మీ సోషల్ మీడియా అకౌంట్స్ ని చూడడానికి ఎవరినైనా పెట్టుకోండి...సోహైల్ కి సలహా


బిగ్ బాస్ సీజన్ వచ్చిందంటే చాలు ఆ సీజన్ ఎండ్ అయ్యే లోపు ఎవరో ఒకరు ఫేమస్ ఐపొతూ ఉంటారు. అలాగే ఈ 7 సీజన్స్ లో చాల మంది పాపులర్ అయ్యారు కూడా. అలాంటి ఈ గేమ్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న వారిలో సయ్యద్ సోహైల్ కూడా ఉన్నాడు. హౌస్ లో ఉన్నపుడు ఆడియన్స్  ని ఆకట్టుకున్న సోహైల్ తర్వాత హౌస్ నుంచి బయటకు వచ్చాక హీరోగా సినిమాల్లో చేస్తూ ఇంకా ఎంటర్టైన్ చేస్తున్నాడు.  ప్రేక్షకులను ఆకట్టుకున్న సోహెల్ ఇప్పుడు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు, లక్కీ లక్ష్మణ్ , ఇలాంటి మూవీస్ లో నటించాడు. ఇక ఇపుడు సోహైల్ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ఒక పోస్ట్ పెట్టాడు.

గోల్డ్ కోస్ట్ ఆస్ట్రేలియాకి వెళ్లి అక్కడ అక్కడ వార్నర్ బ్రదర్స్ "స్కూబి డూ పోకీ కోస్టర్ నెక్స్ట్ జనరేషన్" అనే బ్యానర్ దగ్గర నిలబడి దిగిన ఫోటోని పోస్ట్ చేసాడు. ఇక ఆ బ్యానర్ కలర్స్ లో సోహైల్ డ్రెస్ కలర్ కూడా కలిసిపోయింది. ఇక ఈ ఫోటోకి ఒక నెటిజన్ మాత్రం వెరైటీ గా కామెంట్ చేస్తూ ఒక సలహా కూడా ఇచ్చారు. "అంత మంచి కంట్రీకి వెళ్లి మంచి డ్రెస్ కూడా వేసుకుని సెలెక్టివ్ పిక్స్ పోస్ట్ చేయడం మాత్రం రావడం లేదు..ప్లీజ్ ఎవరినైనా మీ సోషల్ మీడియా అకౌంట్స్ ని చూసేవాళ్లను పెట్టుకోండి ..ఇది నా సజెషన్ మాత్రమే" అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చాడు. ఇక కొంతమంది సూపర్ బ్రో అంటే మీరు ఆ బ్యానర్ లో ఏం చూపిస్తున్నారో అర్థంకాలేదు అంటూ ఒకరు...స్కూబిడూ కార్టూన్ చిన్నప్పుడు నా ఫేవరేట్ అంటూ ఇంకొకరు కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో ముగ్గురు ఫైనలిస్టులు సెలెక్ట్ అయ్యారు. అప్పుడు హోస్ట్ నాగార్జున వీళ్లకు  25 లక్షలు ఆఫర్ ఇచ్చేసరికి సోహైల్ ఆ డబ్బు తీసుకుని హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు.