ఈ వ్యక్తులకు  అల్జీమర్స్ వచ్చే ప్రమాదం  ఎక్కువ..!

జ్ఞాపకశక్తిని,  ఆలోచనా సామర్థ్యాన్ని నెమ్మదిగా నాశనం చేసే వ్యాధి  అల్జీమర్స్.  ఈ వ్యాధి నేటి ప్రపంచంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది. ఇది లక్షలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే చాలా సంక్లిష్టమైన నాడీ సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి  కారణాలను అర్థం చేసుకుంటే దాని ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు. అల్జీమర్స్ వ్యాధి గురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న 'ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం' జరుపుకుంటారు.  ఏ వ్యక్తులు అల్జీమర్స్ ప్రమాదంలో ఎక్కువగా ఉన్నారో.. దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుంటే.. వయసు.. అల్జీమర్స్ వ్యాధికి అతి పెద్ద ప్రమాద కారకం వయస్సు. ఈ వ్యాధి 65 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. దీని అర్థం  వృద్ధులందరిలో ఈ వ్యాధి వస్తుందని కాదు. వయస్సుతో పాటు మెదడులో సంభవించే సహజ మార్పులు ఈ వ్యాధికి గురయ్యే అవకాశాన్ని పెంచుతాయి. కుటుంబ చరిత్ర,  జన్యుశాస్త్రం.. కుటుంబంలో ఎవరికైనా అల్జీమర్స్ వ్యాధి ఉంటే, కుటుంబంలోని వారు  కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉండవచ్చు. APOE4 వంటి కొన్ని జన్యువులు ఈ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి. జన్యువులు మాత్రమే కారకం కానప్పటికీ, కుటుంబ చరిత్ర ఉంటే క్రమం తప్పకుండా చెకప్ లు చేయించుకోవడం, జాగ్రత్తగా ఉండటం  ముఖ్యం. డౌన్ సిండ్రోమ్.. డౌన్ సిండ్రోమ్ ఉన్నవారికి అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే క్రోమోజోమ్ 21 లోని ఒక నిర్దిష్ట జన్యువు వారి మెదడుల్లో అమిలాయిడ్-బీటా ప్రోటీన్‌ను ముందుగానే సేకరించడం ప్రారంభిస్తుంది. ఇది అల్జీమర్స్‌కు ప్రధాన కారణం. తల గాయం.. తలకు తీవ్రమైన గాయం అయిన వ్యక్తులకు తరువాత అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మెదడు గాయం వాపు,  కణాల నష్టానికి కారణమవుతుంది. ఇది అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. జీవనశైలి,  గుండె ఆరోగ్యం.. అల్జీమర్ రావడానికి కారణమయ్యే హానికరమైన వాటిలో  జీవనశైలి  సరిగా లేకపోవడం కూడా ఒకటి. అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్,  మధుమేహం వంటివి  మెదడుకు రక్త ప్రసరణను ప్రభావితం చేస్తాయి. ఇవి  అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఆరోగ్యకరమైన గుండెకు సమతుల్య ఆహారం,  క్రమం తప్పకుండా వ్యాయామం ముఖ్యమైనవి. నిద్రలేమి, మద్యం సేవించడం.. తగినంతగా,  బాగా నిద్రపోకపోవడం కూడా ఒక ముఖ్యమైన ప్రమాద కారకం. నిద్రలో మెదడు నుండి టాక్సిన్లు  తొలగించబడతాయి. ఒక వ్యక్తి తగినంత నిద్రపోకపోతే, మెదడులో హానికరమైన ప్రోటీన్లు పేరుకుపోతాయి. దీనితో పాటు అధిక మద్యం సేవించడం వల్ల మెదడు కణాలు కూడా దెబ్బతింటాయి.  ఇవి  అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి.                            రూపశ్రీ.

read more
ఈ చిట్కాలతో  చాలా ఈజీగా గట్ ను శుభ్రం చేసుకోవచ్చు..!

ఆయుర్వేదం నుండి ఆధునిక శాస్త్రం వరకు పేగు ఆరోగ్యం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. మనిషి శరీరంలో వచ్చే చాలా వ్యాధులకు మార్గం ఇక్కడే మొదలవుతుంది. పేగు మురికిగా ఉంటే.. క్రమంగా కొవ్వు, చక్కెర, విషపదార్థాలు పెరుగుతాయి. ఇది వందలాది వ్యాధులకు కారణమవుతుంది. పేగు ఆరోగ్యానికి ఉత్తమమైన 10 ఆహారాలు ఉన్నాయి. వీటిని స్నాక్‌గా తినవచ్చు. ఇవి కడుపు,  ప్రేగులను సరిగ్గా శుభ్రపరచడంలో, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను పెంచడంలో,  జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆరోగ్యకరమైన స్నాక్స్ తింటే ఏమవుతుంది..  ఆరోగ్యం క్షీణించడానికి అతిపెద్ద కారణం అనారోగ్యకరమైన చిరుతిళ్లు.  ఆకలిని తీర్చుకోవడానికి  వాటిని తింటాము . ప్యాక్డ్ ఫుడ్,  మార్కెట్ స్నాక్స్‌లో  కేలరీలు, ప్రిజర్వేటివ్‌లు, కృత్రిమ రంగులు ఉంటాయి. ఇవి పోషకాహార పరంగా సున్నా. అవి జీర్ణక్రియను,  ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా సంఖ్యను  తగ్గిస్తాయి. పేగు ఆరోగ్యాన్నిమెరుగుపరిచే స్నాక్స్ గురించి తెలుసుకుంటే.. వేయించిన శనగలు..  గ్రీకు పెరుగు + బెర్రీలు.. వేయించిన మఖానా.. ఆపిల్ + పీనట్ బటర్ .. మిక్స్డ్ సీడ్స్ + గుమ్మడికాయ గింజలు కూరగాయలు.. ఉండికించినవి.. పచ్చిగా తినదగినవి. డార్క్ చాక్లెట్ (70%+).. మొలకెత్తిన పెసలు. మజ్జిగ.. ముఖ్యంగా మూడు ఆహారాలు పేగు ఆరోగ్యానికి చాలా దృఢంగా ఉంచుతాయి. మజ్జిగ.. పెరుగు నుండి వెన్నను తొలగించడం ద్వారా మజ్జిగ తయారు చేస్తారు. ఇది జీర్ణం కావడానికి తేలికగా ఉంటుంది.  ప్రోబయోటిక్స్‌తో నిండి ఉంటుంది. ప్రతి రోజూ తాజా మజ్జిగను తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బాక్టీరియా పెరుగుతుంది. డార్క్ చాక్లెట్.. డార్క్ చాక్లెట్ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. చాలా పరిశోధనలు దీనిని తినడం వల్ల  మానసిక స్థితి మెరుగుపడుతుందని, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.  పోషకాలు గ్రహించబడతాయి. వేయించిన శనగలు.. వేయించిన శనగలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి . అన్నింటిలో మొదటిది..  ప్రోటీన్, ఫైబర్,  ఐరన్ లభిస్తాయి. ఫైబర్ గట్ బాక్టీరియాను మెరుగుపరుస్తుంది. ప్రోటీన్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది.                               *రూపశ్రీ.

read more
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
ఏ వయసులో ఏ సమయంలో నిద్రపోవాలి?  నిద్ర గురించి షాకింగ్ నిజాలు..!

కొంతమంది త్వరగా నిద్రపోయినా కూడా ఉత్సాహంగా ఉండటం, మరికొందరు అర్థరాత్రి వరకు మేల్కున్నా సరే  ఉదయాన్నే లేవడం   బాగా పని చేయడం చేస్తారు. ఇలాంటివాళ్లను  ఎప్పుడైనా గమనించారా? నిద్ర సమయం కేవలం విశ్రాంతి కోసమే కాదు, అది  ఆరోగ్యానికి  సంబంధించినది.  ఒక అధ్యయనం ప్రకారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల మధ్య  నిద్రకు ఉపక్రమించే వారికి  గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తేలింది.  శరీరం  సహజ లయ ప్రకారం నిద్రపోవడం గుండె,  ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఇది ప్రూవ్ చేస్తుంది. నిద్రించడానికి సరైన సమయం వయస్సును బట్టి మారుతుంది. పిల్లలకు ఎక్కువ నిద్ర అవసరం, టీనేజర్లు అర్ధరాత్రి వరకు  మేల్కొని ఉంటారు, ఆలస్యంగా నిద్రపోతారు. పెద్దలకు పని,  విశ్రాంతి మధ్య సమతుల్యత అవసరం.  వృద్ధులు త్వరగా నిద్రపోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరం? పిల్లలు (5–12 సంవత్సరాలు) ఉన్నవారికి  రాత్రి 7:30–9:00 మధ్య నిద్రపోవడం మంచిది. వీరికి 9–12 గంటలు నిద్ర అవసరం. పిల్లలు బాగా పెరగడానికి, చదువులో దృష్టి పెట్టడానికి,  భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడానికి తగినంత నిద్ర అవసరం. త్వరగా,  క్రమం తప్పకుండా నిద్రపోవడం వారిని మంచి మానసిక స్థితిలో ఉంచడానికి, ఏకాగ్రత పెరగడానికి,  రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. కౌమారదశ (13–18 సంవత్సరాలు)లో ఉన్నవారు  రాత్రి 10:30–11:30 మధ్య తప్పనిసరిగా నిద్రపోవాలి. వీరికి  8–10 గంటలు నిద్ర తప్పనిసరిగా ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు చదువు పేరుతో వీరిని నిద్రకు దూరం చేస్తుంటారు. ఇది చాలా తప్పు. టీనేజర్ల క్రమం తప్పకుండా నిద్రపోవడం వల్ల  మెదడు అభివృద్ధి, మానసిక స్థితి,  విద్యా పనితీరుకు సహాయపడుతుంది. నిద్రపోయే ముందు  ఫోన్ లేదా టీవీ వాడకాన్ని పరిమితం చేయాలి.రాత్రి పడుకునే ముందు మంచి పుస్తకాన్ని చదవడం అలవాటు చేసుకోవాలి.  యువత,  మధ్య వయసు.. (18–64 సంవత్సరాలు)ల మధ్య ఉండేవారందరూ ఒకే నిద్ర సమయాన్ని అనుసరించాలి.  రాత్రి 10:00–11:00 మధ్య నిద్రపోవాలి.  ప్రతిరోజూ తప్పనిసరిగా 7–9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఈ వయసు వారు శరీర సహజ లయ ప్రకారం నిద్రపోవాలి. ఈ సమయంలో బయట పనుల కారణంగా   అలసట, శరీరంలో శక్తి తగ్గడం,  మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రాత్రిపూట కెఫిన్,  భారీ భోజనం మానుకోవాలి.   క్రమం తప్పకుండా ఒక సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. వృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు) రాత్రి 9:00–10:00 గంటల మధ్య నిద్రపోవాలి. వీరికి కూడా తప్పకుండా  7–8 గంటలు నిద్ర ఉండాలి. వృద్ధులు త్వరగా మేల్కుంటూ ఉంటారు.   తక్కువ నిద్రపోతారు. త్వరగా నిద్రపోవడం గుండె ఆరోగ్యానికి, మెదడు పదునుగా ఉండటానికి,  మొత్తం ఆరోగ్యానికి మంచిది. నిద్రవేళకు ముందు కాస్త వాకింగ్, హెర్బల్ టీ లేదా ధ్యానం చేయడం వల్ల  నిద్ర  మెరుగుపడుతుంది. ఎన్ని గంటలకు నిద్రపోతారు అనేదే కాదు.. ఎన్ని గంటలు నిద్రపోతారనేది కూడా ముఖ్యం. వయస్సు ప్రకారం సరైన సమయంలో నిద్రపోవడం మానసిక స్థితి,  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సరైన నిద్ర హార్మోన్లు, రోగనిరోధక శక్తి, జీవక్రియను సమతుల్యంగా ఉంచుతుంది.  మధుమేహం,  డిప్రెషన్  వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
బంగాళదుంపలు,  ఉల్లిపాయలు.. కలిపి స్టోర్ చేస్తున్నారా? దిమ్మతిరిగే నిజాలివి..!

బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన దుంప కూరగాయ.  దీంతో ఫ్రై చేసినా,  మసాలా కూర వండినా, చిప్స్ చేసినా లేదా వేరే స్నాక్స్ ఏమైనా చేసినా చాలా ఇష్టంగా తింటారు. అయితే చాలా ఇళ్ళలో కనిపించే సాధారణ సంఘటన ఏంటంటే.. బంగాళదుంపలను ఉల్లిపాయలతో కలిపి ఒక బుట్టలో నిల్వ చేయడం. ఇలా బంగాళదుంపలను ఉల్లిపాయలతో కలిపి నిల్వ చేయడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? అనే విషయం చాలా మందికి తెలియదు.  కేవలం నిల్వ చేయడం గురించే కదా అనే అనుమానం చాలా మందికి రావచ్చు.  దీని గురించి కాస్త వివరంగా తెలుసుకుంటే.. బంగాళదుంపలు,  ఉల్లిపాయలు ఒకే బుట్టలో లేదా కంటైనర్ లో నిల్వ చేయడం గురించి చాలా షాకింగ్ నిజాలు వెలువడ్డాయి.  ముఖ్యంగా బంగాళదుంపలలో పెద్ద మొత్తంలో సెలీనిన్,  అల్లెన్ సల్పైడ్ లు ఉంటాయి.  ఇక ఉల్లిపాయలో సల్ఫర్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఉల్లిపాయలను, బంగాళదుంపలను కలిపి ఉంచడం వల్ల రెండింటినలో ఉండే రసాయనాల చర్య వల్ల బంగాళదుంపలు మొలకెత్తుతాయి. మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనిన్, చాకోనిన్,   క్లోరోఫిల్ ఏర్పడతాయి. ఈ రసాయనాలు ఉన్న బంగాళదుంపలు తింటే అవి శరీరంలో విషాన్ని కలిగిస్తాయి.  ఇది ప్రాణాంతకం అయ్యే అవకాశం కూడా ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు.  ముఖ్యంగా దీని ప్రభావం ఎక్కువగా పిల్లలపై ఉంటుందట. పై కారణంగా  ఉల్లిపాయలు, బంగాళదుంపలను ఒకే కంటైనర్ లో నిల్వ చేస్తే అది కాస్తా ఫుడ్ పాయిజన్ కు కారణమయ్యే అవకాశం ఉంటుంది.  అందుకే మార్కెట్ నుండి ఉల్లిపాయలు,  బంగాళదుంపలు తెచ్చినా.. వాటిని విడివిడిగా నిల్వచేయాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
రాతి ఉప్పును ఎవరు తినకూడదు? ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందా?

రాతి ఉప్పును ఎవరు తినకూడదు? ఇది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపిస్తుందా? ఆహారంలో ఉప్పు వేయడం తప్పనిసరి.  ఉప్పు లేని వంట తినడం సాధ్యమే కాదు.. అయితే ఉప్పులో కూడా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో రాతి ఉప్పును  ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణిస్తారు. ముఖ్యంగా  సాధారణ ఉప్పును తినకూడని సమయంలో రాతి ఉప్పును ఎక్కువగా వాడతారు. కొందరు  ఉపవాస సమయంలో ఉప్పు తినకూడదు అనే నియమం ఉన్నప్పుడు సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పు ఆహారంలో వినియోగిస్తారు. కొందరు రాతి ఉప్పును రెగ్యులర్ గా వినియోగిస్తారు.  రాతి ఉప్పుతో తయారు చేసిన ఆహారం   జీర్ణక్రియకు మంచిదని చెబుతారు. కానీ రాతి ఉప్పు అందరికీ ప్రయోజనకరంగా ఉండదని చాలామందికి తెలియదు. మరీ ముఖ్యంగా కొందరు ఈ రాతి ఉప్పును అస్సలు తినకపోవడం మంచిది. ఇంతకీ రాతి ఉప్పు ఎవరు తినకూడదు? తెలుసుకుంటే.. బిపి పేషెంట్లు.. రాతి ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. అధిక రక్తపోటు ఉన్న రోగులు దీనిని తక్కువగా తీసుకోవాలి లేదా అస్సలు తీసుకోకపోవడం మంచిది. గుండె జబ్బులు ఉన్నవారు.. సోడియం అధికంగా తీసుకోవడం ప్రమాదకరం. రాతి ఉప్పు రక్తపోటు, శరీరంలో  ద్రవాల  నిలుపుదల పెంచడం ద్వారా గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది. అందుకే గుండె సమస్యలు ఉన్నవారు.. లేదా కుటుంబంలో గుండె సంబంధం సమస్యల చరిత్ర ఉన్నవారు రాతి ఉప్పు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ రోగులు.. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరం నుండి అదనపు సోడియం తొలగించబడదు. ఇలా మూత్ర పిండాల సమస్య ఉన్నవారు రాతి ఉప్పు తింటే మూత్రపిండాల పరిస్థితిని మరింత దిగజారుతుంది. షుగర్ పేషెంట్లు..  రాతి ఉప్పు ఎక్కువగా వినియోగించడం మధుమేహ రోగులకు హానికరం. ఇది రక్తపోటు,  చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ రోగులు.. థైరాయిడ్ రోగులకు అయోడిన్ అవసరం. అయితే రాతి ఉప్పులో అయోడిన్ ఉండదు. దీని కారణంగా, థైరాయిడ్ అసమతుల్యత  పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలు.. గర్భధారణ సమయంలో మహిళలు సోడియం,  అయోడిన్ సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం.  రాతి ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యంపై  చెడు ప్రభావం పడుతుంది. వృద్ధులు.. వృద్ధులకు తరచుగా అధిక రక్తపోటు, మధుమేహం లేదా గుండె సంబంధిత సమస్యలు ఉంటాయి.  రాతి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల వారి మొత్తం ఆరోగ్యం చెడిపోతుంది.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
అరటిపండును పాలతో కలిపి తింటే ఈ నష్టాలు తప్పవట..!

అరటిపండు.. అందరికి సులువుగా దొరికే పండు. సీజన్ తో సంబంధం లేకుండా అరటిపండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. రోజుకు ఒక అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు వైద్యులు. అరటిపండ్లు చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు అందరూ సులువుగా తినడానికి అనువుగా ఉంటాయి. చాలామంది అరటిపండును ఉదయాన్నే అల్పాహారంగానో లేదా ఉదయం తీసుకునే ప్రోటీన్ డ్రింక్స్ లోనూ వాడుతుంటారు. ముఖ్యంగా అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం చాలా మంది అలవాటు.  మిల్క్ షేక్ అయితే ఎడాపెడా తాగేస్తారు. అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే.. జీర్ణసమస్యలు.. అరటిపండును పాలతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.  ఆయుర్వేదం ప్రకారం పాలు, అరటిపండు రెండూ బరువుగా ఉండే పదార్థాలు. రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.  ఉబ్బరం,  గ్యాస్ లేదా మలబద్దకానికి కారణం అవుతుంది. కఫం.. అరటిపండు, పాలు రెండింటిని కలిపి తీసుకుంటే కఫం ఏర్పడుతుందట.  ఈ రెండింటి కాంబినేషన్ అంత మంచిది కాదని అంటున్నారు. కఫ శరీరం ఉన్నవారు ఈ కాంబినేషన్ ను అస్సలు ట్రై చేయకపోవడమే మంచిది.  కఫం పెరిగితే జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అలెర్జీలు, సైనస్.. అరటిపండు, పాలు కాంబినేషన్ కొంతమందికి అలెర్జీలు రావడానికి కారణం అవుతుందని అంటున్నారు. శరీరంపై దద్దుర్లు, దురద వంటి సమస్యలు వస్తాయి.  ఇది మాత్రమే కాకుండా సైనస్ రద్దీని ఈ కాంబినేషన్ పెంచుతుందట.  ఇప్పటికే సైనస్ సమస్యలు ఉన్నవారికి ఈ కాంబినేషన్ అస్సలు మంచిది కాదు. నీరసం.. పాలు, అరటిపండు రెండూ శక్తివంతమైనవే.. ఇవి రెండూ శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. కానీ ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం భారంగా మారుతుందని, ఇది నీరసం ఫీలింగ్ పెంచుతుందని అంటున్నారు. ఒళ్లంతా భారంగా అనిపించడం వల్ల బాగా నీరసంగా అనిపిస్తుందని కొందరు అనుభవాల ద్వారా పంచుకున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. రక్తంలో చక్కెర.. అరటిపండులో చక్కెర శాతం అధికంగా ఉంటుంది.  ఇక పాలలో కూడా గ్లూకోజ్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నేటికాలంలో  డయాబెటిస్ సమస్యలు పెరుగుతున్న దృష్ట్యా.. ఈ కాంబినేషన్ కు దూరంగా ఉండటం మంచిది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
విటమిన్-డి మోతాదు మించితే పాయిజన్‌గా మారుతుందా?

  శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారం ద్వారా విటమిన్లు,  ఖనిజాలు క్రమం తప్పకుండా అవసరం. ఆరోగ్యానికి మేలు చేసే  విటమిన్లలో విటమిన్ డి ఒకటి. ప్రతి ఒక్కరూ ప్రతి రోజూ శరీరానికి విటమిన్-డి అందేలా చూసుకోవాలి. ఇది వాస్తవానికి సూర్యరశ్మి ద్వారా శరీరం తయారు చేసుకునే విటమిన్.  విటమిన్ డి మన ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. ఇది ఎముకలకు చాలా అవసరం. విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచుతుంది,  పగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కండరాలు సరిగ్గా పనిచేస్తాయి,  బలహీనత ఉండదు. శరీర రోగనిరోధక శక్తిని పెంచడానికి, అంటు వ్యాధుల నుండి రక్షించడానికి,  మెదడు పనితీరును మెరుగుపరచడానికి,  ప్రతిరోజూ తగినంత పరిమాణంలో విటమిన్-డి  అవసరం. కానీ విటమిన్ డి  ఎంత ముఖ్యమో, దాని మోతాదు మించితే అంతే హానికరం అని చాలామందికి తెలియదు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. విటమిన్-డి మోతాదు మించితే కలిగే ప్రమాదం.. ఆరోగ్యకరమైన వయోజన వ్యక్తికి ప్రతిరోజూ దాదాపు 400–800 IU (10–20 మైక్రోగ్రాములు) విటమిన్ డి సరిపోతుంది.  క్రమం తప్పకుండా ఈ పరిమాణం కంటే ఎక్కువ విటమిన్ డి తీసుకుంటే శరీరం అనేక రకాల నష్టాలకు గురయ్యే ప్రమాదం ఉంది. దీనిని విటమిన్ డి టాక్సిసిటీ అంటారు. సాధారణంగా ఒక వ్యక్తి ఎక్కువ కాలం అవసరమైన దానికంటే ఎక్కువ సప్లిమెంట్లను తీసుకున్నప్పుడు విటమిన్ డి టాక్సిసిటీ ప్రమాదం వస్తుంది. ఆహారం ద్వారా ఈ ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో కాల్షియం మొత్తాన్ని పెంచుతుంది. ఫలితంగా మళ్లీ మళ్లీ దాహం వేస్తుంది,  వాంతులు అవుతాయి. అంతేకాకుండా, బలహీనత, తలతిరుగుడు,  మూత్రపిండాల వైఫల్యం ప్రమాదం పెరుగుతుంది. హైపర్‌కాల్సెమియా వల్ల మూత్రపిండాల నష్టం..  శరీరంలో విటమిన్ డి పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, అది రక్తంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది. దీనిని హైపర్‌కాల్సెమియా అంటారు. అధిక కాల్షియం కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. మూత్రపిండాల పనితీరు  తగ్గుతుంది. విటమిన్-డి మోతాదు మించితే జరిగేది ఇదే.. జీర్ణక్రియకు ఆటంకం.. శరీరంలో విటమిన్ డి స్థాయిలు పెరగడం వల్ల జీర్ణ సమస్యలు  వస్తాయి. విటమిన్ డి స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు  పెరుగుతాయి.   ఇది జీర్ణ సమస్యలు, విరేచనాలు,  అపానవాయువుకు కారణమవుతుంది. విటమిన్ డి సప్లిమెంట్ల అధిక మోతాదు  వికారం,  వాంతికి కారణమవుతుంది. మెదడుపై ప్రభావం.. కాల్షియం స్థాయిలు పెరగడం వల్ల మెదడు కూడా ప్రభావితమవుతుంది. దీని కారణంగా తరచుగా తల బరువుగా అనిపించడం, తల తిరగడం,  ఏకాగ్రత పెట్టలేకపోవడం వంటి సమస్యలు ఉండవచ్చు. అలాంటి వ్యక్తులు మళ్లీ మళ్లీ ఏదైనా విషయాన్ని మర్చిపోవడం జరుగుతుంది. చిరాకు,  విశ్రాంతి లేకపోవడం పెరుగుతుంది. తీవ్రమైన పరిస్థితులలో  గందరగోళానికి గురవడం  లేదా కోమాలోకి  వెళ్ళడం కూడా జరగవచ్చు.                                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
జాగ్రత్త ఈ సమస్యలు ఉన్నవారు వంకాయ తింటే డేంజర్..!

  వంకాయ చాలామందికి ఇష్టమైన కూరగాయ. వంకాయను ఎలా వండినా టేస్ట్ అద్దిరిపోతుంది. తాజా కూరలలో రాజా ఎవరండీ అని వంకాయ మీద పాట రాశారు.. అలాగే వంకాయ వంటి కూర.. పంకజ ముఖి సీత వంటి భామామణి అంటూ పద్యం కూడా రాశారు.  ఇలా వంకాయ క్రేజ్ చాలా పెద్దదే..  అయితే వంకాయను అందరూ తినడం అంత మంచిది కాదు.. కొన్ని సమస్యలు ఉన్నవారు వంకాయకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.  సరదా పడి తిన్నారంటే ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంతకీ వంకాయకు దూరంగా ఎవరు ఉండాలి? ఎందుకని? పూర్తీగా తెలుసుకుంటే.. వంకాయలో అధికమొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది.  ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.  వంశపారంపర్యంగా కిడ్నీలో రాళ్లు,  కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు వంకాయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వంకాయ తింటే కొందికి అలెర్జీ వస్తుంది.  ఇది దురద, వాపు,  శ్వాస సంబంధ సమస్యలను కూడా కలిగిస్తుంది.  అందుకే వంకాయ తినేముందు ఆరోగ్య సమస్య విషయంలో ఆలోచించుకోవాలి. చాలామందికి తెలియదు కానీ.. వంకాయ తింటే గ్యాస్, ఉబ్బరం సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలతో  ఇబ్బంది పడేవారు వంకాయ తినేముందు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా తినాలనుకున్నా సరే.. పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా వంకాయను వైద్యుల సలహా మీద మాత్రమే తినడం మంచిది. వంకాయలో పొటాషియం  పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు సమస్య ఉన్నవారు.. రక్తపోటు సమస్య కోసం మందులు వాడేవారు వంకాయలు ఎక్కువగా తినకూడదు. వంకాయలలో సోలననిన్ అనే రసాయనం ఉంటుంది.  ఇది కీళ్లలో నొప్పి, వాపు పెంచడంలో సహాయపడుతుంది.  సాధారణంగా పెద్దలు అంటూ ఉంటారు.. వంకాయలు ఎక్కువ తినకు వాతం పెరుగుుతంది అని. ఇది ఆ కోవకు చెందినదే..  ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు వంకాయను ఎంత తక్కువ తింటే అంత మంచిది. వంకాయలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం స్థాయిల సమతుల్యత దెబ్బ తింటుంది.                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
మగాళ్లు ఈ ఆహారం తీసుకుంటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది..!

నేటి మారుతున్న జీవనశైలిలో, పురుషులలో వంధ్యత్వ సమస్య వేగంగా పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం స్పెర్మ్ కౌంట్ తగ్గడం. ఈ సమస్య దంపతుల తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేరకుండా చేయడమే కాకుండా, పురుషుల ఆత్మవిశ్వాసాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. తరచుగా ఇది నయం చేయలేని సమస్య అని చాలామంది అనుకుంటారు. కానీ సరైన ఆహారం, జీవనశైలిని మార్చడం ద్వారా ఈ సమస్యను చాలా వరకు అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా  ఆహారంలో కొన్ని  చేర్చుకోవడం  ద్వారా స్పెర్మ్ కౌంట్ ను,  దాని నాణ్యతను మెరుగుపరచవచ్చు అని అంటున్నారు. ఇంతకీ మగాళ్లలో స్పెర్మ్ కౌంట్ పెరగడానికి, స్పెర్మ్ నాణ్యత పెరగడానికి  సహాయపడే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. శతావరి,  అశ్వగంధ.. ఆయుర్వేదంలో శతావరి, అశ్వగంధకు చాలా ప్రాధాన్యత ఉంది.  శతావరి,  అశ్వగంధ రెండూ ఆయుర్వేద మూలికలు. ఇవి పురుషులకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అశ్వగంధ ఒత్తిడిని తగ్గించడానికి,  టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఇది స్పెర్మ్ కౌంట్,  స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. శతావరి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. ఈ రెండింటి పొడిని ప్రతిరోజూ పాలు లేదా నీటితో తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయ నీరు.. నిమ్మకాయ నీటిని ఒక సాధారణ పానీయంగా భావిస్తే పప్పులో కాలేసినట్టే..  ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్పెర్మ్ నాణ్యతకు చాలా ముఖ్యమైనది. విటమిన్ సి అనేది స్పెర్మ్‌ను హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ప్రతి ఉదయం నిమ్మరసం కలిపిన ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీరంలో టాక్సిన్లను  తొలగించడమే కాకుండా, స్పెర్మ్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. వాల్నట్స్, బాదం.. వాల్‌నట్స్,  బాదం పప్పులలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు స్పెర్మ్ నిర్మాణం,  కార్యాచరణను మెరుగుపరుస్తాయి. అయితే యాంటీఆక్సిడెంట్లు వాటిని దెబ్బతినకుండా కాపాడతాయి. రోజూ గుప్పెడు వాల్‌నట్స్,  బాదం పప్పులు తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. అరటిపండు.. అరటిపండ్లలో బ్రోమెలైన్,  విటమిన్ బి అనే అరుదైన ఎంజైమ్ ఉంటుంది. ఇది పురుషుల సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది స్పెర్మ్ నాణ్యతను, స్పెర్మ్ కౌంట్ను   రెండింటినీ మెరుగుపరుస్తుంది. దీనితో పాటు అరటిపండు శక్తికి అద్భుతమైన మూలం.  ఇది అలసటను కూడా తొలగిస్తుంది. తక్షణ శక్తిని ఇస్తుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
కంటి శుక్లం గురించి ఈ అపోహలు తొలగించుకోండి..!

కంటిశుక్లం అనేది కంటికి ఉండే సహజ లెన్స్ మీద ఏర్పడే తెల్లని పొర. ఇది కనుపాప వెనుక ఉంటుంది. ఇది సాధారణంగా వయస్సుతో పెరిగి వృద్దులలో వస్తుంది. కాంతిని సరిగ్గా చూడలేకపోవడం,  రంగుల విషయంలో గందరగోళం,  రాత్రి సమయంలో చూడటంలో ఇబ్బంది వంటివి కంటిశుక్లం వల్ల ఎదురయ్యే సమస్యలు.  కంటిశుక్లం దృష్టి లోపానికి గల ప్రధాన కారణాలలో ఒకటి.  ముఖ్యంగా వృద్దాప్యం వచ్చాక కంటిశుక్లం ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటారు. కానీ ఈ కంటిశుక్లం గురించి చాలామంది చాలా అపోహల్లో ఉన్నారు.  ఈ అపోహల కారణంగా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కంటిశుక్లం గురించి అందరూ నమ్మే అపోహల గురించి తెలుసుకుంటే.. శస్త్రచికిత్సకు ముందు కంటిశుక్లం ముదిరిపోయి ఉండాలా? నేటికాలంలో కంటిశుక్లం శస్త్రచికిత్సకు కంటిశుక్లం ముదిరిపోయే దశకు చేరుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఆలస్యం చేసేకొద్ది ఆపరేషన్ ప్రక్రియ క్లిష్టంగా మారుతుంది. రోజువారీ జీవితం  ప్రభావితం అవుతుంది. పైగా కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుంది. అదే కంటిశుక్లం ఇంకా ముదరకముందే ఆపరేషన్ చేయించుకుంటే సమస్య అంతగా ఉండదని వైద్యుల మాట.  శస్త్రచికిత్స తర్వాత కంటిశుక్లం తిరిగి పెరుగుతుందా? తెల్లని పొరగా మారిన లెన్స్ తొలగించి  దాని స్థానంలో కృత్రిమ లెన్స్ (ఐఓఎల్) అమర్చిన తర్వాత, కంటిశుక్లం తిరిగి రాదు. అయినప్పటికీ, పృష్ఠ క్యాప్సూల్ ఒపాసిఫికేషన్ (పిసిఒ) అని పిలువబడే పరిస్థితి నెలలు లేదా సంవత్సరాల తరువాత రావచ్చు. దీనిని  లేజర్ విధానంతో సులభంగా చికిత్స చేయవచ్చు. వృద్ధులకు మాత్రమే కంటిశుక్లం వస్తుందా? వృద్ధాప్యంతో కంటిశుక్లం సర్వసాధారణం అయినప్పటికీ, డయాబెటిస్, గాయం, దీర్ఘకాలిక స్టెరాయిడ్ వాడకం, ధూమపానం,  జన్యు కారణాలు  వంటి కారకాల వల్ల  యువతలో కూడా  వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టుకతో  కంటిశుక్లంతో పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఉంటాయట.  కంటి చుక్కలు లేదా ఆహారంతో కంటిశుక్లం నయం చేయవచ్చా? కంటి చుక్కలు, హెర్బల్ నివారణలు లేదా ఆహార మార్పులతో కంటిశుక్లం తిప్పికొట్టవచ్చు లేదా నయం చేయవచ్చనే వాదనకు క్లినికల్ ఆధారాలు లేవట.  కంటిశుక్లం రోగులలో దృష్టిని పునరుద్ధరించడానికి శస్త్రచికిత్స మాత్రమే సరైనది అని వైద్యుల మాట.  కంటిశుక్లం శస్త్రచికిత్స ప్రమాదకరం లేదా బాధాకరంగా ఉంటుందా? కంటిశుక్లం శస్త్రచికిత్స అనేది ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా నిర్వహించే సురక్షితమైన విధానాలలో ఒకటి. ఇది సాధారణంగా త్వరగా అయిపోతుంది.  అనస్థీషియా కింద జరుగుతుంది.  అసౌకర్యం కూడా తక్కువ.   కొద్ది రోజుల్లోనే  దృష్టి మెరుగుపడుతుంది. రెండు కళ్ళకు ఒకేసారి శస్త్రచికిత్స చేయాలా? కంటిశుక్లం శస్త్రచికిత్సలు సాధారణంగా కొన్ని రోజులు లేదా వారాల విరామంతో ఒకేసారి ఒక కంటికి చేస్తారు. మొదటి శస్త్రచికిత్స ఫలితాల ఆధారంగా మరొక కంటికి చికిత్సను చేయడానికి వైద్యులకు క్లారిటీ వస్తుంది. కంటిశుక్లం ముదిరి దృష్టి పూర్తిగా కోల్పోయే వరకు ఆపరేషన్ చేయించుకోకూడదా? కంటిశుక్లం ముదిరే వరకు ఉంటే అది లైఫ్ స్టైల్ కు చాలా ఇబ్బందికరంగా మారుతుంది. మొదట్లోనే సర్జరీ చేయించుకుంటే చాలా వరకు మెరుగ్గా ఉంటుంది.  కోలుకోవడానికి నెలలు పడుతుందా? నేటి కాలంలో జరిగే కంటిశుక్లం చికిత్స నుండి కోలుకోవడానికి నెలల సమయం అవసరం లేదు.  తరచుగా ఒకటి లేదా రెండు వారాలలో సాధారణ జీవనశైలికి వచ్చేస్తారు.  ఇది వ్యక్తిని బట్టి మారే అవకాశం ఉంటుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
మీ ఊపిరితిత్తుల కెపాసిటీ ఎంత? ఇంట్లోనే ఇలా టెస్ట్ చేసుకోండి..!

మానవ శరీరంలో ఊపిరితిత్తులు  చాలా ముఖ్యమైనవి.  మనం పీల్చే గాలిని శుభ్రపరచడంలో ఊపిరితిత్తులదే కీలకమైన పాత్ర. ఊపిరితిత్తులు సక్రమంగా పనిచేయకపోతే శ్వాస క్రియకు ఇబ్బంది కలుగుతుంది. అయితే.. నేటికాలపు రద్దీ జీవితంలో అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతోంది. కలుషిత వాతావరణం కూడా దీనికి ప్రధాన కారణంగా పరిగణించబడుతుంది. దీని కారణంగా  ఊపిరితిత్తులు ఎక్కువగా సఫర్ అవుతుంటాయి. గతంలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువగా వృద్ధులలో కనిపించేవి. కానీ  ఇప్పుడు చిన్నవారు,  పిల్లలు కూడా దీనికి బలైపోతున్నారు. గత రెండు దశాబ్దాలలో భారతదేశంతో సహా అనేక దేశాలలో ఉబ్బసం, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD),  ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వ్యాధుల కేసులు వేగంగా పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం వాయు కాలుష్యానికి సంబంధించిన వ్యాధుల కారణంగా 7 మిలియన్ల మంది మరణిస్తున్నారు. ఊపిరితిత్తుల పనితీరును  ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉంటే చాలా వరకు సమస్యలను పెద్దవి కాకుండా చూసుకోవచ్చు.  BOLT అనే విధానం ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని ఇంట్లోనే చెక్ చేసుకునేందుకు సహాయపడుతుంది. దీన్నెలా చేసుకోవాలో తెలుసుకుంటే.. BOLT అంటే బ్లడ్ ఆక్సిజన్ లెవల్ టెస్ట్ స్కోర్.  దీని సహాయంతో ఊపిరితిత్తులు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో,  వాటికి ఏదైనా ప్రమాదం ఉందా అని తెలుసుకోవచ్చు. BOLT (బాడీ ఆక్సిజన్ లెవల్ టెస్ట్) అనేది  కార్బన్ డయాక్సైడ్ టాలరెన్స్‌ను కొలిచే ఒక సులభమైన, సెల్ఫ్ టెస్ట్.  శ్వాసను ఎంతసేపు హాయిగా పట్టుకోగలరో ఇది తెలియజేస్తుంది. శ్వాసను పట్టుకోగల సమయం  ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని తెలుపుతుంది. 10 కంటే తక్కువ BOLT స్కోరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి అని వైద్యులు అంటున్నారు. బోల్ట్ పరీక్ష ఎలా చేయాలి? ఈ పరీక్ష చేయడానికి ముందుగా ఎటువంటి ఆటంకాలు లేని నిశ్శబ్దమైన,  సౌకర్యవంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. తరువాత శ్వాస తీసుకోవడానికి అనువుగా ఉండే భంగిమలో కూర్చోవాలి. సాధారణంగా  దీర్ఘంగా  శ్వాస తీసుకొని హాయిగా గాలిని వదిలివేయాలి. తరువాత ఇప్పుడు గాలి  ఊపిరితిత్తులలోకి ప్రవేశించకుండా మీ వేళ్ళతో మీ ముక్కును మూసివేసి  టైమర్‌ను ప్రారంభించాలి.  ఊపిరి పీల్చుకోవాలనే తపన ప్రారంభమైనప్పుడు,  ఛాతీ బిగుసుకుపోవడం ప్రారంభించినప్పుడు, టైమర్‌ను ఆపివేయాలి.  శ్వాసను పట్టుకున్న సెకన్ల సంఖ్య  బోల్ట్ స్కోరు అవుతుంది. ఈ పరీక్షను తక్కువ వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు రిపీట్  చేసి, మూడు స్కోర్‌ల సగటును తీసుకోవాలి. బోల్ట్ స్కోర్ ఎంత ఉండాలి? ఎంత ఉండకూడదు?  ఊపిరితిత్తుల ఆరోగ్యం గురించి ఈ స్కోరు ఏమి చెబుతుందంటే..  బోల్ట్ స్కోరు 20 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయని సూచిస్తుంది. 10-20 సెకన్ల స్కోరు అంటే ఊపిరితిత్తుల ఆరోగ్యం సాధారణంగానే ఉంది కానీ మెరుగుదల అవసరం. 10 సెకన్ల కన్నా తక్కువ స్కోరు ఉంటే శ్వాస సామర్థ్యం బలహీనంగా ఉందని సూచిస్తుంది. ఇలాంటి వారు వైద్యుడిని సంప్రదించి  ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి.                                *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా? ఈ షాకింగ్ నిజం తెలుసా?

  ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకోవడం ఎంత కామనో.. పళ్లు తోమగానే కాఫీ లేదా టీ చేసుకుని తాగడం అంతే కామన్.  ఇంట్లో చాలా వరకు కాఫీ, టీ లవర్స్ ఉంటారు. వీరికి బ్రష్ చేయకపోయినా సరే.. కాఫీ లేదా టీ మాత్రం టైంకి ఖచ్చితంగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో టీ ప్రియులు ఎక్కువైపోయారు. కాఫీ నుంచి టీకి జంప్ అవుతున్నవారు కూడా ఉంటారు. మొత్తానికి నగరాల నుండి గ్రామాల వరకు టీ హడావిడి ఎక్కువ.  వివిధ ప్రాంతాల నుండి దిగుమతి అయ్యే టీ ఆకులతో టీ చేసుకుని ఆస్వాదించాలంటే చాలా ఇష్టం చూపిస్తుంటారు.  ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం చాలామంది అలవాటు.  కానీ ఇది ఆరోగ్యానికి మంచిదేనా అనే ఆలోచన మాత్రం చాలామంది చేయరు. అసలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది? దీని గురించి తెలుసుకుంటే..   ఖాళీ కడుపుతో టీ.. ఉదయం ఖాళీ కడుపుతో ఏమి తిన్నా, తాగినా అది ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. అందుకే  చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం, ఉసిరి  రసం వంటి వాటిని గోరువెచ్చని నీటిలో కలిపి  తీసుకుంటారు. అయితే చాలా మంది ఖాళీ కడుపుతో టీ తాగుతుంటారు. టీలో ఉండే కెఫిన్,  టానిన్ వంటివి  కడుపులో ఆమ్లాన్ని పెంచుతాయి. దీని కారణంగా  రోజంతా కడుపులో బరువుగా లేదా గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు టీ తాగితే అది నేరుగా కడుపు లోపలి పొరను ప్రభావితం చేస్తుంది. ఇది చికాకు, గ్యాస్, అల్సర్ వంటి సమస్యలను కలిగిస్తుంది.   కడుపు పూతలు.. ఖాళీ కడుపుతో టీ తాగినప్పుడు టీలో ఉండే టానిన్, కెఫిన్ కడుపులోని ఆమ్లాన్ని పెంచుతాయి. సాధారణంగా కడుపులో కొద్ది మొత్తంలో ఆమ్లం ఉంటుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. కానీ ఖాళీ కడుపుతో టీ తాగితే ఈ ఆమ్లం ఎక్కువ పరిమాణంలో ఏర్పడుతుంది.  ఇది కడుపు లోపలి పొరలో చికాకు కలిగిస్తుంది. ఇది చాలా కాలం పాటు జరిగితే కడుపు గోడ బలహీనపడి అల్సర్ వంటి వ్యాధులకు కారణమవుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగే అలవాటు ఉన్నవారికి అసిడిటీ, గ్యాస్ట్రిటిస్ వంటి సమస్యలు ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. కడుపులో ఏర్పడే ఆమ్ల ప్రభావం తగ్గడానికి టీ తాగే ముందు తేలికపాటి అల్పాహారం తీసుకోవడం మంచిది.   జీర్ణ సమస్య.. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై కూడా చెడు ప్రభావం పడుతుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు టీలో ఉండే కెఫిన్ నేరుగా కడుపు గోడ ద్వారా శోషించబడుతుంది.  దీని కారణంగా ఇది తక్షణ ప్రభావాన్ని చూపుతుంది. ఇది కడుపు తిమ్మిరి, మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేసే గ్రంథుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల జీర్ణ రసాల సమతుల్యత దెబ్బతింటుంది.  ఫలితంగా ఆహారం జీర్ణం కావడానికి సమయం పడుతుంది.  పోషకాలు సరిగ్గా గ్రహించబడవు.   ఎముకల ఆరోగ్యం.. టీలో ఉండే కెఫిన్ ఎక్కువ తీసుకుంటే శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఈ ప్రభావం మరింత పెరుగుతుంది. ఎందుకంటే టీ శరీరంలో నేరుగా శోషించబడుతుంది. ఎముకలలో కాల్షియం శోషణను ప్రభావితం చేస్తుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీరంలో అవసరమైన పోషకాలు లోపిస్తాయి. ఇది ఎముకలను బలహీనపరుస్తుంది. ఈ సమస్య ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలకు సాధారణంగానే ఎక్కువ కాల్షియం అవసరం. కాల్షియం లోపం వల్ల ఎముకల నొప్పి, కీళ్ల దృఢత్వం, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఖాళీ కడుపుతో  టీ తాగేవారు జాగ్రత్త.   - రూపశ్రీ  

read more
రక్తపోటుకు చెక్ పెట్టాలంటే ఏం తినాలి?

రక్తపోటు నేటికాలంలో చాలా సాధారణం అయిపోయింది.  ఒకప్పుడు వయసుతో పాటు పెద్దవారికి మాత్రమే రక్తపోటు వచ్చేది.  తరువాత మధ్యవయసు వారిలో రక్తపోటు రావడం మొదలైంది. కానీ ఇప్పట్లో మాత్రం యువతలో ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలలో కూడా రక్తపోటు బయటపడుతూ ఉంటుంది.  సాధారణంగా ఉండాల్సిన దాని కంటే ఎక్కువ రక్తపోటు ఉండటం చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు కారణంగా గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు తినాలని వైద్యులు చెబుతుంటారు.  అయితే పొటాషియం అధికంగా ఉన్న ఆహారాలు ఏంటి?  ఏ ఆహారాలు తినాలి?  తెలుసుకుంటే.. తినాల్సిన ఆహారాలు.. అరటిపండ్లు.. అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది.  సులభంగా లభిస్తాయి, చవకైనవి కూడా. అన్ని రకాల వయసుల వారికి  అనువైనవి. అరటిపండ్లను స్మూతీలు, ఫ్రూట్ సలాడ్లలో కలపడం  లేదా వాటిని నేరుగా  తినడం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచవచ్చు. కొబ్బరి నీరు.. కొబ్బరి నీరులో సహజ  ఎలక్ట్రోలైట్లు అధికంగా ఉంటాయి.   ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది.  అటు హైడ్రేట్ గా ఉంచుతూ.. రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.  పాలకూర.. పాలకూరలో  పొటాషియం, ఐరన్ తో పాటు ఇతర ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. పాలకూరను తీసుకుంటే రక్తపోటును చాలా వరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. దోసకాయ.. దోసకాయలో పొటాషియం అధికంగా ఉంటుంది.  కేలరీలు తక్కువగా  ఉంటాయి.  పైగా ఇది  హైడ్రేటింగ్ గా ఉంచుతుంది. ఇది రక్తపోటును నియంత్రణలో  ఉంచడానికి సహాయపడుతుంది.  టమోటాలు.. టమోటాలు  భారతీయ వంటకాల్లో  విరివిగా ఉపయోగిస్తుంటాం. అయితే టమోటాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.  టమోటాలను కూరల్లోనే కాకుండా జ్యూస్ కూడా చేసుకుని తాగవచ్చు. ఎక్కువ రక్తపోటు ఉన్నవారికి ఇలా జ్యూస్ చేసుకుని తాగడం మంచి ఉపశమనం  ఇస్తుంది. పెరుగు.. పెరుగు అద్భుతమైన ప్రోబయోటిక్ మాత్రమే కాదు..  ఇందులో  పొటాషియం కూడా సమృద్దిగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.  శరీరానికి పోషణ కూడా ఇస్తుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
మెగ్నీషియం శరీరానికి ఎందుకంత ముఖ్యం? మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలేంటి?

మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. ఇది శక్తి ఉత్పత్తి, కండరాలు,  నరాల పనితీరు, రక్తంలో చక్కెర నియంత్రణ,  ఎముక ఆరోగ్యంతో సహా శరీరంలో 300 కి పైగా జీవరసాయన ప్రతిచర్యలలో కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం లోపం అలసట, కండరాల తిమ్మిరి, చిరాకు, హృదయ స్పందన సక్రమంగా లేకపోవడం, మానసిక రుగ్మతలు వంటి లక్షణాలకు దారితీస్తుంది. శరీరం సహజంగా మెగ్నీషియంను ఉత్పత్తి చేయదు.  దీన్ని ఆహారం నుండి పొందాలి. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాల గురించి తెలుసుకుంటే.. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు.. బచ్చలికూర.. బచ్చలికూర మెగ్నీషియం పవర్హౌస్. బచ్చలికూరలో  ఐరన్, ఫోలేట్,  యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది గుండె, ఎముక,  మెదడు ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది.  బాదం.. కేవలం గుప్పెడు బాదం లో సుమారు 80 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. వీటిలో  ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్,  విటమిన్ ఇ  కూడా సమృద్ధిగా ఉంటాయి. బాదం మెదడు పనితీరు,  శక్తి స్థాయిలకు  మద్దతు  ఇస్తుంది. గుమ్మడికాయ విత్తనాలు..  28 గ్రాముల గుమ్మడి విత్తనాలలో   150 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. వీటిలో  యాంటీఆక్సిడెంట్లు,  ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె,  ప్రోస్టేట్ ఆరోగ్యానికి చాలా మంచివి. సలాడ్లు, పెరుగు లేదా  స్వీట్స్ లలో వీటిని జోడించుకోవచ్చు. అవోకాడోస్.. ఒక మీడియం అవోకాడోలో పొటాషియం, ఫైబర్,  గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులతో పాటు 58 మి.గ్రా మెగ్నీషియం కూడా ఉంటుంది. అవోకాడోస్ జీవక్రియకు చాలా హెల్ప్  చేస్తాయి, మంటను తగ్గిస్తాయి.  ఇతర ఆహారాల నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి. డార్క్ చాక్లెట్.. మంచి-నాణ్యత గల డార్క్ చాక్లెట్ రుచికరమైనది మాత్రమే కాదు  మెగ్నీషియం సమృద్దిగా కలిగి ఉంటుంది. ఇది ఔన్సుకు 64 మి.గ్రా  మెగ్నీషియం అందిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.  ఇది మానసిక స్థితిని మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి,  హృదయ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.  అరటిపండ్లు.. పొటాషియం కోసం అరటిపండ్లు చాలా మంచి ఎంపిక.  ఒక మీడియం సైజు అరటిపండులో  32 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది. అవి కండరాల పనితీరుకు మద్దతును, శక్తిని ఇస్తాయి.  వ్యాయామం తర్వాత అరటిపండు తినేది ఇందుకే. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెగ్నీషియం లోపం రాకుండా ఉంటుంది.  మెగ్నీషియం  లోపం వల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ముందే జాగ్రత్త పడినట్టు ఉంటుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
స్లిప్ డిస్క్.. ఈ సమస్య మీకు ఉందో లేదో తెలుసుకోండి..!

ఈ రోజుల్లో చిన్నవారైనా, పెద్దవారైనా వెన్నునొప్పి, నడుము నొప్పి అనే ఫిర్యాదులు చేయడం చూస్తూనే ఉన్నాం.  వెన్నునొప్పి ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెడుతుంది. ఈ నొప్పిని తరచుగా నిర్లక్ష్యం చేస్తారు. ఇది క్రమంగా పెరుగుతుంది. ఈ నొప్పి శారీరక అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, రోజువారీ వనులు చేసుకోవడంలో  కూడా ప్రభావితం చేస్తుంది. కానీ ఇలాంటి వెన్ను నొప్పి వెనుక స్లిప్ డిస్క్ లాంటి తీవ్రమైన సమస్య కూడా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విషయం  ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది.  అసలు స్లిప్ డిస్క్ అంటే ఏమిటి? ఇది వచ్చే అవకాశం ఎవరికి ఎక్కువ ఉంది? దీన్నెలా గుర్తించాలి? పూర్తీగా తెలుసుకుంటే.. స్లిప్ డిస్క్.. స్లిప్డ్ డిస్క్‌ను వైద్య భాషలో 'హెర్నియేటెడ్ డిస్క్' అని కూడా అంటారు. వెన్నెముక ఎముకల మధ్య ఉన్న కుషన్ లాంటి డిస్క్ దాని స్థానం నుండి జారిపోయినప్పుడు ఇది జరుగుతుంది. ఈ డిస్క్ మృదువైన, జెల్లీ లాంటి నిర్మాణం, ఇది ఎముకలు ఒకదానికొకటి రాపిడి కాపాడుతుంది. ఎముకలు సజావుగా కదలడానికి కారణం అవుతుంది. ఈ డిస్క్ పగిలిపోయినప్పుడు లేదా దాని స్థానం నుండి జారిపోయినప్పుడు అది సమీపంలోని నరాలపై ఒత్తిడి తెస్తుంది, దీని కారణంగా నడుము నుండి పాదాల వరకు తీవ్రమైన నొప్పి, తిమ్మిరి,  బలహీనత వంటి సమస్యలు వస్తాయి. కారణాలు.. డిస్క్ జారిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. వీటిలో కొన్ని  రోజువారీ అలవాట్లకు సంబంధించినవి, అతి పెద్ద కారణం కూర్చోవడం లేదా తప్పు మార్గంలో వంగడం. దీనితో పాటు బరువైన వస్తువులను, ముఖ్యంగా తప్పు మార్గంలో ఎత్తడం వల్ల, డిస్క్ పై అదనపు ఒత్తిడి పడుతుంది. వయస్సు పెరగడం కూడా ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే వయస్సుతో డిస్క్ బలం తగ్గడం ప్రారంభమవుతుంది. ఊబకాయం, వ్యాయామం లేకపోవడం,  కొన్నిసార్లు ఆకస్మిక గాయాలు కూడా డిస్క్ జారిపోవడానికి కారణం అవుతాయి. స్లిప్ డిస్క్ సంకేతాలు.. నడుము,  వెన్నునొప్పి స్లిప్ డిస్క్ కు సంబంధించినదా కాదా అని తెలుసుకోవడానికి సరైన లక్షణాలను గుర్తించాలి. అత్యంత సాధారణ లక్షణం ఎప్పుడూ  తీవ్రమైన నొప్పి కలిగి ఉండటం. ఇది నడుము నుండి ప్రారంభమై కాళ్ళ వరకు వెళుతుంది. దీనిని సయాటికా అని కూడా అంటారు. దీనితో పాటు, చాలా మందికి కండరాలలో తిమ్మిరి, జలదరింపు లేదా బలహీనత కూడా అనిపించవచ్చు. అలాగే, కూర్చోవడం, నిలబడటం లేదా నడవడంలో ఇబ్బంది ఉన్నా,  లక్షణాలు ఎక్కువసేపు కొనసాగినా వైద్యుని వద్దకు వెళ్లడం మంచిది. స్లిప్ డిస్క్ ఎవరికి వచ్చే ప్రమాదం ఉంటుంది? శారీరక శ్రమలకు తక్కువ ప్రాముఖ్యత ఇచ్చే లేదా గంటల తరబడి ఒకే స్థితిలో కూర్చునే ఐటీ నిపుణులు, డ్రైవర్లు,  కార్యాలయ ఉద్యోగులు వంటి వారిలో స్లిప్ డిస్క్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమస్య భారీ బరువులు ఎత్తే కార్మికులు లేదా అథ్లెట్లలో కూడా కనిపిస్తుంది. ముందు జాగ్రత్తలు.. స్లిప్ డిస్క్‌ రాకుండా ఉండాలంటే  దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవడం ముఖ్యం. మొదటగా సరైన పద్ధతిలో కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. కుర్చీపై కూర్చున్నప్పుడు  వీపును నిటారుగా ఉంచాలి.  ప్రతి 30-40 నిమిషాలకు కాస్త అటు ఇటు నడవాలి. బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు  నడుముపై కాకుండా  మోకాళ్లపై ఒత్తిడి ఉంచాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్  చేయడం వల్ల  వెన్నెముక బలోపేతం అవుతుంది.                                 *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ఏం చేసినా దగ్గు తగ్గడం లేదా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి..!

దగ్గు చాలా సాధారణంగా వచ్చే సమస్య. దగ్గు వస్తే సుమారు మూడు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ దగ్గు తగ్గకుండా ఎక్కువ కాలం ఉంటే మాత్రం అది చాలా ఇబ్బంది పెడుతుంది. దీర్ఘకాలిక దగ్గు అనేది జలుబు, ఫ్లూ, కోవిడ్ -19 లేదా శ్వాసకోశ ఇన్పెక్షన్ వంటి  సమస్యలు వచ్చినప్పుడు లేదా ఆ సమస్యలు తగ్గిన తరువాత కూడా కొన్నిరోజులు ఉంటుంది. ఈ రకమైన దగ్గు పొడిగా లేదా శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సాధారణంగా శ్వాసనాళం  మంట, యాసిడ్ రిఫ్లక్స్ లేదా గొంతులో  సున్నితంగా మారడం వల్ల వస్తుంది. ఇది అంత ప్రమాదకరమైన సమస్య కాకపోయినా ఉన్నన్నాళ్లు చాలా ఇబ్బంది పెడుతుంది.  ఈ సమస్యను సులువుగా చెక్ పెట్టడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. దీర్ఘకాలిక దగ్గుకు ప్రభావవంతమైన చిట్కాలు.. హైడ్రేట్ గా ఉండాలి.. పుష్కలంగా ద్రవాలు త్రాగటం వల్ల  శ్లేష్మం పల్చబడుతుంది.  ఇది  గొంతు పొడిబారడాన్ని తగ్గించడానికి,  వాయుమార్గాలలో చికాకును తగ్గించడానికి సహాయపడుతుంది. హెర్బల్  టీలు, సూపులు లేదా నిమ్మకాయ, తేనెతో వెచ్చని నీరు వంటి వెచ్చని ద్రవాలు గొంతుకు చాలా మంచి ఉపశమనం కలిగిస్తాయి. హైడ్రేటెడ్ గా ఉంటే  రోగనిరోధక పనితీరు బలంగా ఉంటుంది. శరీరానికి వచ్చే జబ్బులు వేగంగా నయం కావడానికి అనువుగా ఉంటుంది.  నిద్రవేళకు ముందు తేనె.. తేనె యాంటీమైక్రోబయల్,  ఓదార్పు లక్షణాలతో  దగ్గును సహజంగానే అణిచివేస్తుంది. నిద్రవేళకు ముందు ఒక చెంచా తేనే తీసుకోవాలి. ఇది గొంతు లోపల పూత లాగా ఏర్పడి రాత్రిపూట దగ్గును తగ్గిస్తుంది.  నిద్రను మెరుగుపరుస్తుంది. అదనపు ప్రయోజనం కోసం గోరువెచ్చని నీరు, పసుపు లేదా అల్లం రసంతో  కలిపి తీసుకోవచ్చు.  కానీ ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వకూడదు. నిద్ర చిట్కా.. తలను ఎత్తుగా ఉంచి నిద్రపోవడం వల్ల  గొంతులో శ్లేష్మం ఏర్పడకుండా ఉంటుంది. అలాగే  దగ్గును ప్రేరేపించకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. ఆవిరి.. ఆవిరి పీల్చడం పొడి, చికాకు కలిగించే వాయుమార్గాలను తేమ చేయడానికి,  శ్లేష్మాన్ని బయటకు రప్పించడానికి  సహాయపడుతుంది. అలాగే  గదిలో హ్యూమిడిఫైయర్ను ఉపయోగించడం గాలికి తేమను కూడా జోడిస్తుంది. ఇది పొడి దగ్గును తగ్గిస్తుంది, ముఖ్యంగా ఎయిర్ కండిషన్డ్ లేదా శీతాకాల వాతావరణంలో మంచిది.  ఉప్పు నీటి పుక్కిలింత.. రోజూ కొన్నిసార్లు గోరువెచ్చని ఉప్పు నీటితో పుక్కిలించాలి.  ఇలా  చేయడం వల్ల గొంతు మంట తగ్గుతుంది. శ్లేష్మం సడలుతుంది,  చికాకులను బయటకు పంపుతుంది. ట్రిగ్గర్లు.. దుమ్ము, పొగ, సుగంధ ద్రవ్యాలు,  కాలుష్యం వంటి సాధారణ విషయాలు దీర్ఘకాలిక దగ్గును మరింత తీవ్రతరం చేస్తాయి. ఈ ట్రిగ్గర్లను నివారించడానికి ప్రయత్నించాలి. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఉపయోగించాలి.  కలుషితమైన వాతావరణంలో బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ఉపయోగించాలి. అల్లం లేదా పసుపు టీ .. అల్లం,  పసుపు రెండూ శక్తివంతమైన శోథ నిరోధక,  యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉంటాయి. వీటితో తయారుచేసిన టీలను సిప్ చేయడం వల్ల గొంతుకు ఉపశమనం లభిస్తుంది. మంటను తగ్గించడానికి,  దగ్గుకు కారణమయ్యే ఏదైనా ఇన్పెక్షన్ తో  పోరాడటానికి సహాయపడుతుంది.  శ్వాస వ్యాయామాలు.. సున్నితమైన శ్వాస వ్యాయామాలు.. ముఖ్యంగా నెమ్మదిగా,  లోతైన శ్వాసలపై దృష్టి సారించే వ్యాయామాలు శ్వాసకోశ వ్యవస్థను రిపేర్ చేయడానికి, దగ్గును తగ్గించడానికి సహాయపడతాయి.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
మీకు గుడ్లు తినడం అలవాటు లేదా? గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారాలు తినండి..!

గుడ్లను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు.  పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరు గుడ్లు తినడానికి అనువుగా ఉంటాయి.  ముఖ్యంగా పోషకాహార లోపం రాకూడదంటే పిల్లలకు చిన్నతనం నుండే రోజుకు ఒక గుడ్డు తప్పనిసరిగా ఇవ్వడం మంచిదని వైద్యులు చెబుతుంటారు.  పైగా గుడ్లతో బోలెడు రుచికరమైన వంటలు తయారు చేస్తుంటారు. కానీ అందరూ గుడ్లను తినలేరు. భారతదేశంలో శాకాహార ఆహారాన్ని అనుసరించేవారు కూడా ఉన్నారు.  కనీసం గుడ్డును కూడా తినని వారు ఉన్నారు. ఇలాంటి వారు ప్రోటీన్ ఫుడ్ కోసం చాలా ఇబ్బందులు పడుతుంటారు.  అయితే  గుడ్లకంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాలు ఉన్నాయి. ఒక  గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటుంది.  అయితే ఇంతకంటే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉన్న శాకాహార ఆహారాలు ఉన్నాయి. గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన 4 సూపర్ ఫుడ్స్ ఎంటో తెలుసుకుంటే.. శనగలు..   భారతీయుల  ఆహారంలో అద్బుతం అని చెప్పదగినవి శనగలు.  వీటిలో  ప్రోటీన్ కంటెంట్ అమోఘం. అర కప్పు శనగలలో  దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ ఉంటుందట. భారతీయులు అయితే శనగలను చాలా బాగా వండేస్తారు.  చోలే కూర,  ఉడికించిన శనగలను స్నాక్స్ గానూ, వేయించిన శనగలను టైం పాస్ గా తినడం కోసం.. ప్రోటీన్ పౌడర్ గానూ.. ఇలా చాలా రకాలుగా శనగలను తినవచ్చు. పనీర్.. పాలలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.అటువంటి పాల నుండి తయారయ్యే పనీర్ లో కూడా ప్రోటీన్ మెరుగ్గా ఉంటుంది. అరకప్పు   కాటేజ్ జున్నులో  దాదాపు 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.  భారతీయులు పనీర్ ను కూరల్లోనూ,  శాండ్విచ్ ల తయారీ లోనూ, స్నాక్స్ గానూ, రకరకాల తినుబండారాలుగా, స్వీట్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు.  తక్కువ కొవ్వు ఉన్న పనీర్ ను ఎంచుకుంటే మరింత ఆరోగ్యం. బాదం..  ప్రోటీన్ కంటెంట్ను పెంచడానికి బాదం గ్రేట్గా సహాయపడుతుంది. బాదం బటర్ కూడా తయారు చేసుకుని వాడవచ్చు. 2 టేబుల్ స్పూన్ల బాదం బటర్ లో  7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.   గుండెకు మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులు బాదంలో ఉంటాయి. బాదంను చాలామంది రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటుంటారు.  అలా కాకుండా.. బాదం ను స్నాక్స్ గానూ,  బాదం బటర్ తయారు చేసుకుని,  స్వీట్స్ లోనూ, ప్రోటీన్ పౌడర్ లోనూ వినియేగించవచ్చు. గుమ్మడి గింజలు.. గుమ్మడికాయ విత్తనాలు చాలా స్పెషల్.. వీటిని  ఏదైనా సలాడ్, డెజర్ట్ లేదా స్మూతీలలో ఈజీగా జోడించవచ్చు. పొట్టు తీసిన  ఔన్స్ గుమ్మడి గింజలలో 8.5 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటాయి. అవి జింక్, ఇనుము, రాగి, మెగ్నీషియం, పొటాషియం,  సెలీనియం కూడా అందిస్తాయి, ఇవి వోట్మీల్, పాయసం, స్వీట్స్ స్నాక్స్ లలో జోడించుకోవచ్చు.  లేదంటే నానబెట్టిన బాదంతో పాటు రోజూ గుమ్మడి గింజలను కూడా తినవచ్చు.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more