అఖిలేష్ యాదవ్ బాటలో నారా లోకేష్
Publish Date:May 18, 2012
Advertisement
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాటలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పయనించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ ఇబ్బందుల్లో ఉన్నపుడు అతని తనయుడు అఖిలేష్ యాదవ్ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ మొదట పార్లమెంట్ కు ఎన్నికయి తర్వాత యు.పి.కి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రస్తుతం రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తన తండ్రి చంద్రబాబు నాయుడికి ఇకపై చేదోడు వాదోడుగా ఉండాలని నారా లోకేష్ నిర్ణయించారు. తండ్రి అనుమతితో పార్టీ వ్యవహారాలను కూడా పర్యవేక్షించడం ఇప్పటికే ప్రారంభించారు. అయితే ఆయన నేరుగా పార్టీ ఆఫీసుకు వెళ్ళకుండా ఇంటి వద్దకే తన సలహాదారులను రప్పించుకుని మంత్రాంగం నిర్వహిస్తున్నారు. టిడిపి పార్టీ కార్యాలయ ఇన్ ఛార్జి తొండెపు దశరథ జనార్థన్, శాసనమండలి సభ్యుడు యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్, జయరామ్ రెడ్డి, కంభంపాటి రామ్మోహన రావు తదితరులను లోకేష్ కు సలహాదారులు గా చంద్రబాబు నియమించారు. వీరు వారంలో రెండు రోజులు లోకేష్ తో కలిసి మంతనాలు సాగిస్తున్నారు. 2014 ఎన్నికల నాటికి లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు నగదు బదిలీ పధకాన్ని తన మేనిఫెస్టోలో పెట్టారు. ఆ పథకానికి అప్పట్లో విశేష ప్రచారం కూడా కల్పించారు. ఈ పథకాన్ని లోకేష్ రూపొందించారని చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్పుకున్నారు. అయితే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఒకవేళ గెలిచి ఉంటే ఈ పథకం వల్లే తాము గెలవగలిగామనే ప్రచారాన్ని తెలుగుదేశం నేతలు చేసి నారా లోకేష్ ను ఆకాశానికెత్తేసేవారే. ఈ ఎన్నికల తర్వాత లోకేష్ స్టూడియో ఎన్ న్యూస్ ఛానల్ వ్యవహారాలకే చాలాకాలం పరిమితమయ్యారు. అయితే నందమూరి కుటుంబసభ్యుల మద్దతు అనిశ్చితంగా ఉండడంతో చంద్రబాబు నాయుడు ఇకపై పార్టీ వ్యవహారాల్లో నారా లోకేష్ సహాయ సహకారాలను తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. నందమూరి ఫ్యామిలీలో ఒక్క బాలకృష్ణ మినహా ఎవరూ చంద్రబాబును నమ్మడం లేదు. అయితే బాలకృష్ణ రాజకీయాల్లోకి రావాలని ఉబలాట పడుతున్నప్పటికీ చంద్రబాబు ఇష్టపడడం లేదని తెలుస్తోంది. గత ఎన్నికల ప్రచార సభల్లో బాలకృష్ణ పాల్గొన్నప్పటికీ పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూరలేదనే భావనతో చంద్రబాబు ఉన్నారు. జూనియర్ ఎన్.టి.ఆర్. సభలకు జనం బాగానే వచ్చారు. అతని ప్రసంగాలు కూడా ఆకట్టుకున్నాయి. కానీ అతను ఎదిగితే తన కుమారుడు లోకేష్ రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని లోకేష్ కు రాజకీయ పాఠాలు నేర్పిస్తున్నట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/nara-akhilesh-in-foot-steps-of-akhilesh-yadav-24-14121.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





