మొయినాబాద్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు!

Publish Date:Mar 15, 2026

Advertisement

 

హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేయడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో కాల్పులు జరగడం, కొకైన్ స్వాధీనం కావడం సంచలనంగా మారింది. మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మార్చి 14 రాత్రి సుమారు 8 గంటల సమయంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం.డి. నయీముద్దీన్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. అజీజ్‌నగర్ గ్రామంలో ఉన్న వ్యాపారి పంజుగుల రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో కొందరు వ్యక్తులు మాదక ద్రవ్యాలు మరియు భారీ మొత్తంలో మద్యం వినియోగిస్తూ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం వచ్చింది. 

ఈ సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసిన ఎస్‌ఐ, NDPS చట్టం ప్రకారం అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి ప్రత్యేక బృందంతో ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. ఈగల్ (TGNAB) బృందం, షాద్‌నగర్ SOT, చేవెళ్ల పోలీస్ బృందాలు, క్లూస్ టీమ్ సభ్యులు మరియు రెండు అధికారిక సాక్షులతో కలిసి పోలీసులు రాత్రి సుమారు 9.40 గంటలకు ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే సిబ్బంది ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టి లోపలికి ప్రవేశించారు. ఈ సమయంలో పోలీసులు తమను పరిచయం చేసుకుని సోదాలు నిర్వహించనున్నట్లు ప్రకటించగా, ఫామ్‌హౌస్ లోపలి నుంచి ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తక్షణమే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ‘మేడ్ ఇన్ జర్మనీ’ అని ముద్రించిన .32 కాలిబర్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రివాల్వర్‌లో ఒక లైవ్ రౌండ్, ఒక ఖాళీ తూటా కవచం ఉండగా, అక్కడి నుంచి మరికొన్ని ఖాళీ తూటా కవర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మగా గుర్తించారు. అతని పక్కనే ఉన్న సిల్వేరి శరత్ కుమార్ వద్ద నుంచి మూడు ఖాళీ తూటా కవచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ పక్కన ఏర్పాటు చేసిన సోఫాల్లో కూర్చుని మద్యం సేవిస్తున్న మరో 9 మంది పురుషులు, ఒక మహిళను పోలీసులు గుర్తించారు. 

వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా శరత్ కుమార్ వద్ద చిన్న ప్యాకెట్‌లో కొకైన్ డ్రగ్ ఉన్నట్లు అతను స్వయంగా ఒప్పుకున్నాడు. ఈ పార్టీలో దొరికిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అయితే అందులో ఆరుగురికి మాత్రం పాజిటివ్ రాగా మరికొందరికి నెగటివ్ వచ్చింది. దీంతో పోలీసులు మరోసారి 11మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించగా మహేష్ కుమార్‌కు డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. 

అయితే మహేష్ కు మొదట నిర్వహించిన యూరిన్ టెస్ట్‌లో మాత్రం నెగిటివ్ వచ్చింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి మరోసారి బ్లడ్ టెస్ట్ నిర్వహించారు.ఈవిచారణలో భాగంగా యూరిన్ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. నీళ్లు కలపడం వల్లే యూరిన్ టెస్ట్‌లో డ్రగ్స్ నెగిటివ్‌గా వచ్చినట్లు తేల్చారు. బ్లడ్ టెస్ట్‌లో మాత్రం మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. వీకెండ్ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్‌లోని తన ఫామ్‌ హౌస్‌లో పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ పార్టీలో వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పోలీసులు సేకరించిన ఆధారాల ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, కౌశిక్ రవి ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పర్యటనకు వెళ్లిన సమయం లో ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతరం వాటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసు నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న ఏలూరు ఎంపీ పుత్త మహేష్ యాదవ్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఆయనతో పాటు పుట్టా మధు, ప్రియాంక రెడ్డికి కూడా అధికారులు బెయిల్ ఇచ్చారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అవసర మైన న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత వారిని విడుదల చేశారు.
 

By
en-us Political News

  
టీఎమ్ సీ తిరుగుబాటు పర్వం ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ చోటు చేసుకుంది. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎలా ఎదుర్కోవాలనే వ్యూహాలపై చర్చించేందుకు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశానికి హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో ఆమె సొంత పార్టీకి చెందిన దాదాపు 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటుకు రెడీ అవ్వడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అణ్ణామలైది. ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆవేశంతో, ఆశయంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్రంలో బీజేపీని ముందుకు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ పార్టీలో ఎదురైన అంతర్గత పరిణామాలు, మారుతున్న రాజకీయ సమీకరణాలతో ఆయన విసుగుచెందారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన కేవీపీ వైఎస్ ప్రతిష్ట మసకబార్చేలా మాట్లాడటం సరికాదనీ, పవన్ కళ్యాణ్ తాను చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే, ముఖ్యమంత్రి సహాయనిధికి తన సొంత సొమ్ము నుంచి 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తాననీ, నిరూపించలేకపోతే.. పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి వైఎస్ కుటుంబానికి, ఆయన అభిమానులకు బహిరంగం క్షమాపణ చెప్పాలని సవాల్ విసిరారు చేశారు.
ఈ భేటీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో తాను ప్రతిపాదించిన మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను సమర్థిస్తూ, వచ్చే 2029 ఎన్నికల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల భూములను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అంటే.. 2029 తరువాత కూడా ఏపీ రాజధానిని మార్చే ఆలోచనలోనే జగన్ ఉన్నారని, ఉంటారని జగన్ తేటతెల్లం చేశారన్న మాట.
ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్.
బీజేపీ అక్కడ ఎంత పటిష్టంగా వేళ్లూనుకుందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా మారింది. ఈ పరిణామాలతో టీఎంసీ మనుగడకే పెను ముప్పు పొంచి ఉందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
సాధ్యం కాలేదు. అనేక రోజులు ఢిల్లీలో బుజ్జగింపులు, సంప్రదింపులు జరిగాయి.కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, ప్రియాంక గాధీ వంటి వూరు రంగంలోకి దిగి బుజ్జగింపులు, సంప్రదింపులు జరిపారు.
ఈ రాజకీయ పరిణామాల్లో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మంగళవారం ( మే 25) అత్యంత కీలకమైన సమావేశం ఏర్పాటైంది. ఈ ఉన్నత స్థాయి చర్చల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పాల్గొననుండటం గమనార్హం. గత కొంతకాలంగా కర్ణాటక కాంగ్రెస్ శ్రేణుల్లోను, నాయకత్వ స్థాయిలోనూ అంతర్గతంగా సాగుతున్న అసంతృప్తులు, మార్పుల గుసగుసలకు ఈ భేటీతో ఒక స్పష్టమైన ముగింపు పలకాలని అధిష్ఠానం భావిస్తోంది.
వైఎస్ రాజారెడ్డి హ‌త్య కేసు మ‌ళ్లీ తెర‌పైకి.
రెండు నెలల కాలంలోనే దాదాపు తొమ్మిది ప్రాంతాలకు ప్రస్తుతం ఉన్న పేర్లు మార్చి పాత పేర్లను ఖరారు చేశారు.
విజ‌య్ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకోవ‌డం ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇంధన పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపునకు అనుగుణంగా.. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
జగన్‌కు లౌకికవాద ముద్ర ఉంది, ఆయన తనను తాను క్రైస్తవ లేదా హిందూ విశ్వాసాలకు మాత్రమే పరిమితం చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆయన నుదుటిపై సంప్రదాయ హిందూ బొట్టు కనిపించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.