ఉప్పాడలో పవన్ కళ్యాణ్ పర్యటన
posted on Jul 3, 2024 3:48PM
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలుపెరగక పర్యటనలు చేస్తున్నారు. బుధవారం కాకినాడ జిల్లాలోని ఉప్పాడలో పర్యటించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మూడో రోజు కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జనసేనానికి స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇక ఈ పర్యటనలో భాగంగా ఆయన సూరప్ప తాగునీటి చెరువు, వాకతిప్ప ఫిషింగ్ హార్బర్తో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పరిశీలించారు. తుపాన్ పరిస్థితులపై ఫొటో గ్యాలరీని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై పవన్ అధికారులతో చర్చించినట్లు సమాచారం. సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో పవన్ పాల్గొననున్నారు. ఈ సభలో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇచ్చే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.