మిథున్ రెడ్డి అరెస్ట్.. పెద్దిరెడ్డికి తొలి ఎదురుదెబ్బ

Publish Date:Jul 19, 2025

Advertisement

వైసీపీ కీలక నేత, పుంగనూరు ఎమ్మెల్యే, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టు ఉన్నట్లుగా చెప్పుకునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి గట్టి షాక్ తగిలింది. జిల్లాలో  కాంగ్రెస్, ఆ తరువాత వైసీపీ లో తిరుగులేని నేతగా రాజకీయం నడిపిన పెద్దిరెడ్డికి తొలి సారిగా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో పెద్దరెడ్డి తనయుడు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ శనివారం (జులై 19) అరెస్టు చేసింది. ఇది ఏ రకంగా చూసుకున్నా పెద్దిరెడ్డికి తేరుకోలేని ఎదురు దెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది.

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తొలినుండి చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మధ్య ఉప్పు నిప్పులా నడుస్తుంది.  విద్యార్థి దశలోనే ఇరువురు నేతలు ప్రత్యర్థులుగా తలపడ్డారు.  అనేక సంద ర్భాల్లో చంద్రబాబు ను రాజకీయంగా దెబ్బ తీయడానికి రామచంద్రా రెడ్డి విఫలయత్నం చేశారు.  2004 లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికి వైఎస్ తో ఉన్న విభేదాలతో రామచంద్రారెడ్డి మంత్రి పదవిని దక్కించుకోలేక పోయారు. 2009 నాటికి పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి బెంగళూరులోనే ఉంటూ జగన్ కు దగ్గరయ్యారు. దీంతో పెద్దిరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపి వైఎస్ మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. అప్పటి నుంచి జగన్, మిథున్ రెడ్డి బంధం మరింత బలపడింది. ఆ తరవాత జరిగిన పరిణామాలలో చిత్తూరు జిల్లాలో అప్పటి వరకు వైఎస్ వర్గీయులుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తదితరులను జగన్ దూరం పెట్టడం ప్రారంభించారు. జగన్ పార్టీకి సంబంధించి తొలి నుంచీ  చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి హవా కొనసాగింది.  ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అంటే.. 2019 నుంచి రాయలసీమలో పెద్దిరెడ్డి కింగ్ మేకర్ అయ్యారు. మరోవైపు మిథున్ కూడా జగన్ కు నమ్మిన బంటుగా వ్యవహరించారు.

2019-24 మధ్య జగన్ క్యాబినెట్ లో పెద్దిరెడ్డి నంబర్ టూ గా ఉన్నారు.  ఈ నేపథ్యంలోనే కుప్పం లో చంద్రబాబు ను టార్గెట్ చేస్తూ పెద్దిరెడ్డి రాజకీయాలు చేశారు. ఓ వైపు జగన్ కు సంబంధించిన కీలక వ్యవహారాలను మిథున్ రెడ్డి పర్యవేక్షిస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి కీలకంగా మారారు. నమ్మిన బంటుగా   మిథున్ రెడ్డిని ఢిల్లీ స్థాయిలో విజయసాయి రెడ్డికి ప్రత్యా మ్నాయంగా జగన్  ప్రోత్సహించారు. జగన్ హయాంలో ప్రభుత్వంలో, పార్టీలో కూడా  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. చిత్తూరు జిల్లాలో రామచంద్రారెడ్డి ఏమి చేసినా రైట్ అన్నట్లుగా జగన్ పెత్తనమంతా పెద్దిరెడ్డి చేతిలో పెట్టారు.

జగన్ అధికారంలో ఉన్నంత వరకూ పెద్దిరెడ్డి మాటే శాసనం అన్నట్లుగా చిత్తూరు వైసీపీ రాజకీయం నడిచింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దిరెడ్డి భూక్జాల నుంచి దౌర్జన్యాల వరకూ చేయని అరాచకం అంటూ లేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఎప్పుడైతే జగన్ అధికారం కోల్పోయి రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిందో.. అ అప్పటి నుంచే పెద్దిరెడ్డికి అన్ని వైపుల నుంచీ ప్రతికూలత ఎదురైంది. ఇక ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టుతో పెద్దిరెడ్డికి తేరుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.   తనయుడి అరెస్ట్ తో రామచంద్రారెడ్డి కుంగిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.1978 నుంచి రాజకీయాల్లో ఉన్న రామచం ద్రారెడ్డి వివిధ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ లాంటి బలమైన నాయకులను కూడా దీటుగా ఎదుర్కొన్నారు. చంద్రబాబుతో కూడా ఢీ అంటే ఢీ అంటూ వచ్చారు.  అయితే ఇప్పుడు మిధున్ రెడ్డి అరెస్టుతో పుంగనూరు పుడింగికి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు.  

By
en-us Political News

  
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో టీడీపీకి ఒక బెర్త్ క‌న్ఫ‌ర్మ్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో టెండరింగ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందనీ, కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా, విద్యుత్, ఇరిగేషన్, రోడ్లు ఇలా ప్రతి రంగంలోనూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ అడ్డగోలు దోపిడీకి తలుపులు బార్లా తెరిచారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
జగన్ పాలనా వైఫల్యాలు అంటూ వైసీపీయులు కలలో కూడా అంగీకరించడానికి సాహసించని మాటలను పేర్ని నాని నోటి వెంట రావడం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. జగన్ పాలనా వైఫల్యం కారణంగానే 2019 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయాన్ని ఘోరపరాజయాన్ని చవిచూడాల్సి వచ్చిందని పేర్ని నాని యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించేశారు.
రాజకీయాల్లో నాయకులపై విమర్శలు, ఆరోపణలు సహజం. వాటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవడం అన్నది సాధారణంగా అధకారంలో ఉన్న వారిపై కంటే అధికారంలో లేని వారిపైనే ఎక్కువగా జరుగుతుంటుంది. అయితే ఈ పద్ధతిని బ్రేక్ చేసి.. ఇది ప్రజాస్వామ్యం, తన, పర తేడా లేకుండా ఎవరిపై ఆరోపణలు వచ్చినా విచారణ జరుపుతామని,తప్పు చేశారని నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెబుతున్నారు.
ముంబైపై పట్టు సాధించడమే లక్ష్యంగా థాక్రే బదర్స్ కలవడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ-షిండే కూటమి విజయం సాధించే అవకాశం ఉందని తెలినప్పటికీ, థాక్రేల కలయిక నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ముంబై వాసులలోనే కాకుండా, దేశ వ్యాప్తంగా వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో మునిసిపోల్స్ దగ్గర పడుతున్న తరుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా శుక్రవారం నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిర్మల్ జిల్లాలో సదర్ ఘాట్ బ్యారేజీకి, అలాగే ఆదిలాబాద్ జిల్లాలో చనాక-కోరట పంప్ హౌస్ కు ప్రారంభోత్సవం చేయనున్నారు.
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.