కోస్తా ప్రజల నాడి తెలుస్తుందా?

Publish Date:Apr 24, 2012

Advertisement

ఉప ఎన్నికలు జరుగనున్న 18అసెంబ్లీ నియోజకవర్గాల్లో 17 స్థానాలు ఆంధ్రాప్రాంతంలో వుండటం వల్ల 2014 ఎన్నికల్లో ప్రజల నాడి ఏవిధంగా వుంటుందో తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి వంటి జిల్లాల్లో ఉప ఎన్నికలు జరిగే స్థానాలు వున్నాయి. అంతేకాకుండా ఉప ఎన్నికలు జరిగే స్థానాలన్నీ కాంగ్రెస్ పార్టీకి చెందినవి. ఆ స్థానాలకు చెందిన శాసనసభ్యులందరూ కాంగ్రెస్ ను వదిలి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరినవారే. అందువల్ల ఈ ఉప ఎన్నికల ద్వారా కాంగెస్ పార్టీ కి ప్రాధాన్యత వుందా? లేక వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి ప్రాధాన్యత వుందా? అనే విషయం కొంతమేరకు అవగాహనకు వస్తుందని భావిస్తున్నారు.

 

 

ఇదే సమయంలో కాంగెస్ పార్టీ ఓటింగ్ ఏ మేరకు చీలుతుంది, అది తెలుగుదేశంపార్టీకి ఎంతమేరకు ఉపయోగపడుతుందనే అంశం కూడా అర్థమయ్యే అవకాశం వుంది. ఉప ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ మూడు స్థానాల్లో గలిచినా లేదా నాలుగుస్థానాల్లో గెలిచినా అదనంగా ప్రయోజనం పొందినట్లే. ఈ ఉప ఎన్నికల ద్వారా తెలుగుదేశంపార్టీ 2014 ఎన్నికలకు కొత్త ఎత్తుగడలతో సిద్ధమవ్వాడానికి వీలు కలుగుతుంది. ఉప ఎన్నికలు ఎన్నికలు జరిగే 18 స్థానాలలో ఒకటి (పరకాల) మాత్రమే తెలంగాణలో వుంది. ఈ ఎన్నిక ద్వారా జగన్ పట్ల తెలంగాణా ప్రజలు ఏ భావంతో వున్నారో కూడా అర్థం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నియోజకవర్గం తాజా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కొండా సురేఖ వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వుండటమే కాకుండా ఆమె తెలంగాణా నాయకురాలికంటే జగన్ అబిమానిగా ఎక్కువ గుర్తింపు తెచ్చుకోవడం అందుకు కారణం.

By
en-us Political News

  
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
పెళ్లయి తొమ్మిది నెలలే.. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. అప్పటికే గర్భం దాల్చిన భార్య.. కానీ భర్త అనుమానం ఆ కుటుంబం లో విషాదాన్ని నింపింది.
భాగ్యనగరంలో వైభవంగా వినాయక చవితి సంబరాలు.. ఖైరతాబాద్‌లో తొలిపూజ పూర్తి..!
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో మైనర్ బాలికపై పలువురు యువకులు మూడు రోజులపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
సికింద్రాబాద్ మౌలాలి సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుపై కరెంట్ తీగలు తెగిపడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది
కన్నుల పండువగా గణేశ్ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా ఖైరతాబాద్ మహాగణపతి..!
స్నేహితుడి పుట్టినరోజు సందర్భంగా మిగతా స్నేహితులంతా కలిసి అతని ఇంటికి వెళ్లి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు.
బుల్లితెర డ్యాన్స్ షో ‘ఢీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న డ్యాన్సర్ రాజు వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.
మైక్ కనిపిస్తే ఊగిపోతున్నారు.. నాయినిపై ఆగ్రహం..?
ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేనలో చేరారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.