ఎన్నికల తర్వాతే జగన్ అరెస్టు?
Publish Date:May 21, 2012
Advertisement
అక్రమాస్తుల కేసులో ప్రధాననిందుతుడైన వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అరెస్టుపై ఇంకా సందిగ్ధత కొనసాగురూనే ఉండి. నేడో రేపో ఆయనను అరెస్టు చేస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే ఉప ఎన్నికల తరువాత ఆయనను అరెస్టు చేయించాలన్న భావనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలున్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలకు ముందు జగన్ ను అరెస్టు చేస్తే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తవచ్చని రాష్ట్రప్రభుత్వం భయపడుతోంది. దీనికి తోడు పోలింగ్ కు ముందు అరెస్టు చేస్తే ప్రజల్లో జగన్ పట్ల సానుభూతి పెరిగే ప్రమాదముందని, ఇదే జరిగి అన్ని నియోజకవర్గాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే ప్రభుత్వానికి కొత్త సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భయపడుతున్నట్లు తెలిసింది. జగన్ అరెస్టు, ప్రజా సానుభూతి కారణంగా అన్ని స్థానాల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే కాంగ్రెస్ పార్టీలోని మరికొంతమంది అసంతృప్త ఎమ్మెల్యేలు జగన్ పంచన చేరే ప్రమాదముందని, ఇదే జరిగితే ప్రభుత్వ పతనం ఖాయమని కిరణ్ కుమార్ రెడ్డి భయపడుతున్నారు. అందుకే ఎన్నికల ఫలితాల అనంతరమే జగన్ ను అరెస్టు చేస్తే మంచిదన్న భావనతో ఆయన ఉన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో 2, 3 చోట్ల కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అవుతుందని కిరణ్ కుమార్ రెడ్డి అంచనా వేస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో జగన్ ను బలహీనపరిచి ఎన్నికల అనంతరం అతన్ని అరెస్టు చేస్తే ఇక ఎటువంటి సమస్యలు ఉండవన్నది కిరణ్ కుమార్ వ్యూహంగా కనిపిస్తున్నది. జగన్ అరెస్టుకు ముందుగానే అతని ఆర్ధిక మూలాల మీద దెబ్బకొట్టడం ద్వారా కిరణ్ కుమార్ ప్రభుత్వం జగన్ ను బలహీనపరిచింది.
http://www.teluguone.com/news/content/ys-jagan-to-be-arrested-after-elections-24-14179.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





