పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి జలాలను విడుదల చేశారు. ఒక వైపు వర్షాభావ పరిస్థితి, మరో వైపు నిండుకున్న జలాశయాలతో ప్రశ్నార్థకంగా మారిన కృష్ణా డెల్టా భవిష్యత్.. ఈ తరుణంగా గతంలో చంద్రబాబు ఎంతో ముందు చూపుతో కేవలం ఏడాది వ్యవధిలో పూర్తి చేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకమే డెల్టారైతాంగానికి ఆశాదీపంగా మారింది.
గోదావరి పరీవాహక ప్రాంతాలలో కురిసిన వర్షాలతో గోదావరి ప్రవాహం పెరిగిన నేపథ్యంలో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరందించేందుకు తెలుగుదేశం కూటమి సర్కార్ నడుంబిగించింది. బుధవారం ( జులై 3) ఉదయం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పట్టి సీమ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీరు రెండుమూడు రోజలలో ప్రకాశం బ్యారేజీ ఎగువన ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా జలాలలో కలుస్తుంది. పట్టిసీమ నీటి విడుదల కృష్ణా డెల్టా రైతుల సాగునీటి కష్టాలను తీర్చనుంది.
పట్టిసీమతో పాటు గోదావరి డెల్టాలోని తాడిపూడి, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టులకు నీటి పంపింగ్ను మంత్రి రామానాయుడు ప్రారంభించారు. 2014లో ప్రారంభమైన పోలవరం కుడికాల్వ పనుల్ని ఏడాదిలోపే పూర్తి చేవారు. 2015లో తొలిసారి పట్టిసీమ ద్వారా నీటిని విడుదల చేశారు. తొలి ఏడాది అంటే 2015-16లొ 8.50టిఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించారు. 2016-17లో 55.60టిఎంసీలు, 2017-18లొ 105 టిఎంసిలను తరలించారు. 2018-19లో 26.88టిఎంసిలను తరలించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల పాటు పట్టిసీమ ప్రాజెక్టును వినియోగించలేదు. పులిచింతల వద్ద కృష్ణా జలాలను నిల్వ చేసి గోదావరి నీటిని వాడుకునే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం చేశారు. గత ఏడాది ఎగువ నుంచి నీటి విడుదల లేకపోవడంతో తప్పని సరి పరిస్థితుల్లో పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేశారు. 2023-24లో 33టిఎంసిలను విడుదల చేశారు. గతేడాది ఆగస్టు 11న పట్టిసీమ ఎత్తిపోతలతో నీటి తరలింపు ప్రారంభించినా నెల రోజులకే నిలిపివేశారు. గోదావరిలో పుష్కలంగా జలాలు ఉన్నా.. డెల్టాకు అవసరం ఉన్నా.. పట్టిసీమను పూర్తి స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకో లేదు.
పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు సాగునీరు అందిస్తే.. ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకు దక్కుతుందన్న దుగ్ధతోనే కృష్ణా డెల్టా ఎండిపోతున్నా జగన్ సర్కార్ చోద్యం చూసింది తప్ప.. రైతాంగాన్ని ఆదుకునేందుకు నీటిని మాత్రం విడుదల చేయలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/godavari-water-to-krishna-delta-39-179888.html
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య శనివారం నాడు జరిగే చారిత్రక సమావేశానికి అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.
నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కి వచ్చిన చంద్రబాబు నాయుడికి హైదరాబాద్ నగరం ఘన స్వాగతం పలికింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా రైతులకు సాగునీరు, తాగునీటికి ఊరటనిచ్చే పట్టిసీమ ఎత్తిపోతలతో పథకాన్ని గత అయిదేళ్లుగా ప్రభుత్వం పక్కన పెట్టివేసింది. గత ఏడాది తాగునీటి ఎద్దడిని తట్టుకోలేక కొద్ది రోజులు పట్టిసీమను వినియోగించి ప్రభుత్వం మమ అనిపించింది. ఈ ఏడాది నాగార్జున ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరటంతో .. కృష్ణా, గుంటూరు జిల్లాలు తాగునీటి కోసం తల్లడిల్లిపోతున్నాయి. కనీసం కృష్ణాజిల్లా రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో పట్టిసీమ మోటార్లతో నీటి తరలింపు ప్రారంభించారు.
కేతిరెడ్డికి జగన్ విజయవాడకి రమ్మని కబురు చేశారట. అయితే కేతిరెడ్డి మాత్రం నేను ఇప్పుడు రాలేను.. నా మనసేమీ బాగాలేదు అని రిప్లయ్ ఇచ్చారట.
ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా.. చేసిన పాపాలకు అసలు వడ్డీతో టి సిసలుగా ఫలితంబు అనుభవించుట తధ్యమన్నా.. అంటూ సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ సినిమాలో ఓ పాట ఉంది. జీవితంలో మనంచేసే మంచి చెడులకు ఫలితాలు తప్పకుండా అనుభవించాల్సి వస్తుందని దీని సారాంశం. ఈ పాట మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అతికినట్లు సరిపోతుంది.
తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పీక్స్ కు చేరాయి. హిందుత్వ భావజానం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజప రిణామంగా అంతా భావించేవారు. వామపక్ష పార్టీలు, బీజేపీలు కన్జర్వేటివ్ పొలిటికల్ పార్టీలకు భిన్నంగా సైద్ధాంతిక నిబద్ధతతో ఉంటాయని భావించేవారు. అయితే బీజేపీలో ఇప్పుడా పరిస్థితి లేదు.
కోడి సాధారణంగా పొయ్యి మీద వున్న గిన్నెలోకి చేరుతుంది.. కానీ, బ్రిటీష్ కొలంబియాలో ఒక కోడి గిన్నిస్ బుక్కులోకి చేరింది. ప్రపంచం మొత్తంలో అంకెలను, రంగులను గుర్తుపట్టి చెప్పగలిగే కోడిగా ఈ కోడి గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది.
వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి రిమాండ్లో వున్న రేపిస్టు సుధాకర్ని పరామర్శించాల్సిన అవసరం వుంది. హత్యాయత్నం కేసులో జైల్లో వున్న తన పార్టీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పాతిక లక్షల రూపాయల ఖర్చు పెట్టించి పరామర్శించిన జగన్, ఇప్పుడు రేప్ కేసులో అరెస్టు అయిన సుధాకర్ని కూడా పరామర్శించాలి.
ఆయన తొలి సారి ఎంపీగా ఎన్నికయ్యారు. అతి సామాన్య కుటుంబ నేపథ్యం ఆయనది. రెండు దశాబ్దాల కిందట తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా పని చేస్తూ వస్తున్నారు. ఎన్నడూ పదవుల కోసం పాకులాడలేదు. తన పనితీరు ద్వారానే పార్టీ అధినేతను మెప్పించారు.
ఎక్కడో రంపచోడవరం గిరిజన గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేసే ఒక యువతి ఎమ్మెల్యే అవుతుందని ఎవరైనా ఊహించగలరా? ఎవరో వేరేవారు ఊహించడం కాదు.. సాక్షాత్తూ ఆ యువతి కూడా ఊహించలేదు.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు కైవసం చేసుకున్న నేపథ్యంలో బిఆర్ఎస్ ఎల్ పిని కాంగ్రెస్ ఎల్ పిలో చేర్చుకునే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒక్కసారిగా ఆరుగురు కాంగ్రెస్ లో చేరిపోయారు.
టెక్సాస్లో వుండే మోనికా రిలే అనే ఓ బొద్దుగుమ్మ మాత్రం ఇలా అనుకోవడం లేదు. తాను బరువు బాగా పెరిగిపోవాలని కోరుకుంటోంది. అలా బరువు పెరగడం కోసం.... మూడు పూటలా కాదు... ఆరుపూటలా తింటూ కృషి చేస్తోంది.