త్రి దోషాలు అంటే ఏంటి? ఇవి శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
ప్రాచీన భారతీయ వైద్య శాస్త్రమైన ఆయుర్వేదం ఆరోగ్యకరమైన, సమతుల్య జీవితాన్ని గడపడానికి చాలా రహస్యాలను పేర్కొన్నది. ఆయుర్వేదం ప్రకారం, శరీరం కేవలం ఎముకలు, కండరాలు కాదు. మూడు ప్రాథమిక జీవ శక్తులు లేదా 'దోషాలు' అయిన వాత, పిత్త, కఫాలతో రూపొందించబడింది. ఈ మూడు దోషాలు శరీరంలోని ప్రతి చిన్న, పెద్ద పనితీరును నియంత్రిస్తాయి. అది శ్వాస ప్రక్రియ అయినా, ఆహారం జీర్ణం అయినా లేదా మనిషి ఆలోచనలు, భావోద్వేగాలైనా.. ఇలా ప్రతీది త్రిదోషాలే నియంత్రిస్తాయి. ప్రతి వ్యక్తికి ఈ దోషాల ప్రత్యేకమైన సమతుల్యత ఉంటుంది. ఇది వారి ప్రత్యేక శారీరక నిర్మాణం, మానసిక స్వభావం, వ్యాధులకు గురయ్యే అవకాశాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఆయుర్వేదం ప్రాథమిక సూత్రం ప్రకారం ఈ దోషాలు సమతుల్యంగా ఉన్నప్పుడు మనిషి పూర్తిగా ఆరోగ్యంగా ఉంటాడు. కానీ ఈ సమతుల్యతలో ఏదైనా ఇబ్బంది ఏర్పడిన వెంటనే శరీరంలో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ మూడు దోషాల గురించి.. ఈ దోషాల వల్ల ఏర్పడే పరిస్థితుల గురించి వివరంగా తెలుసుకుంటే.. వాత దోషం.. వాత దోషం వాయు (గాలి), ఆకాశ (అంతరిక్షం) అనే మూలకాలతో రూపొందించబడింది. ఇది మన శరీరంలోని శ్వాస, రక్త ప్రసరణ, హృదయ స్పందన, కండరాల కదలికలు, నాడీ వ్యవస్థ నుండి వచ్చే సందేశాలు వంటి అన్ని రకాల కదలికలను నియంత్రిస్తుంది. వాత ఆధిపత్య వ్యక్తులు సాధారణంగా సన్నగా, చురుగ్గా, సృజనాత్మకంగా ఉంటారు. వాత సమతుల్యంగా ఉన్నప్పుడు ఉత్సాహం, త్వరగా ఆలోచించే సామర్థ్యం, మంచి శక్తి ఉంటుంది. కానీ వాత అసమతుల్యతలో ఉన్నప్పుడు కీళ్ల నొప్పులు, మలబద్ధకం, గ్యాస్, పొడి చర్మం, నిద్రలేమి, ఆందోళన, భయము వంటి సమస్యలు ఉండవచ్చు. చల్లని, పొడి లేదా చప్పగా ఉండే ఆహారం, అధిక ఒత్తిడి, క్రమరహిత దినచర్య వాతాన్ని తీవ్రతరం చేస్తాయి. పిత్త దోషం.. అగ్ని (అగ్ని), జలం (నీరు) అనే మూలకాలతో రూపొందించబడింది. ఇది జీర్ణక్రియ, మన శరీరంలోని అన్ని రకాల పరివర్తనలను నియంత్రిస్తుంది. ఆహారాన్ని శక్తిగా మార్చడంలో, తెలివితేటలు, భావోద్వేగాలను నియంత్రించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పిత్త ఆధిపత్య వ్యక్తులు తరచుగా మధ్యస్థ ఎత్తు, పదునైన తెలివితేటలు, దృఢ సంకల్పం కలిగి ఉంటారు. సమతుల్య పిత్తం ఉన్న వ్యక్తులు మంచి జీర్ణక్రియ, పదునైన మనస్సు, నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు. అయితే పిత్తం అసమతుల్యతతో ఉన్నప్పుడు అది ఆమ్లత్వం, గుండెల్లో మంట, చర్మ దద్దుర్లు లేదా మొటిమలు, కోపం, చిరాకు, అధిక చెమట వంటి సమస్యలను కలిగిస్తుంది. కారంగా, పుల్లగా, చాలా వేడిగా ఉండే ఆహారం, అధిక కోపం పిత్తాన్ని తీవ్రతరం చేస్తాయి. కఫ దోషం.. కఫ దోషం పృథ్వీ (భూమి), జలం (నీరు) అనే మూలకాలతో రూపొందించబడింది. ఇది మన శరీరానికి స్థిరత్వం, నిర్మాణం, సరళత, రోగనిరోధక శక్తిని అందిస్తుంది. ఇది కీళ్ళను సరళతగా ఉంచుతుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది. కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కఫ ఆధిపత్యం ఉన్న వ్యక్తులు సాధారణంగా బలంగా, సహనంతో ఉంటారు. సమతుల్య కఫం వ్యక్తికి స్థిరత్వం, ఓర్పు, మంచి నిద్ర, బలమైన రోగనిరోధక శక్తిని ఇస్తుంది. అయితే, అసమతుల్య కఫం బరువు పెరగడం, బద్ధకం, జలుబు-దగ్గు, శ్లేష్మం, సైనస్ సమస్యలు, నిరాశ వంటి సమస్యలకు దారితీస్తుంది. తీపి, భారీ, జిడ్డుగల ఆహారం, తక్కువ శారీరక శ్రమ, ఎక్కువగా నిద్రపోవడం కఫాన్ని తీవ్రతరం చేస్తాయి. సమతుల్యత కీలకం.. ఆయుర్వేదం ఈ మూడు దోషాలు ప్రతి వ్యక్తిలో ఉన్నాయని బోధిస్తుంది. ఆరోగ్యంగా ఉండటానికి, ఈ దోషాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆహారం, జీవనశైలి, యోగా, ధ్యానం, ఆయుర్వేద చికిత్సల ద్వారా ఈ సమతుల్యతను కాపాడుకోవచ్చు. పై లక్షణాల ఆధారంగా వ్యక్తి శరీర స్వభావాన్ని అర్థం చేసుకోవడం , ఆహారాన్ని తదనుగుణంగా మార్చుకోవడం ద్వారా వ్యాధులను నివారించుకుని దీర్ఘకాలం ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreప్రెగ్నెన్సీ టైమ్ లో మహిళలు చేసే ఈ తప్పు.. సి-సెక్షన్ కు పెద్ద కారణం..!
గర్భధారణ సమయంలో చాలా సార్లు తల్లి లేదా బిడ్డ ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే సాధారణ ప్రసవం సాధ్యం కాని పరిస్థితులు తలెత్తుతాయి. దీనివల్ల వైద్యులు సి-సెక్షన్ను సిఫారసు చేస్తారు. నిజానికి నేటి కాలంలో సి-సెక్షన్ ఏ ఎక్కువగా సాగుతోంది. అయితే నేటి కాలం మహిళలలో మెల్లిగా మార్పు వస్తోంది. చాలామంది సి-సెక్షన్ బదులు సాధారణ ప్రసవం కావాలని వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇందుకోసం ప్రెగ్నెన్సీ క్లియర్ అయ్యింది మొదలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు కూడా. అయితే చాలామంది మహిళలు చేసే ఒక తప్పు వల్ల సాధారణ డెలివరీ కావాలని అనుకున్న వారు కూడా సి-సెక్షన్ కు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మహిళలు చేస్తున్న తప్పేంటి? తెలుసుకుంటే.. నీరు.. గర్భాధారణ సమయంలో మహిళలు నీరు పుష్కలంగా తాగకపోవడం సాధారణ డెలివరీ అవకాశాలను తగ్గిస్తుందట. భారతదేశం వంటి వేడి చాలా ఎక్కువగా ఉండే దేశంలో గర్భిణీ స్త్రీలు కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు లేదా ద్రవాలు తీసుకోవాలని గైనకాలజిస్టులు చెబుతున్నారు. చాలా మంది దాహం వేసినప్పుడు మాత్రమే నీరు తాగుతారు లేదా నీటి వనరులు అంటే నీరు మాత్రమే అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. దీని కోసం జ్యూసులు కూడా తాగవచ్చు. అలాగే కొబ్బరి నీళ్లు తాగవచ్చు. కానీ రోజంతా 3 నుండి 4 లీటర్లు నీరు తాగాలి. శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు, అది గర్భంలో ఉన్న శిశువు చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ద్రవం పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు. దాని స్థాయి పడిపోతే శిశువు ఎప్పుడైనా గర్భంలో మల విసర్జన చేయవచ్చు. ఇది ప్రసవాన్ని అత్యవసరం చేస్తుంది. అటువంటి పరిస్థితిలో డాక్టర్ సాధారణ ప్రసవానికి బదులుగా సి-సెక్షన్ను సిఫారసు చేస్తారు. కాబట్టి నీటి విషయంలో జాగ్రత్త వహించాలి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreగులాబ్ జామూన్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఈ నిజాలు తెలిస్తే దిమ్మ తిరుగుతుంది..!
భారతదేశంలో స్వీట్లకు, ముఖ్యంగా గులాబ్ జామున్కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అది పండుగ అయినా, పెళ్లి అయినా, ఆఫీస్ పార్టీ అయినా - గులాబ్ జామున్ కనిపించకుండా ఉండదు. పైగా గులాబ్ జామూన్ వండటం కూడా చాలా తేలిక. దీని కారణంగా చాలామంది గులాబ్ జామూన్ ను చేయడానికి ఇష్టపడతారు. ఇక దీని రుచి కారణంగా దీనికి విపరీతమైన అబిమానులు ఉన్నారు. విదేశీయులు సైతం గులాబ్ జామూన్ అంటే పడి చస్తారు. కానీ గులాబ్ జామూన్ గురించి కొన్ని నిజాలు తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. అవేంటో తెలుసుకుంటే.. గులాబ్ జామూన్ రుచిగా ఉన్నప్పటికీ ఈ గులాబ్ జామున్లో దాగి ఉన్న చక్కెర, సంతృప్త కొవ్వు స్థాయి నేరుగా శరీరానికి ఎన్ కౌంటర్ లాంటి చేటు చేస్తుందట. ఇది ఊబకాయాన్ని పెంచడమే కాకుండా, గుండె జబ్బులు, మధుమేహం, కాలేయ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. స్వీట్లు అంటే ఇష్టమే అయినా ఇలా చక్కెర, నూనె ఎక్కువగా వినియోగించి చేసే పదార్థాల విషయంలో చాలా జాగ్రత్త అవసరమని అంటున్నారు ఆహార నిపుణులు, ఆరోగ్య వైద్యులు. తియ్యని రుచి కాదు.. కేలరీల కొండ.. ఒక చిన్న గులాబ్ జామున్ సగటున 125 నుండి 150 కేలరీలు ఇస్తుందని తెలుసా? చాలా షాకింగ్ గా అనిపిస్తుంది కానీ ఇదే నిజం. ఇందులో దాదాపు 20 గ్రాముల చక్కెర, 5 గ్రాముల కంటే ఎక్కువ సంతృప్త కొవ్వు ఉంటుంది. కేవలం ఒక్క చిన్న గులాబ్ జామూన్ లోనే ఇంత ఉంటే.. ఇక రుచి బాగుందని ఆబగా తినే వారి సంగతి తలచుకుంటే చక్కెర కొండ మింగుతున్నారా అని అనిపిస్తుంది. రుచి మోజులో శరీరానికి ఎంతో చేటు చేసే పదార్థాలను అవగాహన లేకుండానే అలా పొట్టలోకి పంపేస్తున్నామని చాలామందికి అస్సలు తెలియదు. ఇటువంటి స్వీట్లను నిరంతరం తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది, జీవక్రియ నెమ్మదిస్తుంది, వేగంగా బరువు పెరుగుతుంది. బరువును నియంత్రించుకోవాలనే ఆలోచనలో ఉన్నవారు ఇలా చక్కెర శాతం ఎక్కువగా ఉండే గులాబ్ జామూన్ లాంటి స్వీట్లను అస్సలు తీసుకోకూడదని అంటున్నారు ఆహార నిపుణులు. స్వీట్లు ఈ జనరేషన్ లోనే ఎందుకు చేటు చేస్తున్నాయ్.. కాస్త వివరంగా ఆలోచిస్తే.. గతంలో అంటే కిందటి తరాల వారికి శారీరక శ్రమ ఎక్కువ ఉండేది. కానీ శారీరక శ్రమ తక్కువగా ఉన్న నేటి జీవనశైలిలో, చక్కెరను అధికంగా తీసుకోవడం శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. స్వీట్లు రక్తంలో చక్కెరను అసమతుల్యత చేయడమే కాకుండా ఫ్యాటీ లివర్, అధిక ట్రైగ్లిజరైడ్లను కూడా కలిగిస్తాయి . ఈ ప్రభావం పిల్లలు, వృద్ధులలో మరింత ప్రమాదకరం. కాబట్టి, 'రుచి' పేరుతో ఆరోగ్యాన్ని లైట్ తీసుకోకూడదు. పిల్లలకు, వృద్దులకు చేసే చేటు.. స్వీట్లు తినడం మద్య వయసు వారికే ప్రమాదం అనుకుంటే పొరపాటు. పిల్లలకు, వృద్దులకు ఇది చాలా డేంజర్.. పిల్లల్లో స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల ఊబకాయం, దంతక్షయం, హైపర్యాక్టివిటీ వంటి సమస్యలు వస్తాయి. మరోవైపు వృద్ధులలో స్వీట్లు రక్తంలో చక్కెరను పాడు చేస్తాయి. ఇది మధుమేహం, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. చాలా సార్లు "కొంచెం తీపి తింటే ఏమి తేడా ఉంటుంది" అని లైట్ తీసుకునే వారు ఎక్కువ. కానీ ఈ చిన్న మొత్తాలు కలిసి శరీరంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. భవిష్యత్తులో ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా చిన్నతనం నుండే పిల్లల అలవాట్లకు సరైన దిశానిర్దేశం చేయడం చాలా ముఖ్యం. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreబాబోయ్.. మోస్ట్ డేంజర్ ఫుడ్.. దీన్ని తిన్న ప్రతి సారి 36నిమిషాల జీవితకాలం మటాష్..!
ఆహారం శరీరానికి శక్తి వనరు. తీసుకునే ఆహారాన్ని బట్టి శరీర ఆరోగ్యం ఆధాపడి ఉంటుంది. అయితే పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని పెద్దలున్నారు. కానీ నేటి కాలంలో మాత్రం జిహ్వకు బోలెడు రుచులు కావాలి. నేచి జనరేషన్ లో తిండి మీద చూపిస్తున్న ఆసక్తి వేరే దేని మీద లేదంటే అతిశయోక్తి కాదు.. దీనికి తగినట్టే వీదులలో బోలెడు ఫుడ్ సెంటర్లు కూడా పుట్టగొడుగుల్లా వచ్చేసాయి. కానీ ఆహారం అనేది శరీరాన్ని దృఢంగా ఉంచేలా ఉండాలని ఆయుర్వేదం చెబుతుంది. అయితే దీన్ని పాటించేవారు ఇప్పట్లో చాలావరకు తగ్గిపోయారు. మరీ ముఖ్యంగా రుచి కోసం తింటున్న ఆహారాలు మనిషి ఆయుష్షును తగ్గించేస్తున్నాయ్ అని అంటున్నారు. వాటిలో చాలా డేంజర్ ఫుడ్ కూడా ఉంది. ఈ ఫుడ్ ఐటమ్ తిన్న ప్రతి సారి 36 నిమిషాల మానవ జీవితకాలం తగ్గిపోతోందట. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటి? తెలుసుకుంటే.. ఫాస్ట్ ఫుడ్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. నగరాల్లోనే కాదు, ఇప్పుడు గ్రామాల్లో కూడా ఫాస్ట్ ఫుడ్ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, యువత ఫాస్ట్ ఫుడ్ అంటే పడి చస్తారు. ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసి కూడా సంతోషంగా తింటున్నారు. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ ల గురించి చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. హాట్ డాగ్ తినడం వల్ల ఒక వ్యక్తి వయస్సు 36 నిమిషాలు తగ్గుతుందని, సోడా తాగడం వల్ల 12 నిమిషాలు తగ్గుతుందని పరిశోధకులు తమ పరిశోధనలలో కనుగొన్నారు. సంతోషంగా తినే ఫాస్ట్ ఫుడ్ వాస్తవానికి ఆయుష్షును మింగేస్తోందని వారు అంటున్నారు. శాండ్విచ్లు, గుడ్లు జీవితాన్ని 13 నిమిషాలు తగ్గిస్తాయట. చీజ్ బర్గర్లు దాదాపు 9 నిమిషాలు, బేకన్ను 6 నిమిషాలు తగ్గిస్తాయని అంటున్నారు. ఇవి ఎందుకు ప్రమాదం అంటే.. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు ఆయుష్షు తగ్గడానికి ప్రధాన కారణాలు.. ఎందుకంటే వాటిలో ఎటువంటి పోషకాహారం లేకపోవడం, శుద్ధి చేసిన చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, ఉప్పు, ఉత్పత్తులు పాడవకుండా ఉండటం కోసం వినియోగించే రసాయనాలు, కృత్రిమ రుచులు, రంగులు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తాయి. ప్రమాదాలు.. ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాలక్రమేణా అవి దీర్ఘకాలిక మంట, ఊబకాయం, గుండె జబ్బులు, స్ట్రోక్, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ పెద్ద మొత్తంలో తీసుకునే వ్యక్తులు గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం 50% ఎక్కువగా ఉంటుంది. ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలతో బాధపడే అవకాశం 48-53% ఎక్కువగా ఉంటుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 12% ఎక్కువగా ఉంటుందట. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreకిడ్నీ నుండి లివర్ వరకు ఈ మొక్క చేసే అద్భుతం మాటల్లో చెప్పలేం..
ఆయుర్వేదంలో ఎన్నో శతాబ్దాలుగా అనేక వ్యాధుల చికిత్సకు ఎన్నో మొక్కలు ఉపయోగిస్తున్నారు. వాటిలో సింహదంష్ట్ర లేదా పుచ్చపువ్వు అనేది ముఖ్యమైనది. దీన్నే అందరూ తంగేడు పువ్వు అంటారు. చూడటానికి పసుపు రంగు చామంతిని పోలి ఉండే ఈ పువ్వు కిడ్నీ నుండి లివర్ వరకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. భారతదేశంలో, ఇది ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో కనిపిస్తుంది. అంతేకాదు.. దీనికి 30 కంటే ఎక్కువ జాతులు ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్ లో డాండెలైన్ అని పిలుస్తారు. సుశ్రుత సంహిత ప్రకారం, తంగేడు ఫైబర్ యొక్క మంచి మూలం. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో, జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది శరీరంలోని వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదంలో, దీనిని కాలేయానికి సహజమైన నిర్విషీకరణ మందుగా పేర్కొంటారు. దీని వేర్లు, ఆకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. అదే సమయంలో, దీని ఆకులు విటమిన్లు A, C, D అలాగే పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలకు అద్భుతమైన మూలం. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మధుమేహాన్ని నిర్వహించడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. తంగేడు ఆకుల సారం మూత్రపిండాలను దెబ్బతినకుండా రక్షించే సమ్మేళన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మంటను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇది శరీరం నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది, ఇది మూత్రపిండాలపై భారాన్ని తగ్గిస్తుంది, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. తంగేడు పువ్వుల టీ డయాబెటిస్ రోగులకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది క్లోమమును ప్రేరేపించడం ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. కాల్షియం, విటమిన్ K పుష్కలంగా ఉండటం వల్ల, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో, ఎముక సంబంధిత ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreటీ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఈ పని మాత్రం చేయకండి..!
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయంగా మాత్రమే కాదు, ఒక భావోద్వేగంగా మారిపోయింది. ఉదయం అయినా లేదా సాయంత్రం అలసట అయినా, అందరికీ ఒక కప్పు టీ లేనిదే రిలాక్స్ గా అనిపించదు. చాలా మంది టీని ఎక్కువసేపు మరిగిస్తారు, తద్వారా దాని రుచి చిక్కగా, రుచికరంగా మారుతుంది. అయితే ఎంతో ఇష్టంగా త్రాగే టీని, అవసరానికి మించి మరిగిస్తే అది ఆరోగ్యానికి కూడా హానికరం చేస్తుంది. చాలామంది టీ విషయంలో చేసే తప్పులు, చేయకూడని పొరపాట్లు తెలుసుకుంటూ.. టీ ని ఆరోగ్యంగా తాగాలంటే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం టీలో కెఫిన్,టానిన్లు, యాంటీఆక్సిడెంట్లు ప్రభావవంతంగా ఉంటాయి. ఈ కారణంగా టీని పరిమిత సమయం మాత్రమే ఉడకబెట్టాలి. టీని ఎక్కువసేపు లేదా చాలా తక్కువసేపు ఉడకబెట్టడం వల్ల రుచి దెబ్బతింటుంది. అంతేకాదు.. ఇది ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. త్వరగా టీ తయారు చేసి తాగితే.. అంటే 1-2 నిమిషాలు టీని ఉడకబెట్టినట్లయితే అప్పుడు టీ ఆకులలో ఉండే పోషకాలు పూర్తిగా పానీయంలో చేరదు. . ఇలాంటి టీ కూడా ఎలాంటి రుచిని, ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాన్ని ఇవ్వదు. టీ చాలా సేపు ఉంచి మరగబెడితే.. 10 నిమిషాలు లేదా ఎక్కువసేపు టీని ఉడకబెట్టినట్లయితే దానిలో టానిన్డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది టీని చేదుగా చేస్తుంది. ఇది చాలా వగరుగా కూడా ఉంటుంది. చాలామంది టీ స్ట్రాంగ్ గా ఉండాలని ఎక్కువ సేపు టీ ఉడికిస్తారు. కానీ ఈ రకమైన టీ తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి కడుపు సమస్యలు వస్తాయి.ఎక్కువగా మరిగించిన టీలో కెఫిన్ పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారాతలనొప్పి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఉండవచ్చు. టీ ఎంతసేపు మరగబెట్టాలి? ఆరోగ్య నిపుణుల ప్రకారం టీని 4-5 నిమిషాలు మాత్రమే మరిగించడం సరైనది. దీనివల్ల టీ రుచికరంగా, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. అది పాల టీ అయినా లేదా బ్లాక్ టీ అయినా రెండూ ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు . టీ తయారు చేస్తున్నప్పుడు ముందుగా నీటిని మరిగించి అప్పుడు అందులో టీ ఆకులు వేసి 2-3 నిమిషాలు మరిగించాలి. తక్కువ మంట మీద మరిగించి, రుచికి తగ్గట్టుగా పాలు, చక్కెర కలపాలి. దీని తరువాత, దానిని 1-2 నిమిషాలు మరిగించి వెంటనే వడకట్టాలి. చాలా సేపు మరగబెట్టిన టీని తాగడం వల్ల రుచి పెరుగుతుంది. కానీ ఆరోగ్యం మాత్రం మరింత దిగజారుతుంది, అయితే గ్రీన్ టీ తాగే వారులేదా లేదా హెర్బల్ టీ తీసుకునేవారు దానిని అస్సలు ఉడకబెట్టకూడదు. గోరువెచ్చని నీటిలో వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు ఆవిరిలో ఉంచాలి. దీని ద్వారా ఆరోగ్యం బాగుటుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreవర్షాకాలంలో విషజ్వరాల బెడద రాకూడదంటే తీసుకోవలసిన జాగ్రత్తలు..!
వర్షాకాలం చాలామందికి బాగా ఇష్టంగా ఉంటుంది. వాతావరణం బాగా చల్లగా ఉంటుందనే కారణంతో దీన్ని ఇష్టపడతారు. అయితే వర్షాకాలం విషజ్వరాలను, వైరల్ ఇన్ఫెక్షన్లను మోసుకొచ్చే కాలం. ఈ కాలంలో విషజ్వరాలు స్వైర విహారం చేస్తాయి. అందుకే ఈ సీజన్ మార్పుకు అనుగుణంగా అలవాట్లు మార్చుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవాలి. సాధారణంగా విషజ్వరాలలో డెంగ్యూ ప్రముఖమైనది. లో ప్లేట్ లెట్ ల కౌంట్ తగ్గుతుంది. ప్లేట్లెట్ కౌంట్ 10,000 కంటే తక్కువగా ఉంటే, దానిని పెంచాల్సిన అవసరం ఉంటుంది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లను నివారించడానికి ఆహారం, శుభ్రమైన నీటిని మాత్రమే తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. త్రాగే నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. నీరు స్వచ్చంగా లేవని అనిపిస్తే వాటిని మరిగించి చల్లార్చి తీసుకోవాలి. వర్షాకాలంలో ఫ్లూ ఎక్కువగా వస్తుంది. దీనివల్ల జ్వరం, శరీర నొప్పులు వస్తాయని ఆయన అన్నారు. దీనితో పాటు జ్వరం చాలా ఎక్కువగా ఉండి, తలనొప్పి నిరంతరంగా ఉంటే డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు నాలుగు నుండి ఐదు గంటల్లోపు మందులు తీసుకున్న తర్వాత జ్వరం తగ్గితే, మలేరియా వచ్చే ప్రమాదం పెరుగుతుందని వైద్యులు అంటున్నారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో టైఫాయిడ్, విరేచనాలు, డెంగ్యూ, మలేరియా వంటివి ముఖ్యమైనవి. వాటిని నివారించడానికి ఎల్లప్పుడూ మరిగించి చల్లార్చిన లేదా ఫిల్టర్ చేసిన నీటిని తాగాలి. నీటి పాత్రను శుభ్రంగా ఉంచుకోవాలి. నీటి పాత్ర మీద ఎల్లప్పుడూ కప్పి ఉంచాలి. తినడానికి ముందు, తిన్న తర్వాత, మలవిసర్జన చేసిన తర్వాత నీటిని తాకే ముందు సబ్బుతో చేతులు బాగా కడుక్కోవాలి. పిల్లలు క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్లు ఆటల నేపథ్యంలో చేతులను ఉపయోగించే విధానం వేరుగా ఉంటుంది. ఆహారం ఎప్పుడూ బాగా ఉడికినదై ఉండాలి. పచ్చి లేదా సగం ఉడికించిన ఆహారాన్ని నివారించాలి. పండ్లు, కూరగాయలను తినేముందు శుభ్రమైన నీటితో కడగాలి. బయట ఆహారాన్ని తినడం మానేయడం మంచిది. బావులు, నదులు లేదా చెరువుల దగ్గర మలవిసర్జన చేయవద్దు. నీటి వనరులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇది దోమలు, బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతుంది. స్థానిక ఆరోగ్య కేంద్రం నుండి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి సమాచారం పొందాలి. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. వీలైనంత వరకు పరిశుభ్రతే శ్రీరామ రక్ష అనే విషయం మరవకూడదు. ఈ చర్యలు తీసుకోవడం ద్వారా, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను చాలా వరకు నివారించవచ్చు. విరేచనాలు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreవర్షాకాలంలో రాగి పాత్రలో నీరు తాగితే అద్భుతమే..!
రుతుపవనాలు వచ్చాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. అయితే, వర్షాకాలం వచ్చిన వెంటనే, ఆరోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. ఈ వర్షాకాలంలో ఆరోగ్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు తాగడం ఒకటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగి పాత్రలో ఉంచిన నీరు ఈ సీజన్లో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రాగి నీరు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి కూడా రక్షిస్తుంది. ఇది అమృతం లాంటిది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వర్షాకాలంలో నీటి కాలుష్యం ప్రమాదం పెరుగుతుంది, ఇది ఇన్ఫెక్షన్ లకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, రాగి నీరు సురక్షితమైన ఆయుర్వేద నివారణ. రాగి యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది నీటిలో ఉన్న హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది, నీటిని శుద్ధి చేస్తుంది. రాగి పాత్రలోని నీరు స్వచ్ఛమైనది. శరీరం నుండి విషాన్ని బయటకు పంపి, శరీరాన్ని ఆరోగ్యంగా, మనస్సును ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడుతుంది. రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. మలబద్ధకం, అపానవాయువు, అజీర్ణం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు ఈ నీరు మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మూత్రపిండాలు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. రాగి పాత్రలోని నీరు రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. ఇది వర్షాకాలంలో వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. రాగి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది, ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆయుర్వేదం కూడా రాగి పాత్రలో నీరు త్రాగమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం రాగి నీరు శరీరంలోని త్రిదోషాలను (వాత, పిత్త, కఫ) సమతుల్యం చేస్తుంది. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రాగి పాత్రలో నీటిని రాత్రంతా ఉంచి ఉదయం ఖాళీ కడుపుతో త్రాగడం ఉత్తమం. కానీ పాత్ర తుప్పు పట్టకుండా ఉండటానికి దానిని క్రమం తప్పకుండా శుభ్రపరచడం అవసరం. ఈ చిన్న మార్పుతో వర్షాకాలంలో కూడా నీరు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreఇంట్లో షుగర్ టెస్ట్ చేసుకునేవారు చేసే బిగ్ మిస్టేక్స్ ఇవే..!
డయాబెటిస్ రోగులు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెరను తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం. దీని సహాయంతో మందులను సక్రమంగా తీసుకుంటూ ఉండటమే కాకుండా , ఆహారాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి, తీవ్రమైన సమస్యలను నివారించడానికి సహాయపడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో గ్లూకోమీటర్తో చక్కెర స్థాయిని తనిఖీ చేసుకుంటూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి మంచిదే. కానీ చాలాసార్లు ఈ పరీక్ష తప్పుగా జరుగుతోందని డయాబెటిస్ నిపుణులు అంటున్నారు. దీని కారణంగా రీడింగ్ కూడా తప్పుగా వస్తుంది. ఇంట్లో రక్తంలో చక్కెరను తనిఖీ చేసేటప్పుడు చాలామంది చేస్తున్న తప్పులేంటి? వాటిని ఎలా నివారించాలి?తెలుసుకుంటే.. చేతులు కడుక్కోకపోవడం.. చాలా మంది చేతులు కడుక్కోకుండానే పరీక్షలు చేసుకుంటారు. చెమట, నూనె లేదా చేతులపై చిన్న ఆహారం ముక్క కూడా తప్పుడు రీడింగ్ ఇస్తుంది. అందువల్ల, రక్తంలో చక్కెరను తనిఖీ చేసే ముందు ఎల్లప్పుడూ చేతులను సబ్బుతో కడుక్కోవాలి. చేతులు పూర్తీగా ఆరిన తరువాత పరీక్ష చేసుకోవాలి. వేలు గుచ్చడానికి ప్రతిసారీ ఒకే వేలును ఉపయోగించడం.. ప్రతిసారీ ఒకే ప్రదేశం నుండి రక్తాన్ని తీయడం వల్ల అక్కడి చర్మం కఠినంగా మారుతుంది. దీని వల్ల రక్తాన్ని తీయడం కష్టమవుతుంది. వేళ్లను మారుస్తూ ఉండాలి. ఒకే వేలును పదే పదే ఉపయోగించకూడదు. పాత స్ట్రిప్స్ వాడకం.. టెస్ట్ స్ట్రిప్స్ కు గడువు తేదీ ఉంటుంది. చాలా సార్లు పాత లేదా తేమతో కూడిన స్ట్రిప్స్ వాడతారు. ఇది తప్పు రీడింగ్ లను ఇస్తుంది. స్ట్రిప్స్ ను ఎల్లప్పుడూ పొడి, చల్లని ప్రదేశంలో ఉంచాలి. అలాగే గడువు తేదీని తనిఖీ చేసుకుంటూ ఉండాలి. రక్త నమూనా తీసుకోవడానికి ఎక్కువ ఒత్తిడి తీసుకురావడం.. కొన్నిసార్లు రక్తం బయటకు రానప్పుడు, వేలిని చాలా గట్టిగా నొక్కుతారు, ఇది కణజాల ద్రవాన్ని రక్తంతో కలిపి రీడింగ్ను ప్రభావితం చేస్తుంది. మృదువుగా గుచ్చాలి. అవసరమైతే చేతిని కొద్దిగా రబ్ చేయాలి, లేదా క్రిందికి వంచాలి. తప్పు సమయంలో తనిఖీ చేయడం.. ఖాళీ కడుపుతో, భోజనం చేసిన 2 గంటల తర్వాత లేదా నిద్రపోయే ముందు రక్తంలో చక్కెరను తనిఖీ చేయడానికి సరైన సమయం. తప్పు సమయంలో తనిఖీ చేయడం వల్ల నివేదిక గందరగోళంగా మారే అవకాశం ఉంటుంది. ఇది తీసుకునే ఆహారం గురించి, వాడాల్సి మందుల గురించి కూడా గందరగోళం క్రియేట్ చేస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreమోషన్ సిక్నెస్.. లాంగ్ జర్నీలలో వాంతుల భయమా? ఒక రోజు ముందు ఇలా చేయండి..!
లాంగ్ జర్నీ చాలామందికి ఇష్టం. అయితే అనుకున్న సులువుగా వీటిని ప్లాన్ చేయడానికి ధైర్యం సరిపోదు. దీనికి కారణం మోషన్ సిక్నెస్. దీన్నే వాంతుల సమస్య, తల తిరగడం అంటారు. ప్రయాణంలో వాంతులు లేదా తల తిరుగుతున్నట్లు అనిపిస్తే ప్రయాణంలోని సరదా అంతా పాడైపోతుంది. మోషన్ సిక్నెస్ అనేది ఒక సాధారణ సమస్య, ఇది ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, స్త్రీలలో సర్వసాధారణం. బస్సు, కారు, రైలు లేదా విమానం..ఇలా ప్రయాణం ఎందులో అయినా సరే.. ప్రయాణించేటప్పుడు మన చెవులు, కళ్ళు, శరీర సమతుల్యత అసౌకర్యానికి లోనైనప్పుడు , వికారం, చెమట, తల తిరగడం, వాంతులు వంటి పరిస్థితులు తలెత్తుతాయి. అయితే ఒక రోజు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ మోషన్ సిక్నెస్ కు చెక్ పెట్టవచ్చు. ప్రయాణాన్ని హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. ఆహారం.. ప్రయాణానికి ఒక రోజు ముందు భారీ, వేయించిన, కారంగా ఉండే ఆహారాన్ని తినకుండా ఉండాలి. ఇది కడుపులో భారంగా మారుతుంది, గ్యాస్ లేదా ఆమ్లత్వం కారణంగా అనారోగ్యం పెరుగుతుంది. తేలికైన, సులభంగా జీర్ణమయ్యే, ఫైబర్ ఆధారిత ఆహారాన్ని తినాలి. నిద్ర.. అలసట, నిద్ర లేకపోవడం శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఇది ప్రయాణ సమయంలో తలనొప్పి లేదా వాంతులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రయాణానికి ఒక రోజు ముందు తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. మందులు.. గతంలో మోషన్ సిక్నెస్ చాలాసార్లు జరిగి ఉంటే వైద్యుల సలహా మందులు వాడవచ్చు. ప్రయాణానికి 30-60 నిమిషాల ముందు వైద్యులు సిఫార్సు చేసిన మందులు తీసుకోవాలి. తద్వారా ప్రయాణం సాఫీగా సాగుతుంది. అల్లం లేదా నిమ్మకాయ నీరు.. అల్లం, నిమ్మకాయ రెండూ కడుపుని శాంతపరచడానికి సహజ నివారణలు. అల్లం టీ లేదా గోరువెచ్చని నిమ్మకాయ నీరు ఒక రోజు ముందుగానే తీసుకోవడం మంచిది. ఇది వికారం అవకాశాలను తగ్గిస్తుంది. ముఖ్యమైన వస్తువులు.. ప్రయాణానికి ఒక చిన్న బ్యాగును సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో వాంతి బ్యాగ్, టిష్యూ పేపర్, పుదీనా క్యాప్సూల్స్, మౌత్ ఫ్రెషనర్, వాటర్ బాటిల్ ఉండాలి. మార్గంలో ఏదైనా అసౌకర్యాన్ని ఎదుర్కొంటే ఈ వస్తువులు సహాయపడతాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreఈ ఇంటి చిట్కా ఫాలో అయితే చాలు.. మోకాళ్ల నొప్పి మాయం కావడమే కాదు.. చకచకా నడిచేస్తారు!
మోకాళ్ల నొప్పులు ప్రజల జీవితాన్ని కష్టతరం చేస్తాయి. దీని కారణంగా, లేవడం, కూర్చోవడం, నడవడం నుండి రోజువారీ పనులు చేయడంలో సమస్యలు తలెత్తుతాయి. మోకాళ్లలో నిరంతరం నొప్పితో బాధపడే వారు ఈ సమస్యకు సర్జరీ లేదా చాలా తీవ్రమైన చికిత్సలతో తప్ప నయం కాదని అనుకుంటూ ఉంటారు. అయితే ఇంటి చిట్కాతో మోకాళ్ల నొప్పిని ఈజీగా తగ్గించవచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఈ చిట్కా వల్ల మోకాళ్ల నొప్పి తగ్గడమే కాదు.. హాయిగా చకచకా తిరిగేసేంత శక్తి మోకాళ్లకు వస్తుంది అంటున్నారు. ఇంతకీ ఆ చిట్కాలేంటో తెలుసుకుంటే.. మోకాళ్లలో వాపు, మోకాళ్లు బిగుసుకుపోయినట్టు ఉండటం, నొప్పి ఎక్కువగా ఉండటం వంటి సమస్యలను తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక పురాతన పేస్ట్ ఉంది. దానిని మోకాలి నొప్పి ఉన్న ప్రాంతంపై పూసి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయం నిద్రలేచిన తర్వాత చాలా ఉపశమనం కలుగుతుందట. ఈ ఆయుర్వేద పేస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే.. పేస్ట్ తయారీ విధానం.. మోకాలి నొప్పి నుండి సహజ ఉపశమనం పొందడానికి, ఆయుర్వేద పేస్ట్ను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీని కోసం కావలసిన పదార్థాలు.. 1 టీస్పూన్ ఆముదం 1 టీస్పూన్ తేనె 1 టీస్పూన్ దాల్చిన చెక్క పొడి 1 నిమ్మకాయ. తయారు విధానం.. ఒక గిన్నెలో అన్ని పదార్థాలను బాగా కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ చాలా గట్టిగా లేదా చాలా పలుచగా ఉండకూడదు. మధ్యస్థంగా మోకాలి మీద రాసినప్పుడు కారిపోకుండా లేదా తొందరగా ఆరిపోయి రాలిపోకుండా ఉండాలి. ఈ పేస్ట్ ను చాలా సులభంగా అప్లై చేయవచ్చు. తయారు చేసుకున్న ఆయుర్వేద పేస్ట్ ను పలుచని పొరలాగా మోకాలిపై నొప్పి ఉన్న ప్రాతంలో లేదా మోకాలు అంతటగా పూయాలి. దానిపై మెత్తని కాటన్ వస్త్రాన్ని చుట్టాలి. 8-10 గంటలు అలాగే ఉంచాలి. దీన్ని రాత్రి సమయంలో అప్లై చేసుకుంటే చాలా మంచిది. ఉదయం గోరువెచ్చని నీటితో సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. ప్రయోజనాలు.. ఈ పేస్ట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీన్ని పూయడం వల్ల వాపు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది మోకాలు బిగుసుకుపోవడాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreగుడికి వెళ్లడం ద్వారా షుగర్ కంట్రోల్ చేయవచ్చట.. ఇదెలాగో తెలిస్తే షాకవుతారు..!
మధుమేహాన్ని నిర్వహించడానికి చాలా పద్ధతులను ప్రయత్నిస్తారు. తీపి ఆహారం తగ్గించడం, చక్కెరకు దూరంగా ఉండటం, అధిక మద్యపానాన్ని నివారించడం, ఒత్తిడిని నిర్వహించడం.. ఇలా చాలా విషయాలు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ గుడికి వెళ్లడం ద్వారా షుగర్ నయమవుతుందని మీరు విన్నారా? గుడికి వెళ్లడం వల్ల రక్తంలో చక్కెర తగ్గుతుందని, కొన్ని సందర్భాల్లో మధుమేహం పూర్తిగా నయమవుతుందని అంటున్నారు. ఇది నిజమే అని పోషకాహార నిపుణులు కూడా పేర్కొనడం గమనార్హం. ఇదెలా అనే విషయం తెలుసుకుంటే.. గుడికి వెళ్లడం అంటే ఇంటి నుండి గుడి ఎంతో కొంత దూరంలో ఉంటుంది. ఇది ఒక చక్కని వాకింగ్ సెషన్ లాంటిది. అంతేకాదు.. గుడికి వెళ్తే అక్కడ మళ్లీ ప్రదక్షిణలు కూడా చేస్తారు. ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ప్రశాంతత. గుడిలో ప్రశాంతత ఉంటుంది. అక్కడ కొట్టే గంట చుట్టు ప్రక్కల వాతావరణాన్ని చాలా పాజిటివ్ గా ఉంచుతుంది. గుడి చుట్టూ ఉండే మొక్కలు, ఇతర విషయాలు కూడా చాలా పాజిటివ్ గా ఉంచుతాయి. ఇది సహజంగానే మనిషిలో ఒత్తిడి తగ్గిస్తుంది. రక్తప్రసరణ సక్రమంగా ఉండేలా చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. సాధారణంగానే రోజుకు ఒక 10వేల అడుగులు వేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను చాలా వరకు నియంత్రించవచ్చు. అంతేకాదు.. ప్రీడయాబెటిస్ ను కూడా నయం చేయవచ్చు. ఇలా గుడికి వెళ్తూ కార్బోహేడ్రేట్స్ అధికంగా ఉన్న ఆహారాన్ని నియంత్రించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకుంటే మధుమేహం నియంత్రణ.. కొన్నేళ్లు ఇలా చేస్తే మధుమేహాన్ని నయం చేయడం సాధ్యమే.. అంటున్నారు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreబిపి అదుపులో ఉండాలంటే వారానికి ఎన్ని నిమిషాలు వ్యాయామం చేయాలంటే..?
బిపి ని సాధారణంగా రక్తపోటు అని కూడా పిలుస్తారు. హై బిపి ఉంటే మాత్రం దాన్ని అధిక రక్తపోటు అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ఆరోగ్య సమస్య. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్లకు కారణమవుతుంది. వృద్ధాప్యంలో చిత్తవైకల్యం వచ్చే ప్రమాద కారకంగా కూడా ఉంటుంది. ప్రతి నలుగురు పురుషులలో ఒకరు, దాదాపు ఐదుగురు స్త్రీలలో ఒకరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. కానీ చాలా మందికి దీని గురించి స్పష్టంగా తెలియదు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. బిపిని నిర్వహించడానికి సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చాలా ముఖ్యమైనవి. వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే వారానికి ఎన్నినిమిషాలు లేదా గంటలు వ్యాయామం చేయాలనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. హై బిపి అంటే.. అధిక రక్తపోటు అనేది ఒక తీవ్రమైన సమస్య. దీనిలో ధమని గోడలపై రక్త పీడనం సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. దీని అర్థం గుండె రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధితో సహా అనేక వ్యాధులకు కారణమవుతుంది. హై బిపి ప్రమాదం తగ్గించాలంటే.. అధిక రక్తపోటు నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, క్రమం తప్పకుండా వ్యాయామం, వ్యాయామ అలవాట్లను కూడా అలవర్చుకోవాలి. శరీరంలో అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయడానికి ఈ అలవాట్లు కూడా అవసరం. ఇది అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఎన్ని గంటల వ్యాయామం? ఏ వ్యాయామాలు చేయాలి? వయోజన వ్యక్తులు అయితే ప్రతి వారం కనీసం ఐదు గంటలు మితమైన వ్యాయామం చేస్తే అధిక రక్తపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ముఖ్యంగా వారు 60 సంవత్సరాల వయస్సు వరకు వ్యాయామ అలవాటును కొనసాగించడం మంచిది. వారానికి 5 గంటల వ్యాయామం, ఇందులో కొన్ని తీవ్రమైన ఏరోబిక్ కార్యకలాపాలు, మితమైన తీవ్రత కలిగిన వ్యాయామాల కలయిక ఉండాలి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వ్యాయామం ఎలా హెల్ప్ అవుతుంది? వ్యాయామం రక్తపోటును ఎలా నియంత్రించడంలో సహాయపడుతుందో అని చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే అది గుండెను బలపరుస్తుంది. బలమైన గుండె ఎక్కువ కష్టపడకుండానే ఎక్కువ రక్తాన్ని పంప్ చేయగలదు. ఈ విధంగా రక్త నాళాలపై బలం తగ్గుతుంది. ఫలితంగా రక్తపోటు తగ్గుతుంది. సాధారణ రక్తపోటు 120/80 mmHg లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreవర్షాకాలంలో ఈ 5 కూరగాయలు కొనకపోవడమే మంచిది..!
సీజన్ ను బట్టి ఆహారపు అలవాట్లు మార్చుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా సీజన్ తో పాటు కొన్ని రకాల కూరగాయలను కొత్తగా జత చేసుకోవడం లేదా కొన్ని తినకుండా వదిలిపెట్టడం వంటివి చేస్తారు. అదే విధంగా వర్షాకాలంలో 5 రకాల కూరగాయలు తినడం మంచిది కాదని, సాధ్యమైతే వీటిని ఈ వర్షాకాలంలో పూర్తీగా వదిలిపెట్టడం మంచిదని అంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. ఇంతకీ వర్షాకాలంలో వదిలిపెట్టాల్సిన కూరగాయలు ఏమిటి? వాటిని ఎందుకు వదిలిపెట్టాలి? తెలుసుకుంటే.. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. చాలామంది క్యాబేజీ తినడం తగ్గిస్తారు. దాని నుండి వచ్చే పురుగులు చాలా ప్రమాదకరమైనవిగా భావిస్తారు. కానీ క్యాబేజీ మాత్రమే కాకుండా పురుగులు ఉన్న కూరగాయలు చాలా ఉన్నాయి. అవి శుభ్రం చేసిన తర్వాత కూడా అందులో పురుగులు పూర్తిగా బయటకు రావు. అందుకే వర్షాకాలంలో కొన్ని కూరగాయలు అస్సలు తినకూడదని అంటారు. ఆకుకూరలు.. పాలకూర, మెంతికూ, ఆవాల చెట్టు ఆకులు .. ఇలా చాలా రకాల ఆకుకూరలు వర్షాకాలంలో తినకపోవడమే మంచిది. వాటిని ఎంత బాగా కడిగినా కొన్ని కంటికి కనిపించనంత సన్నని పురుగులు, సూక్ష్మజీవులు అలాగే ఉంటాయి. క్యాబేజీ, క్యాలిఫ్లవర్.. క్యాబేజీ, కాలీఫ్లవర్ లలో పొరలు, పువ్వులు ఉంటాయి. ఈ పొరల మధ్య తేమ, బ్యాక్టీరియా, ఫంగస్ సులభంగా పెరుగుతాయి. వీటిని తినకపోవడమే మంచిది. ఒకవేళ వీటిని తినాలని అనుకుంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి ఆ నీటిలో వీటిని బాగా కడగాలి. పుట్టగొడుగు.. వర్షాకాలంలో సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా చాలామంది విటమిన్-డి కోసం అయినా పుట్టగొడుగులను తినాలని అనుకుంటారు. పైగా వర్షాల కారణంగా పుట్టగొడుగులు కూడా బాగా పండుతాయి. కానీ పుట్టగొడుగులు ఎంత ఆరోగ్యమూ.. వీటిని సరిగ్గా శుభ్రం చేయకపోతే లేదా కొద్దిగా కలుషితమైనా చాలా చెడ్డ చేస్తుంది. పుట్టగొడుగులు ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతాయి. బంగాళదుంపలు.. ఆహార నిపుణుల ప్రకారం వర్షాకాలంలో బంగాళాదుంపలు తినకపోవడం మంచిది. ఎందుకంటే బంగాళదుంపలు త్వరగా మొలకెత్తుతాయి. కాబట్టి బంగాళాదుంపలను ఇలా తినకూడదు. అయితే, సరిగ్గా నిల్వ చేస్తే బంగాళాదుంపలు త్వరగా మొలకెత్తవు . వీటిని అయితే తినవచ్చు. జాగ్రత్త.. వర్షాకాలంలో కూరగాయలు అయినా ఆకుకూరలు అయినా చాలా తాజాగా ఉండాలి. తాజాగా ఉన్నా సరే.. వీటిని వేడి నీటిలో ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మాత్రమే వండుకోవాలి. లేకపోతే వీటిలో ఆరోగ్యానికి హాని కలిగించే పురుగులు, రసాయనాలు, సూక్ష్మక్రిములు ఉంటాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreగుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 అలవాట్లు..!
ఈ రోజుల్లో చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్లు గుండె ఆరోగ్యంపై చాలా చెడ్డ ప్రభావాన్ని చూపుతాయి. అంతేకాకుండా మన చిన్న చిన్న రోజువారీ అలవాట్లు గుండెకు హాని కలిగిస్తాయి. ఇవి క్రమంగా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. దీనితో పాటు నేటికాలంలో అన్ని సమస్యలకు మందులు వాడటం, ఖరీదైన చికిత్సలు తీసుకోవడం కూడా కొన్నిసార్లు శరీరానికి హాని కలిగిస్తాయి. అధిక వ్యాయామం కూడా గుండెపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇలా నేటి కాలంలో చాలా కారణాలుగా గుండె జబ్బుల ప్రమాదం క్రమేపీ పెరుగుతోంది. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే.. కొన్ని సులభమైన, ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. ఇది శరీరానికి ఎటువంటి హాని లేకుండా చేస్తుంది. అటువంటి 5 సులభమైన అలవాట్ల గురించి తెలుసుకుంటే.. భోజనం తర్వాత నడక.. భోజనం తర్వాత 10 నిమిషాల నడక చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే కూర్చునే అలవాటును మార్చుకోవాలి. ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాల తేలికపాటి నడక చేయాలి. ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువు పెరగకుండా నిరోధిస్తుంది. ఒమేగా-3 ఫ్యాట్స్.. రోజువారీ ఆహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉండేలా చూసుకోవాలి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇది గుండె, మెదడు, వాపును నియంత్రించడంలో సహాయపడుతుంది. సాల్మన్, చేపలు, అవిసె గింజలు, వాల్నట్ల వంటి వాటి నుండి ఒమేగా-3ని పుష్కలంగా పొందవచ్చు. నిద్ర.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ 7-9 గంటలు మంచి నిద్ర పొందడం ముఖ్యం. ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఫోన్ వాడటం, టీవీ చూడటం అలవాటు కారణంగా నిద్ర సైకిల్ దారుణంగా దెబ్బతింటోంది. తక్కువ నిద్రపోవడం వల్ల ఊబకాయం, వ్యాధులు, అలసట వంటి సమస్యలు వస్తాయి. ప్లాస్టిక్ నిషేధం.. మంచి గుండె ఆరోగ్యానికి ప్లాస్టిక్ వస్తువులను నివారించడం, గాజు లేదా స్టీల్ కంటైనర్లు ఉపయోగించడం ముఖ్యం. ప్లాస్టిక్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి హార్మోన్లకు, శరీరానికి హాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ రసాయనాలు నెమ్మదిగా శరీరంలో విషాన్ని వ్యాపింపజేస్తాయి. ఇది క్యాన్సర్, ఇతర వ్యాధులకు కారణమవుతుంది. అందువల్ల ఆహారాన్ని నిల్వ చేయడానికి గాజు లేదా స్టీల్ పాత్రలు మంచివి. ఇవి గుండె ఆరోగ్యానికి అలాగే మొత్తం ఆరోగ్యానికి సురక్షితమైనవి. బరువు.. మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బరువు, BMI ని చూస్తే సరిపోదు. రక్త పరీక్షలపై కూడా శ్రద్ధ వహించాలి. బరువు లేదా BMI కంటే రక్త పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. LDL, CRP, ఫాస్టింగ్ ఇన్సులిన్ వంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు. గుండె జబ్బులను నివారించడానికి ఇది ఉత్తమ మార్గం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం వల్ల సమస్యలను ముందుగానే గుర్తించవచ్చు. ఆహారం.. గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుకోవాలంటే ఆహారంలో పండ్లు, ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలి. వాటిలో గుండెను బలంగా, ఆరోగ్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి. వాటిని సరిగ్గా తినకపోతే, అది గుండెకు హాని కలిగిస్తుంది. ఈ రోజుల్లో, చాలా మంది ఏదో ఒక విషయం గురించి ఒత్తిడి తీసుకోవడం చాలా సహజం అయిపోయింది. ఇది గుండెపై కూడా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreజాగ్రత్త.. బెర్రీలు తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినకూడదు..!
బెర్రీలు చాలా మంది ఇష్టంగా తినే పండ్లు. వీటిలో బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ.. ఇట్లా చాలా రకాలు ఉంటాయి. తియ్యగా, పుల్లగా ఉంటూ ప్రత్యేకమైన సువాసన కలిగి ఉండే బెర్రీలు అంటే అందరికీ ఇష్టమే.. వీటిని ఉపయోగించి చేసే జ్యూస్ లు, స్మూతీలు, ఐస్ క్రీమ్ లకు చాలా ఆదరణ ఉంది. వీటి ప్లేవర్ అంత బాగుంటుంది మరి. అయితే బెర్రీలు తినగానే కొన్ని రకాల ఆహారాలు, ద్రవ పదార్థాలు అస్సలు తీసుకోకూడదు అంట. అలా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడి ఫుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుందట. ఇంతకీ బెర్రీలు తిన్న తరువాత తీసుకోకూడని పదార్థాలు ఏంటో తెలుసుకుంటే.. పాలు.. బెర్రీలు తిన్న తర్వాత పాలు తీసుకోవడం కానీ, లేక పాలు కలిపి బెర్రీలను తినడం కానీ ఆరోగ్యానికి మంచిది కాదట. ఇది జీర్ణక్రియకు ప్రమాదకరం. రెండూ కలిసి యాసిడ్-బేస్ రియాక్షన్కు కారణమవుతాయి. దీని వలన గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. దోసకాయ.. దోసకాయ, బెర్రీలు రెండూ శరీరాన్ని చల్లబరిచే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరంలో అవసరానికి మించి చల్లదనం పెరుగుతుంది. ఇది జలుబు, అజీర్ణానికి కారణమవుతుంది. నీరు.. బెర్రీలు తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల కడుపులో గ్యాస్, తిమ్మిర్లు, కొన్నిసార్లు వాంతులు కూడా వస్తాయి. బెర్రీలు తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాత నీరు త్రాగాలి. ఊరగాయలు.. బెర్రీలు, ఊరగాయలు రెండూ పుల్లగా, ఆమ్లంగా ఉంటాయి. వీటిని కలిపి తినడం వల్ల ఆమ్లత్వం, గుండెల్లో మంట, కడుపు నొప్పి వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. అందుకే బెర్రీలు తిన్న తర్వాత ఊరగాయల జోలికి పోకూడదు. సిట్రస్ పండ్లు.. నారింజ, నిమ్మ వంటి పండ్లను సిట్రస్ పండ్లు అంటారు. బెర్రీలను తిన్న వెంటనే సిట్రస్ పండ్లను తినకూడదు. ఎందుకంటే ఈ రెండూ పుల్లని పండ్లు. దీనివల్ల విరేచనాలు, కడుపు నొప్పి వస్తుంది. కూల్ డ్రింక్స్.. బెర్రీలు తిన్న తర్వాత చల్లని పానీయాలు తాగకూడదు. దీని వల్ల శరీరంలో రసాయన ప్రతిచర్య ఏర్పడుతుంది. ఇందులో ఉండే చక్కెర, కార్బన్ డయాక్సైడ్ బెర్రీలలో ఉండే సహజ ఆమ్లంతో కలిసిపోయి గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read moreరోజూ పచ్చి టమోటాలు తింటే జరిగే మేలు ఏంటో తెలుసా?
భారతీయ వంటగదిలో టమోటా ఒక ముఖ్యమైన భాగం. అది కూరలో అయినా, సలాడ్ అయినా లేదా చట్నీ అయినా టమోటా లేకుండా రుచి అసంపూర్ణంగా అనిపిస్తుంది. అయితే టమోటాను ఇలా కూరలలో కాదు.. పచ్చిగా తినమని చెబుతున్నారు ఆహార నిపుణులు. దీని వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయట. పచ్చి టమోటాలలో లైకోపీన్, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ శరీరంలోని వివిధ భాగాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. సాధారణంగా సలాడ్ లో పచ్చి టమోటా చేర్చుకోవడం చూస్తూంటాం. ప్రతిరోజూ పచ్చి టమోటా తినడం వల్ల కలిగే 6 గొప్ప ప్రయోజనాలను తెలుసుకుంటే.. చర్మానికి చేసే మేలు.. పచ్చి టమోటాలలో ఉండే లైకోపీన్, విటమిన్ సి చర్మానికి సహజమైన బూస్టర్గా పనిచేస్తాయి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ప్రతిరోజూ పచ్చి టమోటా తినడం వల్ల చర్మం మెరుపు పెరుగుతుంది. వృద్ధాప్య సంకేతాలు నెమ్మదిస్తాయి. మొటిమలు లేదా జిడ్డుగల చర్మం సమస్యలు ఉంటే టమోటాలు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి.. టమోటాలలో లభించే లైకోపీన్, పొటాషియం, ఫోలేట్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఇది రక్తపోటును సమతుల్యం చేస్తుంది, కొలెస్ట్రాల్ను నియంత్రిస్తుంది, రక్త నాళాలు దెబ్బతినకుండా నిరోధిస్తుంది. ప్రతిరోజూ పచ్చి టమోటాలు తినడం వల్ల గుండె జబ్బులు, ముఖ్యంగా గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికి టమోటాలు సహజ ఔషధంగా పనిచేస్తాయి. దీనిని సలాడ్, జ్యూస్ లేదా నేరుగా కోసి తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు తగ్గడంలో.. బరువు తగ్గించుకునే ప్రయాణంలో ఉన్నవారికి టమోటా భలే సహాయపడుతుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, ఫైబర్, నీరు ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా సేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. టమోటా జీవక్రియను కూడా సక్రియం చేస్తుంది. శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును నెమ్మదిగా కాల్చడంలో సహాయపడుతుంది. పొట్ట ఆరోగ్యానికి.. టమోటాలలో ఉండే ఫైబర్, సహజ ఆమ్లాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది గ్యాస్, ఆమ్లతత్వం, మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. ప్రతిరోజూ టమోటా తినడం వల్ల కడుపు శుభ్రపడుతుంది, పేగు పనితీరు మెరుగుపడుతుంది. దీనితో పాటు, ఇది ప్రేగులలో ఉండే మంచి బ్యాక్టీరియాకు మద్దతు ఇస్తుంది, ఇది మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తి.. టమాటాలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, వైరల్, అలెర్జీలతో పోరాడటానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మారుతున్న వాతావరణంలో శరీరం సులభంగా అనారోగ్యానికి గురవుతుంది. ఇలాంటి వాతావరణంలో టమోటా రోగనిరోధక శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇది పిల్లలు, వృద్ధులకు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పూర్తి పోషకాలను పొందడానికి దీనిని తాజాగా తినడం మంచిది. డిటాక్స్ చేస్తుంది.. టమోటాలు శరీరం నుండి విషాన్ని తొలగించే సహజ నిర్విషీకరణ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది కాలేయం, మూత్రపిండాలను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది, శరీరాన్ని శుభ్రపరుస్తుంది. బయటి ఆహారాన్ని ఎక్కువగా తినేవారికి లేదా అనారోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉన్నవారికి ప్రతిరోజూ టమోటాలు తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీర శక్తిని కూడా నిర్వహిస్తుంది, అలసటను దూరం చేస్తుంది. ఉదయం లేదా భోజనానికి ముందు టమోటాను తినడం మంచి ప్రయోజనాలు కలిగిస్తుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
read more



.webp)





.webp)

.webp)


.webp)




.webp)
.webp)

.webp)