జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభం.. నాలుగు దశాబ్దాల కల సాకారం!

Publish Date:May 28, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రజల నాలుగు దశాబ్దాల  నిరీక్షణకు తెరపడింది.  ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ పోరాటానికి ఎట్టకేలకు  చారిత్రాత్మక విజయం లభించింది. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కావాలంటూ సాగిన ఉద్యమాలు, నాయకుల త్యాగాలు ఫలించాయి. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో..  విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా నూతనంగా ఏర్పాటైన  సౌత్ కోస్ట్ రైల్వే జోన్ (ఎస్ సీఓఆర్)  జూన్ 1, 2026 నుండి   అధికారిక కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ చారిత్రక పరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా రంగాన్ని, ఆర్థిక వ్యవస్థను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లనుందనడంలో సందేహం లేదు. 

రైల్వే పరిపాలనను   సులభతరం చేసేందుకు,  మౌలిక వసతుల అభివృద్ధి వేగం పుంజుకునేందుకు  వేగంగా అభివృద్ధి చేసేందుకు ఎస్ సీఓఆర్  దోహదపడుతుంది.  తొలుత  ఈ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు తాత్కాలికంగా సిరిపురం వద్ద ఉన్న వీఎంఆర్‌డీఏ   ది డెక్  భవనంలోని ఐదు, ఆరు అంతస్తుల నుండి సాగుతాయి.  జనరల్ మేనేజర్ సందిప్ మాథుర్ నేతృత్వంలో దాదాపు 6 నుండి 8 ముఖ్య విభాగాలు ఈ తాత్కాలిక కార్యాలయం నుంచే పనిచేయడం ప్రారంభిస్తాయి.

మరోవైపు ముదసర్లోవ వద్ద దాదాపు 54 ఎకరాల భారీ విస్తీర్ణంలో శాశ్వత రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ ప్రతిష్టాత్మక శాశ్వత భవన సముదాయాన్ని మూడు సంవత్సరాల కాలపరిమితిలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నిర్మాణ పనుల కోసం ఇప్పటికే  106 కోట్ల నిరూపాయలను  కేంద్రం విడుదల చేసింది. 

రైల్వే పునర్వ్యవస్థీకరణ చట్టం 1989 ప్రకారం ఏర్పాటైన ఈ  కొత్త 18వ రైల్వే జోన్ పరిధి ఎంతో విస్తృతమైనది. ఇది సుమారు 3,496 కిలోమీటర్ల సుదీర్ఘమైన రూట్ పొడవు కలిగి ఉంది. దక్షిణ మధ్య రైల్వే, తూర్పు తీర రైల్వేలలోని కొన్ని కీలక భాగాలను పునర్వ్యవస్థీకరించడం ద్వారా ఈ జోన్ రూపుదిద్దుకుంది. దీని పరిధిలోకి ప్రస్తుత విజయవాడ, గుంటూరు,  గుంతకల్ రైల్వే డివిజన్లు రానున్నాయి. వీటితో పాటు గతంలో తూర్పు తీర రైల్వేలో భాగంగా ఉన్న వాల్తేరు డివిజన్‌ను పునర్వ్యవస్థీకరించి విశాఖపట్నం డివిజన్ గా మార్చారు.

ఈ మార్పుల వల్ల పాత వాల్తేరు డివిజన్ రెండు భాగాలుగా విడిపోయింది. అందులో ఒక భాగం తూర్పు తీర రైల్వే పరిధిలోనే కొత్తగా ఏర్పడిన రాయగడ డివిజన్‌గా మారగా,  మిగిలిన ప్రధాన భాగం విశాఖపట్నం డివిజన్‌గా మారి సౌత్ కోస్ట్ రైల్వేలో విలీనమైంది. అలాగే గతంలో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌ను ఇప్పుడు విజయవాడ డివిజన్‌లో విలీనం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల విశాఖలో ఉన్న తాత్కాలిక జోన్ కార్యాలయాన్ని సందర్శించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  

By
en-us Political News

  
వారు ప్రయాణిస్తున్న అధికారిక టీమ్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్, భద్రతా సిబ్బంది వెంటనే బస్సును పక్కకు నిలిపివేసి.. అందులోని ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరినీ సురక్షితంగా కిందికి దించేశారు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లయింది.
దేశంలోని మిలిటరీ శక్తులు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ) కమాండర్లు ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించారని, కీలక నిర్ణయాల నుండి దేశ అధ్యక్షుడిని, రక్షణ రంగానికి చెందని పౌర ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆ లేఖలో పెజెష్కియాన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది.
అందరి దృష్టిని ఆకర్షించింది కింగ్ కోహ్లీ, అనుష్క జంట. ఆర్సీబీ యాజమాన్యం అధికారికంగా షేర్ చేసిన వీడియోలో విరుష్క (విరాట్ కోహ్లీ, అనుష్క) జంట కలిసి వేసిన అదిరిపోయే డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.
వాహనం నడుపుతున్న అరుణ్ దృష్టి మొత్తం రోడ్డుపై కాకుండా మొబైల్ స్క్రీన్‌పై పడింది.ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి అత్యంత వేగంగా రోడ్డును దాటి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.
సీజన్ మొత్తం 776 పరుగులు సాధించి, ఐపీఎల్ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కేవలం పరుగులే కాదు, అతడు బంతిని బాదిన తీరు కూడా అమోఘం.
ఈ పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై 42 పెరిగి, దాని ధర రూ. 3,113.50కి చేరింది. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
టోర్నమెంట్‌లో అసాధారణమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఏకంగా 776 పరుగులు సాధించి, అత్యధిక పరుగుల బ్యాటర్ గా ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అలాగే.. టోర్నీలోనే అత్యంత విలువైన ఆటగాడిగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ పురస్కారాన్ని కూడా వైభవ్‌ దక్కించుకున్నాడు.
దేశ భవిష్యత్తును మార్చే మీ ఓటు ఎంతో విలువైంది అంటూ ఈసీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. ఈ ఆసక్తికరమైన పోస్టుకు రన్ మిషన్ విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీతో ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్న ఫొటోను జత చేసింది.
బెంగళూరు మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా కప్ మనదే అంటూ సామాజిక మాధ్యమ వేదికలో హర్షం వ్యక్తం చేశారు. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ గెలిచి ఆర్సీబీ చరిత్ర సృష్టించిందని పేర్కొన్న ఆయన పట్టుదల, దీక్ష, సంయమనంతో ఆడి నిజమైన ఛాంపియన్లలా నిలిచారన్నారు.
156 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా కోహ్లీ, తన మణికట్టు మాయాజాలంతో అద్భుతమైన ఫ్లిక్స్, పుల్ షాట్లతో కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. మరోవైపు, మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ వెంకటేశ్ అయ్యర్ 16 బంతుల్లో 32 దూకుడుగా ఆడాడు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రవాణా విప్లవానికి వేదిక కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచే అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.