ఐపీఎల్ విజేత ఆర్సీబీ

Publish Date:May 31, 2026

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. కింగ్ కోహ్లీ  75 నాటౌట్; 42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు అద్భుతమైన అర్ధశతకంతో జట్టును ముందుండి నడిపించి విజయతీరాలకు చేర్చాడు.

156 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా కోహ్లీ, తన మణికట్టు మాయాజాలంతో అద్భుతమైన ఫ్లిక్స్, పుల్ షాట్లతో కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. మరోవైపు,  మోకాలి నొప్పితో బాధపడుతున్నప్పటికీ వెంకటేశ్ అయ్యర్ 16 బంతుల్లో 32  దూకుడుగా ఆడాడు. ఈ జోడీ కేవలం 21 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఐపీఎల్ ఫైనల్స్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.

అయితే, వెంకటేశ్ అయ్యర్, దేవదత్ పడిక్కల్ స్వల్ప వ్యవధిలో ఔటవడంతో ఆర్సీబీ కాస్త నెమ్మదించింది. రజత్ పాటిదార్  కొన్ని చక్కటి షాట్లు ఆడి 14 పరుగులు చేసి ఔటయ్యాడు. గుజరాత్ బౌలర్ రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో పటీదార్‌ను, కృనాల్ పాండ్యా  ను ఔట్ చేయడంతో  మ్యాచ్ ఉత్కంఘఠభరితంగా మారుతున్నట్లు కనిపించింది. అయితే..   కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పటికీ కోహ్లీ  చూడచక్కని షాట్లతో కేవలం పాతిక బంతుల్లోనే బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని జట్టుపై ఒత్తిడిని తగ్గించాడు. 

టిమ్ డేవిడ్  త్వరగానే ఔటయినా, కోహ్లీ తన క్లాస్ ఆటతీరుతో జట్టును గెలిపించాడు. 63 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ పట్టిన డైవింగ్ క్యాచ్‌ను రీప్లేలలో బంతి నేలను తాకినట్లు తేలడంతో కోహ్లీకి లైఫ్ లభించింది. ఆ తర్వాత, అర్షద్ ఖాన్ వేసిన 18వ ఓవర్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ బాది ఆర్సీబీకి ఘనవిజయాన్ని అందించాడు.

తొలుత  టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబీ..  కట్టుదిట్టమైన బౌలింగ్‌తో గుజరాత్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేసింది. గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు   చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్  50 నాటౌట్, 37 బంతుల్లో   జట్టులో అత్యధికపరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.   ఆర్సీబీ బౌలర్లలో రసిఖ్ సలామ్ దార్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

  ఆర్సీబీ ఈ విజయంతో... వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల సరసన చేరింది. కెప్టెన్ గానూ రజత్ పటీదార్ వరుసగా రెండు టైటిళ్లతో రికార్డు పుటల్లోకెక్కాడు.  సీఎస్కే జట్టు 2010, 2011లో వరుసగా టైటిళ్లు గెలవగా... ముంబై ఇండియన్స్ 2019, 2020లో విజేతగా నిలిచింది. ఆర్సీబీ 2025, 2026లో టైటిళ్లు గెలిచి ఆ రెండు జట్ల సరసన చేరింది.

2025లో ఇదే స్టేడియంలో తొలి టైటిల్ గెలుచుకున్న ఆర్సీబీ.. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తర్వాత తమ టైటిల్‌ను నిలబెట్టుకున్న మూడో జట్టుగా నిలిచింది. అంతేకాకుండా, మహిళల ప్రీమియర్ లీగ్ , ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిళ్లను ఒకేసారి కలిగి ఉన్న ఏకైక ఫ్రాంచైజీగా అరుదైన ఘనత సాధించింది.  

By
en-us Political News

  
వాహనం నడుపుతున్న అరుణ్ దృష్టి మొత్తం రోడ్డుపై కాకుండా మొబైల్ స్క్రీన్‌పై పడింది.ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి అత్యంత వేగంగా రోడ్డును దాటి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది.
సీజన్ మొత్తం 776 పరుగులు సాధించి, ఐపీఎల్ చరిత్రలోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. కేవలం పరుగులే కాదు, అతడు బంతిని బాదిన తీరు కూడా అమోఘం.
ఈ పెంపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌పై 42 పెరిగి, దాని ధర రూ. 3,113.50కి చేరింది. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
టోర్నమెంట్‌లో అసాధారణమైన బ్యాటింగ్ నైపుణ్యంతో ఏకంగా 776 పరుగులు సాధించి, అత్యధిక పరుగుల బ్యాటర్ గా ప్రతిష్టాత్మక ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. అలాగే.. టోర్నీలోనే అత్యంత విలువైన ఆటగాడిగా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుతో పాటు ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ పురస్కారాన్ని కూడా వైభవ్‌ దక్కించుకున్నాడు.
దేశ భవిష్యత్తును మార్చే మీ ఓటు ఎంతో విలువైంది అంటూ ఈసీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చింది. ఈ ఆసక్తికరమైన పోస్టుకు రన్ మిషన్ విరాట్ కోహ్లీతో పాటు ఆర్సీబీ ఆటగాళ్లు ఐపీఎల్ ఛాంపియన్ ట్రోఫీతో ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్న ఫొటోను జత చేసింది.
బెంగళూరు మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి కూడా కప్ మనదే అంటూ సామాజిక మాధ్యమ వేదికలో హర్షం వ్యక్తం చేశారు. వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ గెలిచి ఆర్సీబీ చరిత్ర సృష్టించిందని పేర్కొన్న ఆయన పట్టుదల, దీక్ష, సంయమనంతో ఆడి నిజమైన ఛాంపియన్లలా నిలిచారన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రవాణా విప్లవానికి వేదిక కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచే అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన రైతు మనసును చాటుకున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్రమైన ఉద్రిక్తతలకు వేదికగా మారాయి.
హైదరాబాద్ శివారులోని గండిపేట ప్రాంతంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కాజేసి విక్రయించేందుకు ప్రయత్నించిన భారీ భూ మోసాన్ని షేర్ లింగంపల్లి పోలీసులు ఛేదించారు.
ఉన్నత చదువులు, కుటుంబ ఆశయాలు, భవిష్యత్తుపై ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.