లగడపాటిపై సి.బి.ఐ.కి ఫిర్యాదు

Publish Date:May 18, 2012

Advertisement

విజయవాడ లోక్ సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పై హైదరాబాద్ లోని ముస్లీంలు కత్తి గట్టారు. వందలాది కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులను వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో లగడపాటి అక్రమంగా కారు చౌకగా కొట్టేశారని వారు ఆఒపిస్తున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు ఫిర్యాదు కూడా చేశారు. మణికొండలోని భూములను లగడపాటికి చెందిన ల్యాంకో కంపెనీ పబ్లిక్ ఆక్షన్ లో కొనుగోలు చేసింది. ఇక్కడ నిర్మాణాలు ప్రారంభమైన తర్వాత ఈ భూముల్లో కొంత వక్ఫ్ ఆస్తులుగా గుర్తించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణావాదులు అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ఆ తర్వాత హఠాత్తుగా అక్కడనుంచి టెంట్ లు పీకేశారు. వారికి పెద్దమొత్తంలో ముడుపులు అందాయని అందుకే వారు ఆ అంశాన్ని వదిలేశారని ముస్లీం మైనార్టీ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

 

 

టి.ఆర్.ఎస్. వదిలేసినా తాము మాత్రం రాజగోపాల్ ను వదిలేది లేదంటున్నారు ఆల్ ఇండియా ముస్లీం మైనార్టీ నేతలు. మణికొండలో అప్పట్లో వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేసిన మేళ్ళకు ప్రతిఫలంగా లాంకో సంస్థ సుమారు 30 కోట్ల రూపాయల వరకూ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిందని వారు ఆరోపిస్తూ సి.బి.ఐ.కి ఫిర్యాదు పంపారు. దీనిపై విచారణ జరిపి రాజగోపాల్ ను అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్ర పాలనా కేంద్రమైన బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
సింగరేణి కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది.
అధికారులు వస్తుంటారు.. పోతుంటారు.. నేను లోకల్.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఫైర్..!
ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు..!
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అత్యంత కట్టుదిట్ట మైన భద్రత మధ్య ఉన్న మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన బ్యారక్‌లో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..!
హైదరాబాద్‌ రాయదుర్గం పరిధిలో జరిగిన హిట్‌ అండ్‌ రన్‌ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
సికింద్రాబాద్‌లోని  కట్టుదిట్టమైన భద్రత ఉండే మద్రాస్ రెజిమెంట్ లో  ఆయుధాగారం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు మాయమవ్వడం ఆందోళన కలిగిస్తోంది.  
లంగాణ కాంగ్రెస్ లో ఇటీవలి వివాదాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో కేంద్రం క్లియర్ కట్ సందేశాలు ఇవ్వడం, సీఎం, టీపీసీసీ చీఫ్ లను హస్తినకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ప్రస్తుత కేబినెట్ నుంచి.. కొండా సురేఖ తో పాటు మరో ఇద్దరు మంత్రులను తొలగించే అవకాశం ఉ:ది. వారిరువురూ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారే కావడం గమనార్హం. వారి స్థానంలోమరో ముగ్గురు కొత్త వారికి చోటు కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని బంగాళాఖాతంలో ఏర్పడిన  అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉపరితలంలో కొనసాగుతున్న ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ సమాచారం మేరరు రానున్న నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.
అమెరికాలో కూతురి పెళ్లి.. వీడియో కాల్‌ ద్వారా నూతన జంటను ఆశీర్వదించిన పేరెంట్స్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.