Publish Date:Oct 10, 2019
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో టీఆర్ఎస్కు సీపీఐ వార్నింగ్ ఇచ్చింది. టీఆర్ఎస్కి మద్దతు ఉపసంహరించుకోవాలని కార్మికులు డిమాండ్ చేయడంతో ... హుజూర్నగర్లో టీఆర్ఎస్కు మద్దతుపై పునరాలోచిస్తామని సీపీఐ ప్రకటించింది. ఆర్టీసీ కార్మిక జేఏసీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న చాడ వెంకట్ రెడ్డి... ఆర్టీసీ కార్మికులకు సీపీఐ అండగా ఉంటుందని ప్రకటించారు.
ఆర్టీసీ సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఉపఎన్నికపై పడే అవకాశం కనిపిస్తోంది. ఉత్తమ్ కు షాకిచ్చి, ఎలాగైనాసరే హుజూర్ నగర్ లో గులాబీ జెండా పాతాలని కంకణం కట్టుకున్న టీఆర్ఎస్ ఆశ నెరవేరేలా కనిపించడం లేదు. హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే సీపీఐ మద్దతు తీసుకుంది. సీపీఐ కూడా అధికార పార్టీ అడిగేసరికి ఓకే చెప్పింది. అయితే, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో... టీఆర్ఎస్ కు మద్దతుపై పునరాలోచిస్తామంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ప్రకటన చేశారు.
అసలే, హుజూర్ నగర్ లో పార్టీ పరిస్థితి బాగాలేదని సర్వేలు చెబుతున్నాయి. మండలాలు, గ్రామాలు, వార్డులు వారీగా నేతలను రంగంలోకి దింపి ప్రజలను కలుస్తున్నా, గెలుపు అవకాశాల్లేవని కేసీఆర్ సర్వేల్లోనూ, ఇంటలిజెన్స్ రిపోర్ట్స్ లోనూ తేలింది. ఇక, ఇప్పుడు ఒకవైపు ఆర్టీసీ సమ్మె ప్రభావం... మరోవైపు అంతోఇంతో బలమున్న సీపీఐ మద్దతు ఉపసంహరించుకుంటామంటూ హెచ్చరించడంతో, టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. మరి సీపీఐ హెచ్చరికపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/cpi-strong-warning-to-krc-25-89936.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!