెంట పొలాల్లో షాపులు పెట్టుకోవడానికి స్థానికేతర వ్యాపారులు చిన్నచిన్న గుడారాలు వేసుకునేందుకు ఆయా భూముల యజమానులకు పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తోంది. 3-5 గజాల స్థలానికి ఈ జాతర జరిగే దాదాపు 20 రోజులకు దాదాపు రూ. 25 వేలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆ గుడారాల్లో పెట్టుకునే షాపులన్నీ తమ వస్తు, సేవలకు విపరీతంగా రేట్లు పెంచి సొమ్ము చేసుకుంటున్నాయి. ఇక ఇవే ధరలు గుడి సమీపంలో అయితే గజానికి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు నడుస్తున్నట్టు పలువురు వ్యాపారులు చెబుతున్నారు. అమ్మవార్ల దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులు మరీ ఇక్కట్ల పాలు కాకుండా ధరల్ని నియంత్రించేలా చర్యలు చేపడితే మేడారం ప్రభ ఇంకా వెలిగిపోతుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఆ దిశగా చర్యలు తీసుకుంటారా? చూడాలి మరి. 

By
en-us Political News

  
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్‌లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.
మొదట్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌లో ఉండటంతో టిడిపిలో లేరని, ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన చంద్రబాబుకు ఎన్టీఆర్ జనరల్ సెక్రెటరీ పదవి ఇచ్చి పార్టీ పగ్గాలు అప్పగించారని తెలిపారు. చంద్రబాబు వచ్చిన కొత్తలో హైదరాబాద్ పరిధిలోని చదువుకున్న యువ నాయకుల వివరాలు సేకరించగా తన పేరు తెరపైకి వచ్చిందన్నారు.
సీనియర్ నాయకులను బుజ్జగించడానికి ఉప ముఖ్యమంత్రి పదవులను పంచుతుంటారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమించి రికార్డు సృష్టించారు. ప్రస్తుత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యంత కీలకమైన, శక్తిమంతమైన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తూ డైనమిక్ రోల్ పోషిస్తున్నారు.
దేశవ్యాప్తంగా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతున్న బీజేపీ.. చారిత్రాత్మకంగా దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయడానికి ఎప్పటి నుంచో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇక్కడి ద్రవిడ రాజకీయాల ప్రభావం బలంగా ఉండటంతో కమలం ఆశించిన స్థాయిలో విస్తరించలేకపోయింది. ఈ క్రమంలోనే ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన అణ్ణామలై రూపంలో బీజేపీకి ఒక బలమైన ఆశాకిరణం లభించింది.
గతంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే.. ఇచ్చిన హామీని కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు గా నిలబెట్టుకుంది. అయితే, ఈ కొత్త పదవి, అదనపు బాధ్యతలు వైఎస్ షర్మిలకు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తున్నప్పటికీ, మరోవైపు ఆమె ముందు అనేక సవాళ్లను ఉంచబోతున్నాయి.
సుపు రంగు అనేది భూమి పుట్టినప్పటి నుండి ఉనికిలో ఉందనీ.. ఆ రంగు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం కాదని తేల్చి చెప్పారు.
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న హైడ్రామా ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.