చైనా చుట్టూ డిజిటల్ ఇరన్ వాట్!

Publish Date:Apr 26, 2026

Advertisement

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వామిగా ఉన్న చైనా.. ఇప్పుడు సెల్ఫ్ ఇసోలేషన్ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది.  చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ నాయకత్వంలో ఆ దేశం క్రమంగా తన సరిహద్దులను మూసివేస్తూ.. ప్రపంచం నుండి తనను తాను వేరు చేసుకునే   ప్రక్రియను వేగవంతం చేస్తోంది. కేవలం భౌతిక సరిహద్దులే కాకుండా.. సమాచారం, సాంకేతికత,   సామాజిక సంబంధాల చుట్టూ కూడా  నాలుగు అంచల నియంత్రణ వ్యవస్థను బీజింగ్ సిద్ధం చేస్తోంది.  ఆ నాలుగు అంచల నియంత్రణ వ్యవస్థ ఏంటంటే...
1. భౌతిక కదలికలు.. చైనాలో ఇప్పుడు పాస్పోర్ట్ అనేది కేవలం ప్రయాణ పత్రం కాదు,   ఒక నియంత్రణాస్త్రం. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ అధికారులు విదేశాలకు వెళ్లాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి. కొన్ని ప్రాంతాలలో సామాన్య పౌరులు సైతం పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేయాలంటే ఏడాది కాలపు ఆర్థిక లావాదేవీల రికార్డులు, ఫోన్ నంబర్ల నివేదికలు సమర్పించాల్సి వస్తోంది.  ముఖ్యంగా ఏఐ, సాంకేతిక రంగాలలో పనిచేసే నిపుణులపై  ఎగ్జిట్ బాన్'  విధించడం ద్వారా మేధో సంపత్తి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటోంది.
2. సామాజిక సంబంధాలు.. విదేశీయులతో లేదా విదేశీ నేపథ్యం ఉన్న వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండటం ఇప్పుడు చైనా  ఒక భద్రతా ముప్పుగా పరిగణిస్తోంది.  ఈ ఏడాది జనవరి నుంచి అమలులోకి వచ్చిన అంతర్గత ఆదేశాల ప్రకారం.. న్యాయ, పోలీసు విభాగాల్లో పనిచేసే వారు విదేశీ సంబంధాలు ఉన్న పాత స్నేహితులు,  కుటుంబ సభ్యులతో సైతం సంబంధాలు తెంచుకోవాలన్న ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. రహస్యంగా కలిసే ప్రయత్నం చేసినా పకడ్బందీ నిఘా నీడన వారు చిక్కుకుంటున్నారు. సమాచార లీకేజీని అడ్డుకోవడమే లక్ష్యంగా, పౌరుల వ్యక్తిగత సంబంధాలను సైతం ప్రభుత్వం నియంత్రిస్తోంది. ఇది   మావో నాటి కఠిన నిబంధనలను గుర్తుకు తెస్తోంది. 

3. అంతర్గత సమాచార దిగ్బంధనం..  ప్రభుత్వ కార్యాలయాల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై పూర్తి నిషేధం విధించింది. అధికారులు తమ ఫోన్లను కార్యాలయం వెలుపల ఉండే  ఎలక్ట్రానిక్ షీల్డింగ్ లాకర్లలో ఉంచాలి. సమాచార మార్పిడికి కేవలం వైర్డ్ ల్యాండ్లైన్లను మాత్రమే ఉపయోగిస్తున్నారు. 2024 నాటి  ఇంటెల్  , ఏఎండీ  చిప్ లను  ప్రభుత్వ కంప్యూటర్లలో నిషేధించడం ద్వారా విదేశీ సాంకేతికతపై ఆధారపడటానికి  చైనా పూర్తిగా స్వస్తి పలికింది.
4. ఇంటర్నెట్ సరిహద్దుల మూసివేత.. 
2026 ఏప్రిల్ నుండి చైనాలో విదేశీ వెబ్సైట్లకు యాక్సెస్ ను దాదాపు అసాధ్యం చేశారు. వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ (వీపీఎన్) వినియోగంపై తీవ్రమైన ఆంక్షలు విధించారు. హాంగ్ కాంగ్, మకావు వంటి ప్రాంతాల వెబ్సైట్లను సైతం బ్లాక్ చేయడం ద్వారా చైనా ఇంటర్నెట్ ను ఒక  అంతర్గత ద్వీపంగా మార్చివేసింది. 
ఇక చైనా ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏమిటి అని చూస్తే..   ప్రధానంగా అంతర్గత అస్థిరత, బాహ్య ఒత్తిళ్లు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే.. అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ చైనీస్ భాషలో విడుదల చేసిన రిక్రూట్మెంట్ వీడియోలకు దాదాపు 12 కోట్ల వీక్షణలు రావడం బీజింగ్ ను ఉలిక్కిపడేలా చేసింది. ఇది ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కంటే ఎక్కువ కావడం గమనార్హం. ఇక సమాచార చౌర్య భయం కూడా ప్రధాన కారణాలలో ఒకటిగా కనిపిస్తోంది.  తియాంజిన్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్ నుండి పది పెటాబైట్ల సున్నితమైన సమాచారం (క్షిపణి నమూనాలు, అణు సంలీన సిమ్యులేషన్లు లీక్ అవ్వడం చైనా భద్రతా లోపాలను ఎత్తిచూపింది. అదే విధంగా  దేశంలో పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి, నిరుద్యోగం పౌరులలో అసహనాన్ని పెంచుతున్నాయి. ఈ అసంతృప్తి విదేశీ శక్తుల మద్దతుతో తిరుగుబాటుగా మారవచ్చని జీ జిన్పింగ్ ప్రభుత్వం భయపడుతోంది. చైనా అనుసరిస్తున్న ఈ సెల్ఫ్ ఐసోలేషన్ విధానం ఆ దేశాన్ని మావో కాలం నాటి క్లోజ్ డ్ సిస్టం వైపు తీసుకెళ్తోంది. ప్రజలు, మూలధనం, సమాచారం బయటకు వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా నియంతృత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని చైనా కమ్మూనిస్టు పార్టీ (సీపీపీ) భావిస్తున్నట్లు కనిపిస్తోంది.  అయితే, ఆధునిక యుగంలో సమాచారాన్ని, స్వేచ్ఛా కాంక్షను అడ్డుకోవడం సాధ్యం కాదనీ, చైనా అనుసరిస్తున్న ఈ విధానం.. భవిష్యత్ లో అనూహ్య పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.

References
•    China's New National Security Law & Cyber Regulations (2026).
•    Reports on Civil Servant Passport Seizures - Human Rights Watch.
•    CIA Chinese Language Recruitment Campaign Analysis.
•    Tianjin Supercomputing Center Data Breach Reports.

-సీతారాం కంఠంనేని 

By
en-us Political News

  
ఈ కాల్పుల ఘటనను నెటిజనులు ఒక ప్రణాళిక మేరకు జరిగిన స్టేజ్డ్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, పడిపోతున్న తన ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం ఆడిన నాటకంగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుండి తరలించడం ఏమిటని నిలదీస్తున్నారు.
చైనా గత 15 నెలల కాలంలో దాదాపు 100 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ట్రెజరీలను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే దీన్ని కేవలం ఒకేసారి చేసిన విక్రయంగా చూడలేము. బాండ్ల కాలపరిమితి ముగిసిన తర్వాత వాటిని తిరిగి పునరుద్ధరించకుండా, ఆ నిధులను ఇతర రూపాల్లోకి మళ్లించడం చైనా వ్యూహం.
మాసాయిపేట సమీపించగానే ఇంజిన్ భాగం నుంచి పొగ, మంటలు రావడాన్ని గమనించిన డ్రైవర్, క్లీనర్ ను అప్రమత్తం చేసి బస్సు నుంచి బయటకు వచ్చేశాడు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
15 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో 1.25 లక్షల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. దేశ చరిత్రలోనే ఇది అత్యంత భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో ఒకటి.
సమాచారం అందుకున్న వెంటనే అటవీ శాఖ యంత్రాంగం అప్రమత్తమైంది. సుమారు 50 మందితో కూడిన ప్రత్యేక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అటవీ శాఖ సిబ్బందితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం అటవీ విభాగం, అగ్నిమాపక దళం సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోనికి తీసుకువచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర విస్తరించిన మంటలను అదుపు చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు, ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోల్, డీజిల్ వంటి నిత్యావసరాల సరఫరాలో బాధ్యతారహితంగా వ్యవహరించడం క్షమార్హం కాదని హెచ్చరించారు.
స‌న్‌రైజ‌ర్స్ ఇన్నింగ్స్ సంద‌ర్భంగా బంతిని ఆపే క్ర‌మంలో 15 ఏళ్ల వైభ‌వ్ గాయంతో మైదానాన్ని వీడాడు. ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ జోరు మామూలుగా లేదు. సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. 15 ఏళ్ల వయసులో రికార్డుల మోత మోగిస్తూ.. క్రికెట్ ఫ్యాన్స్ ప్రశంసలు అందుకుంటున్న వైభవ్ సూర్యవంశీ తీవ్రంగా గాయపడటం జట్టుతో పాటు అభిమానులను తీవ్రంగా కలవరపరుస్తోంది.
మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత అత్యధికంగా ఉంటుందనీఆ సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దనీ అధికారులు సూచిస్తున్నారు. ఇక హైదరాబాద్‌లో కూడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉంది. పెరిగిన తేమ కారణంగా ఉక్కపోత కూడా ప్రజలను ఇబ్బంది పెడుతుందనీ వాతావరణ శాఖ హెచ్చరించింది.
కేవలం కొన్ని ప్రధాన బంకుల్లో మాత్రమే ఇంధనం లభిస్తుండటంతో, అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి. తిరుమలలోని హెచ్పి పెట్రోల్ బంక్ పెట్రోల్, డీజిల్ కోసం భారీగా వాహనాలు బారులు తీరాయి.
అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులు తమ ఆర్థిక అవసరాల పేరుతో ధర్మేంద్ర నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారనీ, . లగ్జరీ కార్లు, విలువైన బంగారం, ఫ్లాట్లు వంటివి ధర్మేంద్రతోనే కొనుగోలు చేయించి అన్షురెడ్డి పేరిట రిజిస్టర్ చేయించుకున్నట్లు బాధితుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గత ఆరు నెలలుగా తాను నార్సింగి పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని పేర్కొంది. నాన్‌బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేయకుండా సీఐ వెసులుబాటు కల్పిస్తున్నా రని ఆరోపించింది.
చట్టం బలంగా ఉంటుంది. అయితే సమస్య ఏమిటంటే దాని అమలు మాత్రం అత్యంత బలహీనం. కష్టంగా ఉన్నా ఇదే చేదు నిజం. చట్టానికి, సమాజానికి మధ్య అగాధం న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసేదిగా పరిణమిస్తోంది. దేశంలో చట్టాలు ఐడిలిస్టిక్ కోణంలో రూపొందుతాయి తప్ప.. రియలిస్టిక్ గా కాదు అన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది.
జగన్ తన ఫారిన్ టూర్ కోసం ఇప్పటికే ఇప్పటికే న్యాయస్థానం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ పొందిన సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నందున జగన్ విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పని సరి అన్న సంగతి విదితమే. అది పక్కన పెడితే.. ఈ పర్యటనలో భాగంగా జగన్, ఆయన సతీమణి భారతీ లండన్ లండన్‌లో ఉంటున్న తన కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డిలను కలుసుకోవడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని సమాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.