యువత మీ హృదయం కాస్త  జాగ్రత్త...

యువతరానికి గుండెపోట ఇదేమిటి అప్పుడే గుండెపోటు ఏమంత వయసు అయ్యిందని యువత గుండెపోటుకు గురిఅవుతున్నారు అన్నది అందరినీ సందిగ్ధం లో పడేసింది. ఇక్కడ దీనికి సంబంధించి ఒక వాస్తవ సంఘటన గుర్తుకు వస్తుంది. అప్పట్లో కేంద్ర మాజీ మంత్రి ఎం పి బండారు దత్తా త్రేయ కుమారునికి 21 సంవస్త్సరాలు యువకుని పేరు వైష్ణవ్ గుండెపోటు తో మరణించినట్లు సమాచారం. అందరూ ఒక్క సారిగా దిగ్బ్రాంతికి గురియారు.పైగా వైష్ణవ్ ఒక వైద్య విద్యార్ధి కావడం గమనార్హం. చిన్నవయస్సులో గుండెపోటు కు గురికావడం పట్ల సర్వత్రా ఉలిక్కి పడ్డారు అప్పుడే మొదలయ్యింది చిన్నవయస్సులో గుండెపోటు ఏమిటి? ఎందుకు వస్తుంది? అన్న ప్రశ్నలకు సమాధానం రాకుండా నివారించాలేమా? అసలు అంత చిన్న వయస్సులో గుండెపోటు ఎందుకు వస్తోంది అన్న అంశాల పై దృష్టి సారించారు నిపుణులు.మనదేశం లో అత్యధిక మరణాలు గుండెజబ్బుల మూలంగానే అని అనడం లో అతిశయోక్తి లేదు.ఒకవైపు ఆధునికత, మరోవైపు పోటీ తత్వం వృత్తి పరంగా,విద్య లో పోటీ పెరగడం తో విపరీతమైన   ఒత్తిడి పెరగడం తో శరీరం లో ని ప్రతి అవయవమూ ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. అని అంటున్నారు నిపుణులు ఒత్తిడి కారణంగానే రకరకల రోగాల్ బారిన పడడం గమనించవచ్చు.అవే వారి పాలిట మృత్యు ఘంటి కలుగా మారుతున్నాయి. వాటిలో ప్రధాన మైనది క్రానిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్... క్రానిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ లో గుండె పంపింగ్ సామర్ధ్యం తగ్గిపోతుంది.శరీర అవసరాలకు తగినంత రక్తాన్ని గుండె సరఫరా చేయలేకపోవడం వైద్యులు అంటూ ఉంటారు. ఫలితంగా నీరసం,ఆయాసం, శరీరం లో ని పదాలు చీలమండలాలలో నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాగే కొంతకాలం కొనసాగితే గుండె కండరం బలహీన పడడం లేదా బిగుతుగా మారడం వల్ల గుండె కొట్టుకునే సామర్ధ్యం తగ్గి రక్త ప్రసరణ లో వేగం తగ్గుతుంది. కొంత కాలానికి అది ప్రనాన్తకంగా మారుతుంది. ఆర్టరీ డిసీజ్ కు కారణాలు... గతంలో గుందేసమస్యలు కేవలం 5౦ సంవత్సరాలు వచ్చిన వారిలోమాత్రమే కనిపించేది.కనీ ఇప్పుడు25 సంవత్సరాల నుండి 4౦ సంవత్సరాల వయస్సు ఉన్న వారిని సైతం గుండెపోటు కు గురికావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఆందోళనకు గురి చేస్తోంది.ప్రాణాలను హరిస్తోంది.గుండె సమస్య ఏదైనా సరే కారణాలు చాలానే ఉంటాయి. చిన్న వయస్సులో గుండెపోటు రావడానికి కారణాలలో ముఖ్యమైనది సరైన జీవన శైలి లేకపోవడమే,లేదా చెడు అలవాట్లు, ముఖ్యంగా పొగ తాగడం, ఒత్తిడికి గురికావడం, కీలక పరిణామం గా వైద్యులు పేర్కొంటున్నారు.గతంలో ఎన్నడూ లేనివిధం గా యువత లో ఒత్తిడికి గురి అవుతున్నారని ఒత్తిడి ఉన్న కనిపించకుండా ఉండేవారని. ఇప్పుడు సహజంగానే జీవితం లో వస్తున్న మార్పులు జీవితం లో కావాల్సిన అవసరాలు పెరగడం ఆశలు పెరగడం తగిన విధంగా పని చేయాల్సి రావడం తో తీవ్ర ఒత్తిడికి కాక తప్పడం లేదు.పిల్లలలో వారి స్థాయికి మించి ఆశించడం వల్ల బాల్యంనుండే పిల్లలు ఒత్తిడికి గురిఅవుతున్నారు.అలా వయస్సు పెరిగే కొద్దీ మరింత బాధ్యతలు పెరిగి ఒత్తిడిని ఎదుర్కోవడం వల్లే ఒకవైపు గుండె సమస్యలు లేదా ఆత్మహాత్యలకు పాల్పడడం మనం చూస్తున్నాము. జీవన శైలి లో మార్పులు కరనమేనా ... ఏ వృత్తిలో ఉన్నవారైనా శారీరక శ్రమ తగినంత ఉండడం లేదు. తగిన వ్యాయామం చేయడానికి తగిన సమయం దొరకడం లేదు. వీరు తీసుకునే ఆహారం కూడాసమతులంగా ఉండకపోవడం చాలా మందిలో అధిక బరువు స్థూలకాయం సాధారణం గా కనిపిస్తుంది. శరీర బరువు కూడా ఒకకారణ మైతే ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణా లకు ప్రాధాన కారణం ఊబకాయామే అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.ఇప్పుడు చాలా మంది యువకులలో చాలా మంది రాత్రి పూట మేలుకునే ఉద్యోగాలాలో ఉంటున్నారు. ఇలాంటి వారిలో స్లీప్ ప్యాత్రాన్ సరిగా లేకపోవడం రకరకాల అనారోగ్యాలకు పరోక్షంగా గుండె కిడ్నీ వంటి ముఖ్యమైన అన్ని అవయవాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అని నిపుణులు పేర్కొన్నారు.ఒత్తిడి ని తగ్గించే క్రమం లో రక రకాల అలవాట్లకు యువత పాల్పడుతోంది.తాత్కాలిక ఉపసమనం కోసం చేసుకునే అలవాట్లు ప్రతిరోజూ అలవాటుగా మారి దీర్ఘకాలం లో శరీరానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలవాట్లు వ్యసనాల కారణంగా బిపి రక్త నాళాల పైన తీవ్రమైన ఒత్తిడి నష్టం చేస్తుంది.ఈ కారణంగానే కార్డియో వ్యాస్క్యులర్ సమస్యలు,హార్ట్ ఎట్టాక్ వచ్చే అవకాశాలు ఉన్న్నాయి. హార్ట్ ఎట్టాక్ వచ్చిన వారిలో గుండె కండరం దెబ్బతినడం,లేదా హార్ట్ ఫైల్యూర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.పుట్టుకతో వచ్చే అనారోగ్య సమస్యలు కూడా హార్ట్ ఎట్టాక్ కు కారణమౌతాయి. నివారణ సాధ్యమేనా?... గుండె జబ్బులు వయస్సుతో నిమిత్తం లేకుండా ఎవరికైనా రావచ్చు అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి లక్షణాలు కనపడ్డ వెంటనే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. ప్రాణాలకు ప్రమాదం కాకుండా జాగ్రత్త పడడం అత్యవసరం. దీనికోసం చిన్నపాటి జాగ్రతలు పాటించడం అవసరం... వీలైనంత మేరకు ఒత్తిడికి గురి కాకుండా ఉండడా నికి దూరంగా ఉండే ప్రయాత్నం చేయాలి. ఇందుకోసం యోగా ధ్యానం చేయడం ఉత్తమం... ప్రతిరోజూ అరగంట పాటు వ్యాయామం తప్పని సరిగా చేయడం అలవాటు చేసుకోవాలి... సమతుల పోషక ఆహారం పాలు,కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు,ఆహారం లో భాగం చేసుకోవాలి... కుటుంబ సభ్యులతో కాస్త గడపడం వల్ల ఒత్తిడి ని అధిగమించ వచ్చు.ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలే ప్రాణాపాయ స్థితి నుండి మిమ్మల్ని కాపాడ తాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న దేశానికీ అవసరం, మీ ప్రాణం అత్యంత విలువైనది. అని గ్రహించండి. మీ ఆరోగ్యం మీగుందే మీచేతుల్లోనే ఉందని గుర్తించండి.  ప్రధాన కారణం ఊబకయమే అని నిపుణులు అభిప్రాయ పడ్డారు.      

read more
ఆరోగ్యం కాపాడుకోవడానికి అద్భుత మార్గాలు ఇవే!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ నేటి కాలంలో మాత్రం సంపద కోసం ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు ఎంతోమంది. ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యమే కాదు మానసిక ఆరోగ్యం కూడా ఇవి రెండూ కలిగి ఉండటం ఎంత ముఖ్యం?? రెండూ కావాలంటే ఏమి చెయ్యాలని వైద్యులు ఇలా చెప్పుకొచ్చారు.. మెరుగైన ఆరోగ్యం అంటే.. శారీరక మరియు మానసిక ఆరోగ్యం రెండింటినీ తెలుసుకోవడం, ఈ రెండింటిని కలిగి ఉండటం అవసరం. కరోనా మహమ్మారి సమయంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితులు ఈ వాస్తవాన్ని మరింత బలపరుస్తున్నాయి. ప్రజల మానసిక ఆరోగ్యంపై మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అనేక అధ్యయనాలు నిర్ధారించాయి. గత రెండేళ్లలో ఆందోళన-నిరాశ, ఒత్తిడి సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడానికి ఇదే కారణం. మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం పట్ల ప్రాధాన్యత పెంచుకోవాలి.  వైద్యుల అభిప్రాయం ప్రకారం.. మెరుగైన మానసిక ఆరోగ్యం లేకుండా, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోలేము. ప్రజలు దీని గురించి తెలుసుకోవాలి. మానసిక ఆరోగ్యం ఉన్నప్పుడు మనుషుల్లో అజ్ఞానం ఏర్పడుతుంది. దీనివల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఏ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం జరుగుతుంది. దీంతో జీవితమంటే పెద్ద సవాలులా మారుతుంది. ఈ మానసిక సమస్యలను అధిగమించడానికి వైద్యులు మూడు మార్గాలు సూచిస్తున్నారు.  భావాలను వ్యక్తపరచడం.. మనసులో ఏమనిపిస్తుందో దాని గురించి మాట్లాడటం బలహీనతకు సంకేతం కాదు. కొంతకాలంగా మీ మనసులో ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవడానికి ఇలా మాట్లాడటం ఒక మార్గం. వ్యక్తుల పట్ల మీ ప్రేమను, భావాలను వ్యక్తపరచండి.  ఇతరులను కూడా అలా చేయడానికి ప్రేరేపించండి. ఏదో దృష్టిలో పెట్టుకుని కూర్చోవడం వల్ల టెన్షన్, ఆందోళన పెరుగుతాయి. ఈ అలవాటు మిమ్మల్ని మరింత ప్రతికూలంగా మార్చగలదు, ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. మంచి ఆహారం అవసరం.. మనం తినేవి మన శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటిపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ కారణంగానే ప్రజలందరూ ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. శరీరంలోని ఇతర భాగాల మాదిరిగానే, మీ మెదడు ఆరోగ్యంగా ఉండటానికి, బాగా పనిచేయడానికి పోషకాలు అవసరం. ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉండే వస్తువులను పెంచాలి. ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సంతోషాన్ని కలిగించే పని చేయాలి.. మెరుగైన మానసిక ఆరోగ్యానికి సంతోషంగా ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం మీకు నచ్చిన పనులను చేయండి, సృజనాత్మకంగా ఉండండి. మిమ్మల్ని మీరు ఆస్వాదించడం ద్వారా అది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఆనందించే పనులను చేయడం అంటే మీరు దానిలో నైపుణ్యం ఇవ్వగలరు. ఇలా ఏదైనా  సాధించడం మీ ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. మంచి పుస్తకాలు చదవడం, మంచి సంగీతం, సైక్లింగ్ మొదలైనవి చింతలను మరచిపోయి మానసిక స్థితిని ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడతాయి.  కాబట్టి పైన చెప్పుకున్న ఈ మూడింటిని తప్పకుండా ఫాలో అయితే మానసిక, శారీరక ఆరోగ్యాన్ని నిక్షేపంలా ఉంచుకోవచ్చు.                                     ◆నిశ్శబ్ద.

read more
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
వేసవిలో వేడి దెబ్బ కొట్టేస్తుందని భయమా.. అయితే మీకోసమే ఇవి!

వేసవి కాలం వచ్చేసింది హైడ్రేటెడ్ గా ఉండాల్సిన అవసరం చాలా ఉందిప్పుడు. బయటకు వెళితేనే కాదు..  ఇంట్లో ఉన్నా ఇప్పటికాలంలో ఉన్న అగ్గిపెట్టల్లాంటి ఇళ్లలో, గాలి వెళుతూ సరిగా లేక శరీరంలో తేమశాతం చాలా తొందరగా తగ్గిపోతుంది. ఈ  వేసవిలో శరీరానికి ఎక్కువ ద్రవపదార్థాలు అవసరమవుతాయి, ఎందుకంటే పెరిగిన ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడతుంది. ఈ సమస్య అధిగమించడానికి నీరు ఎక్కువగా తాగాలని చెబుతారు. ఎంత నీరు తాగితేనేం.. నిమిషాలు కూడా గడవకముందే మళ్ళీ దాహం వేస్తుంది, నోరు పిడచకట్టుకుపోతుంది.  చల్లగా, హైడ్రేటెడ్ గా ఉండటానికి నీరు కాకుండా అనేక ఆప్షన్స్  ఉన్నాయి. రుచికి రుచి, శక్తికి శక్తి, ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఇంతకంటే కావాల్సిందేముంది?? ఈ వేసవిలో  మిస్ చేసుకోకూడని.. టాప్ 5 బెస్ట్ డ్రింక్స్ ఇవి.. మీరూ వీటిని ట్రై చేసి చక్కగా హాయిగా ఉండండి. సత్తు తెలుగు వారికి ఇది కాస్త కొత్తే.. ఇది బీహార్ రాష్ట్ర పానీయం. దీన్ని పేదవాడి ప్రోటీన్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఈ ఒక్కమాటతో ఇది ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం  సత్తు డ్రింక్ ను దేశ వ్యాప్తంగా తాగుతున్నారు.  ఇందులో ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటాయి. సోడియం తక్కువగా ఉంటుంది, ఇది మీకు వేగవంతమైన శక్తిని అందించడంతో పాటు కూలింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో కరగని ఫైబర్స్ ఉండటం వల్ల  ఇది ప్రేగులకు కూడా మంచిది. గ్యాస్, మలబద్ధకం, ఆమ్లతను కూడా నియంత్రిస్తుంది, ఇది వేసవిలో శరీరానికి  చల్లదనాన్ని ఇస్తుంది. శనగపిండితో తయారు చేసే ఈ సత్తు పానీయం చాలా శక్తివంతమైంది.   మజ్జిగ.. అల్లం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కాస్త మిర్చితో పోపు వేసిన మజ్జిగ తెలుగువారికి చాలా ఇష్టమైనది. ఈ మజ్జిగను కుండల్లో ఉంచి చల్లగా ఉన్నప్పుడు తాగితే.. కలిగే రిలీఫ్ వేరు.  ఇది శరీరంలోని వేడిని తగ్గించడంలోపాటు డీహైడ్రేషన్‌ను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలక్ట్రోలైట్‌ లు ఉంటాయి. ఇవి శరీరంలో పుట్టే వేడి కారణంగా నీరు కోల్పోవడాన్ని నివారిస్తుంది. అందుకే మజ్జిగ ది బెస్ట్..  అందులోనూ ఇది గొప్ప ప్రోబయోటిక్  ప్రేగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సహాయపడుతుంది. మారేడు జ్యుస్.. శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాల గురించి మాత్రమే మనకు తెలుసు. కానీ మారేడు కాయలను జ్యుస్ చేస్తారని మీకు తెలుసా.. ఇది వేడిని అధిగమించడంలో అద్భుతంగా  సహాయపడే ఉత్తమ పానీయాలలో ఒకటి. బేల్ అని పిలుచుకునే ఈ జ్యూస్ లో రిబోఫ్లావిన్ విటమిన్ బి నిండి ఉంటుంది. ఇది శరీరానికి అద్భుతమైన శక్తిని ఇస్తుంది. ఈ సమ్మర్ లో  శరీరానికి శక్తిని అందించడంలో  కీలక పాత్ర పోషిస్తుంది. దోసకాయ పుదీనా జ్యూస్.. దోసకాయలలో  సహజంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. మరోవైపు, పుదీనా ఆకులు చల్లదనాన్ని రిఫ్రెష్‌ నెస్ ను అందిస్తాయి. ఈ రెండింటిని కలపడం  వేసవికి అద్భుతమైన పానీయం రెడీ అయినట్టే..  దోసకాయ, పుదీన జ్యుస్ తయారుచేసి దానికి కాస్త నల్ల ఉప్పు, నిమ్మరసం జోడిస్తే.. అద్భుతంగా ఉంటుంది. ఈ డ్రింక్స్ తో వేసవిని ఈజీగా అధిగమించవచ్చు.బాబోయ్ ఎండలు అని భయపడకుండా ఛిల్ల్ అవుతూ ఫుల్లు హ్యాపీ ఐపోండి..                                    ◆నిశ్శబ్ద.

read more
మధుమేహం, కీళ్ల వాతం ఉన్నవారిలో ఈ లక్షణాలుంటే కొంప మునిగినట్టే!

ఇప్పటి కాలంలో చాలామందిని వేధించే సమస్య ఏదైనా ఉందంటే.. అది మధుమేహం, కీళ్ల వాతం అని చెప్పచ్చు. ఈ రెండింటికి ప్రధాన కారణం అధికబరువు. అదిక బరువు ఉన్నవారిలో మధుమేహం రావడానికి అవకాశాలు ఎక్కువ. ఈ అధిక బరువే.. కీళ్లు అరిగిపోవడానికి కూడా కారణం అవుతుంది. కానీ మధుమేహం, కీళ్ల వాతం   మూత్రపిండాలను ఎంత నాశనం చెయ్యాలో అంతా చేస్తాయి. ఈ సమస్యను కనుగొనడానికి దీనికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..  మూత్రపిండాల వ్యాధుల లక్షణాలు మూత్రపిండాల పనితీరు తగ్గడం వల్ల శరీరంలోని వ్యర్థాలు పేరుకుపోవడం లేదా ఎలక్ట్రోలైట్ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ రకమైన పరిస్థితిలో, అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  మూత్రపిండాల వ్యాధి లక్షణాలు.. వికారం వాంతులు, ఆకలి నష్టం, అలసట మరియు బలహీనత, నిద్ర సమస్యలు తరచుగా లేదా అరుదుగా మూత్రవిసర్జన, కండరాల తిమ్మిరి ఇవన్నీ కొన్నిసార్లు కనబడుతూ ఉంటాయి. కానీ మూత్రపిండాల సమస్యలో ఇవి అధికం. మరీ ముఖ్యంగా కేవలం రెండు సమస్యలు చాలా అధికంగా కనబడతాయి. సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం.. తరచుగా మూత్ర విసర్జన చేయాలని అనిపిస్తుందా? ఈ సమస్య మూత్రపిండాలు, మధుమేహం రెండు వ్యాధులలో సంభవించవచ్చు. అయితే, ముఖ్యంగా రాత్రిపూట ఇటువంటి సమస్య ఏర్పడటం కిడ్నీ వ్యాధికి సంకేతంగా పరిగణించబడుతుంది. మూత్రపిండాల ఫిల్టర్లు క్షీణించడం ప్రారంభించినప్పుడు, ఇది మూత్ర విసర్జన చేయాలనే కోరికను పెంచుతుంది. కొన్నిసార్లు ఇది పురుషులలో యూరినరీ ఇన్ఫెక్షన్ లేదా ప్రోస్టేట్  విస్తరించడానికి సంకేతం కూడా కావచ్చు. చీలమండలు, పాదాలలో వాపులు పాదాలలో వాపు సమస్య కీళ్ళనొప్పుల వల్ల కూడా కావచ్చు, కానీ కిడ్నీ వ్యాధుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. చీలమండలు పాదాలలో వాపు, మూత్రపిండాల సమస్యలు, ముఖ్యంగా మూత్రపిండాల పనితీరు స్తంబించడం  వలన సంభవించవచ్చు. దిగువ కాళ్ళలో వాపు గుండె జబ్బులు, కాలేయ వ్యాధి, కాళ్ళ నరాల సమస్యలకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఈ సమస్యలకు సకాలంలో వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం.                                   ◆నిశ్శబ్ద.

read more
దానిమ్మ జ్యూస్ తీసుకుంటే నిజంగానే బరువు తగ్గుతారా?

పండ్ల-కూరగాయల జ్యుస్ లు  మొత్తం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా, శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు అందుతాయి, ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రత్యేకతను కలిగి ఉంటాయి.  పండ్లలోకి దానిమ్మ పండు చాలా శక్తివంతమైనది. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం దానిమ్మ పండు తీసుకోవడం జరుగుతుంది. దానిమ్మ గింజలను నేరుగా తినకుండా చాలా మంది జ్యుస్ తయారుచేసుకుని తాగడానికి ప్రాధాన్యత ఇస్తారు.  దానిమ్మ రసం శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను సరిదిద్దడంలో, రక్తహీనతకు చికిత్స చేయడంలో, శరీరానికి శక్తిని అందించడంలో, జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో.. ఇలా బోలెడు రకాలుగా సహాయపడుతుంది. అయితే దానిమ్మరసం కేవలం పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా  బరువు తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుందా?  చాలామంది తమ  డైట్ ప్లాన్‌లలో బరువు తగ్గడానికి దానిమ్మ రసాన్ని చేర్చుకోవాలని నిపుణులే సలహా ఇస్తున్నారు. అయితే బరువు తగ్గడానికి దానిమ్మ ఎంతవరకు బెస్ట్ ఆప్షన్?? అసలు దానిమ్మ వల్ల ప్రయోజనాలు ఏంటి??  బరువు తగ్గడానికి సహాయపడుతుందా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దానిమ్మ జ్యుస్ లో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలన్నీ సమర్థవంతమైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడతాయి, ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు కాబట్టి, దీని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా బరువు పెరిగే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జజీవక్రియ కోసం.. దానిమ్మ జీర్ణ ఆరోగ్యానికి ప్రయోజనకరమైనది, ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఇది జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. దానిమ్మలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ కార్సినోజెనిక్ ప్రభావాలను కలిగి ఉన్నాయని  జంతు అధ్యయనాలలో నిరూపితమైంది. ప్రేగుల ఆరోగ్యానికి, మెరుగైన జీర్ణక్రియకు దానిమ్మ ది బెస్ట్.. జీవక్రియను సరిగ్గా ఉంటే.. తిన్న ఆహారం జీర్ణమై బరువు పెరగకుండా చేస్తుంది.   యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా.. పాలీఫెనాల్స్ అని పిలువబడే ప్రభావవంతమైన యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను దానిమ్మ కలిగి ఉంటుంది. శరీరంలోని వివిధ రకాల తాపజనక పరిస్థితులకు చికిత్స చేయడానికి పాలీఫెనాల్స్ ప్రభావవంతంగా ఉంటాయి. ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి (IBD), రుమటాయిడ్ ఆర్థరైటిస్, జీవక్రియ, హృదయ సంబంధ రుగ్మతలు వంటి తాపజనక సమస్యల చికిత్సలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది. ఇతర ఆరోగ్య ప్రయోజనాలు.. దానిమ్మ అనేక ప్రభావవంతమైన పోషకాల నిధి, దీని వినియోగం శరీరానికి అనేక ప్రయోజనాలను ఇస్తుంది.  దానిమ్మలో పాలీఫెనాల్స్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇది క్యాన్సర్ నివారణలో ప్రయోజనాలను కలిగి ఉంది. అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇది ఆర్థరైటిస్‌లో మేలు చేస్తుంది. గుండె జబ్బులు ఉన్నవారి ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది.                                                ◆నిశ్శబ్ద.

read more
గొంతు నొప్పి వేధిస్తోందా? ఈ సమస్యతో ముప్పు రావచ్చు!

మారుతున్న వాతావరణం వల్ల  తరచుగా అనేక రకాల గొంతు సమస్యలు వస్తాయి. వీటిలో గొంతు ఇన్ఫెక్షన్ చాలా ఇబాబుది పెడుతుంది.  గొంతు ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణాల ద్వారా దాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకుంటే ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. అదే ఈ ఇన్ఫెక్షన్ ను లైట్ తీసుకుంటే ఇది చాలా దారుణమైన ఫలితాన్ని పరిచయం చేస్తుంది.   గొంతు ఇన్ఫెక్షన్ సాధారణంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, అలెర్జీల వల్ల సంభవించవచ్చు. కొన్నిసార్లు వాతావరణంలో మార్పు లేదా ఫ్లూ కారణంగా కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటే.. గొంతు ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది? గొంతు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వస్తుంది. ఇది  ఏ వయస్సు వారిలో అయిన కనిపించవచ్చు.  కానీ ఈ సమస్య చిన్న పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలు గొంతు ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఎక్కువ.   గొంతు ఇన్ఫెక్షన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే.. గొంతు నొప్పి, ఆహారం మింగడంలో ఇబ్బంది తలెత్తడం.  టాన్సిల్స్‌లో వాపు, నొప్పి. టాన్సిల్స్ మీద తెల్లగా ఉండటం. గొంతు ఎరుపు రంగులోకి మారడం.  వాయిస్ లో మార్పు, గొంతు బొంగురు పోవడం జరుగుతుంది.  గొంతు ఎండిపోయినట్టు, నాలుక మీద దద్దుర్లు రావడం,  జ్వరం-దగ్గు, తలనొప్పి మొదలైనవి ఉంటాయి.  గొంతు ఇన్ఫెక్షన్ కారణాలు.. జలుబు వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. గొంతు నొప్పి, వాపు, జ్వరం వంటి సమస్యలు ఉండవచ్చు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీని కారణంగా, స్ట్రెప్ థ్రోట్ సమస్య, గొంతు, టాన్సిల్స్‌లో ఇన్ఫెక్షన్ వస్తుంది. అలర్జీ వల్ల కూడా గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. కాలుష్యం, పెంపుడు జంతువులు, బలహీనమైన రోగనిరోధక శక్తి, ఇతర కారణాల వల్ల అలెర్జీలు వస్తాయి. గొంతు గాయం కారణంగా,  స్వర తంతువులు, గొంతులో కండరాలు వ్యాకోచం చెందుతాయి. , దీని కారణంగా గొంతు నొప్పి వస్తుంది. దీర్ఘకాలం గొంతు నొప్పి ఉంటే అది ఇన్ఫెక్షన్‌కు దారి తీస్తుంది. గొంతు ఇన్ఫెక్షన్ నివారణ ఇలా.. గొంతు నొప్పి లేదా ఇతర లక్షణాలు ఉంటే, భౌతిక దూరం పాటించడం ముఖ్యం. శుభ్రత పట్ల శ్రద్ధ వహించండి. ఆహారం తినే ముందు తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోటిపై రుమాలు ఉంచుకోవాలి. సిగరెట్ మద్యం అలవాట్లు ఉంటే వాటిని వదిలెయ్యాలి. . పొగతాగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్ మరింత పెరుగుతుంది. ఎక్కడైనా గాలి కాలుష్యం, ధూళి ఉంటే గొంతు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. మురికి ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి. పుష్కలంగా నీరు త్రాగాలి కానీ చల్లని నీరు మాత్రం త్రాగకూడదు. గొంతు ఇన్ఫెక్షన్ చికిత్స ఇలా..   గొంతు ఇన్ఫెక్షన్ ఉంటే  డాక్టర్లు  యాంటీబయాటిక్స్ ఇవ్వవచ్చు.  వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే ఏదైనా మందు  వాడటం ముఖ్యం. సమస్య తీవ్రత పెరిగినప్పుడు  గొంతు ఇన్ఫెక్షన్ చికిత్సకు శస్త్రచికిత్సా ప్రక్రియ కూడా ఉంది, దీనిలో టాన్సిల్స్ తొలగించబడతాయి.  గొంతు ఇన్ఫెక్షన్‌లో అనేక ఇంటి చిట్కాలు  ప్రయోజనకరంగా ఉంటాయి.  ఉప్పు, వెల్లుల్లి, ఆపిల్ వెనిగర్, తేనె, పాలు మంచివి. అలాగే పసుపు, అల్లం, ఆవిరి పట్టడం లికోరైస్ మొదలైనవి మంచి ఉపశమనాన్ని ఇస్తాయి.                                  ◆నిశ్శబ్ద.

read more
బొప్పాయి తింటే ఏమవుతుంది... ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం!

ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే  తీసుకునే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతారు. ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా ఆకుపచ్చ కూరగాయలు పండ్లను తీసుకోవడం మంచిది. మనం తినే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి తినడం వల్ల అనేక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే బొప్పాయి ఆరోగ్యానికి హానికరంగా కూడా మారుతుంది. అందుకే రోజూ బొప్పాయిని ఎంత తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, ఆరోగ్య నష్టాలు ఏంటి తెలుసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  బొప్పాయిలో ఉండే పోషకాలు..  బొప్పాయి విటమిన్ ఎ కి ఖజానా అనుకోవచ్చు.  ఇందులో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది, అంతే కాకుండా విటమిన్ సి కూడా లభిస్తుంది. మరోవైపు, బొప్పాయిలో చాలా నీరు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ పదార్థాలు, ఆల్కలీన్ మూలకాలు, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, చక్కెర మొదలైనవి కనిపిస్తాయి. సహజంగా, ఫైబర్, కెరోటిన్, ఖనిజాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు బొప్పాయి తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. వీటి గింజలను తీసుకుంటే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది. బొప్పాయిలో ఉండే ఔషధ గుణాలు కంటి ఆరోగ్యానికి మంచిది. ఆర్థరైటిస్ రోగులు సమస్య నుండి ఉపశమనం కావాలని అనుకుంటే బొప్పాయి చక్కగా పనిచేస్తుంది. బొప్పాయి స్కిన్ టోన్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. జుట్టును దృఢంగా ఒత్తుగా మార్చేందుకు బొప్పాయి ఆకుల రసాన్ని ఉపయోగించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బొప్పాయి గింజలు క్యాన్సర్‌ను నివారించడంలో మేలు చేస్తాయి. అధిక బరువు ఉన్నవారు బొప్పాయి తినడం వల్ల  ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. అధిక రక్తపోటు చికిత్సలో పచ్చి బొప్పాయి ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల  రోగనిరోధక వ్యవస్థ కూడా మెరుగవుతుంది. బొప్పాయి తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు గర్భధారణ సమయంలో బొప్పాయి తినకూడదు. బొప్పాయిలో పాలు కనిపిస్తే, అది గర్భాశయ సంకోచాలకు కారణమవుతుంది. దీని కారణంగా గర్భస్రావం, ప్రసవ నొప్పి, శిశువులో అసాధారణతలు ఉండవచ్చు. పాలిచ్చే తల్లులు బొప్పాయికి దూరంగా ఉండటమే మంచిది. బొప్పాయిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే జాండిస్ సమస్య పెరుగుతుంది. బొప్పాయిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ముక్కులో రద్దీ, జలదరింపు, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అంతేకాదు కిడ్నీలో రాళ్ల సమస్య రావచ్చు. మరీ ముఖ్యమైన విషయం ఏమిటంటే..  ఒక సంవత్సరం లోపు పిల్లలకు బొప్పాయి హానికరం.                                 ◆నిశ్శబ్ద.

read more
మోకాళ్ళ నొప్పులు వేధిస్తున్నాయా... ఇవే అసలు కారణాలు!

కాళ్ల నొప్పులు గృహిణులలో ఒక సాధారణ సమస్య. చాలామంది మహిళలు తరచుగా వారి మోకాళ్ళలో నొప్పి అంటూ ఉంటారు. మోకాళ్ల నొప్పుల కారణంగా మహిళల వర్కింగ్ స్టైల్ కూడా దెబ్బతింటుంది. కీళ్ల లేదా మోకాళ్ల నొప్పులకు ప్రధాన కారణాలలో ఒకటి పేలవమైన జీవనశైలి మరియు ఆహారంలో పోషకాహార లోపం. నేటి ఆధునిక జీవనశైలి వల్ల కీళ్ల నొప్పులు వస్తున్నాయి. ఈ సమస్య రాత్రిపూట ఎక్కువగా వేధిస్తుంది. ఒక వయస్సు తర్వాత, స్త్రీలు, పురుషులు ఇద్దరూ మోకాలి నొప్పి గురించి ఫిర్యాదు చేస్తారు, అయితే ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మోకాళ్ల నొప్పుల సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో నొప్పులు పెరిగే అవకాశం కూడా ఉంది. మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతుంటే, ముందుగా ఈ సమస్యకు కారణాలు ఏమిటో తెలుసుకోవాలి. మోకాలి నొప్పి నుండి ఉపశమనం పొందడానికి నివారణలు తెలుసుకోవాలి. మోకాలి నొప్పి కారణాలు పురుషుల కంటే మహిళలకు మోకాళ్ల నొప్పులు ఎక్కువ. పురుషులు, స్త్రీల శరీర నిర్మాణంలో వ్యత్యాసం దీనికి ఒక కారణం. నిజానికి స్త్రీల కీళ్ల కదలికలు ఎక్కువగా ఉండడం వల్ల వారి లిగమెంట్లు కూడా మరింత ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. స్త్రీల మోకాళ్ల కదలిక ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని వల్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ. మెనోపాజ్ తర్వాత, మహిళల్లో ఋతు చక్రంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయి తగ్గుతుంది. ఈస్ట్రోజెన్ అనేది మహిళల్లో కనిపించే హార్మోన్, ఇది మోకాళ్లను ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతుంది. కానీ పీరియడ్స్‌లో ఈస్ట్రోజెన్ హార్మోన్ తక్కువ స్థాయి మోకాళ్లపై ప్రభావం చూపుతుంది. మోకాలి గాయాల విషయంలో, సరిగ్గా లేక వెంటనే చికిత్స చేయకపోతే, భవిష్యత్తులో నొప్పి ప్రమాదం పెరుగుతుంది. వ్యాయామం చేసినప్పుడు లేదాఎక్కువగా పరిగెత్తినప్పుడు, మోకాలి చిప్ప, స్నాయువులపై ఒత్తిడి ఉంటుంది. కీళ్ల నొప్పులు పెరుగుతాయి. అధిక వ్యాయామం ఆరోగ్యానికి హానికరం.  పురుషులతో పోలిస్తే మహిళల్లో కీళ్ల నొప్పులకు అధిక బరువు లేదా ఊబకాయం ఒక కారణం. ఊబకాయం సమస్యకు పురుషుల కంటే స్త్రీలే ఎక్కువ మంది బాధితులు. అధిక బరువు వల్ల మోకాళ్లపై ఒత్తిడి పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక బరువు, మోకాళ్లపై ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. తేలికపాటి నొప్పి ఉన్నప్పుడు తరచుగా ప్రజలు దానిని లైట్ తీసుకుంటారు., ఇది మోకాళ్లలో ఎక్కువ నొప్పికి అవకాశాలను పెంచుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ రీసెర్చ్ సొసైటీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం, ఒక వ్యక్తికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు మోకాలి నొప్పి ఉంటే, అది ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల వచ్చినధై ఉండొచ్చు. కీళ్ల నొప్పులకు నివారణలు మోకాళ్లు లేదా కీళ్లలో నొప్పి రాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. దీని కోసం, వ్యాయామం చేస్తే, దాన్ని కూడా అవగాహనతో ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మోకాళ్ల మృదులాస్థిని కాపాడుకోవచ్చు.  మోకాళ్ల నొప్పులను నివారించడానికి స్విమ్మింగ్ సైక్లింగ్ చేయవచ్చు. ఈ వ్యాయామం భవిష్యత్తులో మోకాళ్లకు నష్టం జరగకుండా చేస్తుంది. అధిక బరువు కారణంగా, మోకాళ్లపై ఒత్తిడి ఉంటుంది, కాబట్టి బరువు విషయంలో జాగ్రత్త.   అతిగా వ్యాయామం చేయడం వల్ల కీళ్లలో నొప్పి కూడా వస్తుంది. కొన్నిసార్లు వేగంగా లేవడం, కూర్చోవడం లేదా నడవడం వంటి అధిక శ్రమ నొప్పిని కలిగిస్తుంది. జుంబా, ఫంక్షనల్ వర్కవుట్, సూర్య నమస్కారం, పద్మాసనం వంటివి ఎక్కువగా సాధన చేయడం వల్ల నొప్పి పెరుగుతుంది. కాబట్టి నిపుణుల సలహా మేరకు మాత్రమే వ్యాయామం చేయాలి. మోకాళ్లలో వాపు వచ్చినా, నొప్పి వచ్చినా పట్టించుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. మోకాళ్ల సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో సమస్య పెరుగుతుంది.                                    ◆నిశ్శబ్ద.

read more
కాళ్ళ నొప్పులకు శరీరంలో అధిక కొలెస్ట్రాల్ కు లింకుందా?

కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. కొలెస్ట్రాల్ రక్త నాళాలలో పేరుకుపోయి సాధారణ రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. అధిక స్థాయి కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది, ఎందుకంటే ఈ ప్రమాదం చిన్న వయస్సు నుండి వృద్ధాప్యం వరకు ప్రతి ఒక్కరికీ వస్తోంది ఈ కాలంలో, దీన్ని నివారించడం చాలా ముఖ్యం. ఆహారం జీవనశైలిలో ఆటంకాలు కలగడం కొలెస్ట్రాల్ పెరగడానికి ప్రధాన కారణం కావచ్చు. అధిక కొలెస్ట్రాల్ లక్షణాలను సరైన సమయంలో  గుర్తించడం, దానికి తగిన చికిత్స చేయడం ద్వారా, తీవ్రమైన వ్యాదులు అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. దురదృష్టవశాత్తు, అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు ప్రారంభ దశల్లో స్పష్టంగా కనిపించవు. కానీ శరీరంలోని కొన్ని సంకేతాలను జాగ్రత్తగా గమనించడం ద్వారా గుర్తించవచ్చు. కాళ్లలో నొప్పికి అధిక కొలెస్ట్రాల్ కి లింకేమిటి? పెరుగుతున్న కొలెస్ట్రాల్ పరిస్థితి కారణంగా, రక్తపోటులో తరచుగా సమస్య, గుండెపోటు, నడవడంలో నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఈ అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు కొన్ని పాదాలలో కనిపిస్తాయి. ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోయిన సందర్భంలో, కాళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా మొదలవుతాయి, దీనిని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. పాదాలలో నొప్పి ఉండటం, ఆ నొప్పి కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత అది మెరుగుపడినట్లయితే, అది శరీరంలో  కొలెస్ట్రాల్ పెరుగుతున్న సంకేతంగా పరిగణించబడుతుంది రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది  రక్తంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్  ధమనుల పనితీరు  తగ్గిస్తుంది లేదా నిరోధిస్తుంది. ధమనులలో కొలెస్ట్రాల్ పెరిగే సమస్యను పట్టించుకోకపోతే, దీని కారణంగా, శరీరంలోని అనేక భాగాలలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గడం ప్రారంభించినప్పుడు  పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ సమస్య వస్తే ఏం జరుగుతుంది? పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ సమస్యలో, కాళ్లలో అడపాదడపా నొప్పి ఉంటుంది. ఈ లక్షణాలు సాధారణంగా వాకింగ్ లేదా ఏదైనా ఇతర శారీరక శ్రమ సమయంలో అధ్వాన్నంగా ఉంటాయి, అయితే కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత అవి మెరుగవుతాయి. మరోవైపు మందులు చికిత్స లేకుండా పాదాల నొప్పికి అంత త్వరగా ఉపశమనం లభించదు. మీరు అలాంటి లక్షణాలను ఎదుర్కొంటుంటే, ఖచ్చితంగా దీని గురించి వైద్యుడిని సంప్రదించండి శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెరుగుతోందని సూచించే మరికొన్ని సంకేతాలు. అధిక కొలెస్ట్రాల్‌ గుర్తించడానికి ప్రత్యేకంగా ఇదీ.. అని ఎలాంటి  లక్షణం లేనప్పటికీ, దానిని గుర్తించడానికి రక్త పరీక్ష మాత్రమే మార్గం. అయితే, కొన్ని శారీరక సంకేతాల ఆధారంగా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతోందో లేదో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు తరచుగా వికారం అవయవాల తిమ్మిరి విపరీతమైన అలసట ఛాతీ నొప్పి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. చేతులు కాళ్ళలో తిమ్మిరి లేదా చల్లదనం. అధిక రక్తపోటు సమస్య. ఈ సమస్యల్లో కొన్ని మీకూ ఉంటే తప్పకుండా వైద్యుడిని కలవండి.                                    ◆నిశ్శబ్ద.

read more
మీ పేగు ఆరోగ్యం నిజంగానే బాగుందా?

జీర్ణవ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా సమతుల్యతను గట్ హెల్త్ అంటారు. రోగనిరోధక శక్తి, శారీరక, మానసిక ఆరోగ్యం  ఇతర కారకాలు ప్రేగులలో ఈ సూక్ష్మజీవులు సమతుల్యంగా ఉండటంపై దోహదం చేస్తాయి.  అయితే ఇప్పట్లో చాలామందికి ఈ గట్ ఆరోగ్యం బలహీనంగా ఉంటోంది.   పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడే కొన్ని విషయాలు తెలుసుకుంటే..  నోటి ఆరోగ్యం బాగుండాలి..  దంతాలను క్రమం తప్పకుండా బ్రష్ చేయాలి.  నోటి నుండి బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశించి సమస్యలను సృష్టిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.  దంతాలను జాగ్రత్తగా చూసుకోవడం ద్వారా, చెడు మైక్రోబయోమ్  కడుపులోని మంచి మైక్రోబయోమ్‌ను నాశనం  చేయకుండా నిరోధించవచ్చు. ఒత్తిడి స్థాయిలను బ్యాలెన్స్ చెయ్యాలి. ఒత్తిడి లేదా ఆందోళన ప్రభావాన్ని అనుభవించే శరీరంలోని మొదటి భాగాలలో కడుపు ఒకటి కావచ్చు. ఒత్తిడి సమయంలో, శరీరంలో నాడీ వ్యవస్థ మరింత చురుకుగా ఉంటుంది. అంతేకాకుండా, ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది, జీర్ణక్రియకు రక్తాన్ని ఉపయోగించాల్సిన అవసరాన్ని నిరోధిస్తుంది. బదులుగా, ప్రతిస్పందనను ప్రేరేపించడానికి  శరీరం దాని శక్తిని  కండరాలు మరియు గుండెకు నిర్దేశిస్తుంది. నిదానంగా జీర్ణం కావడం వల్ల కడుపులోని ఆమ్లాల పెరుగుదల గుండెల్లో మంట, ఉబ్బరం వంటి జీర్ణవ్యవస్థ సమస్యలకు దారితీయవచ్చు. చాలా ఆహారాలలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి సాధారణ కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి, అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గట్ ఆరోగ్యానికి అంతరాయం ఏర్పడుతుంది. గట్‌లోని అవాంఛిత బ్యాక్టీరియాను వదిలించుకోవాలని మీరు ఆలోచిస్తున్నట్లయితే తక్కువ చక్కెర సహాయపడుతుంది. పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, రెస్టారెంట్ ఫుడ్‌లో అధిక చక్కెర కంటెంట్ సర్వసాధారణం ఎందుకంటే ఇది రుచిని పెంచుతుంది. విభిన్నమైన ఆహారాన్ని తినాలి.. ప్రేగులలో వందలాది రకాల బాక్టీరియాలు ఉంటాయి.  వీటిలో ప్రతి ఒక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో.. విభిన్న పోషకాహార అవసరాలలో ప్రత్యేకమైన పనితీరును కలిగి ఉంటాయి. సాధారణంగా చెప్పాలంటే, డైవర్సిఫైడ్ మైక్రోబయోమ్ ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎక్కువ బ్యాక్టీరియా జాతులు  ఆరోగ్యంపై మరింత సానుకూల ప్రభావాలకు దారితీయవచ్చు అనే వాస్తవం దీనికి కారణం. వైవిధ్యభరితమైన మైక్రోబయోమ్ అనేక రకాల ఆహారాలు తీసుకోవడం లభ్యమవుతాయి.  నిద్ర ముఖ్యం.. కడుపు, మెదడు నరాలు మరియు రసాయనాలను ఉపయోగించి ఒకదానితో ఒకటి సంభాషించుకుంటాయి. వాటి మార్పిడి మీ మానసిక స్థితి, నిద్ర విధానాలను ప్రభావితం చేయవచ్చు. సిర్కాడియన్ రిథమ్ ను తరచుగా "జీవ గడియారం" అని పిలుస్తారు, ఇది అంతర్గత టైమర్. ఇది జీర్ణక్రియ వంటి క్లిష్టమైన ప్రక్రియలను నియంత్రిస్తుంది. రౌండ్-ది-క్లాక్ షెడ్యూల్‌లో నిద్రిస్తుంది. మన గట్ సూక్ష్మజీవులు కూడా షెడ్యూల్‌కు కట్టుబడి ఉంటాయి, కానీ మీకు తగినంత నిద్ర లేకపోతే, మీ జీర్ణక్రియ మైక్రోబయోమ్ ప్రభావితం కావచ్చు. వ్యాయామం ఏమి పనులు చేయకుండా ఒకే చోట ఉండి పనులు చేసుకునేవారికి తక్కువ వైవిధ్యమైన జీర్ణాశయ సూక్ష్మజీవులు  కలిగి ఉంటాయి. అందువల్ల, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం అనేది  శరీరంలో మీరు తినే వాటితో పాటు జీవనశైలి మీద కూడా ఆధారపడి ఉంటుంది.  వ్యాయామాల వల్ల ఈ గట్ ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. దీని వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్యకరమైన బాక్టీరియా చలనాన్ని  ప్రేరేపించవచ్చు. ఇవన్నీ పాటిస్తే గట్ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.                                   ◆నిశ్శబ్ద.

read more
ఇలా చేస్తే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఐస్ లాగా కరిగిపోతుంది!

ఇప్పటి కాలంలో చాలా మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.  శరీరంలో కొలెస్ట్రాల్ అధికంగా పెరగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ అనేది కొవ్వు లాంటి పదార్ధం, ఇది జిగటగా ఉంటుంది. రక్త ధమనులలో పేరుకుపోతుంది, ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. శరీరంలోని వివిధ భాగాలకు రక్తం చేరడం కష్టతరం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండెకు రక్తం చేరకపోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. దీని కారణంగా, శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి కూడా ప్రారంభమవుతుంది. ఇది సాధారణంగా ఉబకాయం, కొవ్వు పదార్ధాల అధిక వినియోగం కారణంగా జరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, దానిని తగ్గించడానికి ఆహారంలో అనేక మార్పులు చేయడం అవసరం. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే కొన్ని పదార్థాలు మన ఇంట్లోనే.. వంటగదిలో ఉన్నాయి. కింద సూచించిన మూడు చిట్కాలలో ఏదో ఒకటి ఫాలో అవ్వడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.  దాల్చిన చెక్క గుండె సమస్యలను తొలగించడంలో దాల్చినచెక్క చాలా ప్రయోజనకరమైనది. దీన్ని ఉపయోగించడం వల్ల రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ కారణంగా మూసుకుపోయిన ధమనులు తెరుచుకోవడంలో ఇది సహాయపడుతుంది.  ఇందులోని యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ముఖ్యంగా రక్తలో  కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దాల్చిన చెక్కను తీసుకోవడానికి ఉత్తమ మార్గం టీ తయారు చేసి త్రాగడం. దాల్చిన చెక్క టీ తయారు చేయడం చాలా సులభం. ఒక కప్పు నీటిని మరిగించి దాల్చిన చెక్క ముక్కలను వేసి కాసేపు ఉడికించాలి. ఈ టీని తేనె కలుపుకుని తాగవచ్చు.  మెంతులు  మెంతి గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. మెంతి గింజలు ధమనులలో కొలెస్ట్రాల్ శోషణ ప్రక్రియను తగ్గించే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. మెంతి గింజలను తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగవచ్చు. మెంతి గింజలను వంటలలో భాగంగా తీసుకోవచ్చు. అంతే కాకుండా మెంతి గింజలతో టీ తయారు చేసి తాగడం వల్ల కూడా మేలు జరుగుతుంది. పసుపు  ఔషధ గుణాలతో నిండిన పసుపు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అనేక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది. పసుపును వేడి నీటిలో మరిగించి టీ లాగా తాగవచ్చు. పాలలో కలిపి తీసుకోవచ్చు.  మూడు చిట్కాలలో ఏదో ఒకటి తప్పకుండా ఫాలో అయితే కొలెస్ట్రాల్ సమస్య తగ్గిపోతుంది.                                 ◆నిశ్శబ్ద..

read more
నవ్వితే బాగుపడతారు

పూర్వకాలం నుండీ పెద్దవాళ్ళు పలుకుతున్నట్లు “నవ్వి, బాగుపడండి" అనే మాటను నేటి వైద్య మానసిక శాస్త్రాలు సమర్థిస్తున్నాయి. అది వ్యర్థమైన మాటకాదు. మానసిక బాధల వలనో, శరీర బలహీనత వలనో బిగ్గరగా నవ్వే దృక్పధం కొందరికి లేకపోవచ్చు. ఇది ఒక లోపం అనుకోవచ్చు. ఆధునిక  వైద్య శాస్త్రం ప్రకారం నవ్వలేని మనిషిని ఏదో రోగం ఆవరించి వుందనుకోవాలి. ఏదో ఒక అనిశ్చలత అతని ఎదలో దాగుడుమూతలాడుతుంటుంది. నవ్వుతూ ఆనందంగా కాలక్షేపం చేయలేని వ్యక్తి సాంఘిక జీవితంలో చెప్పుకోదగ్గ ఫలితాలు తేలేడు. పారిస్ నగరంలో వివసించే మనో విజ్ఞాన శాస్త్ర నిపుణుడు డాక్టరు పియరీ వాచెట్ ఇలా అన్నారు. “నవ్వు బలమైన ఉత్ప్రేరణలు కలుగజేస్తుంది. అందువలన నరాలు సడలి వ్యక్తి యొక్క శరీరావస్థలో మార్పు వస్తుంది. ఆయన కొన్నాళ్లు. నవ్వు వలన దేహానికి కలిగే లాభాలను గూర్చి వివరించే ఒక తరగతి ప్రారంభించారు. నవ్వు ఒక అంటువ్యాధి వంటిది, అది అందరినీ ఇట్టే మార్చివేస్తుంది. సామూహికంగా ప్రజల మనో ప్రవృత్తిని నవ్వు ద్వారా మార్పు చెందినవచ్చు. మన శరీర మానసిక ఆవేశాలు సడలింపబడటం వల్ల మాత్రమే మన హృదయానికి ఆనందం కలుగుతుంది. మనకు నవ్వు తెచ్చే ఈ ఆనందం  వలన నవ్వుతాము. నవ్వుతాము కాబట్టి మనకు ఆనందం కలుగుతుంది. రోగం బాగా ముదిరి మరణావస్థలో వున్న ఒక బాలుడు ఇంకా నవ్వుతూనే వున్నాడు. అప్పుడు అతడు బ్రతికి బయటపడే అవకాశాలున్నాయని ఒక వైద్యుడు సాక్షమిచ్చాడు. పెద్దలు పై పైకి నవ్వవచ్చు గానీ చిన్న పిల్లలు దొంగ నవ్వులు నవ్వలేరు గదా! పిల్లలు యదార్థంగా పరిస్థితిని బట్టి ప్రవర్తిస్తారు. రోగగ్రస్తుడైవ బాలుడు ఇంకా నవ్వగల్గితే సగం జబ్బు నయమైనట్లే. డాక్టరు జి. డబ్ల్యు, నేరెంటీన్ ఫ్రెంచి దేశపు మనో శాస్త్రవేత్త. పిల్లలలో నవ్వు అనే అంశంపై కుణ్ణంగా పరిశీలన చేసి నవ్వు వారి రోగాలను పోగొడుతుందని ధృణీకరించాడు. ప్రధమంగా పసిబిడ్డ చిరునవ్వు నవ్వటం ద్వారా తన ఆనందాన్ని, ఆరోగ్య స్థితిని తెలియజేస్తాడు. పన్నెండు వారాలు పూర్తి కాగానే శిశువులు బిగ్గరగా నవ్వటం ప్రారంభిస్తారు. ఆరు రోజుల ప్రాయం నుండే చిరునవ్వులు నవ్వుతారు. వయస్సు ఎక్కువగల బిడ్డ బిగ్గరగా నవ్వటానికి, కొన్ని దినాల వయస్సుగల బిడ్డ చిరునవ్వు మాత్రమే నవ్వటానికి గల కారణం ఆరోగ్య స్థితిలో మెరుగు కావటం కాదు.  అది మనో అభివృద్ధి. మూడు నెలల వయసులో  కొన్ని ఉచ్ఛారణలు, శబ్దాలు తనకిష్టమని తెల్పుతూ బిడ్డ నవ్వుతాడు. తన ఆనందాన్ని తృప్తిని అలా నవ్వు ద్వారా వెల్లడి చేస్తాడు. ప్రారంభదశ నుండి మాటలు ఎట్లా అభివృద్ధి అవుతాయో అట్లే నవ్వు కూడ అభివృద్ధి చెందుతూ వుంటుంది. మాటలతో ఎలా మరొకరికి మన భావాలు తెల్పుతామో అట్లే.. నవ్వడం  ద్వారా శిశువు తన భావాలు తెలియజేయగల్గుతాడు.. ఇలా నవ్వు మన ఆరోగ్యానికి, మానసిక మెరుగుదలకు ఒక గొప్ప ఔషదమవుతుంది.                                     ◆నిశ్శబ్ద.  

read more
నారింజ-నిమ్మ.. దేంట్లో ఏముంది?

మనం  సహజంగా తినే పండ్లలో నారింజ తప్పకుండా ఉంటుంది. తియ్యగా, పుల్లగా ఉంటే ఈ పండు సిట్రస్ పండుగా పేరు పొందింది. ఇందులో ఉన్న సి విటమిన్ మనకు ఎంతగానో సహపడుతుంది. దీంతోపాటు నిమ్మకాయ కూడా విరివిగానే వాడతాం. నారింజ, నిమ్మకాయలకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించారు. విదేశీ కథల ప్రకారం వీటి వెనుక ఎన్ని కారణాలు ఉన్నా.. ఇవి ఆరోగ్యానికి గొప్ప వరాలు. ఈ రెండు పండ్ల గురించి వివరంగా తెలుసుకుంటే..  పోషకాల మూలంగా, నారింజ రసం చక్కెరను జోడించకుండా సహజమైన తీపిని కలిగి ఉంటుంది. నిమ్మరసంతో పోలిస్తే, నారింజ రసంలో అనేక ఖనిజాలు మరియు విటమిన్లు రెండింతలు ఉంటాయి, అయితే రెండు రసాలు గణనీయమైన మొత్తంలో మూడు విటమిన్లు మరియు ఫ్లేవనాయిడ్లను అందిస్తాయి. న్యూట్రిషన్ పరంగా చూస్తే.. ఒక కప్పు  నిమ్మరసాన్ని తీసుకోగలిగితే 54 కేలరీలు మాత్రమే లభిస్తాయి,  అదే 1 కప్పు నారింజ రసంలో 112 కేలరీలు ఉంటాయి. ఆరెంజ్ జ్యూస్‌లో దాదాపు 2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది, ఇది నిమ్మరసం కంటే రెట్టింపు. ఒక కప్పు నిమ్మరసం 1 గ్రాము ఫైబర్‌ను అందిస్తుంది, అయితే నారింజ రసంలో సగం ఉంటుంది. విటమిన్ సి ఒక కప్పు నారింజ రసం రోజువారీ మనకు కావలసిన విటమిన్ సి విలువలో 138 శాతం అందిస్తుంది, నిమ్మరసంలో  అయితే 104 శాతం ఉంటుంది. నీటిలో కరిగే యాంటీఆక్సిడెంట్‌గా, విటమిన్ సి కణాలకు హానిని నిరోధిస్తుంది, మంటను తగ్గిస్తుంది, ఇది గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ సి అమైనో ఆమ్లాలు, కొల్లాజెన్‌లను సంశ్లేషణ చేసే రసాయన ప్రతిచర్యలలో పాల్గొంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్‌గా మాత్రమే కాకుండా, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థకు మెరుగుపరుస్తుంది. ఫోలేట్ కొత్త కణాలు తయారవడానికి, కణాల పెరుగుదలకు ఫోలేట్ముఖ్యం. ఫోలేట్ గర్భం దాల్చిన మొదటి మూడు నెలల ముందు సమయంలో తగినంత మొత్తంలో తీసుకున్నప్పుడు పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది. అన్ని వయసులలో, ఫోలేట్ రక్తం నుండి హోమోసిస్టీన్‌ను తొలగిస్తుంది. ఇది చాలా ముఖ్యమైనది.  ఎందుకంటే అధిక స్థాయి హోమోసిస్టీన్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఒక కప్పు నారింజ రసంలో రోజువారీ మనక్కావాల్సిన ఫోలేట్‌లో 18 శాతం ఉంటుంది. అదే నిమ్మరసంలో 12 శాతం ఉంటుంది. విటమిన్ B-6 విటమిన్ B-6 రక్తంలో ప్రసరించే హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గిస్తుంది, అయితే ఇది ఫోలేట్ కంటే భిన్నమైన ప్రక్రియ ద్వారా దాన్ని సాధిస్తుంది. విటమిన్ B-6 న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్ ఉత్పత్తి చేయడంలో పాత్రను కలిగి ఉంది, ఇది నిద్ర మరియు మానసిక స్థితిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆరెంజ్ జ్యూస్ మరియు నిమ్మరసం రెండూ మనకు రోజుకు అవసరమైన విటమిన్ బి-6లో 8 శాతం అందిస్తాయి. ఫ్లేవనాయిడ్స్ ఫ్లేవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే పదార్థాల పెద్ద కుటుంబం. సిట్రస్ పండ్లలో కొన్ని ఫ్లేవనాయిడ్‌లు ఉంటాయి, ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీలుగా పనిచేస్తాయి. రక్తపోటును మెరుగుపరచడంలో, శరీర కొవ్వును తగ్గించడంలో కాలక్రమేణా బరువు పెరగకుండా నిరోధించడంలో సహాయపడతాయి.  సిట్రస్‌లోని ఇతర యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు న్యూరోటాక్సిసిటీని నిరోధించడంలో సహాయపడతాయి. ఇక ఈ నారింజ, నిమ్మలను మీకు నచ్చినట్టు ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అయితే సహజంగా తీసుకునే వేటిలోనైనా ఎలాగైనా పూర్తి ఫలితాలు లభిస్తాయో.. అలాగే వీటిని సహజంగా తీసుకుని సంపూర్ణ పలితాన్ని పొందడం మంచిది.                             ◆నిశ్శబ్ద.

read more
ఎంతో ఇష్టంగా తినే పుచ్చకాయ ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా?

వేసవి వచ్చిందంటే చాలామంది పుచ్చకాయలు, చెరకు రసం, మామిడి పండ్లు, తాటిముంజలు మొదలైనవి తినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. మరీ ముఖ్యంగా ఎక్కువశాతం నీటితో నిండి ఉండే పుచ్చకాయ అంటే పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. తియ్యగా, జ్యూసీగా ఉండే పుచ్చకాయను ఎర్రటి ఎండలో తింటూంటే వేసవి తాపం మొత్తం మాయమైపోతుంది. అందుకే శీతల పానీయాలు, సోడాలు తీసుకోవడానికి బదులు పుచ్చకాయ తినడం మంచిదని ఆహార నిపుణులు కూడా చెప్తారు. అయితే పుచ్చకాయ బాగుంటుంది కదా అని మరీ ఎక్కువగా తినేస్తే మాత్రం ఆరోగ్య లాభాలకు బదులు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పుచ్చకాయ తియ్యగా ఉంటుంది. కేలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. వేసవి దాహాన్ని తీరుస్తోంది కదా అని పుచ్చకాయను అధికంగా తింటే మాత్రం తక్కువగా ఉన్న కేలరీలు కాస్తా శరీరానికి అధికంగా మారతాయి. వీటిలో ఉండే చక్కెరల  కారణంగా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది.  అందుకే పుచ్చకాయ మంచిదే  అయినా ఎక్కువ తింటే అధికబరువుకు దారితీస్తుంది. పుచ్చకాయలో ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తింటే జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది కాస్తా  గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుంది. అన్ని వయసుల వారు పుచ్చకాయను తినచ్చు. అదేవిధంగా  మధుమేహం ఉన్నవారు కూడా దీన్ని మితంగా తీసుకోవచ్చు. అయితే పుచ్చకాయను  అధికంగా తీసుకుంటే మాత్రం మధుమేహ రోగులకు ప్రమాదం. ఎందుకంటే కేలరీలు తక్కువగా ఉన్నా పుచ్చకాయలో తియ్యదనం ఎక్కువగా ఉంటుంది. అతిగా తింటే ప్రమాదం.   ఆరోగ్యవంతమైన శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అన్నీ  కూడా ముఖ్యమే. అయితే పుచ్చకాయ అధికంగా తినడం వల్ల శరీరంలో ఖనిజాలు విచ్చిన్నమవుతాయి. శరీరంలో ఖనిజాల కొరత ఏర్పడుతుంది.  ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం. పుచ్చకాయలో నీటి శాతం, ఫైబర్  అధికంగా ఉంటాయి. కడుపుకు సంబంధించిన సమస్యలతో  ఇబ్బంది పడేవారు   పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి.                                                          *రూపశ్రీ  

read more
ముల్లంగి ఇలా తింటేనే పలితం ఉంటుంది!

మనకు తక్కువ ధరలో.. అందుబాటులో ఉండే కూరగాయల్లో ముల్లంగి ఒకటి. నీటి శాతం అధికంగా ఉన్న ముల్లంగి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, చలికాలంలో ముల్లంగిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది, జలుబు, దగ్గు వంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ముల్లంగి తినడం వల్ల గుండె జబ్బులు కూడా తగ్గుతాయి. కానీ చాలా మంది ముల్లంగి తినడం మానేస్తారు. రుచి నచ్చకో.. వాసన నచ్చకో.. మరింకేదో కారణం చెప్పుకుని ముల్లంగికి దూరం ఉంటారు. కొందరు ముల్లంగి తిన్న తర్వాత గ్యాస్ వస్తుందని అంటారు. దీని వల్ల కొన్నిసార్లు అందరి ముందు ఉన్నప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు. పచ్చి ముల్లంగి తినడం కొందరికి అలవాటు. ఇతర రాష్ట్రాలలో మనం దోసకాయను తిన్నట్టు, ముల్లంగిని తింటారు. ముల్లంగిని తిన్న తర్వాత చాలా మంది కడుపు నొప్పి అని కూడా ఫిర్యాదు చేస్తారు. ఆయుర్వేదం ప్రకారం..  ఈ రకమైన సమస్య ముల్లంగి తినడం వల్ల కాదు, ముల్లంగిని తప్పుగా తీసుకోవడం వల్ల వస్తుంది. ముల్లంగి తినడానికి సరైన సమయం తెలుసుకోవాలి. నచ్చినప్పుడు నచ్చినవిధంగా ముల్లంగి వండుకుని తినడం, తరువాత దాన్ని నిందించడం కంటే.. ముల్లంగిని తినడానికి సరైన మార్గం ఏంటో తెలుసుకుంటే బెటర్.  ముల్లంగి తినడానికి సరైన సమయం ఏది? ముల్లంగిని ఎప్పుడూ ఖాళీ కడుపుతో తినకూడదు. రాత్రి భోజనంలో కూడా ముల్లంగిని తినకూడదు. తరచుగా చాలామంది ముల్లంగిని ఆహారంతో పాటు సలాడ్‌గా తింటారు, కానీ వండిన ఆహారంతో పచ్చి కూరగాయలను తినకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడుతుంది. అందుకే ముల్లంగిని అల్పాహారం తర్వాత లేదా మధ్యాహ్నం భోజనానికి ముందు తినాలి. కావాలంటే లంచ్ డిన్నర్ మధ్య సమయంలో ముల్లంగిని తినవచ్చు. ఈ సమయంలో ముల్లంగి తినడం వల్ల శరీరానికి ముల్లంగిలోని అన్ని పోషకాలు అందుతాయి. జీర్ణక్రియ కూడా బాగుంటుంది.  ముల్లంగిని తినడానికి సరైన మార్గం తెలుసా.. పచ్చి ముల్లంగిని తింటుంటే, దానితో పాటు ఇతర పచ్చి కూరగాయలను చేర్చుకోవాలి. ఉదాహరణకు దోసకాయ, టొమాటో, క్యారెట్ మొదలైన వాటిని మిక్స్ చేసి సలాడ్ లాగా తినవచ్చు.  ముల్లంగిని కొనుగోలు చేసేటప్పుడు, అతిగా పండిన ముల్లంగిని కొనకూడదు. ఈ రకమైన ముల్లంగిని తినడానికి బదులుగా, సన్నగా, చిన్నగా లేతగా ఉన్న ముల్లంగిని తీసుకోవాలి.  ముల్లంగి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, కాబట్టి ముల్లంగిని తినే సమయంలో ఒకే చోట కూర్చోకూడదు. ఏవైనా చిన్న చిన్న పనులు చేస్తుండాలి.  ముల్లంగిని పొట్టు తీసి అందులో నల్ల ఉప్పు కలిపిన తర్వాత తింటే మంచిది.  ముల్లంగిని ఎవరు తినకూడదు? శరీరంలో నొప్పి ఎక్కువగా ఉంటే ముల్లంగిని తినకూడదు. శారీరక శ్రమ చేయని వారు కూడా ముల్లంగికి దూరంగా ఉండాలి. అలాంటి వారు ముల్లంగి తినడం వల్ల కడుపు నొప్పి లేదా గ్యాస్ సమస్య పెరుగుతుంది.  ముల్లంగి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా.. చలికాలంలో రోజూ ముల్లంగి తినడం వల్ల దగ్గు మరియు జలుబు సమస్యను దూరం చేసుకోవచ్చు. ముల్లంగిని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ముల్లంగి ప్రయోజనకరంగా ఉంటుంది.  ముల్లంగి రక్తంలో చక్కెరను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి మధుమేహం ఉన్నవారికి మంచిది.                                   ◆నిశ్శబ్ద

read more
మట్టి పాత్రలలో వండుకుని తింటే జరిగే అద్భుతం ఇదే...

పూరీ జగన్నాధ స్వామి ఆలయంలో ప్రసాదం మట్టిపాత్రలలోనే వండబడుతుంది, మట్టిపాత్రలోనే అందించబడుతుంది. ఎందుకంటే మట్టి పరమపవిత్రమైనది. శరీరం తగులబెట్టినప్పుడు మిగిలేది 20 గ్రాముల మట్టిమాత్రమే. అందులోనే 18 రకాల మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. దాన్నే మనం బూడిద అంటాము. ఈ వైజ్ఞానిక విషయం అక్కడి పూజారులకు తెలియకపోవచ్చు. ఎందుకంటే వారు సైన్స్ చదువలేదు కాబట్టి. అయినా కూడా శాస్త్రవేత్తలయినవారు ఎన్నో సంవత్సరాలు పరిశోధించి తెలుసుకునే విషయం వారికి తెలియకపోయినా వారు ఆచరిస్తున్నారు. పవిత్రమైన ఆలయంలో భగవంతుని ప్రసాదం కూడా అంతే పవిత్రమైన మట్టి పాత్రలోనే వండి సమర్పించాలి అని మాత్రం తెలుసు.  ఒకసారి కొందరు ఈ ప్రసాదాన్ని తీసుకుని భువనేశ్వర్ లోని C.S.I.R. లేబరేటరీ అంటే (కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్) రీజనల్ రిసర్చ్ లేబరేటరీలో పరిశోధించమని అడిగారు.  వారు దీనికి చాలా సమయం అంటే దాదాపు ఆరు నెలల సమయం పడుతుంది అన్నారు. అయినా దానికి కావల్సిన పనిముట్లు మావద్దలేవు. మీరు ఈ ప్రసాదాన్ని డిల్లీ తీసుకువెళ్ళి టెస్ట్ చేయించుకోండి అన్నారు.  మళ్ళీ అక్కడ నుండి డిల్లీదాకా తీసుకెళ్తే అప్పటిలోపు అది పాడవుతుంది కదా అని వాళ్ళకు డౌటొచ్చింది.  అదే విషయం అక్కడి శాస్త్రజ్ఞులకు చెబితే..  అక్కడి శాస్త్రజ్ఞులు ఇలా అన్నారు..  పూరి ఆలయంలోని ప్రసాదం మట్టిపాత్రలో వండబడుతుంది కాబట్టి, ఇది పాడవ్వదు అని చెప్పారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. మట్టిపాత్రలో వండే ఆహారం ఎంత విలువైనదో అనే విషయం. అయితే భునేశ్వర్ నుండి డిల్లీకి వెళ్ళాలంటే సుమారు 36 గంటల సమయం పడుతుంది. అయినా తీసుకెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయించిన తరువాత  రిపోర్ట్ వచ్చింది. ఈ పదార్థంలో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు అని వారన్నారు. వెంటనే ప్రెషర్ కుక్కర్లో వండిన పదార్ధాన్ని కూడా టెస్ట్ చేయించారు. దానికి  వచ్చిన రిపోర్ట్ కేవలం 13 శాతం మాత్రమే న్యూట్రియన్స్ ఉన్నాయి. 87 శాతం న్యూట్రియన్స్ దెబ్బతిన్నాయి, లోపించాయి. అంతేకాదు మట్టిపాత్రలో వండిన పదార్థానికి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇది మన భారతీయ సంస్కృతీ సంప్రదాయం కనుక మన పూర్వీకులు ఈ సంప్రదాయం ప్రకారం జీవించినంతవరకు వారికి కళ్ళజోడు రాలేదు. జీవితాంతం వరకు పళ్ళు ఊడిపోలేదు. మోకాళ్ళ నొప్పులు డయాబెటీస్ వంటి సమస్యలు రాలేదు. శరీరానికి కావల్సిన నూట్రియన్స్ సక్రమంగా అందుతుంటే జీవితాంతం మన అన్ని పనులు మనమే ఎవరిమీద ఆధారపడకుండా జీవించగలం. అది ఒక్క మట్టిపాత్రలో వండిన ఆహారం తినడం వలన మాత్రమే సాధ్యమవుతుంది. అందుకనే భారతదేశం నేలలో అల్యూమినియం తయారీకి కావల్సిన ముడిసరుకు ఎంత ఉన్నప్పటికీ, మనవారు మట్టి వస్తువులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఇంతగా మనకి మట్టిపాత్రలు తయారుచేసే కుమ్మరివాళ్ళు మనకి ఎంత గౌరవనీయులో కదా. ఏమట్టి కుండగా పనికివస్తుందో ఎలాంటి మట్టితో వంటపాత్రలు చేయవచ్చో గుర్తించి ఏ యూనివర్శిటీలో చదువుకోకుండానే మనకి ఇంత గొప్ప సేవచేసి మన ఆరోగ్యాన్ని అందిస్తున్నారు కుమ్మరివారు.  మనం కుమ్మరి వారిని ప్రోత్సహించి వారికి భవితను ఇవ్వాలి. ఫ్రిజ్ లు, కుక్కర్ లు  ఉన్నాయి కదా అని మట్టి పాత్రలను దూరం పెడితే మనకు మిగిలే న్యూట్రియన్స్ సున్నానే…  ఆరోగ్యంగా జీవితాంతం బ్రతకాలంటే గాలి, సూర్యరశ్మి తగిలేలాగా ఆహారం వండుకోవాలి.  దానిలో అత్యుత్తమమైన పాత్ర మట్టిపాత్ర.. లోనే వండాలి.                                       ◆నిశ్శబ్ద.

read more
రక్తానికి వైద్యం చేసుకోండి ఇలా...

మన శరీరంలో ఆక్సిజన్, హార్మోన్లు, విటమిన్లు, మినరల్స్, ఇతర ముఖ్యమైన పోషకాలు రక్తం ద్వారానే శరీర అవయవాలకు రవాణా అవుతాయి. అయితే విషపూరిత కణాలు రక్తంలో కలవడం వల్ల బ్లడ్ పాడవుతుంది. ఫలితంగా రక్తం పనితీరుపైనా ప్రభావం పడుతుంది… విషపూరిత పదార్థాలను లేదా కణాలను మనం నియంత్రించాలి. లేదంటే అవి వివిధ వ్యాధులకు కారణమవుతాయి. ◆రక్తం ఎందుకు శుద్దిగా ఉండాలంటే.. శరీరంలోని అన్ని అవయవాలు, టిష్యూ కణాలు రక్తంతో అనుసంధానం అయి ఉంటాయి. బ్లడ్ పాడవడం వల్ల గుండెపోటు,  పీసీఓడీ, మధుమేహం, ఊబకాయం, రక్త పోటు, బ్లడ్ క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, అల్జీమర్స్ వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి. వాటి నుంచి బయటపడాలంటే రక్తం శుద్ధిగా ఉండటం అవసరం. ◆మన రక్తం పరిశుభ్రంగా లేదని ఎలా తెలుసుకోవచ్చు? అపరిశుభ్రమైన రక్తం యొక్క లక్షణాలు చర్మ సమస్యలు ఎక్కువగా జుట్టు రాలిపోవడం ఆకలి మందగించడం అతిగా నిద్రపోతున్న ఫీలింగ్ ముదురు పసుపు రంగులో మూత్రం రక్తస్రావం అయ్యే వ్యాధులు ◆కారణమేమిటంటే.. రక్తం విషతుల్యం కావడానికి మూల కారణం 'పిత్త దోషం'(శరీరంలో వేడి), ప్రతికూల భావోద్యేగాలని ఆయుర్వేదంలో ఉంది. ◆రక్తాన్ని అపరిశుభ్రంగా మార్చే అలవాట్లు కార్బోహైడ్రేటెడ్ డ్రింక్స్, చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, వేపుడు పదార్థాలు, ఉప్పు అధికంగా ఉన్న లేదా స్పైసీగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల రక్తం అపరిశుభ్రంగా మారుతుంది.. ఫుడ్ కాంబినేషన్ సరిగ్గా లేకపోవడం కూడా ఇందుకు ఓ కారణమే.. ఉదాహరణకు ఉప్పగా ఉండే స్నాక్స్ తింటూ టీ తాగడం, పిండిలో ఉప్పు, పాలు కలపడం. యాంటీబయోటిక్స్ ఎక్కువగా వాడటం, పొగ తాగడం, మందు సేవించడం, సమయానికి తినకపోవడం, నిద్ర విషయంలో రాజీ పడడం ఇందుకు ప్రధాన కారణాలు. టాక్సిక్ ఓవర్లోడ్ను తగ్గించుకోవాలి రక్తాన్ని అపరిశుభ్రంగా మార్చే అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల టాక్సిక్ ఓవర్లోడ్ను తగ్గించుకోవచ్చు" అనుసరించాల్సిన మార్గాలు 15 రోజులకు ఒకసారి ఉపవాసం డిన్నర్ను రాత్రి 7 గంటలలోపు తినాలి ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి. తగినన్ని నీళ్లు తాగాలి ఉప్పు వినియోగం తగ్గించాలి. చురుకుగా ఉండాలి. వేపాకు వేప శరీరాన్ని కూల్గా ఉంచుతుంది. ఇది రక్తాన్ని సహజంగా శుద్ధి చేస్తుంది. చర్మ సమస్యలకు చక్కని పరిష్కారంగా ఉంటుంది. వరుసగా ఐదు రోజుల పాటు పరగడుపున 4-5 వేపాకులను తినాలి ◆ఆరోగ్యకరమైన రక్తానికి కావాల్సిన ఆహారం క్యారెట్లు, బీట్రూట్లు, సొరకాయ, చిన్న పొట్లకాయను రోజూవారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆకు కూరలు, ముఖ్యంగా రుచిలో వగరుగా ఉండే ఆహార పదార్థాల వల్ల రక్తంలో విషతుల్యమైన కణాలను తొలగించవచ్చు. దానిమ్మ, మామిడి పండ్లు. అల్ల నేరేడు, ఉసిరి వంటి పండ్లు తరచుగా తింటూ ఉండాలి. ఇవన్నీ పాటిస్తే మీ రక్తాన్ని సులువుగా శుద్ధి చేసుకోవచ్చు.                                        ◆నిశ్శబ్ద.

read more