వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు నిధుల కొరత?
Publish Date:May 21, 2012
Advertisement
ప్రస్తుత ఉప ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కొత్త సమస్య ఎదురైంది. 18 అసెంబ్లీ, ఒక లోక్ సభ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నిథుల కొరతను ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల కార్యకర్తలకు కూడా రోజువారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. దీనికి ప్రధానకారణం హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయం నుంచి వీరికి నిథులు అందకపోవడమే. మీరు రాజీనామాలు చేయండి నేను మిమ్మల్ని గెలిపించుకుంటానన్న భరోసాను జగన్ వీరందరికీ ఇచ్చారు. అయితే హఠాత్తుగా జగన్ ఆస్తులపై అటు సిబీఐ, ఇటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్లు దృష్టిపెట్టాయి. పార్టీ న్యూస్ పేపర్, టీవీ ఛానల్ అకౌంట్ తో పాటు జననీ ఇన్ ఫరా అకౌంట్ ను కూడా సిబీఐ స్తంభింపజేసింది. దర్యాప్తు సంస్థల చర్యలతో భయపడిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీ అభ్యర్థులకు నిథులు పంపలేకపోతున్నారు. దీంతో అభ్యర్థులు నిథుల లేమితో విలవిలలాడుతున్నారు. తమ దగ్గర ఉన్న వనరులతో పోలింగ్ వరకూ క్యాడర్ ను మెయింటైన్ చేయటం, ప్రచారానికి డబ్బు ఖర్చు పెట్టడం కష్టమని వారు అంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఖర్చు విషయంలో తాము ఇతర పార్టీ అభ్యర్థుల కన్నా వెనుకబడిపోతామని దీని ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఉంటుందని వారు భయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/funds-shortage-for-ysr-congress-candidates-24-14181.html





