Eto Vellipoyindhi Manasu : కడుపుతో ఉన్న భార్యని తిట్టిన భర్త.. నగలు దొంగతనం చేసిన ఇంటిదొంగ!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -135 లో....సీతాకాంత్ కంగారుగా ఇంటికి వస్తాడు. అప్పుడే అందరు స్వీట్స్ ఇచ్చి విషెస్ చెప్తారు. ఏంటి తాతయ్య రామలక్ష్మి అంటు ఫోన్ లో ఏదో అన్నావ్.. కట్ అయింది.. రామలక్ష్మికి ఏదైనా అయిందేమోనని కంగారుగా వచ్చానని సీతాకాంత్ అంటాడు. ఏం లేదురా మీ అమ్మ, నీ భార్య ఇద్దరు చిన్న పందెం వేసుకున్నారు. అది చెప్పడానికి ట్రై చేస్తుంటే ఫోన్ ఆఫ్ అయిందని పెద్దాయన అంటాడు. ఏం పందెమని సీతాకాంత్ అంటాడు.

ఈ పందానికి జడ్జిని నేనే కాబట్టి నేనే చెప్తానని శ్రీవల్లి అంటుంది. మీకు బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డు వచ్చింది కదా దానికి కారణం రామలక్ష్మి.. తను అడుగుపెట్టాకే మీకు అవార్డు వచ్చిందని సిరి, తాతయ్య అంటున్నారు. లేదు అత్తయ్య గారి ఆశీర్వదం వల్లే వచ్చిందని నేను అంటున్నాను.. మీరేమంటారని శ్రీవల్లి అంటుంది. ఇది చాలా కష్టమైన సిచువేషన్ అని పెద్దాయన అంటాడు. సీతాకాంత్ ప్రొద్దున లేచి రామలక్ష్మి మొహం చూసింది. గుర్తుకు చేసుకొని నేను ఇవ్వాలా లేచి రామలక్ష్మి మొహం చూసాను. ఆఫీస్ కి వెళ్ళగానే గుడ్ న్యూస్ తెలిసింది. దీనికి కారణం రామలక్ష్మి అంటాడు. దాంతో చూసారా అత్తయ్య మీరంటే అసలు బావ గారికి విలువే లేదని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. అప్పుడే శ్రీలత దగ్గరికి సీతాకాంత్ వచ్చి.. ఇదంతా నీ ఆశీర్వాదం వల్లేనని శ్రీలత ఆశీర్వాదం తీసుకుంటాడు.

మరొకవైపు ధన, మాణిక్యం ఇద్దరు బార్ కి వెళ్తారు. సీతాకాంత్ తనని తక్కువ చేసి చూస్తున్నాడని ధనని మాణిక్యం రెచ్చగొడతాడు. ఆ తర్వాత సేట్ నగలు పాలిష్ చేసి తీసుకొని వచ్చి రామలక్ష్మికి ఇస్తాడు. అవి ఎలాగైనా ఈ రాత్రికి కొట్టేయాలని సందీప్ అనుకుంటాడు. నగలు తీసుకొని రామలక్ష్మి గదిలోకి వెళ్తుంది. సీతాకాంత్ డైరీ రాస్తు కన్పిస్తాడు. ఏం రాస్తున్నారంటూ సీతాకాంత్ తో మాట్లాడి నగలు బీరువాలో పెట్టి తాళాలు టేబుల్ పై పెట్టడం సందీప్ చూస్తాడు. ఆ తర్వాత సీతాకాంత్, రామలక్ష్మి, సిరి భోజనం చేస్తోంటే ధన డ్రింక్ చేసి వస్తాడు. భోజనం చేద్దామని సిరి పిలవగానే సిరిపై ధన సీరియస్ అవుతాడు. దాంతో సీతాకాంత్ కి కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.