అమరావతి భూసమీకరణ రగడ.. ఉండవల్లి రైతుల ఆవేదన!

Publish Date:May 28, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో భూసేకరణ ప్రక్రియ మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా రాజధానికి ప్రధాన ముఖద్వారంగా నిలిచే ఉండవల్లి గ్రామంలో రెండో విడత భూసమీకరణ  ఇప్పుడు ఒక అడుగు ముందుకు, మూడడుగులు అడుగులు వెనక్కు అన్నట్లుగా తయారైంది. 2015లో 29 గ్రామాల పరిధిలో సుమారు 34,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరిస్తూ..  ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రకటించింది. ఆ సమయంలో దాదాపు 99 శాతం మంది రైతులు భవిష్యత్తుపై   ఆశలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నమ్మకంతో తమ విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగించారు. అయితే..  మిగిలిన 1 శాతం భూమికి సంబంధించిన సమస్య లు, ముఖ్యంగా ఉండవల్లి గ్రామంలోని పరిస్థితులు ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి.

ఉండవల్లి గ్రామ పరిధిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం 3 కిలోమీటర్ల పొడవునా భూములు ఇవ్వడానికి సుమారు 42 మంది రైతులు మొదట్లో అంగీకరించారు. సిఆర్డిఏ అధికారులు, అప్పటి మంత్రులు కేవలం రోడ్డు నిర్మాణం వరకే భూములు తీసుకుంటామని, మిగిలిన భూముల జోలికి రాబోమని స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు తమ సొంత భూములను త్యాగం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ, ఆ తర్వాత కాలంలో అధికారులు మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ..  రోడ్డు ఇరువైపులా అదనంగా 15 మీటర్ల నుండి 30 మీటర్ల వరకు బఫర్ జోన్,  గ్రీన్ జోన్ కోసం నోటిఫికేషన్లు జారీ చేయడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ అదనపు నిబంధనల వల్ల ఉండవల్లి పరిధిలో దాదాపు 250 ఎకరాల విస్తీర్ణంలోని వివిధ సర్వే నెంబర్ల భూములు భూసమీకరణ పరిధిలోకి వచ్చే ప్రమాదం ఏర్పడింది.

ఉండవల్లి గ్రామం భౌగోళికంగా ఎంతో ప్రత్యేకమైనది. ఒకవైపు కొండలు, మరోవైపు కృష్ణా నది, ఇంకోవైపు కొండవీటి వాగు ప్రవాహంతో కూడిన చాలా చిన్న మరియు  ప్రాంతం ఇది. ఇక్కడి భూముల్లో కేవలం 20 అడుగుల లోతులోనే సమృద్ధిగా నీరు పడుతుంది. ఈ కారణంగానే ఏడాది పొడవునా..  అంటే 365 రోజులూ ఇక్కడ భూములు ఆకుపచ్చదనంలో కళకళలాడుతూ ఉంటాయి. ఈ గ్రామంలో మెజారిటీ ప్రజలు ఒకటి లేదా రెండు ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులే. తెల్లవారుజామున లేచింది మొదలు కరకట్ట కింద, నది పరివాహక ప్రాంతాల్లో కాయకష్టం చేసుకుంటూ రోజూ  500 నుండి  1000 రూపాయల వరకు సంపాదించుకుంటూ జీవించే సాధారణ కుటుంబాలు వీరివి. తమకు అద్దాల మేడలు, మెరుగులు అవసరం లేదని, తరతరాలుగా వస్తున్న మట్టి వాసన, వ్యవసాయమే  జీవనాధారమని ఇక్కడి రైతులు చెబుతున్నారు. ల్యాండ్ పూలింగ్ నిబంధనల ప్రకారం కనీసం 12 నుండి 15 సెంట్ల భూమి లేకపోతే సరైన వాణిజ్య ప్లాట్లు కూడా దక్కవని, దీనివల్ల తాము పూర్తిగా రోడ్డున పడే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్య తీవ్రతరం కావడానికి అధికారుల అలసత్వం, సమన్వయ లోపమే ప్రధాన కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మూడు రాజధానుల వివాదం తర్వాత అమరావతిలో పనులు మళ్లీ వేగం పుంజుకోవడానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్‌లతో కూడిన త్రీ మెన్ కమిటీ ఎంతో శ్రమించింది. ఆ కమిటీ స్పష్టమైన గణాంకాలను  ప్రజల ముందు ఉంచి..  కేవలం 300 ఎకరాల పరిధిలోనే సాంకేతిక సమస్యలు ఉన్నాయని నిరూపించడంతో చాలా వరకు గందరగోళం తొలగిపోయింది. అయినప్పటికీ..  స్థానిక అధికారుల వైఖరి వల్ల రైతులు   భయాందోళనలకు లోనవుతున్నారు. ఉండవల్లి ప్రాంతం విజయవాడ నగరానికి అత్యంత సమీపంలో ఉంది. ఇక్కడి భూమి ఖరీదైనది కాబట్టి, ఇక్కడి రైతులకు సాధారణ ప్యాకేజీ కాకుండా ఒక ప్రత్యేక కన్సిడరేషన్ తో మెరుగైన ప్యాకేజీ ఇవ్వడం ఎంతో అవసరం.

గతంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే ఉండవల్లి పొలాల్లో పర్యటించి, రైతుల అనుమతి లేకుండా బలవంతంగా భూములు లాక్కోవద్దని, రైతులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్,  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  నేరుగా చొరవ తీసుకుని, రైతులతో ముఖాముఖి మాట్లాడి భరోసా కల్పిస్తే ఈ సమస్య చాలా సులభంగా పరిష్కారమవుతుంది. ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని కోసం కొంత త్యాగం అనివార్యమైనప్పటికీ, ఆఖరి రైతుకు కూడా అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.

ఇలా ఉండగా ప్రముఖ విశ్లేషకుడు కిలారు నాగేశ్వరరావు ఉండవల్లి భూ సమీకరణ విషయంలో ఈ పరిస్థితి నెలకొనడానికి అమరావతిలో అధికారుల మొద్దు నిద్రేకారణమని అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ సమస్య పరిష్కారం కావాలంటే స్వయంగా చంద్రబాబు అక్కడి రైతులతో ముఖాముఖీ మాట్లాడి స్పష్టమైన భరోసా ఇవ్వాలన్నారు. 

 

By
en-us Political News

  
వారు ప్రయాణిస్తున్న అధికారిక టీమ్ బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్, భద్రతా సిబ్బంది వెంటనే బస్సును పక్కకు నిలిపివేసి.. అందులోని ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ అందరినీ సురక్షితంగా కిందికి దించేశారు. దీంతో పెను ప్రమాదం తృటిలో తప్పినట్లయింది.
దేశంలోని మిలిటరీ శక్తులు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఐఆర్జీసీ) కమాండర్లు ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించారని, కీలక నిర్ణయాల నుండి దేశ అధ్యక్షుడిని, రక్షణ రంగానికి చెందని పౌర ప్రభుత్వాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని ఆ లేఖలో పెజెష్కియాన్ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఆ కథనం పేర్కొంది.
అందరి దృష్టిని ఆకర్షించింది కింగ్ కోహ్లీ, అనుష్క జంట. ఆర్సీబీ యాజమాన్యం అధికారికంగా షేర్ చేసిన వీడియోలో విరుష్క (విరాట్ కోహ్లీ, అనుష్క) జంట కలిసి వేసిన అదిరిపోయే డ్యాన్స్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.
వాహనం నడుపుతున్న అరుణ్ దృష్టి మొత్తం రోడ్డుపై కాకుండా మొబైల్ స్క్రీన్‌పై పడింది.ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి అత్యంత వేగంగా రోడ్డును దాటి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.
సీజన్ మొత్తం 776 పరుగులు సాధించి, ఐపీఎల్ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కేవలం పరుగులే కాదు, అతడు బంతిని బాదిన తీరు కూడా అమోఘం.
ఈ పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై 42 పెరిగి, దాని ధర రూ. 3,113.50కి చేరింది. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
టోర్నమెంట్‌లో అసాధారణమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఏకంగా 776 పరుగులు సాధించి, అత్యధిక పరుగుల బ్యాటర్ గా ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అలాగే.. టోర్నీలోనే అత్యంత విలువైన ఆటగాడిగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ పురస్కారాన్ని కూడా వైభవ్‌ దక్కించుకున్నాడు.
దేశ భవిష్యత్తును మార్చే మీ ఓటు ఎంతో విలువైంది అంటూ ఈసీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. ఈ ఆసక్తికరమైన పోస్టుకు రన్ మిషన్ విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీతో ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్న ఫొటోను జత చేసింది.
బెంగళూరు మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా కప్ మనదే అంటూ సామాజిక మాధ్యమ వేదికలో హర్షం వ్యక్తం చేశారు. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ గెలిచి ఆర్సీబీ చరిత్ర సృష్టించిందని పేర్కొన్న ఆయన పట్టుదల, దీక్ష, సంయమనంతో ఆడి నిజమైన ఛాంపియన్లలా నిలిచారన్నారు.
156 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా కోహ్లీ, తన మణికట్టు మాయాజాలంతో అద్భుతమైన ఫ్లిక్స్, పుల్ షాట్లతో కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. మరోవైపు, మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ వెంకటేశ్ అయ్యర్ 16 బంతుల్లో 32 దూకుడుగా ఆడాడు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రవాణా విప్లవానికి వేదిక కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచే అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.