ఆంధ్రా మిర్చికంపెనీపై తెలంగాణావాదుల ఆగ్రహం

Publish Date:Apr 20, 2012

Advertisement

ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు కోట్లాదిరూపాయలు ఖర్చుపెట్టి ఖమ్మం-కోదాడ ప్రధానరహదారి పక్కన ముదిగొండలో ఏర్పాటు చేసిన పరిశ్రమపై తెలంగాణావాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిరపవిత్తనాల నుంచి ఆయిల్ ను తీసే ఈ పరిశ్రమ వల్ల ముదిగొండ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కాలుష్యం అయిపోతున్నాయని తెలంగాణావాదులు ఆరోపిస్తున్నారు. మిరపకాయల నుంచి తొడిమలు వేరు చేసి వాటి నుంచి గింజలను తీసి ఆ గింజల నుంచి తీస్తున్న ఆయిల్ ను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రోజుకు 2వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పరిశ్రమను రెండు నెలల క్రితమే ప్రారంభించారు.

దీనిని ఇప్పుడు తెలంగాణావాదులు లక్ష్యంగా పెట్టుకుని మూయించివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ఫ్యాక్టరీ నిర్మించాలంటే చుట్టుపక్కల ఐదుకిలోమీటర్ల పరధిలో ఎలాంటి జనాభా ఉండకూడదనే నిబంధన ఉందని, ఈ నిబంధన ను ఉల్లంఘించి ఆంధ్రా పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఫ్యాక్టరీ నెలకొల్పారని తెలంగాణావాదులు ఆరోపిస్తున్నారు. మిరప గింజల నుంచి ఆయిల్ తియ్యాలంటే 220డిగ్రీల ఫారిన్ హీట్ వద్ద వేడి చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వాయువుల వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నార ని తెలంగాణావాదులు ఆరోపిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ మూసివేయాలంటూ వారు జిల్లా అధికార్లకు ఫిర్యాదులు పంపుతున్నారు. అధికారులు పట్టించుకోకపొతే ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టాలని యోచిస్తున్నారు.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లో పేదల సొంతింటి కల సాకారం..!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో నేలకూలిన చెట్టు, ధ్వంసమైన వాహనాలు..!
నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్‌ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి దారుణ హత్య చోటుచేసుకుంది.
సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో సెప్టెంబర్ 17న కేంద్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనున్న
తెలంగాణలో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు
మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్ పరిసరాల్లో చోటుచేసుకున్న పసుపు నీళ్లతో శుద్ధి ఘటన ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశంగా మారింది.
వినాయక చవితి వేడుక లకు హైదరాబాద్‌ నగరం ముస్తాబవుతున్న వేళ.. బేగంబజార్‌లోని ఫీల్‌ఖానా ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి
వినాయక చవితి వచ్చిందంటే బాలాపూర్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన అసెంబ్లీ ముట్టడి లేదా నిరసనల ఉద్రిక్తతలకు సంబంధించి దర్యాప్తు వేగవంతమైంది.
పెళ్లయి తొమ్మిది నెలలే.. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు.. అప్పటికే గర్భం దాల్చిన భార్య.. కానీ భర్త అనుమానం ఆ కుటుంబం లో విషాదాన్ని నింపింది.
భాగ్యనగరంలో వైభవంగా వినాయక చవితి సంబరాలు.. ఖైరతాబాద్‌లో తొలిపూజ పూర్తి..!
సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో మైనర్ బాలికపై పలువురు యువకులు మూడు రోజులపాటు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.