జాప్యంతో జటిలమవుతున్న రాజధాని అంశం

Publish Date:Jul 27, 2014

Advertisement

 

రాష్ట్ర విభజన వ్యవహారంలాగే ఆంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణ వ్యవహారం కూడా చివరికి చిలికి చిలికి గాలివానలా మారేలా ఉంది. రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై ప్రభుత్వానికి స్పష్టత ఉన్నప్పటికీ, ఆ నిర్ణయాన్ని విస్పష్టంగా ప్రకటించడంలో జరుగుతున్న జాప్యంవల్ల నానాటికీ సమస్య జటిలమవుతోంది. రాజధాని నిర్మించాలనుకొంటున్న విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో తగినన్ని ప్రభుత్వభూములు లేకపోయినప్పటికీ, రాజధాని అక్కడ ఉంటేనే అన్ని జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉంటుందని భావిస్తుండటంతో, ఆ ప్రాంతాలలో భూముల ధరలు పెరిగిపోతున్నాయి. రాయలసీమలో విస్తారంగా ప్రభుత్వ భూములు లభ్యమవుతున్నప్పటికీ, ప్రభుత్వం తను నిర్ణయించుకొన్న ప్రాంతంలోనే రాజధాని నిర్మించాలని భావిస్తుండటంతో అన్ని వైపుల నుండి విమర్శలు ఎదుర్కోక తప్పడంలేదు.

 

 

వైయస్సార్ కాంగ్రెస్ ఈ అంశానికి రాజకీయరంగు పులిమే ప్రయత్నం చేస్తుంటే, రాజధాని కోరుకొంటున్న రాయలసీమవాసులు అప్పుడే ఉద్యమబాట పట్టారు. నానాటికీ పెరిగిపోతున్న భూముల ధరలు, ప్రతిపక్షాల విమర్శలు, రాజకీయాలు, రాజధాని కోసం ఉద్యమాలు, శివరామకృష్ణన్ కమిటీ ఇంకా తన నివేదిక సమర్పించకపోవడం వంటి అనేక కారణల చేత ప్రభుత్వం రాజధాని అంశంపై ఒక స్పష్టమయిన ప్రకటన చేయలేకపోతోందని అర్ధమవుతోంది. ఈ పరిస్థితులలో మంత్రుల ప్రకటనలు, రాజధాని కోసం కొత్తగా మరొక కమిటీ ఏర్పాటు వంటివి మరింత అగ్గి రాజేస్తున్నాయి. నిన్నముఖ్యమంత్రితో సమావేశమయిన శివరామకృష్ణన్ కమిటీ, వచ్చే నెల 20లోగా తమ తుది నివేదిక అందజేస్తామని చెప్పగా, ఆ నివేదిక అందిన మూడు నెలలలోగా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటిస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. అంటే మరో మూడు నెలల వరకు రాజధాని ఎక్కడ నిర్మించబోతున్నారనే విషయంపై స్పష్టతరాదని స్పష్టం అవుతోంది.

 

రాష్ట్రానికి ఒక శాశ్విత రాజధాని ఏర్పాటు చేయడం అనేక సంక్లిష్టమయిన అంశాలతో ముడిపడున్న మాట వాస్తవమే. కానీ ఈ విషయంలో జాప్యం జరుగుతున్న కొద్దీ సమస్యలు మరింత జటిలమయి, చివరికి ఊహించని అనేక కొత్త సమస్యలను సృష్టించే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ప్రభుత్వం వీలయిననంత త్వరగా రాజధానిపై తన నిర్ణయాన్ని ప్రకటించి వెంటనే పనులు కూడా మొదలుపెట్టే ప్రయత్నం చేయడం మంచిది.

By
en-us Political News

  
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.