రోజూ ఉదయమే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!
ఉప్పు లేని వంట, సారం లేని జీవితం వ్యర్థం అని అంటారు. వంటల్లో పులుపు, కారం కు జతగా ఉప్పు కూడా తగిన పరిమాణంలో ఉండాలి. లేకపోతే అస్సలు తినలేం. అయితే ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఆరోగ్యానికి బోలెడు ముప్పులు తప్పుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఏం జరుగుతుందంటే.. ఉప్పు నీటిలో సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది. ఉదయాన్నే ఉప్పు కలిపిన నీరు తాగితే ఈ ఎలక్ట్రోలైట్లు శరీర ఆర్థ్రీకరణ, నరాల పనితీరు, కండరాల సంకోచాలు మొదలైన కార్యకలాపాలకు సహాయపడుతుంది. ఉప్పు నీరులో ఉండే సమ్మేళనాలు కడుపులో ఉండే జీర్ణ ఎంజైములు, హైడ్రోక్లోరిక యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. జీర్ణక్రియ, పోషకాల శోషణకు సహాయపడుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఉప్పు నీటిలో మినరల్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది తామర, సొరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. గొంతు నొప్పి, గొంతు సంబంధ సమస్యలు తగ్గడానికి చాలామంది ఉప్పు నీటితో పుక్కిలిస్తుంటారు. అయితే ఉప్పు నీటితో పుక్కిలించడం, ఉప్పు నీటిని ఉదయాన్నే తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, గొంతులో శ్లేష్మం వంటివి తగ్గడమే కాకుండా అలెర్జీలు, శ్వాసకోశ ఆరోగ్యం, జలుబు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. శరీరంలో ఉండే సూక్ష్మ వ్యర్థాలు, విష పదార్థాలను శరీరం నుండి బయటకు పంపడంలో ఉప్పు నీరు సహాయపడుతుంది. ఈ కారణంగా ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది. ఏ ఉప్పు వాడితే మంచిదంటే.. నీటిలో ఉప్పు కలుపుకుని ఉదయాన్నే తాగడం మంచిదే అయినా అన్ని రకాల ఉప్పులు ఇందుకు మంచివి కావు. ఉప్పు నీరు తాగడం వల్ల మంచి ప్రయోజనాలు లభించాలంటే.. హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా శుధ్ది చేయని ఉప్పును ఎంపిక చేసుకోవాలి. ఉప్పు నీరు ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ మోతాదులో ఉప్పు కలిపి తాగకూడదు. తగినంత మోతాదులో ఉప్పు కలిపి తాగడం అన్ని రకాల వ్యక్తులకు మంచిదే అయినా అధిక రక్తపోటు, గుండె సంబంధ జబ్బులు ఉన్నవారు ఉప్పు నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. *రూపశ్రీ.
read moreవేడినీళ్లు తాగడం వల్ల పొట్ట కొవ్వు కరుగుతుందా? అసలు నిజాలేంటంటే..!
మానవ శరీరానికి నీరు చాలా ముఖ్యం. దాహం తీర్చుకోవడానికి మాత్రమే కాదు.. శరీరం సరిగ్గా పనిచేయడానికి, వ్యాధులను నివారించడానికి కూడా నీరు ఇంధనంలా పనిచేస్తుంది. మానవ శరీరంలో దాదాపు 70 శాతం నీటితో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సరిగ్గా పనిచేయడానికి ప్రతిరోజూ 2 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. కొందరు చల్లని నీరు తాగితే.. కొందరు వేడినీరు తాగుతుంటారు. చల్లని, వేడి నీరు రెండింటికీ వాటి స్వంత ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామం తర్వాత చల్లటి నీరు తాగితే శరీరం చల్లబడుతుంది. వేడి నీరు శరీరంలో విషాలను బయటకు పంపడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అయితే వేడి నీరు తాగడం వల్ల బరువు తగ్గడానికి, శరీరంలో కొవ్వు కరగడానికి సహాయపడుతుందని చెబుతుంటారు. ఇది ఎంత వరకు నిజం? దీని గురించి తెలుసుకుంటే.. కొన్ని పరిశోధనలు ఎక్కువ నీరు త్రాగడం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుందని చెబుతున్నాయి. నీరు తాగడం వల్ల కడుపు నిండినట్లు అనిపించడం, తక్కువ తినడం జరుగుతుంది. ఇది శరీరం పోషకాలను బాగా గ్రహించడానికి, హానికరమైన పదార్థాలను తొలగించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. భోజనానికి ముందు అర లీటరు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు 30శాతం మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. వేడి నీరు, బరువు.. ఉదయం లేదా రోజంతా ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల బరువు తగ్గడానికి మూడు విధాలుగా సహాయపడుతుందట. గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. దీన్ని సమతుల్యం చేయడానికి శరీరం అదనపు శక్తిని ఖర్చు చేస్తుంది. ఇది జీవక్రియను సక్రియం చేస్తుంది. గోరువెచ్చని నీరు శరీర కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి, చిన్న అణువులుగా మార్చడానికి సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థ వాటిని మరింత సులభంగా బర్న్ చేయడానికి వీలు కల్పిస్తుంది. భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం వల్ల ఆకలి తగ్గుతుంది, తద్వారా కేలరీల తీసుకోవడం తగ్గుతుంది. వేడి నీటి వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు.. నీరు జీర్ణవ్యవస్థను బాగుచేస్తుంది. జీర్ణం కావడానికి కష్టంగా ఉండే ఆహారాలను కరిగించడంలో సహాయపడుతుంది. గోరువెచ్చని నీరు నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. తద్వారా శరీరంలో నొప్పి, ఒత్తిడి రెండింటినీ తగ్గిస్తుంది. గోరువెచ్చని నీరు ప్రేగుల కదలికను పెంచుతుంది. ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. వేడినీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. చెమట ద్వారా చర్మ రంధ్రాల నుండి విష పదార్థాలు విడుదలవుతాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఈ 5 లక్షణాలు కనిపిస్తే.. కిడ్నీలు ప్రమాదంలో ఉన్నాయని అర్థం..!
మూత్రపిండాలు మానవ శరీరంలో ఒక భాగం. ఇవి 24 గంటలు నిశ్శబ్దంగా తమ విధులు నిర్వర్తిస్తాయి. మూత్రపిండాలు శరీరం నుండి విషాన్ని, అదనపు నీటిని తొలగిస్తాయి. రక్తపోటును నియంత్రిస్తాయి. ఖనిజాల సమతుల్యతను కాపాడుతాయి. కానీ మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. చాలా మంది వీటిని పట్టించుకోరు. ఈ లక్షణాలను సకాలంలో గుర్తించకపోతే అవి తీవ్రమైన అనారోగ్యంగా డవలప్ అవుతాయి. ప్రపంచ జనాభాలో దాదాపు 10 శాతం మంది ఏదో ఒక రకమైన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారని, వీటి కారణంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది మరణిస్తున్నారని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి. మూత్రపిండాలు సరిగా పని చేయకపోతే ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుంటే.. లక్షణాలు.. కిడ్నీ సమస్యలు తరచుగా చాలా చిన్న లక్షణాలతో మొదలవుతాయి. కానీ వాటిని పట్టించుకోకపోతే చాలా పెద్ద సమస్యగా మారతాయి. అలసట,బలహీనత.. ఎప్పుడూ అలసట, కాళ్ళలో లేదా కళ్ళ కింద వాపు, మూత్రం రంగు లేదా పరిమాణంలో మార్పులు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా చర్మం పొడిబారడం, చర్మం దురదగా ఉండటం మొదలైనవన్నీ మూత్రపిండాలు బలహీనపడుతున్నాయనడానికి సంకేతాలు. ఎప్పుడూ అలసట లేదా బలహీనత అనేవి శరీరంలో విషపదార్థాలు పేరుకుపోతున్నాయని, మూత్రపిండాలు వాటిని సరిగ్గా తొలగించలేకపోతున్నాయని అర్థం. బాగా నిద్రపోయిన తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపించడాన్ని , అస్సలు తేలికగా తీసుకోకూడదు. శరీరంలో వాపు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. మూత్రపిండాలు అదనపు ద్రవాన్ని తొలగించలేనప్పుడు అది శరీరంలోని కొన్ని భాగాలలో పేరుకుపోవడం మొదలుపెడుతుంది. ఇది మొదట పాదాలు, చేతులు లేదా ముఖంలో కనిపిస్తుంది. దీనిని వైద్య పరిభాషలో ఎడెమా అంటారు. మూత్రంలో మార్పులు.. మూత్రపిండాల సమస్యలకు చాలా స్పష్టమైన సంకేతం. ముదురు రంగు మూత్రం, మూత్రంలో నురుగు లేదా బుడగలు, తరచుగా మూత్రవిసర్జన లేదా మంట వంటివి మూత్రపిండాల సమస్యను సూచిస్తాయి. శ్వాస ఆడకపోవడం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా మూత్రపిండాల వైఫల్యాలు ఎదుర్కునే చాలామందిలో ఉండే లక్షణం. మూత్రపిండాలు శరీరం నుండి అదనపు ద్రవాన్ని తొలగించలేనప్పుడు ఆ ద్రవం ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. చాలా మంది ఇలాంటి సమస్య వచ్చినప్పుడు గుండె లేదా ఊపిరితిత్తుల సమస్య అనుకుంటారు. కానీ అసలు కారణం మూత్రపిండాల సమస్య. పొడి, దురద చర్మం.. మూత్రపిండాలు రక్తం నుండి అవసరమైన ఖనిజాలు, వ్యర్థ ఉత్పత్తులను ఫిల్టర్ చేయలేకపోవడం వల్ల పొడి చర్మం, దురద వంటి సమస్యలు వస్తాయి. ఇది శరీరంలో ఖనిజ అసమతుల్యతకు కారణమవుతుంది. ఇది చర్మాన్ని పొడిగా, దురదగా చేస్తుంది. మూత్రపిండాల వ్యాధి సమస్యలు ముదిరే కొద్ది ఈ సమస్య బయటకు కనిపిస్తుంది. పై లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ముందుగా గుర్తించడం వల్ల వ్యాధిని నివారించడమే కాకుండా మూత్రపిండాల పనితీరును కూడా గణనీయంగా కాపాడుకోవచ్చు. మూత్రపిండాల ఆరోగ్యానికి సమతుల్య, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది, మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఆపిల్, బెర్రీలు, ద్రాక్ష, కాలీఫ్లవర్, క్యాబేజీ, క్యాప్సికం వంటి పొటాషియం తక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు మూత్రపిండాల సమస్యలు రాకుండా చేయడం లేదా, మూత్ర పిండాలను సంరక్షించడం చేస్తాయి. అందుకే వీటిని తీసుకోవాలి. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గిస్తాయి, మూత్రపిండాల ఒత్తిడిని తగ్గిస్తాయి. చేపలు, కాయధాన్యాలు లేదా గుడ్డులోని తెల్లసొన వంటి లీన్ ప్రోటీన్ లను తీసుకోవాలి. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించాలి. వీటిలోని ప్రిజర్వేటివ్లు మూత్రపిండాలు ఎక్కువగా పని చేయడానికి కారణం అవుతాయి. ప్రతి చిన్న సమస్యకు అధికంగా మందులు వాడటం, ముఖ్యంగా నొప్పి నివారణ మందులు, మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. వైద్యుల సలహా లేకుండా పదే పదే పెయిన్ కిల్లర్స్ తీసుకోకూడదు. *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఈ మందులు ఎక్కువ కాలం వాడితే ఎంత డేంజరో మీకు తెలుసా?
మందులు వాడటం నేటి కాలంలో చాలా సహజం అయిపోయింది. చిన్న సమస్య నుండి, పెద్ద ఆరోగ్య సమస్య వరకు ప్రతి సమస్య తగ్గడానికి మందులు వాడుతుంటారు. ఇందులో టాబ్లెట్లు, ఇంజెక్షన్లు ఉంటాయి. కొందరు వైద్యుల సలహాతో మందులు వాడితే.. మరికొందరు సొంతంగా మందులు కొని అడపాదడపా వాడుతూనే ఉంటారు. అయితే మందులను ఎక్కువ కాలం వాడితే ఎవ్వరూ ఊహించనంత డేంజర్ సమస్య ఎదురవుతుందని చాలామందికి తెలియదు. ఏదైనా ఆరోగ్య సమస్య కారణంగా మందులను ఎక్కువ కాలం వాడటం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు క్రమంగా తగ్గుతాయట. ఈ లోపం శరీరం లోపల పెరుగుతూనే ఉంటుందని, దీని కారణంగా అలసట, రోగనిరోధక శక్తి తగ్గడం, ఎముకలు బలహీన పడటం.. వంటి అనేక సమస్యలకు కారణమవుతుందట. అసలు ఏ మందులు వాడటం వల్ల ఇలాంటి సమస్య ఎదురవుతుంది? ఎక్కువ కాలం మందులు వాడాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుంటే.. ఆస్ప్రిన్ ఆస్ప్రిన్ శరీరం విటమిన్ సి శోషణను తగ్గిస్తుంది. దీని వలన విటమిన్ సి క్రమంగా క్షీణిస్తుంది. దీర్ఘకాలిక ఆస్ప్రిన్ వాడకం వల్ల ఐరన్ నిల్వలు కూడా తగ్గుతాయి. రోజుకు 100 mg తక్కువ మోతాదులో ఆస్ప్రిన్ తీసుకునే 65 ఏళ్లు పైబడిన వారిలో రక్తహీనత ప్రమాదం 20 శాతం పెరిగిందని ఒక అధ్యయనం తేల్చింది. టైలెనాల్, ఎసిటమైనోఫెన్ గ్లూటాతియోన్ శరీరంలోని ప్రధాన యాంటీఆక్సిడెంట్. ఇది కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. టైలెనాల్ వంటి మందులు దాని స్థాయిలను తగ్గిస్తాయి, కాలేయం దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతాయి. తక్కువ గ్లూటాతియోన్ స్థాయిలు వృద్ధాప్యం, మధుమేహం, ఇన్ఫెక్షన్లు, బలహీనమైన రోగనిరోధక పనితీరు వంటి సమస్యలకు కారణం అవుతుంది. గర్భనిరోధక మాత్రలు గర్భనిరోధక మాత్రలను నిరంతరం ఉపయోగించడం వల్ల శరీరంలో ఫోలిక్ యాసిడ్, బి2, బి6, బి12, విటమిన్ సి, విటమిన్ ఇ, మెగ్నీషియం, సెలీనియం, జింక్ వంటి అనేక విటమిన్లు, ఖనిజాలు క్షీణిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ఈ లోపం చాలా తీవ్రంగా ఉంటుంది. చాలా మంది మహిళలు సప్లిమెంట్లను తీసుకోవలసి వస్తుంది. దీనికి గల కారణాలపై స్పష్టత లేదు.. కానీ ఈ మాత్రలలోని ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ శరీర పోషక ప్రక్రియలను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. మెట్ఫార్మిన్ మధుమేహం ఉన్నవారికి సూచించబడే మెట్ఫార్మిన్, పేగులో విటమిన్ బి12 శోషణను తగ్గిస్తుంది. ఎక్కువకాలం ఉపయోగించడం వల్ల విటమిన్ బి12 లోపానికి దారితీస్తుంది. ఇది నరాల దెబ్బతినే ప్రమాదాన్ని పెంచుతుంది. యాంటాసిడ్లు యాంటాసిడ్లు కడుపులోని ఆమ్లాన్ని తగ్గిస్తాయి. కానీ ఇదే ఆమ్లం ఆహారం నుండి విటమిన్ బి12 విడుదలకు సహాయపడుతుంది. దీర్ఘకాలిక యాంటాసిడ్ వాడకం వల్ల కాల్షియం, పొటాషియం, జింక్ లోపాలు కూడా ఏర్పడతాయి, దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి, కండరాల పట్టు తగ్గుతుంది. స్టాటిన్స్ స్టాటిన్ మందులు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి, గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ అవి కండరాల శక్తి ఉత్పత్తికి అవసరమైన కోఎంజైమ్ Q10 ను తగ్గిస్తాయి. ఈ లోపం కండరాల నొప్పి, బలహీనత, వాపుకు కారణమవుతుంది. యాంటీబయాటిక్స్ యాంటీబయాటిక్స్ హానికరమైన బ్యాక్టీరియాను చంపుతాయి. కానీ అవి మంచి గట్ బాక్టీరియాకు కూడా హాని చేస్తాయి. ఇది గట్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఊబకాయం, అలెర్జీలు, జీర్ణ సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడానికి దారితీస్తుంది. స్టెరాయిడ్స్ స్టెరాయిడ్లు శరీర ఖనిజ సమతుల్యతను అనేక విధాలుగా దెబ్బతీస్తాయి. కాల్షియం శోషణను తగ్గిస్తాయి, ఎముకలు బలహీనపడటానికి దారితీస్తాయి, విటమిన్ డి పనితీరును కూడా తగ్గిస్తాయి. ఇది మెగ్నీషియం, పొటాషియం స్థాయిలను తగ్గిస్తుంది. బలహీనత, అలసట, తిమ్మిరికి దారితీస్తుంది. దీర్ఘకాలిక స్టెరాయిడ్ వాడకం కూడా బి విటమిన్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. నరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. జాగ్రత్త.. ఎక్కువ కాలంగా ఏవైనా మందులు వాడుతుంటే, వాటితో పాటు ఏ విటమిన్ లేదా మినరల్ సప్లిమెంట్లు తీసుకోవాలో వైద్యుడిని లేదా డైటీషియన్ను అడగాలి. ఈ సాధారణ జాగ్రత్తలు అలసట, రక్తహీనత, ఎముకల నష్టం, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreబయట తినేటప్పుడు అతిగా తినడాన్ని ఎలా నివారించాలంటే..!
ఆహారమే ఆరోగ్యానికి ఔషదంగా పనిచేస్తుంది. భారతీయ ఆయుర్వేదం చాలా వరకు ఆరోగ్య సమస్యలకు ఆహారాన్నే ఔషదంగా సూచిస్తుంది. బోలెడు రకాల వంటకాలు, దేశ విదేశీ రుచులు ఎప్పుడు కావాలంటే అప్పుడు లభించే నేటికాలంలో ఆహారం దగ్గర కంట్రోల్ లో ఉండటం కాసింత కష్టమైన పనే.. కానీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునేవారు, డైటింగ్ చేస్తున్నవారు.. బయట ఫంక్షన్లు, పార్టీలు, శుభకార్యాలు, ఫ్రెండ్స్ తో లంచ్, డిన్నర్ వంటివి చేసేవారు ఆహారం దగ్గర కంట్రోల్ ఉండలేకపోతున్నాం అని బాధపడుతూ ఉంటారు. అలా బాధపడక్కర్లేకుండా బయట తినేటప్పుడు అతిగా తినడాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుంటే.. హెల్తీ ఫుడ్స్.. వేయించిన, క్రిస్పీ లేదా క్రీమీ వంటకాలకు బదులుగా గ్రిల్ చేసిన, బేక్ చేసిన, ఆవిరి మీద ఉడికించిన లేదా ఉడికించిన వంటకాలను ఎంచుకోవాలి. వంట చేసిన విధానం మీద ఆ వంటలో ఉండే కేలరీలు డిసైడ్ అవుతాయి. గ్రిల్ చేసిన లేదా ఆవిరి మీద ఉడికించిన ఆహారాలకు తక్కువ నూనె అవసరం అవుతుంది. వేయించిన లేదా క్రీమీ ఆహారాలలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. అందుకే రెస్టారెంట్లలో వేయించిన ఆహారాల కంటే గ్రిల్ చేసిన లేదా కాల్చిన, స్టీమ్ చేసిన ఆహారాన్ని ఎంచుకోవడం మేలు. డ్రింక్స్ వద్దు.. రెస్టారెంట్లో భోజనం చేసేటప్పుడు అతిగా తినకుండా ఉండటానికి డ్రింక్స్ కు బదులుగా నీటిని మాత్రమే తీసుకోవాలి. బయట భోజనం చేసేటప్పుడు కూల్ డ్రింక్స్ లేదా జ్యూస్లు ఆర్డర్ చేయడం చాలా కామన్. కానీ ఇవి కేలరీలు పెరగడానికి కారణం అవుతాయి. అందుకే కూల్ డ్రింక్స్, జ్యూస్ ల కంటే నీరు మాత్రమే తీసుకోవడం మేలు. హెల్తీ ఛాయిస్.. రెస్టారెంట్లలో ఫ్రైస్ లేదా చిప్స్ కు బదులుగా కూరగాయలు లేదా సలాడ్ ఎంచుకోవాలి. చాలా వంటకాలు అధిక కేలరీల కలిగిన సైడ్ డిష్ లతో కాంబినేషన్ గా ఉంటాయి. ఇలాంటి వాటిని హెల్తీ ఛాయిస్ గా మార్చుకోవాలి. ప్రోటీన్ ఫుడ్.. బయటకు వెళ్లి ఆహారం తీసుకున్నా.. ఆ ఆహారం ప్రధానంగా ప్రోటీన్ ఆహారమై ఉండేలా చూసుకోవాలి. దీని కోసం చికెన్, టర్కీ లేదా చేప వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను ఎంచుకోవచ్చు. ఈ ఆహారాలు కడుపు నింపడమే కాకుండా ఎక్కువసేపు శక్తిని, హెల్తీ ఫ్యాట్స్ ను కూడా అందిస్తాయి. పోర్షన్.. చాలావరకు రెస్టారెంట్లలో ఆర్డర్ చేసే ఆహారం పెద్ద మొత్తంలో ఉంటుంది. బిర్యానీ, మండీ.. లాంటి వాటి జోలికి వెళ్లకుండా ప్లేట్ మీల్స్ టైప్ లో ఆహారాన్ని ఆర్డర్ చేసుకుని సింపుల్ గా తక్కువగా తినడం మంచిది. ఒకవేళ పెద్ద మొత్తంలో ఆహారం ఆర్డర్ చేయాల్సి వచ్చినా సొంతంగా వడ్డించుకోకుండా ఎవరితోనైనా ఆహారాన్ని వడ్డించమనాలి. దీని వల్ల ఎక్కువ ప్లేట్ లో పెట్టుకోకుండా ఉంటారు. ఆహారం లిమిట్ లోనే ఉంటుంది. నెమ్మది.. బయట తినేటప్పుడు నెమ్మదిగా తినడం చాలా ఇంపార్టెంట్. ఏవో పనులు ఉన్నాయనో లేదా అందరూ వేగంగా తింటున్నారనో ఆహారాన్ని సరిగా నమలకుండా వేగంగా తింటే జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. నిదానంగా తింటే ఆహారం కూడా ఎక్కువగా కాకుండా సరిపడినంత తినవచ్చు. ఆహారం ఎంత బాగా నమిలితే అంత బాగా కడుపు నిండిన ఫీల్ ఉంటుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreవరల్డ్ న్యూమోనియా డే.. న్యూమోనియా లక్షణాలేంటి? దీన్ని ఎలా గుర్తించాలంటే..!
న్యూమోనియా ప్రాణాంతక శ్వాసకోశ సమస్య. ఇది ఇన్పెక్షన్ లాగా వ్యాపిస్తుంది. దీనిగురించి అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 12న ప్రపంచ న్యుమోనియా దినోత్సవాన్ని జరుపుకుంటారు. న్యుమోనియా అనేది బ్యాక్టీరియా, వైరస్లు లేదా శిలీంధ్రాల వల్ల కలిగే తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్పెక్షన్. ఊపిరితిత్తులలోని అల్వియోలీ అనే చిన్న గాలి సంచులు వాపుకు గురై చీము లేదా ద్రవంతో నిండిపోవడానికి ఇది కారణమవుతుంది. ఈ ద్రవం ఆక్సిజన్ ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే ఇది ప్రాణాంతకంగా మారుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు లేదా బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో ఈ ప్రమాదం ఎక్కువ. అయితే న్యుమోనియాను కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. చలి, వణుకు.. న్యుమోనియా ముఖ్య లక్షణం తీవ్రమైన చలి, వణుకుతో కూడిన అధిక జ్వరం. సాధారణ జ్వరంతో చలి రావడం సహజం. కానీ న్యుమోనియాలో వణుకు చాలా తీవ్రంగా ఉంటుంది. ఎన్ని దుప్పట్లు కప్పినా ఈ సమస్య ఉన్నవారికి వణుకు తగ్గదు. ఇలా వణుకు తగ్గకపోవడం.. శరీరం ఇన్ఫెక్షన్తో వేగంగా పోరాడటానికి ప్రయత్నిస్తుందనడానికి సంకేతమని వైద్యులు అంటున్నారు. దీని వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఛాతీ నొప్పి, శ్లేష్మంతో కూడిన దగ్గు.. న్యుమోనియా కేవలం పొడి దగ్గు మాత్రమే కాదు, తరచుగా శ్లేష్మంతో కూడి ఉంటుంది. శ్లేష్మం పసుపు, ఆకుపచ్చ లేదా కొన్నిసార్లు రక్తంతో కూడిన గోధుమ రంగులో ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రోగులు శ్వాస తీసుకునేటప్పుడు లేదా దగ్గుతున్నప్పుడు ఛాతీ నొప్పి ఎక్కువగా అనుభవిస్తారు. ఈ నొప్పి ఊపిరితిత్తుల వాపు వల్ల వస్తుంది. శ్వాస సమస్యలు.. న్యుమోనియా ఊపిరితిత్తులలోని గాలి సంచులు నిండిపోయి శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుంది. రోగులు తగినంతగా శ్వాస తీసుకోలేకపోతున్నట్లు ఇబ్బంది పడతారు . శ్వాస వేగంగా మారుతుంది. చిన్న పిల్లలలో శ్వాస తీసుకునేటప్పుడు వారి ముక్కు రంధ్రాలు మంటగా ఉండటం లేదా వారి ఛాతీ లోపలికి కుచించుకుపోయినట్టు ఉంటుంది. ఇది సమస్య చాలా ఎక్కువ ఉందనడానికి సంకేతం. అలసట, గందరగోళం, పెదవుల రంగు.. న్యుమోనియాతో బాధపడుతున్న వ్యక్తి తీవ్ర అలసట, బలహీనతకు లోనవుతారు. వృద్ధులలో ఈ ఇన్ఫెక్షన్ మానసిక గందరగోళానికి లేదా అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడానికి కారణమవుతుంది. ఆక్సిజన్ లేకపోవడం వల్ల పెదవులు, గోళ్లు నీలం రంగులోకి మారవచ్చు. ఈ లక్షణాలన్నీ తీవ్రమైన ఇన్ఫెక్షన్ను సూచిస్తాయి. *రూపశ్రీ.
read moreరక్తాన్ని శుభ్రం చేసే ఈ ఆహారాల గురించి తెలుసా?
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అన్ని అవయవాలు పర్పెక్ట్ గా పనిచేయాలి. ఇలా అన్ని అవయవాలు సరిగా పని చేయాలంటే దీనికి తగినంత స్వచ్ఛమైన రక్తం సరఫరా అవసరం. మన శరీరమంతా ఆక్సిజన్, హార్మోన్లు, అవసరమైన పోషకాలను రవాణా చేయడానికి రక్తం చాలా అవసరం, కానీ రక్తం స్వచ్ఛంగా, శుభ్రంగా లేకపోతే ఈ ప్రక్రియ కష్టంగా జరుగుతుంది. అసలు రక్తం ఎలా మలినం అవుతుంది? రక్తం శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలు ఏమిటి? తెలుసుకుంటే.. రక్తం ఎలా కలుషితం అవుతుంది? సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కాలక్రమేణా రక్తంలో అనేక విష పదార్థాలు పేరుకుపోతాయి. ఇది శరీరంలోని అనేక అవయవాలలో విషప్రక్రియకు దారితీస్తుంది. సాధారణంగా, మూత్రపిండాలు, కాలేయం వంటి జీర్ణవ్యవస్థ అవయవాలు సహజంగానే రక్తాన్ని నిరంతరం ఫిల్టర్ చేస్తాయి. అయితే రక్తం ఎక్కువ కలుషితం కావడం ఈ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తుంది. అందువల్ల సరైన ఆహారాన్ని తీసుకోవడం, రక్తంలో విష పదార్థాలు తొలగించి రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలు తీసుకోవడం చాలా ముఖ్యం. రక్తం కలుషితం అయితే ఎదురయ్యే సమస్యలు.. ఆహారంలో మలినాలు ఎక్కువ ఉంటే.. రక్తంలో మలినాలు కూడా పెరుగుతాయి. ఇది మన చర్మంతో సహా శరీరంలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తుంది. రక్తంలో మలినాలు ఉంటే కాలేయం సరిగా పనిచేయదు. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుంది. చర్మ ఇన్ఫెక్షన్లు, పదే పదే ఒకదాని తరువాత ఒకటి మొటిమలు వస్తూ ఉండటం, దద్దుర్లు, చికాకు, తరచుగా అలసట, ముఖంపై మెరుపు లేకపోవడం మొదలైనవి రక్తం శుభ్రంగా లేదనే సంకేతాన్ని ఇస్తాయి. రక్తాన్ని శుభ్రం చేసే ఆహారాలు.. గోరువెచ్చని నీరు, నిమ్మరసం.. నిమ్మరసం రక్తాన్ని, జీర్ణవ్యవస్థను రెండింటినీ శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది సహజంగా ఆమ్లంగా ఉంటుంది. ఇది pH స్థాయిలను తగ్గించడానికి, రక్తం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. శరీరం నుండి మలినాలను తొలగించుకోవడానికి ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తాజా నిమ్మరసం కలిపి త్రాగాలి. ఇది రక్తాన్ని శుభ్రంగా ఉంచడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నీరు.. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో టాక్సిన్లు తొలగడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలోని మలినాలను తగ్గిస్తుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాల పనితీరు కూడా సరిగ్గా ఉంటుంది. ఈ అవయవాలు రక్తాన్ని శుద్ధి చేయడానికి, మలినాలను తొలగించడానికి సహాయపడతాయి. నేషనల్ కిడ్నీ అసోసియేషన్ ప్రకారం రోజుకు సుమారు 6 కప్పుల మూత్రం ఉత్పత్తి అయ్యేంత నీరు త్రాగాలి. పసుపు.. పసుపు రక్తాన్ని శుద్ధి చేయడానికి, వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. పసుపులో కనిపించే కర్కుమిన్ అనే సమ్మేళనం వాపు, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం పసుపు పాలు తాగడం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. శరీరం నుండి విషాన్ని తగ్గిస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreరూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?
ఇళ్ళు, ఆఫీసులు మంచి వాసన రావడానికి తరచుగా రూమ్ ఫ్రెషనర్లు, పెర్ఫ్యూమ్లు, సువాసనగల ధూపం లేదా సువాసనగల కొవ్వొత్తులను ఉపయోగిస్తుంటారు. ఇది ఒక సాధారణ అలవాటులా అనిపిస్తుంది. కానీ ఈ "సువాసన" నెమ్మదిగా ఆరోగ్యానికి "సైలెంట్ కిల్లర్"గా మారుతుందని తెలుసా.. చాలామంది ఇలాంటి సువాసన వల్ల ఇల్లు వాతావరణం బాగుంటుందని, ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఈ రూమ్ ఫ్రెషనర్ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే.. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. రూమ్ ఫ్రెషనర్ల తయారీలో ఉపయోగించే రసాయనాలు.. రూమ్ ఫ్రెషనర్లు, పెర్ఫ్యూమ్లు, సౌందర్య సాధనాలు, శుభ్రపరిచే ఉత్పత్తులు, సువాసనగల కొవ్వొత్తులు వంటి ఉత్పత్తులలో ఆరోగ్యానికి హానికరమైన వేలాది రసాయనాలు ఉంటాయి. వీటిలో ప్రధానంగా ద్రావకాలు, స్టెబిలైజర్లు, UV-అబ్జార్బర్లు, ప్రిజర్వేటివ్లు, రంగులు ఉంటాయి. ఇవి ఇండోర్ వాయు కాలుష్యానికి కారణం అవుతాయి. ఈ రసాయనాలు ఎక్కువ కాలం పీల్చడం వల్ల అలెర్జీలు, శ్వాసకోశ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత, క్యాన్సర్, న్యూరోటాక్సిసిటీ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రూమ్ ఫ్రెషనర్లు ఎక్కువకాలం వాడితే కలిగే సమస్యలు.. రూమ్ ఫ్రెషనర్లలో ఉండే రసాయనాలు కళ్ళు, గొంతు, ఊపిరితిత్తులను కప్పే సున్నితమైన పొరలను చికాకుపరుస్తాయి. ఇది చికాకు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఎటువంటి కారణం లేకుండా తరచుగా మైగ్రేన్లు లేదా తలనొప్పుల సమస్య ఉంటే అది రూమ్ ఫ్రెషనర్ల వల్ల ఏర్పడే సమస్య కావచ్చని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా, ప్లగ్-ఇన్ ఎయిర్ ఫ్రెషనర్లు, ఫాబ్రిక్ సాఫ్ట్నర్లు, లాండ్రీ క్రిస్టల్స్, పెర్ఫ్యూమ్లు, కొలోన్లు వంటి ఉత్పత్తులు మెదడులో సున్నితమైన నరాల ప్రతిస్పందనలను ప్రేరేపిస్తాయి. తలనొప్పిని పెంచుతాయి. చాలా మందికి రూమ్ ఫ్రెషనర్లు అంటే అలెర్జీ ఉంటుంది. రసాయనాల వాసన రియాక్షన్ కు తొందరగా గురయ్యేవారిలో దగ్గు, తుమ్ము, కళ్ళు దురద, వాయుమార్గాల వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి దీర్ఘకాలం కొనసాగితే ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. థాలేట్లు, కొన్ని సింథటిక్ రసాయనాలు శరీరం హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. ఇది సంతానోత్పత్తి, జీవక్రియను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలికంగా వీటికి గురికావడం వల్ల లైంగిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి ప్రమాదాలు పెరుగుతాయి. ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిలో ఈ రూమ్ ఫ్రెషనర్లు ఊపిరితిత్తులను చికాకుపరుస్తాయి. దగ్గు, గురక లేదా శ్వాస ఆడకపోవడానికి కారణమవుతాయి. తక్కువ స్థాయిలో ఎక్స్పోజర్ కూడా పిల్లలు, పెద్దలలో ఆస్తమా ప్రమాదాన్ని పెంచుతుందని వైద్యులు అంటున్నారు. రూమ్ ఫ్రెషనర్ పదార్థాలలో ఉండే ఫార్మాల్డిహైడ్, కొన్ని అస్థిర సేంద్రియ సమ్మేళనాలు క్యాన్సర్ కలిగించే ప్రధాన సమ్మేళనాలుగా గుర్తించబడ్డాయి. ఈ సమ్మేళనాలను ఎక్కువ కాలం పీల్చడం వల్ల ఊపిరితిత్తులు, కాలేయం, చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఈ ఉత్పత్తులను ఎక్కువ కాలం పీల్చడం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, కాలేయ పనితీరు దెబ్బతినడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ రసాయనాలు శరీరంలోని హార్మోన్లు, జీవక్రియ వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తాయి. *రూపశ్రీ.
read moreచలికాలంలో చర్మం పగుళ్లు రాకుండా ఉండాలంటే ఏం తినాలంటే..!
చల్లని, పొడి వాతావరణంలో గాలిలో తేమ చాలా తక్కువగా ఉంటుంది. ఇది చర్మం పై పొర నుండి తేమను త్వరగా తొలగిస్తుంది. దీని వల్ల చర్మం పొడిగా గరుకుగా మారుతుంది. దీని కారణంగా పగుళ్లు ఏర్పడతాయి. చలి నుండి ఉపశమనం కోసం చాలా మంది హీటర్ వాడతారు. మరికొంత మంది వేడి నీటి స్నానం ద్వారా ఉపశమనం పొందాలని అనుకుంటారు. కానీ వీటి వల్ల పొడిదనం మరింత ఎక్కువ అవుతుంది. అసలు చలికాలంలో చర్మం ఎందుకు పొడిగా మారుతుంది. చర్మం పొడిగా మారి పగుళ్లు రాకూడదంటే ఏం చేయాలి? ఏం తినాలి? తెలుసుకుంటే.. చర్మం ఎందుకు పొడిగా మారుతుందంటే.. శీతాకాలంలో గాలిలో తేమ తగ్గి చర్మం త్వరగా ఎండిపోతుంది. బయట చల్లని గాలి నుండి చర్మానికి ఉపశమనం కలిగించుకోవడం కోసం వేడికి దగ్గరగా ఉండాలని అనుకుంటారు. ఇది చర్మంలోని తేమను తొలగిస్తాయి. ఈ సమయంలో చర్మం సహజ నూనెలను ఉత్పత్తి చేసే సామర్థ్యం కూడా తగ్గి, చర్మం రక్షణ పొరను బలహీనపరుస్తుంది. వేడి నీటిలో స్నానం చేస్తే లేదా తగినంత నీరు త్రాగకపోతే పొడిబారడం మరింత పెరుగుతుంది. బయటి వాతావరణానికి ప్రభావితమయ్యే శరీర భాగాలైన మఖం, చేతులు, కాళ్లలో ఈ పొడిబారే సమస్య ఎక్కువగా ఉంటుంది. చర్మం పొడిబారి పగుళ్లు రాకుండా చేసే ఆహారాలు.. ఆహారం చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. చేపలు, అవిసె గింజలు, వాల్నట్లు వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు చర్మంలోని నూనె సమతుల్యతను కాపాడుతాయి. బాదం, వేరుశెనగలు, పొద్దుతిరుగుడు విత్తనాలు వంటి విటమిన్ E సమృద్దిగా ఉన్న ఆహారాలు చర్మాన్ని ఫ్రీ రాడికల్ నష్టం నుండి రక్షిస్తాయి. క్యారెట్, పాలకూర వంటి విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలు చర్మ కణాలను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. తగినంత నీరు త్రాగడం వల్ల చర్మం హైడ్రేట్ గా ఉండటంలో సహాయపడుతుంది. అసమతుల్యమైన లేదా ప్రాసెస్ చేసిన ఆహారం చర్మ సహజ కాంతిని తగ్గిస్తుంది. పొడిబారడాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మం కావాలంటే చర్మానికి మేలు చేసే ఆహారాలు తీసుకోవాలి. *రూపశ్రీ.
read moreమూత్ర పిండాలలో రాళ్లను నివారించే మూలికలు, చిట్కాలు..!
ఆధునిక జీవనశైలి, ఫాస్ట్ ఫుడ్ తినడం మొదలైనవి ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటి కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు, ప్రిజర్వేటివ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం, మూత్రపిండాల పనితీరు బలహీనపడటానికి దారితీస్తాయి. మూత్రపిండాల్లో లవణాలు, ఖనిజాలు స్ఫటికీకరించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు నివారించవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారుతున్నప్పటికీ, వాటిని నివారించడం సులభం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం, సమతుల్య ఆహారం, సహజ మూలికల వాడకంతో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకూడదు అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.. హైడ్రేషన్: మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి హైడ్రేటెడ్ గా ఉండటం. "రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగడం వల్ల రాళ్లు ఏర్పడటానికి దోహదపడే కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్ల వంటి ఖనిజాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. సాధారణ నీటితో పాటు, కొబ్బరి నీరు, బార్లీ నీరు అద్భుతంగా సహాయపడతాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడాన్ని ప్రోత్సహిస్తాయి. నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లు కూడా మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో ఉండే సిట్రేట్లు ఆక్సలేట్లు స్ఫటికాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. సరైన హైడ్రేషన్ మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోకుండా మూత్రపిండాల పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తాయి. మూలికలు.. కొన్ని మూలికలు మూత్రపిండాల పనితీరుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తాయి. సహజ నివారణలు విషాన్ని బయటకు పంపడంలో, ఖనిజాలు పేరుకుపోకుండా నిరోధించడంలో, మొత్తం మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అత్యంత ప్రభావవంతమైన మూలికలు.. పునర్నవ .. ఇది సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తుంది, అదనపు ద్రవాలు, విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గోక్షుర .. మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇస్తుంది, ఖనిజ స్ఫటికీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది. అరటి కాండం రసం.. మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేసి బయటకు పంపుతుంది. శతావరి.. మూత్రపిండాల వడపోతను పెంచుతుంది, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. బూడిద గుమ్మడికాయ రసం.. 95 శాతం నీటి శాతం, ఆల్కలీన్ లక్షణాలతో ఇది శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ల నివారణకు ఆహార విధానాలు.. కాల్షియం తీసుకోవడం పెంచాలి.. కాల్షియం గట్లోని ఆక్సలేట్లతో బంధిస్తుంది, మూత్రపిండాలలో వాటి స్ఫటికీకరణను నిరోధిస్తుంది. సోడియం వినియోగాన్ని పరిమితం చేయాలి.. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కాల్షియం విసర్జన పెరుగుతుంది, రాళ్ళు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి.. పాలకూర, దుంపలు, బెండకాయలు వంటి ఆహారాలను మితంగా తినాలి, వాటి ప్రభావాలను సమతుల్యం చేయడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో జత చేయాలి. ఆల్కలీన్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. దోసకాయలు, పుచ్చకాయ, కొబ్బరి నీరు మూత్రంలో ఆరోగ్యకరమైన pH సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. జంతు ప్రోటీన్ను పరిమితం చేయాలి.. మాంసం, గుడ్లు, చేపలను అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఆరోగ్యానికి మంచిది కదా అని నీరు ఎక్కువ తాగితే జరిగేదేంటో తెలుసా?
నీరు త్రాగడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఒక వాహనానికి ఇంధనం ఎలాగో.. శరీరానికి నీరు కూడా అలాగే చాలా అవసరం. చాలా మంది నీరు బాగా తాగాలి అని చెబుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని ఎక్కువ నీరు తాగితే చాలా నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అంటున్నారు వైద్యులు. ఇంతకీ నీరు ఎక్కువ తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుంటే.. ఎక్కువ నీరు తాగమని తరచుగా చాలామంది సలహాలు ఇస్తుంటారు. అయితే నీరు ఎక్కువ తాగితే శరీరానికి చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు. ఆహార నిపుణులు కూడా. ఎక్కువ నీరు తాగడం వల్ల నీటి మత్తుకు దారి తీస్తుందని అంటున్నారు. నీరు ఎక్కువగా తాగినప్పుడు రక్తంలో సోడియం స్థాయిలు తగ్గుతాయట. దీని వల్ల శరీరం ఒకానొక మత్తు స్థితిలోకి జారుకుంటుంది. అందుకే శరీరానికి మంచిది అనే అపోహలో నీరు ఎడాపెడా తాగకూడదు. శరీరానికి సోడియం అవసరం చాలా ఉంది. ఇది శరీరంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెదడు, కండరాలు, నరాలు సరిగ్గా పనిచేయడానికి చాలా అవసరం. అలాంటి సోడియం శరీరంలో ద్రవాల సమతుల్యతను కూడా కాపాడుతుంది. కాబట్టి సోడియం స్థాయి తగ్గిపోతే శరీరం మత్తులోకి జారుతుంది. రక్తంలో సోడియం స్థాయిలు తగ్గిపోతే అది శరీరంపై ఇతర ప్రభావాలు కూడా చూపిస్తుంది. ముఖ్యంగా తలనొప్పి, తలతిరగటం, వాంతులు, అలసట వంటి సమస్యలే కాకుండా బలహీనత వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. నీటిని ఎక్కువ తాగడం వల్ల మెదడులో నరాలు ఒత్తిడికి లోనవుతాయి. ఇది మెదడు పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు మెదడు వాపు సమస్య కూడా వస్తుంది. మరికొన్ని సందర్భాలలో స్పృహ కోల్పోవడం, లేదా మూర్ఛ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఒక వ్యక్తి ఎంత నీరు తాగాలి అనేది.. వ్యక్తి వయసు, బరువు, చేసే పనులను బట్టి ఉంటుంది. అయితే సగటున పెద్దలకు రోజుకు 2 నుండి 3 లీటర్ల నీరు తాగడం మంచిది. నీరు బాగా తాగే వారిలో తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లడం, శరీరంలో వాపు కనిపించడం, ఎప్పుడూ తలనొప్పిగా ఉండటం, వంటి లక్షణాలు కనిపిస్తే అవన్నీ నీరు అధికంగా తాగడం వల్ల వచ్చే సమస్యలేనని అర్థం చేసుకోవాలని వైద్యులు అంటున్నారు. ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreనాలుగు కప్పుల కాఫీతో ఏం కాదెహే!
ప్రపంచంలో కాఫీ తాగే అలవాటు మొదలైన దగ్గర్నుంచీ... అది మంచిదా! కాదా! అనే వివాదం కూడా మొదలైంది. కాఫీ మంచిందంటూ ఒక పరిశోధన బయటకు వచ్చిన వెంటనే... కాఫీ తాగితే ఆరోగ్యం మీద ఆశ వదిలేసుకోవాలంటూ మరో పరిశోధన భయపెడుతుంది. ఈ వివాదానికి ముగింపు ఇచ్చేందుకు టెక్సాస్లోని ToxStrategies అనే సంస్థ నడుం బిగించింది. ఇంతకీ అదేం తేల్చిందంటే... ఇదీ లిమిట్ - 2001 నుంచి 2015 వరకూ కాఫీ మీద జరిగిన దాదాపు 700 పరిశోధనల ఫలితాలను ToxStrategies సేకరించింది. వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని... ఒక మోతాదు వరకు కాఫీ తాగితే అంత ప్రమాదం లేని తేల్చింది. రోజుకి దాదాపు 400 మిల్లీగ్రాముల వరకూ కెఫిన్ పుచ్చుకోవడం వల్ల వచ్చే నష్టేమమీ ఉండదట. ఇది దాదాపు నాలుగు కప్పుల కాఫీతో సమానం. గర్భిణీలూ పుచ్చుకోవచ్చు - ఇప్పటివరకూ గర్భిణీలు కాఫీకి వీలైనంద దూరంగా ఉండాలని హెచ్చరించేవారు. వారు కాఫీ తాగడం వల్ల అబార్షన్లు జరగే ప్రమాదం ఉందనీ, ఒకవేళ బిడ్డ పుట్టిన కూడా తక్కువ బరువుతోనో అవయవలోపంతోనో పుడతారనీ భయపెట్టేవారు. కానీ కాఫీ అలవాటు ఉండే గర్భిణీలు ఇక మీదట నోరు కట్టేసుకోవాల్సిన ఖర్మ పట్టలేదంటున్నారు. వారు 300 మిల్లీగ్రాములు కెఫిన్ లేదా మూడు కప్పుల కాఫీ తాగితే ఫర్వాలేదంటున్నారు. పిల్లలు అతి తక్కువగా - పిల్లలు మాత్రం కెఫిన్కి వీలైనంత దూరంగా ఉండక తప్పదని తేల్చారు. పిల్లలు బరువుండే ప్రతి కిలోకీ 2.5 మిల్లీగ్రాములకి మించి కెఫన్ పుచ్చుకోవద్దని అంటున్నారు. అంటే 20 కిలోలు ఉండే పిల్లవాడు రోజుకి 50 మి.గ్రాల మించి కెఫిన్ తీసుకోకూడదన్నమాట. మోతాదుతో ఉపయోగాలు – కాఫీని మోతాదులో పుచ్చుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయని ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే! కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్ల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, మెదడు చురుగ్గా పనిచేస్తుంది, లివర్ ఆరోగ్యంగా ఉంటుంది, టైప్ 2 డయాబెటిస్ అదుపులో ఉంటుంది, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు దరిచేరవు. కానీ మోతాదు దాటిని కెఫిన్ మాత్రం ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. నిద్రలేమి దగ్గర నుంచీ గుండెపోటు వరకు కెఫిన్తో నానారకాల సమస్యలూ మొదలవుతాయన్నది నిపుణుల హెచ్చరిక. చివరగా చిన్న మాట... కాఫీని మోతాదులో పుచ్చుకుంటే సురక్షితమే అని తేలడం మంచి విషయమే! కానీ ఇక్కడో చిన్న మెలిక ఉంది. మనం తీసుకునే కాఫీలో మాత్రమే కెఫిన్ ఉండదు. టీ, కూల్డ్రింక్స్, తలనొప్పి మాత్రలు, చాక్లెట్లు.. ఇలా బోలెడు పదార్థాలలో కెఫిన్ కనిపిస్తుంది. కాబట్టి ఒకోసారి మనకి తెలియకుండానే కెఫిన్ మోతాదుని దాటేసే ప్రమాదం ఉంది! అంచేత పరిశోధకులు నాలుగు కప్పుల కాఫీకి అనుమతిస్తే మనం రెండు కప్పులతోనే సరిపుచ్చుకోవడం మంచిది. పైగా కొందరి శరీర తత్వానికి కాఫీ అస్సలు సరిపడకపోవచ్చు. అలాంటివారు కాఫీకి దూరంగా ఉండాల్సిందే! - నిర్జర. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఅవగాహన లేకుండా విటమిన్-డి సప్లిమెంట్లు వాడటం ప్రమాదం..!
విటమిన్ డి ముందు వెనుకా ఆలోచించకుండా వేసుకునే మ్యాజిక్ పిల్ కాదు. కొంతమంది విటమిన్-డి లోపం గురించి తెలుసుకోకుండానే విటమిన్ డి పిల్స్ వేసుకుంటూ ఉంటారు. గత కొంతకాలంగా చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. నిద్రవేళలు పాటించకపోవడం, జీవనశైలి, వృత్తి సమయాల కారణంగా విటమిన్-డి లోపానికి గురవుతున్నారు. అయితే ఇప్పటి యూత్ మాత్రం ఏదైనా విటమిన్ లోపం ఏర్పడిందనే అనుమానం రాగానే ముందు వెనుకా ఆలోచించకుండా సప్లిమెంట్లు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే విటమిన్-డి పిల్స్ కూడా వాడుతుంటారు. అయితే ఇలా విటమిన్-డి కోసం సప్లిమెంట్లు వాడేవారు తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. పరిశోధనలు తేల్చిన కొన్ని నిజాలు తెలుసుకుంటే.. పరిశోధనల ప్రకారం ఇతర విటమిన్ల మాదిరిగా కాకుండా సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా విటమిన్ డి ని భర్తీ చేయకూడదు. విటమిన్-డి ని మన శరీరం తయారు చేస్తుంది. సాంకేతికంగా చెప్పాలంటే విటమిన్ డి విటమిన్ కాదు, ఒక హార్మోన్. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా విటమిన్ డి సప్లిమెంట్లను ఇచ్చే ముందు జాగ్రత్త వహించాలని అంటున్నారు. విటమిన్ డి అనేది సోషల్ మీడియాలో ఇది ఆరోగ్య మాత్రగా ప్రచారం చేయబడుతోంది. రెండవ ఆలోచన చేయకుండా చాలామంది విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకుంటారు. సూర్యరశ్మికి గురైన తర్వాత చర్మంలో విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. అప్పుడు కాలేయం, మూత్రపిండాలు దాని క్రియాశీల రూపంలోకి మారుస్తాయి. దీని తరువాత ఇది శరీరంలో వివిధ కార్యకలాపాలకు ఉపయోగించబడుతుంది. శరీరంలో విటమిన్ డి లోపం ఉందని మొదట వైద్యుడిని సంప్రదించాలి. కండరాల బలహీనత, శరీరంలో నొప్పి లేదా లేచి కూర్చోవడంలో ఇబ్బంది ఉంటే డాక్టర్ పరీక్షను సిఫార్సు చేస్తారు. పరీక్ష తర్వాత డాక్టర్ విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలని సలహా ఇస్తే, శరీరంలో విటమిన్ డి లోపం ఉందని తెలిస్తేనే ఈ సప్లిమెంట్లు తీసుకోవాలి. ముఖ్యంగా నవజాత శిశువులకు, 70-75 సంవత్సరాల వయసు పై బడిన వృద్దులకు విటమిన్-డి సప్లిమెంట్లు ఇవ్వవచ్చు. అంతేకానీ యూత్ వీటిని వాడటం మంచిది కాదు.
read moreమీకూ ఆఫీసులో నిద్ర ముంచుకొస్తుందా... అయితే ఇది తప్పక చదవాల్సిందే..
బాగా గమనిస్తే ఆఫీసులలో చాలా మంది నిద్రమత్తుతో ఉంటారు. ఇలాంటి సమస్యలతో మీరు కూడా ఇబ్బంది పడుతుంటే దీని గురించి కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే ఇది కేవలం మీ ఒక్కరి సమస్య కాదు. ఇది ఉద్యోగాలు చేస్తున్న జనాభాలో కనీసం 15శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్టు తెలిసింది. ఆఫీసులో నిద్రపోవడం కేవలం ఆఫీసులో తోటి ఉద్యోగస్తులు, బాస్ ముందు పరువు తీయడమే కాదు.. ఇది చెయ్యాల్సిన వర్క్ మీద కూడా గణనీయంగా ప్రభావం చూపిస్తుంది. అయితే ఆఫీసు వేళల్లో నిద్రపోవడానికి కారణం ఏమిటి? ఇలా ఎందుకు జరుగుతుంది తెలుసుకుంటే.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, పగటిపూట లేదా ఆఫీసులో నిద్రపోవడానికి ప్రధాన కారణం రాత్రి నిద్ర లేకపోవడమే. ప్రతి ఒక్కరికీ 6-8 గంటలు నిద్ర అవసరం. అంత సమయం నిద్రపోకపోతే, లేదా ఈ నిద్రాక్రమం అస్తవ్యస్తమైతే.. దీని కారణంగా పగటిపూట కూడా నిద్రపోయేలా అనిపించవచ్చు. అంతే కాకుండా కొన్ని ఆరోగ్య సమస్యల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొన్ని వ్యాధుల కారణంగా పగటిపూట ఎక్కువగా నిద్రపోవడం లేదా ఎక్కువగా పగటి సమయంలో నిద్రపోతుండటం జరుగుతుంది. కొన్ని శారీరక ఆరోగ్య పరిస్థితులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు దీనికి కారణమని భావించవచ్చు. డిప్రెషన్-ఆందోళన, స్కిజోఫ్రెనియా, లూపస్, పార్కిన్సన్స్ వ్యాధి, మల్టిపుల్ స్క్లెరోసిస్, హైపోథైరాయిడిజం మొదలైన వ్యాధుల ప్రమాదం ఇలా పగటి సమయంలో నిద్రపోవడం అనే ప్రక్రియ కారణమవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇవి రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. న్యూరోలాజికల్, న్యూరోడెజెనరేటివ్ వ్యాధులు.. నార్కోలెప్సీ వంటి నరాల సంబంధిత రుగ్మతలు ఉన్నప్పుడు పగటిపూట కూడా నిద్రపోవడం జరుగుతుంది. నార్కోలెప్సీలో మెదడు నిద్రమేల్కొనే చక్రాన్ని సరిగ్గా నియంత్రించలేకపోతుంది. నార్కోలెప్సీ ఉన్నవారు అధికంగా లేదా అకాల నిద్రపోవడానికి ఇదే కారణం. ఇది కాకుండా, వృద్ధులలో డిమెన్షియా లేదా పార్కిన్సన్స్ వ్యాధుల కారణంగా, పగటిపూట అధికంగా నిద్రపోయే సమస్య కూడా ఏర్పడుతుంది. ఆహారంలో ఆటంకాల వల్లా.. పగటిపూట నిద్రపోయే సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు మధ్యాహ్నం భారీ భోజనం తీసుకోవడం దీనికి ఒక కారణం. షుగర్ అధికంగా ఉన్న స్నాక్స్, సోడా, వైట్ బ్రెడ్, రైస్ వంటి కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల కూడా నిద్ర బాగా వస్తుంది. దీనికి పరిష్కారం కావాలంటే తేలికపాటి ఆహరం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన. పోషకమైన ఆహారాన్ని తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది నిద్రలేమిని తగ్గిస్తుంది. నిద్రను దూరం చేయడానికి ఏమి చేయాలంటే.. ఆఫీసులో పదే పదే నిద్రపోతున్నట్లు అనిపిస్తే దాన్ని వదిలించుకోవడానికి తక్కువ మొత్తంలో కెఫిన్తో కూడిన పదార్థాలు తీసుకోవచ్చు. కెఫీన్ మెదడు నాడీ వ్యవస్థలో కార్యకలాపాలను మెరుగుపరుస్తుంది. కాఫీ-టీ నిద్రను దూరం చేస్తుంది. ఇదిమాత్రమే కాకుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కూడా నిద్ర వస్తుంది. అందుకే పనిచేసే స్థలం నుండి అప్పుడప్పుడు లేచి తిరగడం వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది, శరీర నీరసం పోతుంది. నిద్ర కూడా నియంత్రణలో ఉంటుంది. *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreచలికాలంలో రోజుకు ఒక్క తమలపాకు తింటే ఏం జరుగుతుందంటే..!
తమలపాకుకు మన సంప్రదాయంలో, సంస్కృతిలో, ఆహారంలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. సాధారణంగా పూజలలో తమలపాకు అగ్రస్థానంలో ఉంటుంది. ఆ తరువాత పాన్, తాంబూలంలో వాడతారు. కానీ తమలపాకు ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చలికాలంలో సరైన పద్ధతిలో తీసుకుంటే ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. చలికాలంలో తమలపాకు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. తమలపాకు చలికాలంలో తినవచ్చా? చలికాలంలో తమలపాకు తినడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, ఎందుకంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచే స్వభావం కలిగి ఉంటుంది. . చలితో వచ్చే కఫం, దగ్గు, జలుబు వంటి సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎక్కువగా తినకూడదు. రోజుకు ఒక ఆకుకన్నా ఎక్కువ తీసుకుంటే దాని వేడి శక్తి వల్ల కడుపు మండడం, నోరు ఎండిపోవడం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఏ సమయంలో తినాలి? తమలపాకు తీసుకునే సమయం కూడా చాలా ముఖ్యం. ఉదయం భోజనం తరువాత లేదా సాయంత్రం భోజనం తరువాత.. ఈ రెండు సమయాల్లో ఏదైనా ఒకసారి తినడం ఉత్తమం. ఎందుకంటే భోజనం తర్వాత జీర్ణక్రియను సులభం చేస్తుంది. తిన్న వెంటనే కాదు భోజనం తర్వాత 10–15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. ఎలా తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే.. తమలపాకును తినే పద్ధతిని బట్టి దాని ప్రయోజనాలు ఉంటాయి. సాధారణ పద్ధతి.. ఒక తాజా తమలపాకు తీసుకుని, దానిపై చిన్నమొత్తం ఎలకులు పొడి లేదా సొంపు వేసి మెల్లగా నమిలాలి. ఇది జీర్ణక్రియకు సహాయం చేస్తుంది, నోరు తాజా వాసన ఇస్తుంది. దగ్గు లేదా చలి ఉన్నప్పుడు: ఒక తమలపాకును తేలికగా మంట మీద వేడి చేసి దానిపై కొంచెం తేనె రాసి తినండి. ఇది కఫం తగ్గిస్తుంది, గొంతు నొప్పి తగ్గిస్తుంది. జీర్ణక్రియ కోసం: తమలపాకు మీద కొంచెం చింతపండు, ఉప్పు వేసి నమిలితే, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తమలపాకు ఆరోగ్య ప్రయోజనాలు భోజనం తర్వాత తీసుకుంటే గ్యాస్, బరువుగా ఉండటం తగ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తేనెతో కలిపి తింటే గొంతు సమస్యలు తగ్గుతాయి.కఫం, దగ్గు నియంత్రణ అవుతుంది. నోటి దుర్వాసన తగ్గిస్తుంది ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్ గా పని చేస్తుంది. చలికాలంలో వేడి శక్తి ఇస్తుంది. శరీరానికి తాపాన్ని అందిస్తుంది. తమలపాకులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇమ్యునిటీ పెంచుతుంది. చిన్న రక్తనాళాలను శుభ్రం చేస్తుంది. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది తినటంతో పాటు తమలపాకు నూనెతో మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది. జాగ్రత్తలు.. ఎక్కువగా తింటే కడుపు మండడం లేదా నోరు ఎండిపోవడం జరుగుతుంది. చలికాలంలో రోజుకు ఒక ఆకుకంటే ఎక్కువ కాదు. సున్నం లేదా సుపారితో తినడం మాత్రం వద్దు.. అవి ఆరోగ్యానికి హానికరం. గర్భిణీ స్త్రీలు లేదా గుండె, రక్తపోటు సమస్యలున్నవారు తీసుకునే ముందు వైద్యుని సలహా తీసుకోవాలి. *రూపశ్రీ.
read moreతక్కువ సమయంలో బరువు తగ్గాలని అనుకునేవారికి బెస్ట్ టిప్స్ ఇదిగో..!
మనం ఏమి చేసినా అది మన ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మన ఆహారపు అలవాట్ల నుండి మన జీవనశైలి వరకు.. ఉదయం నిద్రలేచిన తర్వాత మనం చేసే ప్రతి పనీ మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మనం మంచి అలవాట్లను అలవర్చుకుంటే, శరీరం, మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం పూట పాటించే అలవాట్లు బరువు మీద చాలా ప్రభావం చూపిస్తాయి. కొంతమంది బరువు తగ్గడానికి ట్రై చేస్తుంటారు. బరువు తగ్గాలనుకుంటే ఉదయం నిద్రలేచిన తర్వాత కొన్ని అలవాట్లను అలవర్చుకోవడం వల్ల అనుకున్నది సాధించగలుగుతారు. అలవాట్లలో చిన్న మార్పులే మంచి ఫలితాలు ఇస్తాయి. త్వరగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. బరువు తగ్గడానికి సులభంగా అలవాటు చేసుకోగల అలవాట్లు ఏంటంటే.. ఉదయం నిద్రలేచని తర్వాత గోరువెచ్చని నీరు త్రాగాలి. ఇది మరింత ప్రభావవంతంగా పని చేయడానికి, నిమ్మరసం జోడించవచ్చు. గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. కాబట్టి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవచ్చు. క్రమం తప్పకుండా వేగంగా వాకింగ్ చేయాలి. నడక ద్వారా బరువును తగ్గించుకోవచ్చు. అయితే క్రమశిక్షణ చాలా అవసరం. ఏదో చెస్తున్నాం అంటే చేస్తున్నాం అన్నట్టు కాకుండా జాగ్రత్త పడాలి. నడకను మరింత ప్రభావవంతంగా చేయడానికి, నడక వేగాన్ని గంటకు 6 కిలోమీటర్లుగా ఉండేలా చూసుకోవాలి. ఉదయం అల్పాహారం ప్రభావవంతంగా, సులభంగా జీర్ణమయ్యేలా ఉండాలి. అల్పాహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అల్పాహారం కోసం ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. చక్కెర వీలైనంత వరకు మానేయడం మంచిది. బరువు పెరగడానికి అతిపెద్ద కారణమైన జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. ఉదయం ఎండలో కొంత సమయం గడపాలి. లేదా 10-15 నిమిషాలు బయట కూర్చోవాలి.. ఉదయం సూర్యకిరణాల నుండి లభించే విటమిన్ డి ఎముకలకు చాలా బలంగా ఉంచుతుంది. రోజంతా కనీసం నాలుగు లీటర్ల నీరు త్రాగాలి. శరీరం హైడ్రేటెడ్గా ఉండటానికి నిరంతరం నీరు త్రాగుతూ ఉండాలి. ఉదయాన్నే నిద్రలేవాలి. ఇది చెప్పడం సులభం, చేయడం కష్టంగా అనిపిస్తుంది. కానీ ఒకసారి ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకుంటే ఇక వెనక్కి తిరిగి చూడరు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల తగినంత సమయం లభిస్తుంది. ఈ సమయంలో శ్రద్దగా అన్ని పనులు చేయవచ్చు. ఇది మీ రోజంతా తాజాగా, సంతోషంగా గడిచిపోయేలా చేస్తుంది. ఈ సమయంలో జాగింగ్ లేదా రన్నింగ్ కోసం సమయం కేటాయించవచ్చు. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. హాయిగా నిద్రపోవాలి. 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకవాలి. ఒత్తిడి లేని జీవితాన్ని గడపాలి. నిద్రను పూర్తిగా జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత, ఎందుకంటే సమయానికి నిద్రపోకపోవడం వల్ల ఉదయం త్వరగా లేవలేము. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం , తక్కువ నిద్రపోవడం అస్సలు నిద్రపోకపోవడం వల్ల మానసిక ఒత్తిడి కూడా వస్తుంది. ఇది కూడా బరువు పెరగడానికి దారితీస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreనానబెట్టిన ఖర్జూరం తింటే కలిగే లాభాలేంటో తెలుసా?
ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ లో ఒక భాగం. ఇవి తక్షణ శక్తిని ఇస్తాయి. ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస సమయంలో ఖర్జూరం తినడం తోనే ఆ రోజు ఉపవాసాన్ని విరమిస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరాలు ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలు చేకూరుస్తాయి. ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన 2 ఖర్జూరాలు తింటూ ఉంటే కలిగే మ్యాజిక్ ఫలితాలేంటో తెలుసుకుంటే తప్పకుండా ప్రతిరోజూ ఖర్జూరాలు తినడం మొదలుపెడతారు.. ఫైబర్.. నానబెట్టిన ఖర్జూరంలో అధికమొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలంగా మారుస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎనర్జీ.. నానబెట్టిన ఖర్జూరాలను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల శరీరానికి గొప్ప శక్తి అందుతుంది. ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించేందుకు తోడ్పడుతుంది. రోజంతా చురుగ్గా ఉండాల్సి న వ్యక్తులు నానబెట్టిన ఖర్జూరం తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. స్కిన్.. చర్మం ఆరోగ్యం మీద దృష్టి ఉన్నవారు నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా అవసరం. ఎందుకంటే నానబెట్టిన ఖర్జూరం చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఖర్జూరంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె.. ఖర్జూరంలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తింటే చాలా మంచిది. ఎముకలు.. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం, విటమిన్లు మంచి మొత్తంలో ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. ఎముకలు బలహీనంగా ఉన్నవారు ఉదయాన్నే నానబెట్టిన ఖర్జూరం తినడం చాలా మంచిది. మధుమేహం.. ఖర్జూరం తీపి ఎక్కువగా ఉన్నా నానబెట్టిన తరువాత వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది. ఈ కారణంగా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకునే వారు నానబెట్టిన ఖర్జూరం తింటే చక్కెర స్థాయిలు ఆరోగ్యంగానే ఉంటాయి. రక్తహీనత.. భారతదేశంలో ఎక్కువ మంది మహిళలు రక్తహీనత తో బాధపడుతున్నారు. ఖర్జూరంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల నానబెట్టిన ఖర్జూరాలు రోజూ ఉదయమే తింటూ ఉంటే హిమోగ్లోబిన్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. ఒత్తిడి.. ఖర్జూరాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఒత్తిడితో పోరాడేవారు రోజూ ఉదయం నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఒత్తిడి తగ్గుతుంది. తల్లిపాలు.. పరిశోధనల ప్రకారం పిల్లలకు పాలిచ్చే తల్లులు ఉదయాన్నే నానబెట్తిన ఖర్జూరం తింటూ ఉంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read more


.webp)
.webp)




.webp)
.webp)
.webp)

.webp)

.webp)


.webp)
.webp)
.webp)

.webp)
