ధరచూసి భయపడతాం కానీ కివిని రెగ్యులర్ గా తింటే కలిగే లాభాలివే!
ప్రతిరోజూ ఆహారంలో పండ్లు తీసుకోవడం చాలా మంచిదని దీనివల్ల ఆరోగ్యానికి ఢోకా ఉండదని అంటారు. అయితే పండ్లలో కొన్ని ఖరీదైనవి ఉంటాయి, మరికొన్ని తక్కువ ధరకే లభ్యమయ్యేవి ఉంటాయి. ధర విషయం పక్కన పెడితే ప్రతి పండుకూ దాని ప్రత్యేకత ఉంటుంది. చాలా మంది కివి పేరు చెబితే అధిక ధర అంటూ బ్యాక్ స్టెప్ వేస్తుంటారు. కానీ ధర అయినా సరే కివి పండును ఆహారంలో భాగం చేసుకుంటూ మాత్రం హాస్పిలట్స్ లో పోసే వందలు, వేల ఖర్చు ఈజీగా తగ్గినట్టేనట. కివి పండును ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలపడటంతో పాటు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ కేలరీలతో, ఫైబర్ పుష్కలంగా ఉండే కివి పండులో డైజెస్టివ్ ఎంజైమ్ లు అయిన వియమిన్-సి ఉంటుంది. ఇది బరువు తగ్గడం నుండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కివి పండు రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోగనిరోధక శక్తి.. కివి పండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. రోజూవారీ వ్యక్తికి కావలసిన విటమిన్-సి లో 80శాతం వరకు కివి పండు నుండే పొందవచ్చు. విటమిన్-సి శరీరంలో గొప్ప యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఆక్సీకరణ నష్టం నుండి కణాలను రక్షిస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థను ఏర్పరిచి అంటు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొటాషియం మెండు.. గుండె, మూత్రపిండాలు, కండరాలు, నరాలు సక్రమంగా పనిచేయాలంటే పొటాషియం చాలా అవసరం. ఒక కివి పండులో సుమారు 215మిగ్రా ల పొటాషియం ఉంటుంది. కివిని తీసుకోవడం వల్ల శరీరానికి కావలసింత పొటాషియం లభిస్తుంది. ఇది అధిక రక్తపోటు, స్ట్రోక్, గుండె సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాదు మూత్రపిండాల్లో రాళ్లు, బోలు ఎముకల వ్యాధి నుండి కాపాడుతుంది. రక్తం గడ్డకట్టే పనికి చెక్.. సాధారణంగా దిగువ సిరల్లో రక్తం గడ్డ కట్టే సమస్య ఏర్పడుతుంది. ఇది మెదడులో రక్తప్రసరణకు అంతరాయం కలిగిస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలకు కూడా దారితీస్తుంది. కివి రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గించడం ద్వారా రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. కివి పండ్లలో ఆహారంలో తీసుకుంటూ ఉంటే రక్తంలో కొవ్వు కరిగిపోయి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్ట్రోక్ సమస్యను కూడా తగ్గిస్తుంది. జీర్ణఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. కివిలో కరిగే ఫైబర్స్, కరగని పైబర్స్ రెండూ ఉంటాయి. ఇందులో మూడు వంతులు కరిగే ఫైబర్, రెండు వంతుల కరగని పైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటు గుండె, జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కివిలో ఉండే ఫైబర్ మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. *నిశ్శబ్ద.
read moreఅన్నం, చపాతీ.. రెండు కలిపి తినడం మంచిదేనా?
భారతీయులు ఆహార ప్రియులు. భారతీయుల భోజనంలో చాలా రకాలు పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా చాలామంది తమ భోజనంలో కొంచెం అన్నం చపాతీ, రెండు లేదా మూడు రకాల కూరలు.. ఇలా ఉండేలా చూసుకుంటారు. అయితే ఒకే భోజనంలో చపాతీ, అన్నం రెండూ తినడం మంచిదేనా అని కొందరి అనుమానం. నిజానికి నేటికాలంలో హోటళ్లలో కూడా ఇలాంటి మెనూనే లంచ్ లో ఇస్తంటారు. అయితే రెండూ తినడం ఎంత వరకు మంచిది? తెలుసుకుంటే.. బోజనంలో చపాతీ, అన్నం రెండూ కలిపి తినడం అనేది పూర్తీగా వ్యక్తి శారీరక స్థితి మీద ఆధారపడి ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు. కానీ స్పష్టంగా చెప్పాలంటే మాత్రం చపాతీ, అన్నం రెండూ భోజనంలో తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచి ఛాయిస్ కాదని అంటున్నారు. ఒక్క చపాతీ, ఒక కప్పు అన్నం.. ఇది చాలా మంది ఎంచుకునే అలవాటు. దీన్ని చాలా ఇష్టంగా ఎంచుకుంటారు. పైగా దీన్ని చాలా బాలెన్స్డ్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. కానీ చపాతీ, అన్నం.. రెండూ భోజనంలో తీసుకోవడం అయితే అస్సలు మంచిది కాదట. చపాతీలోనూ, అన్నంలోనూ.. రెండింటిలోనూ కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. రెండూ భోజనంలో తినడం వల్ల కార్బోహైడ్రేట్లు అధికంగా శరీరానికి అందుతాయి. తద్వారా కేలరీలు కూడా ఎక్కువ తీసుకున్నట్టు అవుతుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మరీ ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు అన్నం అవాయిడ్ చేసే చర్యలో భాగంగా కొంచెం అన్నం, చపాతీ అని తమ లంచ్ ప్లాన్ చేసుకుంటారు. కానీ ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. అందుకే ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు తినకూడదు. ప్రతి ఆహార పదార్థంలో ఉండే కార్బోహైడ్రేట్లకు విభిన్నమైన శైలి ఉంటుంది. గోధుమలలో ఉండే కార్బోహైడ్రేట్స్ వేరు, అన్నంలో ఉండే కార్బోహేడ్రేట్స్ వేరు.. ఈ రెండింటికి విడివిడిగా తీసుకున్నప్పుడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ కలిపి తీసుకున్నప్పుడు జీర్ణం కావడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే ఈ కాంబినేషన్ తినడం మంచిది కాదు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreప్రేగు ఆరోగ్యం బాగలేకుంటే కనిపించే లక్షణాలు ఇవీ.. మీకు ఉన్నాయేమో చెక్ చేసుకోండి..!
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. అయితే శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం ప్రేగులలోనే జీర్ణం అవుతుంది. కానీ నేటికాలంలో చాలామంది పేగు ఆరోగ్యం దెబ్బతినడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా నేటికాలంలో ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు తాగడం వల్ల పేగు ఆరోగ్యం దెబ్బతింటుంది. శరీరంలో కొన్ని లక్షణాలను బట్టి ప్రేగు ఆరోగ్యం బాగుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే ప్రేగు ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా పేగులలోనే తయారవుతుంది. పేగు ఆరోగ్యం దెబ్బతింటే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా తయారవదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రేగు ఆరోగ్యం దెబ్బతింటే జీర్ణక్రియ నుండి రోగ నిరోధక శక్తి దెబ్బతినడం వరకు చాలా రకాల సమస్యలు వస్తాయి. తరచుగా ఉబ్బరం, కడుపులో గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు వస్తుంటే ప్రేగు ఆరోగ్యం దెబ్బతినిందని, ప్రేగు సమస్యలు ఉన్నాయని అర్థం. గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత ఏర్పడినప్పుడు ఆహారం సరిగా జీర్ణం కాదు. దీని వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడటం, కడుపు ఉబ్బరంగా మారడం, పొట్ట బరువుగా ఉండటం జరుగుతుంది. తరచుగా మలబద్దకం లేదా విరేచనాలు వంటి సమస్యలు వస్తున్నా కూడా ప్రేగు ఆరోగ్యం దెబ్బతిన్నదని అర్థం. ప్రేగు ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల పోషకాలు సరిగా గ్రహించబడవు. ఇది తరచుగా అలసటకు దారితీస్తుంది. ఎంత మంచి ఆహారం తీసుకున్నా శరీరం శక్తివంతంగా ఉండదు. శరీరంలో దాదాపు 70శాతం రోగనిరోధక వ్యవస్థ పేగు ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రేగు సమస్యలు వస్తే రోగనిరోధక శక్తి కూడా బలహీనంగా ఉండటం, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను కూడా శరీరం భరించలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. గట్ మైక్రోబయోమ్ అసమతుల్యత కావడం వల్ల జీవక్రియ కూడా ప్రభావితం అవుతుంది. ఇది బరువు పెరగడానికి అయినా కారణం కావచ్చు, లేదంటే బరువు తగ్గడానికి అయినా కారణం కావచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreదాల్చిన చెక్క కొనే ముందు ఈ తప్పు చేయకండి.. చాలా నష్టపోతారు..!
వంటింట్లో సుగంధ ద్రవ్యాలు చాలా ఉంటాయి. ఇవి అటు వంటలను ఘుమఘుమలాడించడమే కాకుండా.. ఇటు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలామంది రక్తంలో చక్కెర నియంత్రణకు, ఇన్సులిన్ నిరోధకతకు పిసిఏస్ లేదా జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం దాల్చిన చెక్కను ఉపయోగిస్తారు. అయితే దాల్చిన చెక్క కొనేముందు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తప్పుగా ఉన్న దాల్చిన చెక్కను కొనుగోలు చేయడం, దాన్ని వినియోగించడం వల్ల ప్రయోజనం చేకూరడానికి బదులు, హాని జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు క్వాలిటీ ఉన్న దాల్చిన చెక్కను ఎలా గుర్తించాలి? దాల్చిన చెక్కలో రకాలేంటి? వీటి గురించి వివరాలు తెలుసుకుంటే.. సిలోన్ సిన్నమోన్.. సిలోన్ సిన్నమోన్ ను నిజమైన దాల్చిన చెక్క అని కూడా పిలుస్తారు. ఇది ప్రధానంగా శ్రీలంక నుండి వస్తుంది. ఇది సహజంగానే చాలా తక్కువ మొత్తంలో 'కూమరిన్' కలిగి ఉంటుంది. ఇది దీర్ఘకాలిక రోజువారీ ఉపయోగం కోసం సురక్షితమైనదని చెబుతారు. సిలోన్ దాల్చిన చెక్క సారం పై చేసిన అధ్యయనాలు ఇది ఆహారం తీసుకోవడానికి ముందు రక్తంలో చక్కెర స్థాయిలను, ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని చూపించాయి . కాసియా సిన్నమోన్.. ఇది మార్కెట్లో లభించే అత్యంత సాధారణ దాల్చిన చెక్క. ఇందులో చాలా ఎక్కువ స్థాయిలో కూమరిన్ ఉంటుంది. దీన్ని అప్పుడప్పుడు మీ ఆహారంలో రుచి కోసం చేర్చుకుంటే పర్వాలేదు. కానీ ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రతి రోజు పెద్ద పరిమాణంలో తీసుకుంటే అది కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని చెబుతున్నారు. ఇది గుర్తుంచుకోవాలి.. దాల్చిన చెక్కను దాని రుచి, సువాసన కోసం మాత్రమే ఉపయోగిస్తుంటే ఏ రకమైన దాల్చిన చెక్కనైనా వాడవచ్చు, కానీ దాల్చిన చెక్కను రోజువారీ ఆరోగ్య దినచర్యలో భాగం చేసుకుంటూ ఉంటే సిలోన్ దాల్చిన చెక్కను ఎంచుకోవడం మంచిది. సిలోన్ దాల్చిన చెక్క ఎలా గుర్తించాలి.. దుకాణంలో నిజమైన దాల్చిన చెక్కను గుర్తించడానికి, ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. సిలోన్ దాల్చిన చెక్క.. దీని బెరడు మడతపెట్టిన కాగితంలాగా సన్నగా, మృదువుగా, బహుళ పొరలుగా ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే చుట్టలాగా ఉంటుంది. లోపల పొరలుగా కనిపిస్తూ ఉంటుంది. కాసియా దాల్చిన చెక్క.. కాసియా దాల్చిన చెక్క మందంగా, గట్టిగా, కలపతో లాగా ఉంటుంది. దీనికి ఒకే పొర ఉంటుంది. పొడి కొనుగోలు చేస్తే.. దాల్చిన చెక్కను కొనుగోలు చేస్తే.. సిలోన్ దాల్చిన చెక్కను, కాసియా దాల్చిన చెక్కను వాటి ఆకృతిని చూసి గుర్తించవచ్చు. కానీ పొడి కొనుగోలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్యాకేజీపై ఉన్న లేబుల్ను తప్పకుండా చదవండి. దానిపై 'సిలోన్ దాల్చిన చెక్క' లేదా 'సిన్నమోమమ్ వెరం' అని రాసి ఉండాలి. అలాంటి దాల్చిన చెక్క పొడినే కొనుగోలు చేయాలి. *రూపశ్రీ.
read moreఫ్రోజెన్ బఠానీలు తింటున్నారా? ఇవి తినడం మంచిదా కాదా? అసలు నిజాలివి..!
శీతాకాలంలో మార్కెట్ లో పచ్చి బఠానీలు అందుబాటులోకి వస్తాయి. భారతీయ కూరలు, మసాలా రైస్, వెజిటబుల్ రైస్, కూరగాయలు అన్నీ కలిపి వండే కూరలు, గ్రేవీలు, సూపుల నుండి స్నాక్స్ వరకు బఠానీలు ప్రతి వంటకం రుచిని పెంచుతాయి. కానీ శీతాకాలం ముగియగానే తాజా పచ్చి బఠానీలు మార్కెట్ లో కనిపించవు. ఇలాంటి సందర్భాలలో ప్రజలు తెలివిగా ఆలోచిస్తారు. డీప్ ఫ్రిజ్ లో ఫ్రీజ్ చేసిన బఠానీలను ఆశ్రయిస్తారు. వీటినే ఫ్రోజెన్ బఠానీలు అని అంటారు. అయితే, చాలా మంది ఫ్రోజెన్ బఠానీలు ఆరోగ్యానికి మంచివా కాదా అనే విషయం ఆలోచించరు. అలాగే తాజా బఠానీల లాగా ఫ్రోజెన్ బఠానీలు ప్రయోజనకరంగా ఉంటాయా లేదా అని కూడా తెలుసుకోరు. కానీ ఆరోగ్యం మీద స్పృహ ఉన్న కొద్దిమంది మాత్రం ఫ్రోజెన్ బఠానీ ల గురించి అయోమయంలో ఉంటారు. అసలు ఫ్రోజెన్ బఠానీలు పచ్చి బఠానీలలాగా ఆరోగ్యానికి మేలు చేస్తాయా? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. బఠానీలలో పోషకాలు.. శాకాహారులకు పచ్చి బఠానీలు ప్రోటీన్ పరంగా అద్భుతమైన వనరు. వాటిలో ప్రోటీన్తో పాటు అనేక ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం సాధారణ ఆహారంలో బఠానీలను చేర్చుకోవడం వల్ల పోషకాహార లోపాలను అధిగమించవచ్చు. అందుకే సీజన్ ముగిసిన తర్వాత ఫ్రోజెన్ బఠానీలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఫ్రోజెన్ బఠానీ ప్రాసెస్.. ఫ్రోజెన్ బఠానీలు పూర్తిగా పండినప్పుడు వాటిని సేకరిస్తారు. వాటిని దాదాపు -18 డిగ్రీల సెల్సియస్ వద్ద స్తంభింపజేస్తారు. ఈ తక్కువ ఉష్ణోగ్రత వద్ద వాటిని నిల్వ చేయడం వల్ల సూక్ష్మజీవుల పెరుగుదల లేదా జీవసంబంధమైన మార్పులు నిరోధించబడతాయి, అవి ఎక్కువ కాలం పచ్చి బఠానీల లాగా ఉంటాయి. ఆరోగ్యపరంగా.. ఫ్రోజెన్ బఠానీలు అనారోగ్యకరమైనవని, అనారోగ్యానికి కారణమవుతాయని ప్రజలు తరచుగా అనుకుంటారు. అయితే నిపుణులు దీనిని తోసిపుచ్చుతున్నారు. ఫ్రోజెన్ బఠానీలు తాజా పచ్చి బఠానీల మాదిరిగానే ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయని పోషకాహార నిపుణులు అంటున్నారు. తాజా బఠానీ, ఫ్రోజెన్ బఠానీ మధ్య తేడా.. నిపుణుల అభిప్రాయం ప్రకారం తాజా బఠానీలు, ఫ్రోజెన్ బఠానీల పోషక విలువలో గణనీయమైన తేడా లేదు. ఒక అధ్యయనం రెండు సంవత్సరాల పాటు బఠానీలతో సహా తాజా, ఫ్రోజెన్ కూరగాయలను పోల్చింది. ఈ అధ్యయనంలో రెండింటి పోషక విలువలు దాదాపు ఒకేలా ఉన్నాయని తేలింది. ఇంకా, అనేక ఇతర అధ్యయనాలు కూడా ఘనీభవించిన కూరగాయలు తాజా కూరగాయల మాదిరిగానే ప్రయోజనకరంగా ఉంటాయని చూపించాయి. ఫ్రిజర్వేటివ్స్.. కొంతమంది ఫ్రోజెన్ బఠానీల లైఫ్ స్పాన్ పెంచడానికి వాటికి ప్రిజర్వేటివ్లు లేదా రసాయనాలు కలుపుతారని అనుకుంటారు. అయితే, పోషకాహార నిపుణులు ఇది నిజం కాదని చెబుతున్నారు. -18 డిగ్రీల సెల్సియస్ వద్ద బఠానీలను గడ్డకట్టించడం వల్ల అవి సురక్షితంగా ఉంటాయి. దీనికోసం రసాయనాలు అవసరం లేదు. అయితే, తాజా, ఫ్రోజెన్ బఠానీల మధ్య రుచిలో మాత్రం తేడా ఉంటుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreనిలబడి నీరు తాగుతున్నారా?ఈ షాకింగ్ నిజాలు తెలిస్తే అవాక్కవుతారు..!
నేటి వేగవంతమైన జీవితంలో, మనం చిన్న చిన్న అలవాట్ల విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు . కామన్ గా ఆఫీసులో, ఇంట్లో లేదా బయటకు వెళ్లినప్పుడు నిలబడి నీరు తాగుతుంటారు. దీని వల్ల ఏం జురుగుతుందనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఇదేం చెడ్డ అలవాటు కాదులే అనుకుంటారు చాలామంది. కానీ ఆయుర్వేదం మాత్రం ఇది చాలా చెడ్డ అలవాటు అంటోంది. శరీరానికి నీరు ఎంత ముఖ్యమైనదో.. నీరు తాగే పద్దతి కూడా అంతే ముఖ్యమని ఆయుర్వేదం చెబుతుంది. నిలబడి నీరు త్రాగడం క్రమంగా శరీరానికి హాని కలిగిస్తుందట. దీని గురించి పూర్తీ విషయాలు తెలుసుకుంటే.. కూర్చుని నీరు తాగితే.. కూర్చుని సౌకర్యవంతంగా నీరు త్రాగినప్పుడు శరీరం దానిని నెమ్మదిగా గ్రహించడానికి సమయం ఉంటుంది. అయితే నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు వేగంగా గ్రహించబడుతుంది. శరీరం దానిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇది క్రమంగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఆయుర్వేదం ప్రకారం నిలబడి నీరు త్రాగడం వల్ల శరీరంలోని నీటి సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల నీరు సరిగ్గా ఉపయోగించబడకుండా కీళ్ళు, మోకాళ్ల చుట్టూ పేరుకుపోతుంది, దీని వలన చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు,బిగుసుకుపోవడం, కీళ్ల సమస్యలు వస్తాయి. కూర్చిని నీరు తాగితే జరిగేది ఇదే.. కూర్చుని నీరు త్రాగినప్పుడు శరీరం దానిని ఫిల్టర్ చేసి, తరువాత దానిని మూత్రపిండాలకు పంపిస్తుంది. అయితే, నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు ఫిల్టర్ చేయకుండానే మూత్రపిండాలకు చేరుతుంది, వాటిపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఇలా ఎక్కువసేపు చేయడం వల్ల మూత్రపిండాల సమస్యలు వస్తాయి. నిలబడి నీరు తాగితే.. నిలబడి నీరు త్రాగడం వల్ల నీరు కడుపులోకి వేగంగా చేరుతుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది గ్యాస్, ఆమ్లత్వం, గుండెల్లో మంట, మలబద్ధకం, బరువు తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో జరిగే మార్పు.. శరీరం నీటిని సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు, అది శరీర శక్తిని, బలాన్ని ప్రభావితం చేస్తుంది. ఎక్కువ పని లేకపోయినా అలసిపోయి, నీరసంగా ఉన్నట్టు అనిపించవచ్చు. అందుకే ఇలా చేయాలి.. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నీరు త్రాగేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. ఎల్లప్పుడూ హాయిగా కూర్చుని నీరు త్రాగాలి, అది కూడా నెమ్మదిగా సిప్ బై సిప్ త్రాగాలి, తొందర తొందరగా నీరు తాగకూడదు. చాలా చల్లటి నీరు కూడా తాగకుండా ఉండటం మంచిది. గది ఉష్ణోగ్రతలో ఉన్న నీరు మంచిది, గోరు వెచ్చగా ఉన్న నీరు మంచిది. గాజు లేదా మట్టి కుండలో నిల్వ చేసిన నీటిని త్రాగడం శ్రేష్టం. ప్లాస్టిక్ బాటిళ్లలో నీటిని తాగడం మంచిది కాదు. *రూపశ్రీ.
read moreరోజూ చేసే ఈ చిన్న తప్పులే డయాబెటిస్ రావడానికి కారణం అవుతాయి..!
డయాబెటిస్ చాలామందిని కుదిపేస్తున్న సమస్య. ఒకప్పుడు 60ఏళ్ళు దాటిన వృద్దులలో డయాబెటిస్ కనిపించేది. కానీ నేటి కాలంలో మాత్రం 30 ఏళ్లు కూడా నిండకనే డయాబెటిస్ బారిన పడుతున్నారు. మరీ దారుణం ఏమిటంటే.. చిన్న పిల్లలలో కూడా డయాబెటిస్ సమస్య ఉంటోంది. అయితే రోజువారీ జీవితంలో చేసే చిన్న తప్పులే డయాబెటిస్ రావడానికి కారణం అవుతున్నాయని ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు అంటున్నారు. ఇంతకీ డయాబెటిస్ రావడానికి రోజువారీ జీవితంలో చేస్తున్న తప్పులేంటి? తెలుసుకుంటే.. జన్యు సమస్య కాదు.. డయాబెటిస్ అనేది తల్లిదండ్రుల నుండి వస్తుందని చాలా మంది అనుకుంటారు. దీన్ని జన్యు పరమైన సమస్యగా చెబుతారు. అయితే డయాబెటిస్ ఎక్కువగా ఆధునిక జీవనసైలి, ఆహారం, శరీరానికి కష్టం లేకపోవడం వంటి అలవాట్ల వల్ల వస్తోంది. ప్రాచీన ఆయుర్వేదం ఏం చెప్పిందంటే.. ప్రాచీన భారతీయ గ్రంథాలు అయిన చరక సంహితలో చరకాచార్యుడు డయాబెటిస్ ను మధుమేహం గా వివరించాడు. మూత్రంలో తీపి రుచి ఉండటం ద్వారా దీన్ని గుర్తించారట. సుశ్రుత సంహితలో సుశ్రుతుడు 20రకాల మధుమేహాలను చెప్పి వీటి లక్షణాలు, కారణాలు, చికిత్సలను కూడా తెలిపాడు. పై విషయాలను బట్టి చూస్తే.. మధుమేహం అనేది పూర్వ కాలం నుండే ఉన్నా.. అది నేటికాలంలో మనుషుల జీవితాలను చాలా ప్రభావితం చేస్తోంది. ఇన్సులిన్ వ్యవస్థ.. శరీరంలో ఇన్సులిన్ వ్యవస్థ ఉంటుంది. ఈ వ్యవస్థను పాడు చేసే చిన్న చిన్న అలవాట్లు ఉంటాయి. వీటిని చాలా వరకు ఎంతోమంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఇది డయాబెటిస్ రావడానికి కారణం అవుతుంది. అల్పాహారం.. అల్పాహారాన్ని దాటవేడయం వల్ల శరీరంలో ఇన్సులిన్ ప్రతిస్పందనకు అంతరాయం కలుగుతుంది. బోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది క్రమంగా డయాబెటిస్ కు దారితీస్తుంది. ఎక్కువ సేపు కూర్చోవడం.. ఒకప్పుడు బాగా పని చేసి.. అలసిపోయినప్పుడు కొద్దిసేపు కూర్చొనేవారు. కానీ నేటికాలంలో ఆఫీసులలో గంటలు గంటలు కూర్చుని పనిచేయడం.. నాలుగు గంటలకు ఒకసారి బ్రేక్ పేరుతో కొద్దిసేపు లేచి తిరగడం చేస్తున్నారు. దీని వల్ల శరీర కణాలు ఇన్సులిన్ కు సున్నితంగా మారిపోతాయి. శరీరం గ్లూకోజ్ శోషణను ఇది నెమ్మదిస్తుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ పేరుకోవడానికి దారి తీస్తుంది. ఆలస్యంగా, భారీగా తినడం.. రాత్రి భోజనం ఎప్పుడూ 7 లేదా 8 గంటల లోపు తినాలని చెబుతుంటారు. గూట్లో దీపం నోట్లో ముద్ద అన్నారు పెద్దలు. అంటే సాయంత్రం ఇంట్లో దీపం వేయడం, రాత్రి ఆహారం తీసుకోవడం ఒకేసారి జరగాలని దీని ఉద్దేశ్యం. అంతలోపు తీసుకోకపోయినా కనీసం 7 నుండి 8 లోపు తీసుకోవాలి. కానీ ఆలస్యంగా 10 గంటలకు పైన లేదా 11 గంటలకు పైన తినడం, అది కూడా చాలా భారీగా తినడం చేస్తుంటారు. ఈ అలవాటు కొన్ని నెలలు, ఏళ్ల పాటు కొనసాగితే డయాబెటిస్ పక్కాగా వస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreశరీరాన్ని ఉక్కులా మార్చే ఆహార కాంబినేషన్లు..!
శరీరాన్ని ఉక్కులా మార్చే ఆహార కాంబినేషన్లు..! ఆహారం శరీరానికి చాలా ముఖ్యమైనది. శరీరానికి అన్ని పోషకాలు లభించాలంటే ఆయా పోషకాలు సమృద్దిగా ఉన్న ఆహారాలు తినాలని చెబుతారు పెద్దలు, వైద్యులు. అయితే కొన్ని రకాల ఆహారాలు ఎంత తిన్నా వాటిలోని పోషకాలు శరీరానికి అందవు, ఎంత తిన్నా ఏం మార్పు లేదని చాలామంది కన్ప్యూజన్ అవుతుంటారు. అయితే ఆహారాల కాంబినేషన్ లు మ్యాజిక్ చేస్తాయి. ఆహారంలో లభించే పోషకాల సినర్జిస్టిక్ ప్రభావం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మల్టీవిటమిన్లు సహజంగా మొత్తం ఆహారాలలో కనిపిస్తాయి. విటమిన్లు, ఖనిజాలతో పాటు, అవి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. ఫైబర్.. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది, ఇది శరీరంలోకి పోషకాలను నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఎంజైమ్లు.. పోషకాలను విచ్ఛిన్నం చేసి నిర్దిష్ట మూలకాలను సక్రియం చేస్తాయి. ఫైటోకెమికల్స్.. పోషకాలను నష్టం నుండి రక్షిస్తాయి. పోషకాలను మరింత ప్రయోజనకరంగా చేస్తాయి. ఆహార కాంబినేషన్లు.. బెస్ట్ కాంబో.. సిట్రస్ పండ్లు లేదా ఆకుకూరలతో కూరగాయలు, గింజలతో పండ్లు. బెస్ట్ కలర్స్.. వివిధ రంగుల పండ్లు, కూరగాయలు ముఖ్యమైన ఫైటోన్యూట్రియెంట్లను కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు.. ఆహార కొవ్వును సరిగ్గా జీర్ణం చేసుకోవడానికి విటమిన్లు A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు అవసరం. కాల్షియం, విటమిన్-డి.. తగినంత విటమిన్ డి లేకుండా శరీరం కాల్షియంను సరిగ్గా గ్రహించదు. అందువల్ల కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో విటమిన్ డి ని సప్లిమెంట్ చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది బలమైన దంతాలు, ఎముకలను నిర్వహించడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్-సి, ఐరన్.. విటమిన్ సి తో ఐరన్ తీసుకోవడం వల్ల శరీరం దానిని సులభంగా జీర్ణం చేస్తుంది. అందుకే పాలకూరతో నిమ్మకాయ, టమోటాలతో పప్పు, బెర్రీలతో బలవర్థకమైన తృణధాన్యాలు వంటి కాంబినేషన్లు మంచివిగా పరిగణించబడతాయి. ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్.. ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ను నిర్వహించడానికి ప్రోబయోటిక్స్ అవసరమైన బ్యాక్టీరియా. అవి జీర్ణక్రియకు సహాయపడతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. పెరుగు, ఊరగాయలు, ఇడ్లీ, దోస, కేఫీర్ వంటి పులియబెట్టిన ఆహారాలు ప్రోబయోటిక్స్లో సమృద్ధిగా ఉంటాయి. ఈ బ్యాక్టీరియాను నిర్వహించడానికి ప్రీబయోటిక్ ఆహారాలు కూడా అంతే ముఖ్యమైనవి. ప్రీబయోటిక్స్ అనేది ప్రోబయోటిక్స్కు ఎరువుగా పనిచేసే ఒక రకమైన ఆహార ఫైబర్. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండ్లు, ఆపిల్స్, తృణధాన్యాలలో ప్రీబయోటిక్స్ కనిపిస్తాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఫైబర్ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారా? ఈ నిజాలు తెలిసా..!
ఆహారం ప్రతి జీవికి శక్తివనరు. ప్రాణం లేని వాహనాలు కూడా వాటికి ఇంధనం ఉంటేనే పని చేస్తాయి. అలాంటి ప్రాణం ఉన్న జీవులకు ఆహారం చాలా ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్న జీవులలో ఈ ప్రపంచంలో మనిషి చాలా ప్రత్యేకం. అయితే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే సమతుల ఆహారం తీసుకోవాలి. ఇందులో ఫైబర్ కూడా ముఖ్యమైనది. చాలామంది ఆహారంలో కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ప్రోటీన్ వంటివి ఉన్నాయా లేదా అని చూస్తారు. కానీ ఫైబర్ గురించి ఆలోచించే వారు తక్కువ. ఆహారంలో ఫైబర్ లోపిస్తే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. పైబర్ గురించి నిర్లక్ష్యంగా ఉండేవారు తప్పకుండా తెలుసుకోవలసిన నిజాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. పేగు ఆరోగ్యం.. ఫైబర్ లేకపోవడం వల్ల మన గట్ లైనింగ్ నేరుగా దెబ్బతింటుంది, ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల పేగులు దెబ్బతినే అవకాశాలు క్రమంగా పెరుగుతాయి. షుగర్ లెవల్స్.. ఫైబర్ లేకపోవడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుదల మరింత తీవ్రమవుతుందని. ఆహారంలో ఫైబర్ ఉన్నప్పుడు, అది చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత, టైప్ 2 డయాబెటిస్కు దారితీస్తుంది. కొలెస్ట్రాల్.. గుండె ఆరోగ్యం.. ఫైబర్ శరీరంలో చీపురులా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తుడిచిపెడుతుంది. ఆహారంలో ఫైబర్ తక్కువగా ఉంటే, ఈ చెడు కొవ్వు ధమనులలో పేరుకుపోతుంది. గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. ఫ్యాటీ లివర్.. ఫైబర్ లేకపోవడం కొవ్వు కాలేయం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. దీనివల్ల శరీరం ప్రధాన వడపోత అవయవమైన లివర్ పనితీరు మందగిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ 25-30 గ్రాముల ఫైబర్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఫైబర్ లేకపోవడం వల్ల శరీరం బ్యూటిరేట్ అనే ముఖ్యమైన షార్ట్-చైన్ ఫ్యాటీ యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. బ్యూటిరేట్ పేగు కణాలకు శక్తిని అందిస్తుంది, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి వాటిని రక్షిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం లేకపోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్, ఇతర శోథ వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని, ఇది దీర్ఘకాలిక ఆరోగ్యానికి ఎక్కువ ముప్పును కలిగిస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. హార్మోన్ల అసమతుల్యత.. అకాల వృద్దాప్యం.. ఫైబర్ లేకపోవడం వల్ల అంతర్గత అవయవాలు మాత్రమే కాకుండా చిన్న వయసులోనే వయస్సు పెరిగినట్టు (అకాల వృద్ధాప్యం) కూడా ప్రభావితమవుతుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది, అకాల వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఫైబర్ తగినంతగా తీసుకోకపోవడం ముడతలు, శరీరంలో ఎనర్జీ నష్టానికి దారితీస్తుంది. అందువల్ల, ఆహారంలో తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, కాలానుగుణ కూరగాయలను చేర్చడం చాలా ముఖ్యం. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreరాత్రి పడుకునేముందు సొంపు నీరు తాగితే.. ఆయుర్వేద వైద్యులు చెప్పిన రహస్యాలు ఇవి.. !
ఒకప్పుడు సొంపు చాలా మందికి తెలియదు. జీలకర్రను పోలిన సొంపు చాలా మంచి సువాసనతో ఉంటుంది. కొన్నిరకాల వంటల్లో సొంపును వాడతారు. మరికొందరు సొంపును భోజనం తర్వాత జీర్ణశక్తి కోసం తీసుకుంటారు. రెస్టారెంట్లలో భారీ భోజనం తిన్న తరువాత సొంపు ఇవ్వడం వెనుక కారణం.. కడుపు ఉబ్బరం, అజీర్తి ఉండకూడదనే.. అయితే ఆయుర్వేదం సొంపుతో మరింత గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది. చాలామంది రాత్రి నీటిలో సొంపును నానబెట్టి ఉదయాన్నే తాగుతూ ఉంటారు. కానీ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగితే అద్భుతాలు జరుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆయుర్వేద వైద్యులు ఏం చెప్పారు? తెలుసుకుంటే.. మనం తినే, త్రాగే ఆహారాలు మన చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని చెబుతారు. అందుకే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. కడుపును శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సహజమైన మెరుపు వస్తుంది. సొంపు నీరు కూడా ఇలాంటిదే.. డిటాక్స్ డ్రింక్.. రోజూ డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పోతాయి. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా, ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుతుంది. డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మొటిమలు , మంట, మచ్చలు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. సొంపు నీటిని ఎలా చేసుకోవాలి.. 1 కప్పు నీరు 1 టీస్పూన్ సోంపు.. 1 టీస్పూన్ జీలకర్ర.. 1 టీస్పూన్ క్యారమ్ విత్తనాలు.. తయారు విధానం.. పైన పేర్కొన్నవన్నీ ఒక పాన్లో లేదా గిన్నెలో వేయాలి. అందులో ఒక కప్పు నీరు పోయాలి. దీన్ని తక్కువ మంట మీద మరిగించాలి. 5 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. డిటాక్స్ డ్రింక్ రెడీగా ఉన్నట్టే ప్రతి రాత్రి పడుకునే ముందు దీన్ని తయారు చేసుకుని తాగమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ప్రయోజనాలు.. ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి, చర్మం మెరుస్తుంది, కడుపు శుభ్రంగా ఉంటుంది, శరీరం డీటాక్స్ అవుతుంది సొంపు చేసే మ్యాజిక్.. పైన పేర్కొన్న డిటాక్స్ డ్రింక్ లో సొంపు ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుద్ది చేస్తాయి. ఇది మొటిమలు, ముడతలను తగ్గిస్తుంది, ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది . ఇది మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreదగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మూత్రం లీక్ అవుతోందా? ఈ చిట్కాలు ట్రై చేయండి..!
మహిళలు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి సందర్బాలలో మహిళలు తమ మూత్రవిసర్జనను నియంత్రించుకోలేకపోతారు. దీనివల్ల అసౌకర్యం, ఇబ్బంది కలుగుతాయి. 40 ఏళ్ల తర్వాత మహిళల్లో దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ కావడానికి అనేక కారణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వయస్సు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడటం జరుగుతాయని, ఇది మాత్రమే కాకుండా వైద్యుల పర్యవేక్షణ లేకుండా డెలివరీ వంటివి జరగడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చని మహిళా వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి కొన్ని చిట్కాలను వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. మూత్రం లీకేజి ఇందుకే.. వయసు పెరిగే కొద్దీ కటి కండరాలు క్రమంగా బలహీనపడతాయి . ఇది గర్భాశయం, మూత్రాశయం, పురీషనాళం (ప్రేగు మార్గం) కు ఇచ్చే సపోర్ట్ ను బలహీనపరుస్తుంది. ఈ సపోర్ట్ బలహీనపడినప్పుడు, ఈ అవయవాలు వాటి స్థానం నుండి పక్కకు వెళ్లడం జరుగుతుంది. ఇది దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు మరో కారణం ఎక్కువ ప్రసవాలు జరగడం. ప్రతి ప్రసవంతో కటి కండరాలు బలహీనంగా, వదులుగా మారుతాయి. దీనివల్ల అవయవాలు సరైన సపోర్ట్ ను కోల్పోతాయి, మూత్రం లీకేజ్ వంటి సమస్యలకు దారితీయవచ్చు. మూత్రం లీకేజి కాకూడదంటే ఇలా చేయాలి.. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలి. పోషకాహారం గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు. మల్టీవిటమిన్లు, కాల్షియం తీసుకోవడానికి ముందు వైద్యుల సలహా లేదా విటమిన్ల లోపాన్ని నిర్ధారించుకున్న తర్వాతే తీసుకోవాలి. ఆహారంలో ప్రోటీన్ను బాగా ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా కెగెల్ వ్యాయామాలు చేయాలి. సమస్య తీవ్రంగా ఉంట వైద్యులను కలిసి చికిత్స తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మూత్రం లీకేజీ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. లేదంటే మూత్రాన్ని నియంత్రించుకోలేక చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు, గుడులకు వెళ్లినప్పుడు , శుభకార్యాలు వంటివి జరుగుతున్నప్పుడు, ప్రయాణాలలో ఉన్నప్పుడు ఇది చాలా దారుణమైన అనుభవాన్ని మిగులుస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreనీరు అతిగా తాగేస్తున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాలి...
శరీరాన్ని ఆరోగ్యంగా ఉండటంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. , ప్రతిఒక్కరూ ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలని వైద్యుల నుండి ఆరోగ్యం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు చెబుతారు. ఎండాకాలంలో సాదారణం కంటే నీరు మరింత ఎక్కువ అవసరం అవుతుంది. ఎండవేడిమి కారణంగా, శరీరం నుండి చాలా నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. పెద్దలు రోజుకు 3-4 లీటర్ల నీటిని తాగడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మోతాదులో నీరు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ప్రమాదం నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. శరీరపనితీరు ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు. రక్షించడంలో సహాయపడుతుంది మరియు శరీర అవయవాల పనితీరును సరిగ్గా ఉంచుతుంది. నీరు తక్కువ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్, కిడ్నీలో రాళ్లు, పొడి చర్మం, పొడి కళ్ళు వంటి అనేక దుష్ప్రభావాలు ఏర్పడతాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది ఎక్కువ నీరు తాగేస్తుంటారు. దీని వల్ల బోలెడు ఆరోగ్యమని అనుకుంటారు కానీ.. శరీరానికి ఇది చాలా హాని కలిగిస్తుందని మీకు తెలుసా? నీరు ఎక్కువగా తాగితే, దాని వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.. రోజుకు కచ్చితంగా ఇంత నీరు త్రాగాలి అని నిర్ణయించడానికి ఎటువంటి సూత్రం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా రోజుకు మూడు నుండి మూడు లీటర్ల నీరు శరీరానికి అవసరం అవుతుంది. అది కూడా వాతావరణం, వ్యాయామం, ఆహారం, మొత్తం ఆరోగ్యం, మహిళలు గర్భంతో ఉండటం లేదా మహిళలు పిల్లలకు పాలు ఇవ్వడం వంటి పరిస్థితులపై శరీరానికి కావలసిన నీటి పరిమాణం ఆదారపడి ఉంటుంది. కానీ నీరు అధికంగా తీసుకుంటే ఈ క్రింది అనర్థాలు కచ్చితంగా జరుగుతాయి. నీరు ఎక్కువగా తాగుతుంటే వాటర్ పాయిజనింగ్ సంభవించే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల మూత్రపిండాల పనితీరును బాగా పెంచుతుంది, దీని ఫలితంగా శరీరంలోని ఎలక్ట్రోలైట్లు కరిగిపోతాయి. ఉదాహరణకు, సోడియం (ఉప్పు) కరిగించినట్లయితే, హైపోనాట్రేమియా డవలప్ అవుతుంది. శరీరంలో చాలా తక్కువ సోడియం ఉంటే కణాల లోపల నీరు చేరుతుంది. ఇది శరీరం వాపుకు దారితీస్తుంది. హైపోనాట్రేమియా లక్షణాలు ఎలా ఉంటాయంటే.. హైపోనాట్రేమియా ను ఓవర్ హైడ్రేషన్ అని అంటారు. ఓవర్ హైడ్రేషన్ యొక్క లక్షణాలు ప్రారంభ దశల్లో గుర్తించడం కష్టం. అయితే, ఎక్కువ సార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం దీనికి ఒక సంకేతం. వాటర్ పాయిజన్ జరిగితే శరీరంలో ఈ క్రింది లక్షణాలు కనబడతాయి. వికారం మరియు వాంతులు. మెదడుపై ఒత్తిడి పెరిగి దాని కారణంగా తలనొప్పి. గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి వంటి మానసిక స్థితిలో మార్పులు. కండరాల తిమ్మిరి. తరచుగా మూత్రవిసర్జన సమస్య. వాంతులు కావడం. మన శరీరంలో మూత్రపిండాలు ఒక సమయంలో ఎంత నీటిని విసర్జించాలనే పరిమితి కలిగి ఉంటాయి. దీని ప్రకారం గరిష్టంగా గంటకు 800 నుండి 1,000 ml మూత్రం విసర్జించాలి. ఎక్కువ నీరు తాగడం ప్రారంభిస్తే, శరీరం నుండి అదనపు నీటిని తొలగించడం మూత్రపిండాలకు కష్టమవుతుంది, దీని కారణంగా అపానవాయువు, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి. *నిశ్శబ్ద.
read moreమూత్రంలో నురుగు ఎక్కువ కనిపిస్తోందా? ఈ నిజాలు తెలుసుకోండి..!
అనారోగ్యాలను నిర్థారించడానికి మూత్ర పరీక్షలు కూడా చేస్తారు. కొందరికి మూత్రం చాలా పసుపు రంగులో వస్తుంది. మరికొందరికి లేత పసుపు రంగులో ఉంటుంది. ఇంకొందరికి కేవలం నీరు ఎలా ఉంటుందో అలా మూత్రం వస్తుంది. అయితే కొందరు మూత్రంలో నురుగు గమనిస్తూ ఉంటారు. మూత్ర విసర్జన చేసేటప్పుడు నురుగు కనిపించడం.. మూత్ర విసర్జన చేసిన కొన్ని సెకెన్లలోపు ఆ నురుగు క్లియర్ అయిపోతే అది ఆరోగ్యానికి ఏం చేయదు. కానీ మూత్ర విసర్జన చేసిన తర్వాత మూత్రం లో నురుగు అలాగే ఉంటున్నట్టేతే దాన్ని లైట్ తీసుకోకూడదని అంటున్నారు వైద్యులు. ఇంతకూ మూత్రంలో నురగ కనిపిస్తే కలిగే ప్రమాదం ఏంటి? తెలుసుకుంటే.. మూత్రపిండాల వైఫల్యం.. నురుగుతో కూడిన మూత్రం మూత్రపిండాల వైఫల్యాన్ని సూచిస్తుందని చెప్పలేం. కానీ ఇది ఖచ్చితంగా హెచ్చరిక లాంటిదేనని అంటున్నారు. కొన్నిసార్లు శరీరంలో తేమ తక్కువ ఉండి శరీరం డీహేడ్రేషన్ కు లోనవ్వడం లేదా అధిక ప్రోటీన్ ఆహారం కారణంగా మూత్రం బలంగా ప్రవాహించడం వల్ల తాత్కాలికంగా నురుగుగా మారుతుంది. అయితే ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, దానిని సీరియస్ గా పరిగణించాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువకాలం నురుగుతో కూడిన మూత్రం మూత్రపిండాల వడపోత సామర్థ్యం బలహీనపడటానికి సంకేతం కావచ్చని అంటున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్ ప్రారంభ లక్షణాలు.. కిడ్నీలు ఫెయిల్ కావడానికి ముందే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. చేతులు, కాళ్ళు, ముఖం వాపు, అలసట, బలహీనత, ఆకలి లేకపోవడం, ముదురు రంగులో మూత్రం ఉండటం లేదా దుర్వాసనతో కూడిన మూత్రం విసర్జించడం. శ్వాస ఆడకపోవడం, చర్మం దురద, వాంతులు లేదా వికారం వంటి లక్షణాలు ఉంటాయి. మూత్రంలో నురుగు ఉంటే ఈ వ్యాధులు కూడా ఉండవచ్చు.. నురుగు మూత్రం తరచుగా మూత్రపిండాల సమస్యలే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలను కూడా సూచిస్తుంది. అధిక నురుగు మధుమేహం, అధిక రక్తపోటును సూచిస్తుంది. గుండె సమస్యలు, గర్భం, ఒత్తిడి, మూత్ర ఇన్ఫెక్షన్లు కూడా అధిక నురుగు మూత్రానికి కారణమవుతాయి. తీవ్రమైన అనారోగ్యానికి మొదటి సంకేతం మూత్రంలోనే తెలుస్తుందని వైద్యులు చెబుతున్నారు. నురుగు మూత్రం, మూత్రం రంగు ముదురు పసుపు లేదా గోధుమ రంగులోకి మారడం, బలమైన వాసన, మంట లేదా మూత్రంలో రక్తం వంటి లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreరాత్రి భోజనం తర్వాత గ్రీన్ టీ తాగడం మంచిదేనా?
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది గ్రీన్ టీని ఉదయం సమయంలో తాగుతారు, లేదా సాయంత్రం సమయంలో తాగుతారు. కానీ గ్రీన్ టీని రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత తాగినా చాలామంచి ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు కొందరు. అసలు గ్రీన్ టీ ని రాత్రి సమయంలో తాగవచ్చా? రాత్రి సమయంలో తాగాలి అనుకుంటే ఎన్ని గంటలకు తాగాలి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు ఏంటి? తెలుసుకుంటే.. రాత్రి సమయంలో గ్రీన్ టీ.. రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం గురించి ఒక సమాచారం చాలా వైరల్ అవుతోంది. రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కొంతమంది మళ్లీ ఏదైనా తినాలని అనుకుంటూ ఉంటారు. ఏవో ఒక స్నాక్స్ లేదా పానీయాలు తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ రాత్రి సమయంలో బోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే పెద్ద పెద్ద ఆరోగ్య మార్పులు చేయకపోయినా.. చిన్న చిన్న మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందని అంటున్నారు. స్వీట్ క్రేవింగ్స్.. రాత్రి సమయంలో బోజనం తర్వాత కొందరికి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. డిన్నర్ చేసిన తర్వాత తీపిగా ఉన్న పదార్థాలు ఏమైనా తినాలని అనుకుంటారు. ఇందుకోసం ఇంట్లో చిరుతిళ్లు, ఐస్ క్రీమ్ లాంటివి కూడా స్టాక్ పెట్టుకుని ఉంటారు. కానీ రాత్రి భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే ఈ స్వీట్ క్రేవింగ్స్ కు చెక్ పెడుతుంది. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే ఆ తరువాత మళ్లీ స్వీట్స్ ఏమీ తినాలని అనిపించకపోవడమే దీనికి కారణం. రిలాక్స్.. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగడం మానసికంగా రిలాక్స్ గా ఉంచుతుందట. ఇది పదే పదే ఫోన్ చూడటం లేదా స్క్రీన్ టైమ్ ను తగ్గించుకోవడానికి సహాయపడుతుందట. నిద్ర సమయానికి మానసికంగా రిలాక్సేషన్ ఇస్తుందని అంటున్నారు. తక్కువ భోజనం.. రాత్రి సమయంలో డిన్నర్ తర్వాత గ్రీన్ టీ తాగే అలవాటు భోజనం తక్కువ తీసుకోవడానికి సహాయపడుతుందట. రాత్రి తేలిక పాటి బోజనం ఆరోగ్యానికి చాలా మంచిది. భోజనం తర్వాత గ్రీన్ టీ తాగాలనే కారణంతో భోజనం తక్కువ తీసుకోవడం జరుగుతుందట. రాత్రి గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి.. రాత్రి సమయంలో గ్రీన్ టీని రాత్రి భోజనం చేసిన అరగంట తర్వాత తీసుకోవచ్చు. రాత్రి గ్రీన్ టీ తాగితే నష్టం.. రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగడం వల్ల కొందరికి నిద్ర పట్టడంలో సమస్యలు ఏర్పడతాయి. అయితే ఇది రాత్రి భోజనం చేసే విధానం మీద ఆధారపడి ఉంటుంది. రాత్రి సమయంలో 7 నుండి 8 గంటల మధ్య భోజనం ముగిస్తే 8నుండి 8.30 లోపు గ్రీన్ టీ తాగవచ్చు. రాత్రి 10గంటలకు చక్కగా నిద్రపోవచ్చు. అలా కాకుండా రాత్రి బోజనం ఆలస్యంగా 10 గంటలకు లేదా అంతకంటే ఎక్కువ సమయంలో చేసి ఆ తర్వాత గ్రీన్ టీ తాగితే అది నిద్రకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreరక్తం క్లీన్ గా ఉంటే రోగాలన్నీ దూరమే.. రక్తాన్ని ఇలా శుద్ది చేసుకోండి..!
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడం చాలా ముఖ్యం. ప్రతి అవయవానికి తగినంత మొత్తంలో స్వచ్ఛమైన రక్తం అందితేనే ఇది జరుగుతుంది. రక్త స్వచ్ఛత అంటే అది విష పదార్థాలు లేకుండా ఉండాలని అర్థం. ఆహారం విషయంలో చేసే తప్పులు కాలక్రమేణా రక్తంలో అనేక విష పదార్థాలు పేరుకుపోవడానికి కారణమవుతాయి. దీని వలన అనేక అవయవాలు విషపూరితంగా మారుతాయి. సాధారణంగా జీర్ణవ్యవస్థ, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలు సహజంగా రక్తాన్ని నిరంతరం ఫిల్టర్ చేస్తాయి. అయితే రక్తంలో ఎక్కువ టాక్సిన్లు ఉంటే ఈ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, రక్తంలో టాక్సిన్లు తొలగించే పానీయాలు తీసుకోవడం ద్వారా రక్తాన్ని క్లీన్ గా ఉంచుకోవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. రక్తం క్లీన్ గా లేకపోతే... రక్త నాణ్యత సరిగా లేకపోవడం వల్ల కాలేయం సరిగా పనిచేయదు. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుంది. ఇది మాత్రమే కాకుండా చర్మ ఇన్ఫెక్షన్లు, ఎప్పుడూ మొటిమలు, దద్దుర్లు, చికాకు, తరచుగా అలసట, ముఖంపై మెరుపు లేకపోవడం మొదలైనవన్నీ రక్తం శుభ్రంగా లేదని సంకేతాలు ఇస్తాయి. రక్తం శుద్ది చేసుకోవాలంటే.. ఎక్కువ నీరు త్రాగే అలవాటు శరీరాన్ని డిటాక్స్ చేయడంలో, రక్తంలోని మలినాలను తగ్గించడంలో సహాయపడుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల కాలేయం, మూత్రపిండాల పనితీరు కూడా సక్రమంగా ఉంటుంది. ఈ అవయవాలు రక్తాన్ని శుద్ధి చేయడం, రక్తంలో మలినాలను తొలగించడం వంటి పనులు చేయడంలో సహాయపడతాయి. నేషనల్ కిడ్నీ అసోసియేషన్ ప్రకారం ప్రతిరోజూ 6 కప్పుల మూత్రాన్ని ఉత్పత్తి చేయడానికి తగినంత నీరు త్రాగాలి. నిమ్మరసం.. నిమ్మరసం రక్తాన్ని, జీర్ణవ్యవస్థను రెండింటినీ శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది సహజంగా ఆమ్లంగా ఉంటుంది, ఇది pH స్థాయిలను తగ్గించడానికి, రక్తం నుండి విషాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. శరీరం నుండి మలినాలను బయటకు పంపడానికి, ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో తాజా నిమ్మరసం కలిపి త్రాగాలి. ఇది రక్తాన్ని శుభ్రంగా ఉంచడానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పసుపు.. పసుపు దాని శోథ నిరోధక లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో, వైద్యం ప్రక్రియను వేగవంతం చేయడంలో కూడా సహాయపడుతుంది. పసుపులో లభించే కర్కుమిన్ అనే సమ్మేళనం వాపు, ఇన్ఫెక్షన్ ప్రమాదాల నుండి రక్షించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం, ఒక కప్పు వేడి పాలలో అర టీస్పూన్ పసుపు పొడి కలిపి త్రాగాలి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరం నుండి విషాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreచలిగా ఉందని టీ తెగ తాగేస్తున్నారా? జర జాగ్రత్త..!
వేసవి కాలంలో చల్లని పదార్థాలు, చలి కాలంలో వెచ్చని ఆహారాలు తీసుకోవాలని అనుకోవడం చాలా సాధారణం. ముఖ్యంగా చలికాలంలో ఉదయాన్నే వేడివేడి టీ తాగందే చాలామందికి తెల్లవారదు కూడా. లేవగానే ఒక కప్పుతో మొదలు పెట్టి, పూటకు ఒకసారి టీ తాగడమే కాకుండా.. పని చురుగ్గా జరగడం కోసం శరీరానికి ఉత్సాహం తెచ్చుకోవడానికి పదే పదే టీ తాగుతూ ఉంటారు. అయితే ఏదైనా సరే.. తీసుకునే దాన్ని బట్టి ఔషధంగానూ పనిచేస్తుంది, విషంగానూ పనిచేస్తుంది. ప్రతి రోజూ ఎన్ని కప్పుల టీ తాగడం ఆరోగ్యానికి మంచిది. ఎన్ని కప్పులు తాగడం హానికరంగా పరిగణించబడుతుంది. తెలుసుకుంటే.. శీతాకాలంలో ఒక కప్పు వేడి టీ శరీరం, మనస్సు రెండింటినీ ప్రశాంతపరుస్తుంది. టీ వెచ్చదనం చేతులకు ఉపశమనం కలిగిస్తే.. దాని నుండి వచ్చే ఆవిరి మొత్తం వాతావరణాన్ని హాయిగా చేస్తుంది. చలి రోజులలో చాలా మంది రోజంతా లెక్కపెట్టనట్టు టీ తాగడానికి ఇదే కారణం. అది వారి రోజువారీ అలవాటుగా మారుతుంది. మితంగా టీ తాగడం సాధారణంగా ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. కానీ ఎక్కువగా టీ తాగితే కొన్ని నష్టాలు కూడా కలిగిస్తుంది. ఎక్కువ టీ తాగడం వల్ల కలిగే నష్టాలేంటి? టీ తాగితే కలిగే ప్రయోజనాలు, నష్టాలేంటి? టీ ప్రయోజనాలు.. సరైన మొత్తంలో టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని పరిశోధనలు క్రమం తప్పకుండా టీ తాగడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని సూచిస్తున్నాయి. అయితే ఇది టీ రకం, తీసుకునే పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. టీలోని ఫ్లేవనాయిడ్లు, కాటెచిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయని అంటున్నారు. టీలోని కెఫిన్, ఎల్-థియనిన్ కాంబినేషన్ మనస్సును ప్రశాంతపరుస్తుంది, దృష్టిని మెరుగుపరుస్తుంది, కాఫీ కలిగించే ఆందోళనను నివారిస్తుంది. అల్లం లేదా పుదీనా వంటి హెర్బల్ టీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో, శరీర సహజ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. జలుబు ఫ్లూ సీజన్లో రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తాయి. టీ తాగితే నష్టాలు.. అధికంగా టీ తాగడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా కెఫిన్ ఉన్న టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. టీలోని టానిన్లు ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తాయి. ఇది రక్తహీనతతో బాధపడేవారికి లేదా శాఖాహార ఆహారం తీసుకునేవారికి చాలా సమస్యగా ఉంటుంది. రోజుకు 400 mg కెఫిన్ మించితే నిద్ర సమస్యలు, విశ్రాంతి లేకపోవడం, హృదయ స్పందన రేటు పెరుగుదలకు దారితీస్తుంది. ఖాళీ కడుపుతో స్ట్రాంగ్ టీ తాగడం వల్ల వికారం, ఆమ్లత్వం లేదా తలతిరుగడం వంటివి జరుగుతాయి. ఎక్కువకాలం టీని ఎక్కువగా తాగడం వల్ల దంతాలు మరకలు పడతాయి. కెఫిన్ వ్యసనానికి దారితీస్తుంది. రోజుకు ఎంత తాగితే మేలు.. ఎన్ని కప్పుల టీ తాగడం హాని కలిగిస్తుంది అనే విషయంలో చాలా మంది గందరగోళ పడుతుంటారు. సాధారణంగా రోజుకు 3 నుండి 4 కప్పుల టీ తాగడం చాలా మందికి సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. కెఫిన్కు ఎక్కువ సెన్సిటివ్ గా ఉండేవారు లేదా కొన్ని ఆరోగ్య పరిస్థితులతో బాధపడేవారు టీ తీసుకోవడం పరిమితం చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రోజుకు 2 కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreవామ్మో.. ఈ మూడు అలవాట్లు మానకపోతే చిత్తవైకల్యం తప్పదట..!
ఒకప్పుడు వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కోల్పోవడం, శరీర వణుకు వంటి సమస్యలు వచ్చేవి. పెద్ద వయసులో ఇవి సాధారణం అని భావించేవారు. కానీ నేటి వేగవంతమైన జీవితాల్లో చిత్తవైకల్యం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు ఊహించకుండా వచ్చేస్తున్నాయి. అందులోనూ వయసుతో సంబందం లేకుండా చాలామంది ఈ సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ రెండు వ్యాధులు మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. జన్యుశాస్త్రంతో పాటు, జీవనశైలి కూడా ఈ వ్యాధులకు దోహదం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా. చిత్త వైకల్యం, పార్కిన్సన్స్ వంటి జబ్బులు రాకుండా ఉండాలన్నా మూడు అలవాట్లు పొరపాటున కంటిన్యూ చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. నిద్ర.. శారీరక అలసటకు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా అవసరం. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు గ్లింఫాటిక్ వ్యవస్థ ద్వారా టాక్సిన్స్ తొలగిస్తుంది. వీటిలో అమిలాయిడ్-బీటా ప్రోటీన్ ఉంటుంది. ఇది అల్జీమర్స్, చిత్తవైకల్యంతో నేరుగా కనెక్షన్ కలిగి ఉంటుంది. అందువల్ల క్రమం తప్పకుండా రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తుల మెదడులో హానికరమైన ప్రోటీన్లు పేరుకుపోతాయి. ఇవి మెదడు కణాలను నాశనం చేస్తాయి. రాత్రి నిద్ర ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతి రాత్రి ఒకే సమయంలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. పడుకునే 1-2 గంటల ముందు మొబైల్ ఫోన్ వాడటం మానేయాలి. అల్పాహారం.. అల్పాహారం మన మెదడుకు ఇంధనంగా పనిచేస్తుంది. రాత్రంతా ఆహారం లేకుండా శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. దీని తర్వాత మెదడు సరిగ్గా పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. అందువల్ల, అల్పాహారం దాటవేసే వ్యక్తులకు పోషకాలు లోపిస్తాయి. ఇది మెదడు క్షీణత లేదా మెదడు కుంచించుకుపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది చిత్తవైకల్యం ప్రారంభానికి మూలం అయ్యే అవకాశం కలిగి ఉంటుంది. అందువల్ల అల్పాహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, గింజలు, తాజా పండ్లను చేర్చడం ముఖ్యం. ఇవి మెదడు కణాలను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి. వ్యాయామం.. శరీరంలోని బద్ధకం మనస్సులో బద్ధకాన్ని కలిగిస్తుంది. వ్యాయామం శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది మెదడుకు తగినంత ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. అయితే వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇవి పార్కిన్సన్స్, చిత్తవైకల్యానికి రెండు ప్రధాన ప్రమాద కారకాలు. శారీరకంగా చురుకుగా లేకపోవడం వల్ల మెదడులో డోపమైన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది పార్కిన్సన్స్కు ప్రధాన కారణం. అందువల్ల ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు చురుకైన నడక, యోగా లేదా ఏదైనా ఇతర వ్యాయామం చేయాలి. *రూపశ్రీ.
read more


.webp)













.webp)


.webp)


