గచ్చిబౌలిలోని ఓ ఎలైట్ కోలివింగ్లో ఒక యువతి తన జీవితానికి చివరి అధ్యాయం రాసుకున్నది. 23 ఏళ్ల యువతి నానక్రామ్గూడాలోని ఒక ప్రైవేట్ కంపెనీలో టెలీకాలర్గా ఉద్యోగం చేస్తూ, అదే కోలివింగ్లో సాయికుమార్ అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. ఇద్దరి మధ్య ప్రారంభంలో సాధారణం గానే ఉన్న సంబంధం, క్రమంగా అనుమానాల ఛాయలో చిక్కుకుంది.
ఆ అనుమానం చివరికి వేధింపుల రూపం దాల్చిందని సమాచారం. సాయికుమార్ తరచూ మద్యం సేవించి ఆ మత్తులో కోలివింగ్కు వచ్చి ఆమెను ప్రశ్నించడం, అనుమానంతో గొడవలు చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో వచ్చిన సాయికుమార్ ప్రవర్తన నియంత్రణ తప్పిందని, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన యువతి, తట్టుకోలేని స్థితికి చేరుకుందని తెలుస్తోంది. ఆ క్షణాల్లో తీసుకున్న నిర్ణయం ఆమె జీవితాన్నే ముగించింది—భవనం ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఘటనతో కోలివింగ్ మొత్తం ఒక్కసారిగా షాక్లోకి వెళ్లింది. సహజీవనం చేస్తున్న ఇద్దరి మధ్య వ్యక్తిగత సమస్యలు చివరకు ఇంత తీవ్రమైన దారికి రావడం అక్కడి వారిని కూడా కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకుని ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gachibowli-36-222148.html
ఒడిశా రాష్ట్రంలో వెలుగుచూసిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ అవినీతి ఉదంతం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
కూకట్పల్లి మంజీరా మాల్లోని కింగ్ & క్వీన్స్ పబ్ రాత్రి సాధారణంగా హడావుడిగా ఉండే ప్రదేశమే.
గతంలో కంప్యూటర్లు కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వ్యక్తమయ్యాయి. కంప్యూటర్లు వస్తే అకౌంటెంట్లు, క్లర్కుల ఉద్యోగాలు పోతాయని అంతా భావించారు. కానీ వాస్తవంగా జరిగిందేమిటి? కంప్యూటర్ల వల్ల పాత ఉద్యోగ పద్ధతులు మారాయి తప్ప ఉద్యోగాలు తగ్గలేదు.. సరికదా మరిన్ని అవకాశాలు వచ్చాయి. సాఫ్ట్వేర్ అనే రంగం తెరమీదకు వచ్చింది. కోట్లాది మందికి సరికొత్త ఉపాధి లభించింది.
బీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి ఇంట్లో భారీ చోరి జరగడం తో హైదరాబాద్ సనత్ నగర్ జెడ్ కాలనీ ఇప్పుడు ఒక్క సారిగా చర్చల కేంద్రంగా మారింది.
ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తన రష్యా పర్యటనను యథావిధిగా కొనసాగించాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. డ్రోన్ల దాడుల వార్త వెలువడే సమయానికి ఆయన మాస్కో నుండి సెయింట్ పీటర్స్బర్గ్కు ప్రయాణిస్తున్నారు. అక్కడ నెలకొన్న భద్రతా ఏర్పాట్లు, తాజా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన అనంతరం, లోకేష్ తన షెడ్యూల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని నిశ్చయించుకున్నారు.
మలేషియా దేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.
మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి చమురు భారం పడింది.
తమిళనాట బీజేపీకి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై మూడు రోజుల క్రితం రాజీనామా చేశారు.
రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, సంక్షేమ పథకాలపై విస్తృతంగా మాట్లాడారు.
అమెరికాలోని న్యూయార్క్ సిటీలోలో తెలుగు యువకుడు కుంచా అన్షుల్ దారుణ హత్యకు గురైనాడు.
తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను ముందుగానే గుర్తించి అరికట్టేందుకు సిటీ పోలీసులు శుక్రవారం