వేసవిలో రోజుకు ఎన్ని నీళ్లు తాగాలి? తెలుసుకోకుంటే నష్టపోతారు..!

వేసవి కాలం వచ్చేసరికి మన శరీరానికి ఎక్కువ నీరు అవసరం. చెమట ద్వారా శరీరం నుండి చాలా నీరు పోతుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా మంది తగినంత నీరు తాగరు, దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అసలు ఒక సాధారణ మనిషి రోజుకు ఎంత నీరు త్రాగాలి అనే ప్రశ్న చాలా మందికి గందరగోళం కలిగిస్తుంది. వైద్యులు కూడా నీరు తాగే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ ఉంటారు.  వేసవిలో ఎంత నీరు తాగాలి అనే విషయం తెలుసుకుంటే చాలా మంది చాలా సమస్యల నుండి బయటపడతారు.  ఇంతకీ వేసవిలో ఎన్ని నీరు తాగాలి తెలుసుకుంటే.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేసవిలో పెద్దలు సాధారణంగా రోజుకు 8-10 గ్లాసుల నీరు త్రాగాలని సలహా ఇస్తారు. అంటే ప్రతిరోజూ 2-3 లీటర్ల నీరు త్రాగాలి. అయితే, ఈ పరిమాణం వ్యక్తి శారీరక శ్రమ, వాతావరణం,  ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది.  ఎక్కువ వ్యాయామం చేస్తే లేదా శారీరకంగా కష్టతరమైన పని చేస్తే ఎక్కువ నీరు త్రాగవలసి ఉంటుంది. అలాగే వేడి వాతావరణంలో నివసించే ప్రజలు ఎక్కువ నీరు త్రాగాలి. తక్కువ నీరు తాగడం వల్ల కలిగే సమస్యలు.. నీరు మన శరీరానికి ఇంధనం లాంటిదని అందరికీ తెలుసు. ఇది మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ నీరు త్రాగడం వల్ల శరీరం అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది, ఇవి చిన్న సమస్యల నుండి ప్రారంభమై తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది. ఆ సమస్యలు ఏంటంటే.. డీహైడ్రేషన్.. నీరు లేకపోవడం వల్ల అలసట, తలతిరగడం, తలనొప్పి, నోరు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. చాలా సార్లు డీహైడ్రేషన్ కారణంగా మూర్ఛపోయే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకే  ప్రతి వ్యక్తి వేసవి కాలంలో ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలి. జీర్ణ సమస్యలు.. జీర్ణక్రియకు నీరు చాలా ముఖ్యం. తక్కువ నీరు త్రాగడం వల్ల మలబద్ధకం రావడం చాలా సాధారణం. అదనంగా గ్యాస్, ఉబ్బరం,  అజీర్ణం వంటి పొట్ట సమస్యలు కూడా పెరగవచ్చు. మూత్రపిండాలపై ప్రభావం.. మూత్రపిండాలు శరీరం నుండి విషాన్ని తొలగిస్తాయి. మూత్రపిండాల పనితీరులో  నీరు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. మూత్రపిండాల్లో రాళ్ళు లేదా మూత్ర ఇన్ఫెక్షన్ల  ప్రమాదం పెరుగుతుంది.  దీనిని నివారించడానికి, జుకు 2-3 లీటర్ల నీరు తప్పనిసరిగా త్రాగాలి.                                     *రూపశ్రీ   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

read more
ఈ ఒక్క తప్పు శరీరంలో కాల్షియంను కోల్పోయేలా చేస్తుంది..!

శరీర బలం చాలా వరకు  ఎముకలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎముకలు  మన అవయవాలకు లోపల  బయటి నుండి రక్షణ కల్పిస్తాయి. కానీ చాలా మందికి ఉండే ఒక తప్పుడు  అలవాటు  ఎముకలను బలహీనపరుస్తుందని  తెలుసా? నిజం ఆ ఒక్క తప్పు వల్ల  శరీరానికి అవసరమైనంత కాల్షియం తీసుకున్నా సరే.. అది స్పాంజ్ నీటిని పీల్చేసినట్టు.. ఆ ఒక తప్పు శరీరంలో కాల్షియంను పీల్చుకుని ఎముకలను పెళుసుగా మారుస్తాయి. ఇంతకీ ఆ తప్పేంటో తెలుసుకుంటే.. సూర్యకాంతి లేకపోవడం.. శరీరంలో కాల్షియం లోపానికి ప్రధాన కారణం ఎండలో బయటకు వెళ్లకపోవడమే.  ఎండలో కూర్చోవడం వల్ల  శరీరానికి విటమిన్ డి లభిస్తుంది. శరీరంలో కాల్షియంకు ఇది చాలా ముఖ్యమైనది. అందుకే రోజూ ఉదయాన్నే  కొద్దిసేపు సూర్యుడి లేత కిరణాలు ఉన్నప్పుడు ఆ ఎండలో కనీసం 10 నుండి 30 నిమిషాలు గడపాలి. సూర్యకాంతి,  విటమిన్ డి.. శరీరానికి అవసరమైన విటమిన్లలో విటమిన్ డి కూడా ముఖ్యమైనది.  ఈ విటమిన్-డి  అవసరాన్ని తీర్చడానికి,  కొంత సమయం ఎండలో కూర్చోవడం ముఖ్యం.సూర్యకాంతి శరీరంలో ఉన్న మంచి కొలెస్ట్రాల్ పై పడినప్పుడు అది  శరీరంలో విటమిన్ డి ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. దీని ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్-డి అదే శరీరంలో తయారు అవుతుంది.  ఇలా విటమిన్-డి తయారు కాకపోతే.. విటమిన్-డి లోపం ఏర్పడి శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఎండలో కూర్చోవడం తప్పనిసరి.. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఎండలు,   ఉష్ణోగ్రత పెరగుదల ఎక్కువ ఉంది.  ఖచ్చితంగా ఉదయం సూర్యరశ్మిని శరీరానికి సోకేలా ప్లాన్ చేసుకోవాలి.  ఎందుకంటే ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికాకపోవడం వల్ల  విటమిన్ డి లోపంతో బాధపడవచ్చు. సూర్యకాంతికి ఏ  సమయం  మంచిది? ఆరోగ్య నిపుణులు ఉదయం 10 గంటల లోపు,  సాయంత్రం 4 గంటల తరువాత నుండి 6 గంటల వరకు ఉత్తమ సమయంగా భావిస్తారు. ఎందుకంటే ఈ సమయంలో సూర్యకాంతి శరీరానికి బాగా పనిచేస్తుంది. ఇది విటమిన్-డి ఉత్పత్తికి సహాయపడుతుంది. ఎంత సమయం.. ప్రతి రోజూ సూర్యరశ్మి కనీసం 15 నుండి 30 నిమిషాలు శరీరానికి సోకేలా చూసుకోవాలి.  తీవ్రమైన ఎండ చర్మాన్ని దెబ్బతీస్తుంది.  కాబట్టి లేత సూర్య కిరణాలు మాత్రమే శరీరానికి మేలు చేస్తుంది.                                *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
శరీరంలో రక్తం తక్కువ ఉంటే.. ఈ లక్షణాలు కనిపిస్తాయి..!

  మనిషిలో ప్రాణ శక్తి అంతా రక్తంలోనే ఉంటుంది.  రక్తం శరీరంలో ప్రవహిస్తూ ఉంటేనే మనిషి జీవితం కొనసాగుతుంది. అయితే చాలా మంది రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు ఎక్కువ శాతం రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారు.  రక్తహీనత అంటే శరీరంలో తగినంత రక్తం లేకపోవడం. అంటే శరీరంలో హిమోగ్లోబిన్ లోపించడం. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో 12 పాయింట్లకు పైగా హిమోగ్లోబిన్ ఉండాలని వైద్యులు చెబుతారు. అయితే తక్కువ హిమోగ్లోబిన్ ఉంటే మహిళలలో కొన్ని రకాల లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. చర్మం... ముఖం తెల్లగా మారడం మొదలైతే చాలా మంది తాము మంచి రంగుకు మారుతున్నాం అని పొరబడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇది రంగు మారడం కాదు అది  శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల చర్మం రంగు గణనీయంగా మార్పుకు లోనవుతుంది. చర్మం ఎర్రగా ఉంటే శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత ఉన్నట్టు అర్థం. పొడిబారడం.. ముఖం మీద చర్మం పొడిగా మారితే అది శరీరంలో రక్తం లేకపోవడాన్ని సూచిస్తుంది. రక్తం లేకపోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం  కూడా  తగ్గడం ప్రారంభమవుతుంది. ఇది చర్మం పొడిబారడానికి కారణమవుతుంది. నల్ల మచ్చలు.. ముఖం మీద కళ్ళ చుట్టూ నల్లటి మచ్చలు కనిపించడం మొదలైతే  రక్త పరీక్ష చేయించుకోవాలి. శరీరంలో రక్తం లేకపోవడానికి అతిపెద్ద సంకేతం నల్లటి వలయాలు లేదా నల్ల మచ్చలు. హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవడం ద్వారా శరీరంలో రక్తం ఎన్ని పాయింట్లు ఉందో తెలుసుకోవచ్చు. మొటిమలు రక్తం లేకపోవడం వల్ల  ముఖం మీద మొటిమలు సమస్య రావచ్చు. ఎందుకంటే తక్కువ రక్తంలో టాక్సిన్స్ ఎక్కువగా పెరుగుతాయి. ఇది మొటిమలు వంటి సమస్యలను కలిగిస్తుంది.                                       *రూపశ్రీ.

read more
చిన్న విషయాలకే కోపం వస్తోందా? సెకెండ్ల వ్యవధిలో చిరాకు పుడుతోందా? సమస్య ఇదే కావచ్చు..!

చిన్న విషయాలకే కోపంగా ఉంటారా?  ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడుతున్నారా? అవును అయితే ఇది కేవలం మానసిక స్థితిలో మార్పు మాత్రమే కాదు మీ శరీరంలో కొన్ని ముఖ్యమైన విటమిన్ల లోపానికి సంకేతం కూడా కావచ్చని అంటున్నారు ఆరగ్య నిపుణులు. కోపం,  చిరాకు అనేది ఒత్తిడి లేదా పని ఒత్తిడి వల్ల మాత్రమే వస్తుందని మనం తరచుగా అనుకుంటాము. కానీ వాస్తవానికి పోషకాహార లోపం కూడా దీని వెనుక ఒక పెద్ద కారణం కావచ్చు. ఎప్పుడైనా ఇంట్లో వాళ్లు మాట్లాడుతుంటే..  లేదా ఇంట్లో వాళ్లు ఏదైనా సాధారణ పని చెబితే ఊహించని విధంగా వారి మీద అరిచేస్తుంటాం.  అలాగే స్నేహితులు,  చుట్టాలు,   తెలిసిన వారు పలకరించినప్పుడు  లేదా ఏదైనా విషయం గురించి సమాచారం అడిగినప్పుడు చిరాకుగా సమాధానం ఇస్తుంటారు.  ఎదుటి వ్యక్తులు ఈ మాత్రం దానికే ఇంత కోపమా? అని,  ఈ మాత్రం దానికే ఇలా చిరాకు పడాలా అని అనుకుంటూ ఉంటారు.  అయితే ఇదంతా మనిషి ఒత్తిడి వల్ల కలిగే సమస్య లేదా వాతావరణం వల్ల కలిగే సమస్య కానే కాదట.  ఇది స్పష్టంగా ఆహారం వల్ల వచ్చే సమస్య కూడా కావచ్చు అని అంటున్నారు ఆహార నిపుణులు,  ఆరోగ్య నిపుణులు. ఏ విటమిన్ లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయో తెలుసుకుంటే.. మనకు ఎందుకు కోపం, చిరాకు వస్తుంది? కొన్నిసార్లు చిన్న విషయాలకే కోపంగా మాట్లాడటం లేదా ఎటువంటి కారణం లేకుండా చిరాకు పడటం మీ మనస్సు,  శరీర స్థితిని ప్రతిబింబిస్తుంది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం,  హార్మోన్ల మార్పులు దీనికి ప్రధాన కారణాలు.  కానీ అవసరమైన పోషకాలు లేకపోవడం కూడా మానసిక స్థితిని పాడు చేస్తుంది. శరీరానికి అవసరమైన విటమిన్లు అందనప్పుడు నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది.  ఇది  మానసిక స్థితిని నేరుగా ప్రభావితం చేస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ లోపం.. విటమిన్ బి కాంప్లెక్స్‌లో బి1, బి6,  బి12 వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లన్నీ మన మనస్సును ప్రశాంతంగా,  సంతోషంగా ఉంచడంలో సహాయపడతాయి. వాటి లోపం మెదడులోని సెరోటోనిన్,  డోపమైన్ వంటి న్యూరోట్రాన్స్మిటర్లను తగ్గిస్తుంది. ఇది మానసిక స్థితిలో మార్పులు,  కోపాన్ని పెంచుతుంది. విటమిన్ డి లోపం.. విటమిన్ డి సూర్యకాంతి నుండి లభిస్తుంది.  కాబట్టి దీనిని 'సూర్యరశ్మి విటమిన్' అని పిలుస్తారు. దీని లోపం మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.  దీని లోపం వల్ల  వ్యక్తి నిరాశగా,  చిరాకుగా అనిపించవచ్చు. మీరు ఎండలో తక్కువ సమయం గడిపినట్లయితే, విటమిన్ డి స్థాయిలు తగ్గవచ్చు. మెగ్నీషియం,  జింక్ లోపం..  మానసిక స్థితిని నియంత్రించడంలో మెగ్నీషియం,  జింక్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వాటి లోపం నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.  కోపాన్ని నియంత్రించడం కష్టమవుతుంది. విటమిన్లను ఎలా చూసుకోవాలి? ప్రతిరోజూ కనీసం 20-30 నిమిషాలు ఎండలో గడపాలి. ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పాలు,  గుడ్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. వైద్యుడి సలహా మేరకు  సప్లిమెంట్లను తీసుకోవచ్చు.  యోగా,  ధ్యానం నుండి చాలా ప్రయోజనం పొందవచ్చు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
శాకాహారులు భయపడక్కర్లేదు.. గుడ్లకంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఈ ఆహారాలు తినండి..!

  ఆహారంలో ప్రోటీన్ కు చాలా ప్రత్యేక స్థానం ఉంది.  కండరాల నిర్మాణానికి,  శరీరం బలంగా ఉండటానికి ప్రోటీన్ చాలా అవసరం. అయితే శాకాహారులలో ప్రోటీన్ కు సంబంధించి భయాలు ఎక్కువ ఉంటాయి.  దీనికి కారణం.. ప్రోటీన్ అంటే మాంసాహారం లోనే ఉంటుందని నమ్మడం. చాలా వరకు ప్రోటీన్ కోసం అధిక శాతం మంది గుడ్లు ఎక్కువ తీసుకుంటారు.  కానీ గుడ్ల కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన కొన్ని శాఖాహార ఆహారాలు ఉన్నాయి.  మీరు శాఖాహారులు అయి, కండరాలను బలంగా పెంచుకోవాలనుకుంటే, ఈ సూపర్‌ఫుడ్‌లను మీ ఆహారంలో చేర్చుకోవడం మర్చిపోవద్దు. ఇవి మీ శరీరానికి ఉక్కులాంటి బలాన్ని ఇవ్వడమే కాకుండా కండరాలను నిర్మించడంలో కూడా సహాయపడతాయి.. సోయాబీన్.. సోయాబీన్‌ను శాఖాహార ప్రోటీన్లకు రాజు అంటారు. ఇందులో 100 గ్రాములకు దాదాపు 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్డు కంటే చాలా రెట్లు ఎక్కువ! సోయాబీన్స్‌లో కండరాల నిర్మాణానికి సహాయపడే అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. దీనిని టోఫు, సోయా పాలు లేదా సోయా ముక్కలుగా తినవచ్చు. శనగపప్పు.. మన భారతీయ ఆహారంలో శనగపప్పు ఒక ముఖ్యమైన భాగం. 100 గ్రాముల శనగలల దాదాపు 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అది కాబూలి శనగలు  అయినా లేదా మినప్పప్పు అయినా రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పప్పుధాన్యాలు.. పప్పులు, పెసలు, శనగ,  మినపప్పు వంటి పప్పుధాన్యాలు ప్రోటీన్కు  అద్భుతమైన వనరులు. 100 గ్రాముల పప్పు దినుసులలో దాదాపు 24 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో ప్రోటీన్ మాత్రమే కాకుండా ఐరన్ మరియు ఫైబర్,  పుష్కలంగా ఉంటాయి. పనీర్.. పనీర్ దాదాపు ప్రతి ఇంట్లోనూ ఉపయోగించబడుతుంది. 100 గ్రాముల పనీర్ ల  దాదాపు 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో మంచి మొత్తంలో కాల్షియం ఉంటుంది. వేరుశనగ.. వేరుశెనగలు చౌకగా ఉండటమే కాకుండా ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల వేరుశెనగలో దాదాపు 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీనిని స్నాక్ గా లేదా వేరుశెనగ వెన్న రూపంలో తినవచ్చు.                                    *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ఈ ఆహారాలను పెరుగుతో తింటే పాయిజన్ అవుతాయట..!

    పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. రుచిలో కూడా పెరుగు చాలా బాగుంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు నిల్వ ఉండేలా చూసుకుంటారు.  బయట మార్కెట్లో కూడా పెరుగు అమ్మకాలు,  మజ్జిగ అమ్మకాలు బాగా పెరుగుతాయి.  పెరుగును చిలికి రోజంతా కొద్ది కొద్దిగా మజ్జిగ రూపంలో తీసుకుంటూ ఉంటే అస్సలు వడదెబ్బ కొట్టదు.  వేసవి కారణంగా వేధించే వేడి దరి చేరదు.    కానీ పెరుగు  కొన్ని కారణాల వల్ల పెరుగు కూడా ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కొన్ని ఆహార పదార్థాలతో  తినడం వల్ల  చాలా నష్టం చేకూరుస్తుంది.  కొన్ని పదార్థాలతో తింటే పెరుగు పాయిజన్ గా మారుతుందని ఆహార నిపుణులు అంటున్నారు.  ఇంతకీ  పెరుగుతో తినకూడని 4 ఆహారాలు ఏంటి? తెలుసుకుంటే.. సిట్రస్ పండ్లు పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా చెడ్డది. నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పుల్లని పండ్లను పెరుగుతో ఎప్పుడూ తినకూడదు. పుల్లని పండ్లలో ఉండే ఆమ్ల గుణం పెరుగుతో కలిసి కలుపులో వాయువులు ఏర్పడటానికి దారి తీస్తుంది.  ఇది ఉబ్బరం,  గ్యాస్,  ఛాతీలో మంట వంటి సమస్యలకు కారణం అవుతుంది. డెజర్ట్‌లు స్వీట్లు తినడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు?  కానీ పెరుగుతో కలిపి స్వీట్లు తినడం కొందరికి సరదా.. మరికొందరికి ఇష్టం కూడా.  కానీ ఇలా పెరుగుతో స్వీట్లు తినడం ఆరోగ్యానికి హానికరం. పెరుగు,  స్వీట్ల  కలయిక  కడుపులో మంటను కలిగిస్తుంది. బంగాళాదుంపలు.. పెరుగుతో బంగాళాదుంపలు తినడం  చూసే ఉంటారు.  చాలా రకాల స్నాక్స్ లో బంగాళాదుంపలతో చేసిన స్నాక్స్ పైన పెరుగును చాలా ధారగా వేసి మరీ ఇస్తుంటారు. కానీ పెరుగు,  బంగాళాదుంపల కలయిక ఆరోగ్యానికి చాలా చెడ్డదట. బంగాళాదుంపలను ఎక్కువగా తినడమే మంచిది కాదు.. ఇక పెరుగుతో తింటే అది ఇంకా నష్టం కలిగిస్తుంది మాంసాహారం.. పెరుగుతో కలిపి మాంసాహారం తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే రెండింటిలోనూ ప్రోటీన్ ఉంటుంది.  ఇది మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. కానీ చాలామంది నాన్ వెజ్ వండేటప్పుడు మాంసాన్ని మసాలా మిశ్రమం లో నానబెడతారు.  ఈ మసాలాలో పెరుగు ఖచ్చితంగా వేస్తారు. అంతేకాదు.. నాన్ వెజ్ వంటకాలు తినేటప్పుడు అదనంగా పక్కనే పెరుగు కూడా ఉంటుంది. కానీ మాంసాహారం,  పెరుగు శరీరానికి ప్రోటీన్ పరంగా దెబ్బ కొడుతుంది.                                      *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
పిల్లల మెదడు పదునుగా ఉంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే..!

పిల్లలు చాలా తెలివిగా, చురుగ్గా ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఎందుకంటే ఇలా ఉన్నపిల్లలే చదువులో బాగా రాణిస్తారు.  పిల్లల చిన్నతనం అంతా చదువులు, ర్యాంకులు,  ప్రైజులు,  పుస్తకాల ప్రపంచంలో గడుస్తుంది.  ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు బాగా ఆలోచించాలన్నా,  ఏదైనా సరే తొందరగా నేర్చుకోవాలన్నా, తెలివైన పిల్లలు అనిపించుకోవాలన్నా వారి మెదడు పనితీరు చురుగ్గా ఉండాలి. మందబుద్దిగా ఉన్న పిల్లలు తరగతిలోనే కాదు.. ఇంట్లో కూడా తల్లిదండ్రుల దగ్గర చివాట్లు తింటారు. అయితే పిల్లలు మందబుద్ది స్థాయి నుండి తెలివిగా మారాలంటే వారి మెదడును యాక్టీవ్ చేసే ఆహారాలు ఇవ్వాలి.  పిల్లల మెదడుకు పదును పెట్టే ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వాల్నట్స్.. పిల్లల మెదడును పదును పెట్టడానికి వాల్‌నట్స్ అత్యంత ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు,  యాంటీఆక్సిడెంట్లు వంటి అంశాలు  మెదడు శక్తిని పెంచుతాయి. వాల్నట్స్ ను రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే దాని మీద ఉన్న లేత పొరను తొలగించి తినమని చెప్పాలి. ఇది  చాలా మంచి మార్గం. ఇలా తినడానికి పిల్లలు ఇష్టపడకపోతే డ్రై ఫ్రూట్స్ బార్ లేదా లడ్డు వంటి వాటిలో వాల్నట్స్ ను యాడ్ చేసి రోజుకు ఒకటి ఇస్తుండాలి. ఆకుకూరలు పాలకూర, మెంతికూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు  మెదడు ఆరోగ్యానికి ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఐరన్, ఫోలేట్,  విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఈ ఆకుకూరలు  మెదడును బలపరుస్తాయి.  అయితే పిల్లలు పాస్ట్ ఫుడ్స్,  బయటి ఫుడ్స్ ను ఇష్టపడినట్టు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు.  అందుకే  ఆకుకూరలతో సూప్,  కట్లెట్, పనియారం వంటి వాటిలో ఆకుకూరలు జోడించాలి. చపాతీ చేసేటప్పుడు మెంతికూర ఆకులు లేదా పాలకూర పేస్ట్ వేసి పిండిని కలుపుకోవాలి. వంటల్లో ఆకుకూరలను జోడించాలి. బెర్రీలు స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు,  రాస్ప్బెర్రీస్ వంటి పండ్లు  మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ పండ్లు  మెదడును పదునుపెడతాయి. పిల్లలకు ఈ విదేశీ పండ్లంటే చాలా ఇష్టం.  వాళ్లను బ్రతిమలాడకపోయినా తినేస్తారు.  అయితే ఖరీదు కారణంగా వీటిని అవాయిడ్ చేస్తుంటారు. కానీ నేరేడు,  రేగు పళ్లు.. వంటి లోకల్ పండ్లను కూడా పిల్లలకు ఇవ్వచ్చు.  ఇవి కూడా మంచి పోషకాలు కలిగి ఉంటాయి. గుడ్డు.. గుడ్లు తినడం  ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ఉండే కోలిన్  మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాధారణంగా గుడ్డులోని పచ్చ సొనను పడేస్తుంటారు. కానీ గుడ్డులోని పచ్చసొన కూడా తినాలి.  రోజుకు ఒక గుడ్డు పిల్లలకు ఇస్తూ ఉంటే వారి శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా మెదడు పనితీరు కూడా పెరుగుతుంది. పైన చెప్పుకున్న నాలుగు ఆహార పదార్థాలను పిల్లల ఆహారంలో తప్పనిసరిగా బాగం చేస్తూ ఉంటే పిల్లలు చాలా చురుగ్గా మారతారు.  వారి మెదడు పనితీరు మెరుగవుతుంది. చదువులో రాణిస్తారు.  అయితే పిల్లలను చదువులో ప్రోత్సహించడం,  వారిని ఇన్ప్రైర్ చేయడం తల్లిదండ్రులు తప్పక చేయాలి.                                     *రూపశ్రీ   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                                   

read more
నెయ్యిలో నల్లమిరియాలు కలిపి తింటే ఇన్ని లాభాలా?

   నెయ్యిని భారతీయ ఋషులు అమృతంతో సమానమైన ఔషదంగా పేర్కొన్నారు.  ఆహారంలో నెయ్యిని రెగ్యులర్ గా తీసుకుంటే చాలా ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే నెయ్యిలో ఖర్జూరం నానబెట్టి తినడం,  ఉదయాన్నే నెయ్యిని వేడి నీటితో తాగడం లాంటి చిట్కాలు వినే ఉంటారు.  కానీ నెయ్యిలో నల్ల మిరియాలు కలిపి తింటే ఆరోగ్యానికి బోలెడు లాభాలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. దేశీ ఆవు నెయ్యి చాలా  ఆరోగ్యకరమైనది అని ఆయుర్వేదం చెబుతుంది.  ఎందుకంటే దేశీ ఆవు నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.  ఇవి శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయపడతాయి.  ఇక  మిరియాలలో పైపెరిన్ అనే సమ్మేళనం ఉంటుంది.  ఈ పైపెరిన్ అనే సమ్మేళనం జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. గ్యాస్,  ఎసిడిటీ వంటి సమస్యతో బాధపడేవారు ఒక మిరియాలు వాడితే చాలా మంచి ఉపశమనం ఉంటుంది.  అయితే ఒక స్పూన్ దేశీ ఆవు నెయ్యిలో ఒక చిటికెడు మిరియాల పొడి వేసుకుని తీసుకున్నా లేదా ఒక స్పూన్ నెయ్యితో ఒక మిరియం గింజ తీసుకుని నమిలి తిన్నా చాలా మంచి ఉపశమనం ఉంటుంది. దేశవాళీ ఆవునెయ్యి ప్రేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు దేశ వాళీ ఆవు నెయ్యిలో కాస్త మిరియం పొడి కలిపి తీసుకుంటే మంచిది.  పేగుల దారిని ఇది సుగమం చేస్తుంది.  ఆహారం ప్రేగులలో సులువుగా కదిలేందుకు సహాయపడుతుంది. తద్వారా పేగులలో వ్యర్థపదార్థాలు మలం రూపంలో సులువుగా విసర్ఝించబడతాయి. నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.  ఈ లక్షణాలు శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షిస్తాయి.  నెయ్యిలో కాసింత మిరియాల పొడి తీసుకుంటే రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది.                                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

read more
చక్కెర లేదా నూనె.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ హానికరం అంటే..!

  చక్కెర కాఫీలు, టీల తో పాటు స్వీట్లలో కూడా బాగా ఉపయోగించే పదార్థం.  ప్రతి ఇంట్లో ఒక డబ్బా నిండుగా చక్కెర ఉండాల్సిందే.. అయితే చక్కెర వ్యాధిగా పిలవబడే డయాబెటిస్ సమస్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఆహారం నుండి చక్కెరను మినహాయించాలని నిర్ణయించుకుంటున్నారు. ఇక నూనె లేకుండా ఏ ఆహారం వండలేం అన్నట్టు ఉంటుంది పరిస్థితి.  మరీ ముఖ్యంగా ఎంత ఆవిరిలో ఉడికించిన వంట అయినా సరే.. కాసింత నూనెతో పోపు వెయ్యకపోతే అసలు తినాలని అనిపించదు. ఇక నూనెలో డీప్ ఫ్రై చేసే ఆహారాలు ఎంత రుచిగా ఉంటాయో తినేవారి దూకుడును బట్టి చెప్పేయవచ్చు. అయితే నూనె కూడా ఆరోగ్యానికి ప్రమాదమే అని అంటున్నారు ఆహార నిపుణులు.  ఆహారంలో తప్పనిసరిగా ఉపయోగించే చక్కెర, నూనె రెండింటిలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ హానికరం అనే విషయాన్ని ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణులు కింది విధంగా విశ్లేషిస్తున్నారు.   వైద్యుల అభిప్రాయం ప్రకారం, చక్కెర,  కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తినడం కాలేయానికి ఆల్కహాల్ తాగినంత హానికరం. ఇది కాలేయ పనితీరుకు ప్రమాదకరం. తినే ప్రతిదీ కాలేయం ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. ఇది శరీర గిడ్డంగిగా పనిచేస్తుంది. కేలరీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. ఇది మధుమేహం,  ఇతర జీవక్రియ వ్యాధులకు దారితీస్తుంది.   చక్కెర,  కొవ్వు అధికంగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. దీని ఫలితంగా కాలేయ సమస్యలు, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) వంటివి వస్తాయి. ప్రతి నలుగురిలో ఒకరు ఊబకాయం లేదా అధిక బరువు కలిగి ఉంటారని నివేదికలు చెబుతుండటం ఆందోళన కలిగించే అంశం. దీనివల్ల  ఫ్యాటీ లివర్ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది. జీవితాన్ని ప్రభావితం చేస్తాయా? చక్కెర చేసే చేటు.. మధుమేహం, కాలేయ వ్యాధి, ఊబకాయానికి ప్రధాన కారణాలలో చక్కెర ఒకటి. ఎక్కువ చక్కెర తీసుకోవడం వల్ల కాలేయం లావుగా మారుతుంది. ఇది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కు దారితీస్తుంది. ఈ పరిస్థితి మరింత దిగజారి కాలేయానికి గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది.   రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడం ద్వారా ఇన్సులిన్ నిరోధకత అవకాశాన్ని పెంచుతుంది. చక్కెరలో ఖాళీ కేలరీలు ఉండటం వల్ల బరువు పెరగడానికి కారణం అవుతుంది. బరువు పెరగడం ఫలితంగా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. ఇది మచ్చలు,  వాపుకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచడం ద్వారా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. నూనె చేసే చేటు.. ఆరోగ్యానికి హాని కలిగించే మరో ఆహార పదార్థం నూనె. ముఖ్యంగా ప్రాసెస్ చేయబడిన, హైడ్రోజనేటెడ్ నూనెలు. కానీ చక్కెరలా కాకుండా చాలా నూనెలలో కణాల మరమ్మత్తు, మెదడు పనితీరుకు కీలకమైన ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఉపయోగించే నూనె రకం,  పరిమాణం చాలా ముఖ్యమైనవి.   నూనె చక్కెర కంటే ఎక్కువ కేలరీలు కలిగి ఉంటుంది కాబట్టి  ఒక గ్రాము నూనెలో తొమ్మిది కేలరీలు ఉంటాయి.  అదనపు నూనె బరువు పెరగడానికి కారణమవుతుంది. నూనెలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటే గుండె జబ్బులకు కారణం కావచ్చు. నూనెను అధికంగా తీసుకుంటే అది కాలేయ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.  ఫ్యాటీ లివర్ వ్యాధికి కారణమవుతుంది. మితంగా ఉపయోగించినప్పుడు, ఆవ నూనె లేదా ఆలివ్ నూనె వంటి కొన్ని నూనెలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఏది ఎక్కువ హాని.. నూనెను తక్కువ తీసుకోవడం ద్వారా రోజుకు 50 కేలరీలు తగ్గవచ్చు. అయితే, చక్కెర అంత హానికరం కాదు అని అనిపించినా పప్పులో కాలేసినట్టే..  అనుకున్న దానికంటే  చక్కెర చాలా  ఎక్కువ హానికరం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.   చక్కెరను ఎక్కువగా తీసుకోవడం కూడా అంతే ప్రమాదకరం ఎందుకంటే అది కాలేయంలో కొవ్వుగా మారుతుంది. చక్కెర మరియు నూనె రెండూ ఆరోగ్యానికి హానికరం అయినప్పటికీ, అవి వేర్వేరు పరిణామాలను కలిగి ఉంటాయి. కేలరీల దగ్గర పోలిక కనిపిస్తుంది. •  1 గ్రాము చక్కెర = 4 కేలరీలు •  1 గ్రాము నూనె = 9 కేలరీలు •  5 గ్రాముల నూనె వినియోగం = 45 కేలరీలు •  2 టీస్పూన్ల చక్కెర 1 టీస్పూన్ నూనెతో సమానం. కాబట్టి చక్కెర నూనె రెండూ హానికరమే.. ఉపయోగించే పరిమాణం,  ఉపయోగించే నాణ్యతను బట్టి కూడా ఈ హానికరంలో తేడాలు ఉండవచ్చు. కానీ తక్కువ వినియోగం ఎప్పటికీ ఆరోగ్యానికి శ్రీరామ రక్ష.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
కొబ్బరి బొండంలో కొబ్బరి గురించి ఈ షాకింగ్ నిజాలు తెలుసా? వేసవిలో దీన్ని  మిస్ కావద్దు..!

  వేసవి బోలెడు రుచులను వెంటబెట్టుకు వస్తుంది.  మామిడి పళ్లు,  తాటి ముంజలు,  చెరకు రసం,  జ్యూసులు,  పుచ్చకాయలు,  కర్బూజా.. ఇలా ఒకటనేమిటి చాలా పండ్లు వేసవిలో నోరూరిస్తాయి. ఇక మరొక వైపు శీతల పానీయాలు, ఐస్ క్రీములు కూడా వేసవిలో ఊపందుకుంటాయి. అయితే చాలామందికి ఈజీగా లభించేది,  ఎక్కువ మంది ప్రాధాన్యత ఇచ్చేది కొబ్బరి బొండంకే  లేత కొబ్బరి బొండంలో నీరు శరీర తాపాన్ని తగ్గిస్తుంది.  శరీరాన్ని చల్లబరిడి ఎండ వడ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే చాలామంది కొబ్బరి బొండం తాగి ఆ కొబ్బరి బొండం అక్కడే పడేస్తుంటారు. కానీ  అందులో ఉండే లేత కొబ్బరిని  మిస్ చేసుకుంటే చాలా నష్టపోతారని  అంటున్నారు ఆహార నిపుణులు.  ఇంతకీ కొబ్బరి బొండంలో ఉండే  కొబ్బరి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడం అయినా, వేడి నుండి రక్షించడం అయినా, శరీరానికి  ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడంలో  అయినా లేదా గుండెను ఆరోగ్యంగా ఉంచడం అయినా, కొబ్బరి నీళ్లుకు మించిన గొప్ప పానీయం ఇంకొకటి లేదంటే ఆశ్చర్యపోనవసం లేదు. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉండటంలో కూడా సహాయపడుతుంది. అయితే కొబ్బరి బొండం లో ఉండే లేత కొబ్బరి గురించి  చాలా షాకింగ్ నిజాలు ఉన్నాయి. కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరిలో లారిక్ యాసిడ్ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొబ్బరి నీళ్లతో పాటు,  ఈ లేత కొబ్బరి కూడా తీసుకోవాలి. లేత  కొబ్బరి రుచిగా ఉండటమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే రెగ్యులర్ చైన్ ట్రైగ్లిజరైడ్‌లను కలిగి ఉంటుంది. జీవక్రియను పెంచడం ద్వారా బరువు తగ్గాలనుకున్నా లేదా కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకున్నా, కొబ్బరి బొండంలో ఉండే లేత కొబ్బరి చాలా మంచి ఆరోగ్యకరమైన ఎంపిక. లేత కొబ్బరి ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  లేత కొబ్బరి తినడం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో,  కడుపు వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. కొబ్బరి నీళ్లు లేదా దానిలో ఉండే లేత కొబ్బరి రెండూ ఆరోగ్యానికి చాలా మంచివని పోషకాహార నిపుణులు  చెబుతారు. లేత కొబ్బరి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది.  గుండె, ఎముకలు, చర్మం,  జీర్ణవ్యవస్థకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి ఈ వేసవికాలంలో కొబ్బరి బొండం తాగితే అందులో ఉండే లేత కొబ్బరిని  ఖచ్చితంగా  తినడం మిస్సవకండి. అయితే, మధుమేహం ఉన్నవారు లేత కొబ్బరి తినడం  తగ్గించాలి. కొబ్బరి నీళ్లు లేదా లేత  కొబ్బరి  అధికంగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. లేత కొబ్బరిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ,  ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి చర్మానికి తేమను అందిస్తాయి, ముడతలను తగ్గిస్తాయి. అంతేకాకుండా జుట్టు బలంగా,  మందంగా మారడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఇ, భాస్వరం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి,  ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తాయి.                        *రూపశ్రీ.     గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...    

read more
పదే పదే ఎసిడిటీ సమస్య వేధిస్తోందా? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది..!

  ఎసిడిటీ  చాలా మందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య.  బాగా వయసైన వారు ఆహారం సరిగా జీర్ణం అవ్వక ఎసిడిటీ బారిన పడేవారు. కానీ ఆహారం,  జీవనశైలి మార్పుల వల్ల ఇప్పట్లో చిన్న వయసు వారిలో కూడా ఎసిడిటీ సమస్యలు కామన్ అయిపోయాయి. తరచుగా ఎసిడిటీతో బాధపడుతూ దాని నుండి ఉపశమనం పొందకపోతే,  ఆహారపు అలవాట్లలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఎసిడిటీ సాధారణంగా తప్పుడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి,   జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల వస్తుంది.  ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవడం ద్వారా కడుపులో యాసిడ్లను కంట్రోల్ చేయవచ్చు.  ఈ సమస్యను తగ్గించడంలో  సహాయపడే కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు తెలుసుకుంటే.. ఆహారపు అలవాట్లలో చేసుకోవాల్సిన మార్పులు .. భోజనం షెడ్యూల్ చేసుకోవాలి.  ప్రతిరోజూ ఒకే సమయంలో భోజనం చేయాలి. ఎక్కువసేపు ఆకలితో ఉండకూడదు. రోజులో చిన్న చిన్న మొత్తాలలో భోజనం తినాలి (ప్రతి 2-3 గంటలకు తేలికపాటి ఆహారం తినాలి). భారీ ఆహారాలు,  వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ కారంగా, వేయించిన,  నూనెతో కూడిన ఆహారం ఎసిడిటీని పెంచుతుంది. బదులుగా, తేలికైన, ఉడికించిన,  తక్కువ కారంగా ఉండే ఆహారాన్ని తినాలి. కెఫిన్,  శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. టీ, కాఫీ, శీతల పానీయాలు,  సోడా వంటి వాటికి దూరంగా ఉండాలి. బదులుగా, హెర్బల్ టీ లేదా గోరువెచ్చని నీరు త్రాగాలి. తిన్న వెంటనే పడుకోకూడదు.  భోజనం తర్వాత కనీసం 30-40 నిమిషాలు నిటారుగా కూర్చోవాలి. పడుకోవడం వల్ల కడుపులో ఆమ్లం పెరుగుతుంది, ఇది ఆమ్లత్వాన్ని పెంచుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని బాగా తీసుకోవాలి.  ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు,  సలాడ్లు తినాలి.  ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,  ఆమ్లత్వం నుండి ఉపశమనం కలిగిస్తుంది.  ఆహారంలో ఆల్కలీన్ ఆహారాలను చేర్చుకోవాలి. అరటిపండు, దోసకాయ, పుచ్చకాయ, కొబ్బరి నీళ్లు, బొప్పాయి వంటి పండ్లు ఎసిడిటీని తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి కడుపులోని ఆమ్లాన్ని సమతుల్యం చేసి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. నీటి త్రాగడం పెంచాలి. రోజంతా కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగాలి. నీరు శరీరం నుండి విషాన్ని బయటకు పంపడం ద్వారా ఆమ్లతను తగ్గిస్తుంది. అల్లం,  తులసి తీసుకోవాలి.  అల్లం,  తులసి ఆకులను తీసుకోవడం వల్ల ఆమ్లత్వం నుండి ఉపశమనం లభిస్తుంది. అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థను ఉపశమనం చేస్తుంది.                                     *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
సొరకాయ వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉంటాయని మీకు తెలుసా?

  భారతీయ వంటలలో సొరకాయది చాలా  ప్రత్యేక స్థానం.  ఎక్కువ మందికి వండాలంటే గుమ్మడి,  సొరకాయ,  క్యాబేజీ వంటి బరువైన కూరగాయలను వంటకు వినియోగిస్తుంటారు.  చాలామంది సొరకాయను ఇంటికి తెచ్చుకుని వండుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ ఖద్దూ కా ఖీర్,  హల్వా.. అంటే సొరకాయ పాయసం,  సొరకాయ హల్వా.. వంటివి మాత్రం చాలా ఫేమస్ కూడా అయ్యాయి.  సొరకాయ అంటే ఇష్టపడని వారు కూడా సొరకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇకమీదట తినడానికి ఆసక్తి చూపిస్తారు.  అసలు సోరకాయలో పోషకాలు ఏంటి? సొరకాయ తినడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. సొరకాయలో కేలరీలు తక్కువగా,  ఫైబర్,  అవసరమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి,  రక్తంలో చక్కెర నియంత్రణకు మద్దతు ఇస్తుంది. అయితే సొరకాయ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ,  దీనిని అందరూ తినే అవకాశం లేదని కూడా అంటున్నారు ఆహార వైద్యులు. సొరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు,  నష్టాలు రెండింటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.. సొరకాయ 90 శాతం కంటే ఎక్కువ నీరు కలిగి ఉంటుంది.  ఇది  హైడ్రేషన్‌ను నిర్వహించడానికి ఒక మంచి ఎంపిక . ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో,  కోల్పోయిన ఎలక్ట్రోలైట్‌లను తిరిగి నింపడంలో సహాయపడుతుంది.  వేసవిలో దీనిని తీసుకోవడం చాలా మంచిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. జీర్ణక్రియ,  ప్రేగు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.. సొరకాయ ఫైబర్ కు గొప్ప మూలం.  ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలో, మలబద్ధకాన్ని నివారించడంలో,  ఉబ్బరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌ను కూడా ప్రోత్సహిస్తుంది.  జీర్ణక్రియకు సహాయపడుతుంది,  కడుపుల యాసిడ్ రిఫ్లెక్షన్ ను  తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. సొరకాయ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI)  కలిగి ఉంటుంది. ఇది  మధుమేహ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఎంపిక. ఇందులో ఉండే కరిగే ఫైబర్ గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది.  రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మాత్తుగా  హెచ్చుతగ్గులు కావడాన్ని నివారిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.. సొరకాయలో తక్కువ కేలరీలు, అధిక ఫైబర్  ఉండటం వల్ల ఇది సహజంగా బరువు తగ్గించే ఆహారంగా మారుతుంది. "బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక.  ఎందుకంటే  సొరకాయను ఏ రూపంలో తీసుకున్నా ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్  ఇస్తుంది. గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.. పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లతో నిండిన సొరకాయ రక్తపోటును నియంత్రించడంలో,  కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే స్టెరాల్స్  హృదయనాళ పనితీరుకు  సపోర్ట్ చేస్తాయి. ఎవరు తినకూడదు.. సొరకాయలో చేదు రుచి ఉండటం ఒక ప్రధాన సమస్య. ఇది వికారం, వాంతులు, విరేచనాలు,  తీవ్రమైన సందర్భాల్లో ఆసుపత్రిలో చేరడానికి దారితీసే విషపూరిత సమ్మేళనం. వంట చేసే ముందు ఎల్లప్పుడూ ఒక చిన్న ముక్కను రుచి చూడాలి. అది చేదుగా ఉంటే వెంటనే దాన్ని తినకుండా ఉండటం మంచిది. తక్కువ రక్తపోటు ఉన్నవారు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు, బీటా-బ్లాకర్స్ తీసుకుంటున్న వ్యక్తులు,  ఉబ్బరం, విరేచనాలకు గురయ్యే అవకాశం ఉన్నవారు సొరకాయ తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.                                    *రూపశ్రీ   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
వేసవి కాలంలో పచ్చి మామిడి తింటే ఇన్నిలాభాలా?

  వేసవి అంటే చాలా మంది ఎదురుచూసేది మామిడి పండ్ల కోసమే. పండ్లకు రారాజు అయిన మామిడి సువాసన నుండి రుచి వరకు మైమరచిపోయేలా చేస్తుంది. అయితే చాలామంది పచ్చి మామిడిని కూరలు, పచ్చళ్ల కోసం,  పండిన మామిడిని జ్యూసులు,   నేరుగా తినడం కోసం ఉపయోగిస్తారు. కానీ వేసవిలో పచ్చి మామిడిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పులుపును బాగా ఇష్టపడేవారు మామిడిని బాగా తింటుంటారు. కానీ పచ్చి మామిడిని అందరూ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. పచ్చి మామిడి వల్ల కలిగే ప్రయోజనాలు.. వేసవికాలంలో చాలామంది భయపడేది వడదెబ్బకు.  అయితే ఈ వడదెబ్బకు చెక్ పెట్టేది పచ్చి మామిడి.  పచ్చి మామిడి పండును కాస్త ఉడికించి అందులో తగినంత నీరు పోసి మిరియాలు,  ఉప్పు లేదా పంచదార వంటివి కలిపి తాగితే వడదెబ్బ భయమే ఉండదు. వేసవిలో శరీరం డీహైడ్రేట్ కావడాన్ని ఇది చెక్ పెడుతుంది. పచ్చి మామిడిలో పొటాషియం,  ఇతర ఎలక్ట్రోలైట్లు ఉంటాయి.  ఇవి వేసవిలో చెమట పట్టడం వల్ల కలిగే ఎలక్ట్రోలైట్ల అసమతుల్యతను భర్తీ చేయడంలో సహాయపడుతుంది. సాధారణంగా కొబ్బరి బొండం వంటి పానీయాలలో ఉండే ఎలక్ట్రోలైట్లు పచ్చి మామిడిలో కూడా ఉంటాయి. కాబట్టి పచ్చి మామిడిని తప్పక తినాలి. పచ్చి మామిడిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.  ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.  వేసవిలో జీర్ణసమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి జీర్ణసమస్యలకు చెక్ పెట్టాలంటే పచ్చి మామిడి కాయను ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. పుల్లగా ఉన్న పండ్లలో విటమిన్-సి సమృద్జిగా ఉంటుంది.  పచ్చి మామిడి కూడా అలాంటి వాటిలో ఒకటి. పచ్చి మామిడిని ఆహారంలో తీసుకుంటే శరీరానికి కావలసిన విటమిన్-సి లభిస్తుంది.  శరీరంలో వేడి సంబంధిత వ్యాధులతో పోరాడటానికి ఇది సహాయపడుతుంది.  పైగా రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. పచ్చి మామిడి కాయలు ఆల్కలీన్ ల7ణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో ఆమ్ల స్థాయిలను సమతుల్యం చేస్తాయి.  శరీరంలో ఆమ్లత అంటే యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి.   పచ్చి మామిడి కాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.  ఇది శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతుంది.  పచ్చి మామిడి కాయతో చారు లాగా చేసుకుని ఆహారంలో తీసుకుంటే  శరీరానికి చలువ చేస్తుంది. వేసవి వేడి తగ్గుతుంది.                                  *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
మూత్ర పిండాలలో రాళ్లను నివారించే మూలికలు, చిట్కాలు..!

ఆధునిక జీవనశైలి,  ఫాస్ట్ ఫుడ్ తినడం మొదలైనవి   ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. వీటి కారణంగా  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్స్,  ప్రాసెస్ చేసిన ఫుడ్స్ లో  ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వులు,  ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి.  ఇవి శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం,  మూత్రపిండాల పనితీరు బలహీనపడటానికి దారితీస్తాయి. మూత్రపిండాల్లో లవణాలు,  ఖనిజాలు స్ఫటికీకరించడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల  మూత్రపిండాల్లో రాళ్లు నివారించవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటం ఒక సాధారణ సమస్యగా మారుతున్నప్పటికీ, వాటిని నివారించడం సులభం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం, సమతుల్య ఆహారం,  సహజ మూలికల వాడకంతో  రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మూత్ర పిండాలలో రాళ్లు ఏర్పడకూడదు అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి.. హైడ్రేషన్:  మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి  హైడ్రేటెడ్ గా ఉండటం. "రోజుకు కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగడం వల్ల రాళ్లు ఏర్పడటానికి దోహదపడే కాల్షియం, యూరిక్ యాసిడ్, ఆక్సలేట్‌ల వంటి ఖనిజాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. సాధారణ నీటితో పాటు, కొబ్బరి నీరు, బార్లీ నీరు అద్భుతంగా సహాయపడతాయి.  శరీరం నుండి విషాన్ని తొలగించడాన్ని ప్రోత్సహిస్తాయి.  నిమ్మకాయలు,  నారింజ వంటి సిట్రస్ పండ్లు కూడా మూత్రపిండాల్లో రాళ్లను నివారించడంలో సహాయపడతాయి. ఎందుకంటే వాటిలో ఉండే సిట్రేట్లు ఆక్సలేట్‌లు స్ఫటికాలను ఏర్పరిచే సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. సరైన హైడ్రేషన్ మూత్రపిండాలలో ఖనిజాలు పేరుకుపోకుండా మూత్రపిండాల పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తాయి.   మూలికలు.. కొన్ని మూలికలు మూత్రపిండాల పనితీరుకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తాయి. సహజ నివారణలు విషాన్ని బయటకు పంపడంలో, ఖనిజాలు పేరుకుపోకుండా నిరోధించడంలో,  మొత్తం మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అత్యంత ప్రభావవంతమైన మూలికలు.. పునర్నవ .. ఇది సహజ మూత్రవిసర్జనగా పనిచేస్తుంది, అదనపు ద్రవాలు, విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. గోక్షుర .. మూత్రపిండాల పనితీరుకు మద్దతు ఇస్తుంది,  ఖనిజ స్ఫటికీకరణను నిరోధించడంలో సహాయపడుతుంది. అరటి కాండం రసం.. మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేసి బయటకు పంపుతుంది. శతావరి.. మూత్రపిండాల వడపోతను పెంచుతుంది, ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుంది. బూడిద గుమ్మడికాయ రసం.. 95 శాతం నీటి శాతం,  ఆల్కలీన్ లక్షణాలతో ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.  రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ల నివారణకు ఆహార విధానాలు.. కాల్షియం తీసుకోవడం పెంచాలి..  కాల్షియం గట్‌లోని ఆక్సలేట్‌లతో బంధిస్తుంది, మూత్రపిండాలలో వాటి స్ఫటికీకరణను నిరోధిస్తుంది. సోడియం వినియోగాన్ని పరిమితం చేయాలి.. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల కాల్షియం విసర్జన పెరుగుతుంది, రాళ్ళు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి.. పాలకూర, దుంపలు,  బెండకాయలు వంటి ఆహారాలను మితంగా తినాలి,  వాటి ప్రభావాలను సమతుల్యం చేయడానికి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలతో జత చేయాలి. ఆల్కలీన్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి.. దోసకాయలు, పుచ్చకాయ,  కొబ్బరి నీరు మూత్రంలో ఆరోగ్యకరమైన pH సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. జంతు ప్రోటీన్‌ను పరిమితం చేయాలి.. మాంసం, గుడ్లు,  చేపలను అధికంగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
మలబద్దకం పైల్స్ గా మారకూడదు అంటే.. ఈ 6 పండ్లు తినండి చాలు..!

  మలబద్దకం.. మలవిసర్జన సరిగా జరగకపోతే ఏర్పడే సమస్య.  ప్రతి రోజూ సాఫీగా మలవిసర్జన జరగడం శరీరం ఆరోగ్యంగా ఉన్నది అనడానికి ఒక ముఖ్య సంకేతం.  అయితే వారానికి 2-3 సార్లు మాత్రమే మల విసర్జన జరుగుతూ ఉంటే.. దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా మారే సమస్యకు దారి తీస్తుంది.  ముఖ్యంగా  మలబద్ధకం వల్ల పైల్స్, రక్తంతో కూడిన పైల్స్, ఆపై పగుళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మలబద్దకం తగ్గిపోవాలన్నా,  మలబద్దకం ఫైల్స్ సమస్యకు దారి తీయకూడదన్నా.. 6 రకాల పండ్లు తినడం ఆరోగ్యానికి ఎంతో  మంచిదని అంటున్నారు ఆహార నిపుణులు.  దీని గురించి తెలుసుకుంటే.. కెవి.. డెంగ్యూ చికిత్సలో కివి తినడం మంచిది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది,  ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది. ఈ ఆకుపచ్చ పండులో ఆక్టినిడిన్ ఉందని, ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. పియర్.. పియర్  పండులో సార్బిటాల్ ఉంటుంది. ఇది చక్కెర ఆల్కహాల్, ఇది భేదిమందుగా పనిచేస్తుంది. కానీ దానిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సార్బిటాల్‌ను అధికంగా తీసుకోవడం వల్ల ఉబ్బరం,  విరేచనాలు వస్తాయి. ఇందులో అధిక FODMAP రసాయనం ఉంటుంది. అందువల్ల ఇలా జరుగుతుంది. ఆపిల్.. ఆపిల్ తినడం వల్ల మలబద్ధకంతో సహా అన్ని రకాల వ్యాధులను నయం చేయవచ్చు. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది . ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. ఆపిల్ తినడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయి. బొప్పాయి.. ఎన్నో ఏళ్ల  నుండి బొప్పాయి కడుపుకు మంచిదని చెబుతున్నారు . ఇది మలబద్ధకాన్ని తొలగించి కడుపుని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది. వైద్యుల ప్రకారం ఇది జీర్ణ ఎంజైమ్‌లను కలిగి ఉంటుంది, ఇవి ఆహారం సరిగా జీర్ణం కావడానికి  బాధ్యత వహిస్తాయి. ప్రూనే, బెర్రీలు. ఈ రెండు పండ్లు  చాలా అద్బుతం చేస్తాయ్. ప్రూనేలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అవి ప్రేగు కదలికను సులభతరం చేయడానికి గొప్ప మార్గం. బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు,  ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.                                        *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
శరీరంలో ఈ 5 ప్రాంతాలలో నొప్పి అనిపిస్తే..  కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్టే..!

  అధిక కొలెస్ట్రాల్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్య. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యకరమైన కణాలను నిర్మించడానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. కొలెస్ట్రాల్ అధిక మోతాదు గుండె జబ్బులు,  స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి? కొలెస్ట్రాల్ అనేది కాలేయం ద్వారా ఉత్పత్తి అయ్యే కొవ్వు పదార్థం, ఇది వివిధ శారీరక విధులకు అవసరం. ఇది కొన్ని ఆహారాలలో కూడా కనిపిస్తుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలు: LDL (తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) - దీనిని "చెడు" కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు, ఇది ఎక్కువగా ఉండటం వలన ధమనులలో ఫలకాలు ఏర్పడతాయి. HDL (అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్) - "మంచి" కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఇది రక్తప్రవాహం నుండి అదనపు LDL ను తొలగించడానికి సహాయపడుతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి అంటే సరైన ఆహారం లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ధూమపానం,  అధిక మద్యం సేవించడం వంటివి అధిక చెడు కొలెస్ట్రాల్ కు కారణం. పెద్దలు 20 సంవత్సరాల వయస్సు నుండి ప్రతి 4-6 సంవత్సరాలకు ఒకసారి  కొలెస్ట్రాల్‌ పరీక్ష చేయించుకోవాలని  వైద్యులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కు కారణమేమిటి? అధిక కొలెస్ట్రాల్‌కు అనేక కారణాలు ఉన్నాయి.. సంతృప్త,  ట్రాన్స్ కొవ్వులు (ప్రాసెస్ చేసిన,  వేయించిన ఆహారాలు) అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం. శారీరక శ్రమ లేకపోవడం అధిక శరీర బరువు. ధూమపానం, మద్యం వినియోగం జన్యుశాస్త్రం (కొంతమందికి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు వారసత్వంగా వస్తాయి) అధిక కొలెస్ట్రాల్ చరిత్ర ఉన్నవారికి, జీవనశైలి మార్పులు మాత్రమే దానిని నియంత్రించడానికి సరిపోకపోవచ్చు. అధిక కొలెస్ట్రాల్‌ను ఉంటే ఈ లక్షణాలు కనిపిస్తాయి. రక్తప్రవాహంలో కొలెస్ట్రాల్ పెరిగితే, అది రక్త ప్రసరణను పరిమితం చేస్తుంది.  శరీరంలోని వివిధ భాగాలను ప్రభావితం చేస్తుంది. ఇక్కడ కొన్ని సాధారణ  సంకేతాలు ఉన్నాయి. చర్మంపై పసుపు రంగు మచ్చలు.. అధిక కొలెస్ట్రాల్  మొట్టమొదటి కనిపించే సంకేతాలలో ఒకటి పసుపు రంగు కొవ్వు నిల్వలు లేదా చర్మంపై, ముఖ్యంగా కళ్ళు, మోచేతులు మరియు మోకాళ్ల చుట్టూ గడ్డలు. వీటిని జాంతోమాస్ అని పిలుస్తారు. రక్తంలో అదనపు కొలెస్ట్రాల్‌ను సూచిస్తుంది. చేతులు,  కాళ్ళలో జలదరింపు,  తిమ్మిరి.. ధమనులలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, రక్త ప్రసరణ మందగిస్తుంది, దీని వలన చేతులు,  కాళ్ళలో తిమ్మిరి, జలదరింపు లేదా సూదులు గుచ్చిన  అనుభూతి కలుగుతుంది. చికిత్స చేయకపోతే ఇది నరాలు దెబ్బతినడం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. జీర్ణ సమస్యలు,  పిత్తాశయ రాళ్లు.. అధిక కొలెస్ట్రాల్ జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తుంది.  పిత్తాశయ సమస్యలకు దారితీస్తుంది. పిత్తంలో అధిక కొలెస్ట్రాల్ పిత్తాశయ రాళ్లకు కారణమవుతుంది. ఇది ఉదరం  కుడి ఎగువ భాగంలో నొప్పి, వికారం,  అజీర్ణానికి దారితీస్తుంది. ఛాతీ నొప్పి,  శ్వాస ఆడకపోవడం.. ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోయినప్పుడు అది గుండెకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది, దీని వలన ఛాతీ నొప్పి (ఆంజినా),  శ్వాస ఆడకపోవడం జరుగుతుంది. ఈ లక్షణాలను ఎప్పుడూ విస్మరించకూడదు, ఎందుకంటే అవి గుండె జబ్బుల ప్రారంభ సంకేతాలు కావచ్చు. తిమ్మిరి,  మాట్లాడటంలో ఇబ్బంది.. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణకు ఆటంకం కలిగితే, అది స్ట్రోక్‌కు దారితీస్తుంది.  ఆకస్మిక తిమ్మిరి లేదా బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది,  సమతుల్యత కోల్పోవడం వంటివి దీని లక్షణాలే. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ తరచుగా సమస్యలు తలెత్తే వరకు స్పష్టమైన లక్షణాలను చూపించదు. కాబట్టి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం.                                       *రూపశ్రీ.

read more
ఆరోగ్యకరమైన హోళికి ఆరోగ్య చిట్కాలు!

హోళి అంటే ఇష్టం లేనిది ఎవరికి?? చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు హోళి సందడిలో తమవంతు పాత్ర పోషిస్తారు. అయితే హోళి సంబరాలలో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటు ఉంటాయి. హోళిని హాయిగా ఎంజాయ్ చేస్తూ.. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అవసరం. మీ చర్మ సంరక్షణ తప్పనిసరి:  చర్మాన్ని వీలైనంత జిడ్డుగా చేయడం చాలా ముఖ్యం, తద్వారా రంగులు చర్మం మీద  వ్యాప్తి చెందడానికి లేదా అంటుకునే అవకాశం ఉండదు. ఇందుకోసం కొబ్బరి నూనె రాసుకోవచ్చు. కొబ్బరి నూనె వల్ల మరొక లాభం ఏంటంటే చర్మం పొడిబారకుండా చేస్తుంది. అలాగే శరీరం మీద రంగులు క్లీన్ చేయడం సులువు అవుతుంది.   సేంద్రీయ రంగుల ఎంపిక:   పర్యావరణ అనుకూలంగానే కాకుండా మన చర్మానికి కూడా అనుకూలమైన రంగులతో హోలీని జరుపుకోవాలి. హానికరమైన రసాయనాలు కలిపిన రంగులను నివారించాలి. రసాయనాలు కలిపిన రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి అంతేకాఫు ఇవి నీటిలో చాలా తొందరగా కలిసిపోతాయి. ఈ రంగులు  చర్మం నుండి తొలగించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. చర్మాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఇన్ఫెక్షన్లు, సైడ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. బంతి పువ్వు, గులాబీ, మందారం, చెట్ల ఆకులు, పసుపు ఇలా పువ్వుల రెక్కల నుండి రంగులు తయారుచేసుకోవచ్చు. .  హైడ్రేటెడ్ గా ఉండాలి:  హోలీ వేసవిలో వస్తుంది, హోళి సమయానికి వేసవి మొదలైపోయి ఉంటుంది. దీనివల్ల బయట ఎండలు భగ్గుమంటుంటాయి. ఈ ఎండల్లో రంగులు చల్లుకుని ఎంజాయ్ చేసినా.. మరొకవైపు ఎండ దెబ్బ మాములుగా ఉండదు.  కాబట్టి హైడ్రేటెడ్ గా ఉండటం చాలా అవసరం. నీరు, గ్లూకోజ్, జ్యూస్‌లు, శరీరాన్ని తిరిగి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి.  పైగా ఇవి చర్మం పొడిబారకుండా తేమగా ఉండేలా చేస్తాయి.   కళ్ళను తేలిగ్గా తీసుకోవద్దు:  మీరు రోజూ  కాంటాక్ట్ లెన్స్‌లను ధరించేవారు అయితే, రంగులతో ఆడుకునే ముందు వాటిని తీసివేయడం మంచిది. కళ్ళజోడు మీద రంగులు లేదా నీళ్లు పడితే ఎదుటి ప్రాంతాన్ని మసగ్గా కనిపించేలా చేస్తాయి. ఇది ఇబ్బందే అనుకోవచ్చు. అలాగని కళ్ళజోడు లేకుండా హొలీ ఆడేటప్పుడు రంగులు నేరుగా కళ్ళలోకి పడకుండా అజాగ్రత్త పడాలి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కాబట్టి కళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి.  స్వీట్ల దగ్గరా జాగ్రత్త:  హోలీ సమయంలో మార్కెట్‌లో కల్తీ ఖోయా, మావా అమ్ముతారు. ఇంకా ఇలాంటి కల్తీ పదార్థాలతో స్వీట్లు తయారుచేస్తారు. ఇలాంటివే ఆఫర్స్ కింద, డిస్కౌంట్ల కింద అమ్మేస్తారు. కాబట్టి స్వీట్స్ కొనేముందు జాగ్రత్తగా ఉండాలి. .  శరీరాన్ని ఇలా కవర్ చేయాలి: హొలీ ఆడేటప్పుడు యావరేజ్ గా ఉన్న బట్టలు వేసుకోవాలి. దీనివల్ల వాటిమీద రంగులు వదలకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొత్త బట్టలు అయితే నాశనం అయిపోతాయి. ఫుల్ హాండ్స్ ఉన్న టాప్స్, ఫుల్ గా కాళ్లను కవర్ చేసే ప్యాంట్స్ వేసుకోవాలి. దీనీవల్ల రంగులు శరీరాన్ని పాడుచేసే అవకాశం తక్కువ. పాత డెనిమ్ జీన్స్, పొడవాటి పైజామాలను ఎంచుకోవచ్చు.  ఇలా ఆరోగ్యకరమైన హోళిని ఎంజాయ్ చేసి, ఆరోగ్యంగా ఉండండి.                                    ◆నిశ్శబ్ద.

read more