ఆహారంలో మునగాకు చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

ఆరోగ్యంగా ఉండటానికి ఆహారాలు ఎంతగానో తోడ్పడతాయి. సరైన ఆహారం తీసుకుంటే అసలు జబ్బుల గోల ఉండదు, అంతకు మించి మందుల తలనొప్పి అసలే ఉండదు. కానీ ఆహారాల మోజులో పడి కొందరు అనారోగ్యాలను తెచ్చుకుంటున్నారు. మన చుట్టూ ఎంతో సులువుగా లభించే ఆహారాలతోనే బోలెడు ఆరోగ్యం పొందవచ్చు. చాలాచోట్ల మునగ చెట్లు బాగా పెరిగి ఉంటాయి. వీటి కాయలు అయితే డబ్బు పెట్టి కొనాల్సి వస్తోంది. కానీ మునగాకు మాత్రం డబ్బు వెచ్చించకుండానే కోసుకోవచ్చు.  ఒకవేళ మునగ చెట్లు అందుబాటులో ఉంటే మాత్రం తరచుగా మునగాకును మిస్ కాకుండా తినండి.  కేవలం మునగాకే కాదు మునగ పువ్వులను కూడా  ఆహారంలో భాగంగా తీసుకుంటారు. మునగాకును పప్పు, కారప్పొడి, టీ వంటి వంటకాలుగానూ, మునగ పువ్వులను కూడా ఇదే విధంగానే వండుకుంటారు. చాలా మంది మునగాకును, మునగ పువ్వులను ఎండబెట్టి పొడి చేసుకుని వాటిని ఉపయోగించుకుంటారు. మార్కెట్లో కూడా మునగాకు పొడి డబ్బులు పోసి కొనాల్సి వస్తోంది. కాబ్టటి మునగాకును ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో పోషకాలేంటో.. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. మునగాకులో ప్రోటీన్, విటమిన్-బి6, విటమిన్-సి, విటమిన్-ఎ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు సమృద్దిగా ఉంటాయి. మునగాకు తరచుగా తీసుకుంటే ఎముకలు బలపడతాయి.  కాల్షియం తక్కువ ఉందని కాల్షియం ఆధారిత ఆహారం తీసుకున్నా ఎముకలు బలంగా మారకపోతే మునగాకును ఆహారంలో చేర్చుకోవచ్చు. మునగాకు అల్సర్లను తగ్గించంలో అద్బుతం చేస్తుంది. ఇందులో యాంటీ అల్సర్ గుణాలు ఉన్నాయి. అల్సర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు మునగాకును తింటూ ఉంటే సమస్య తొందరలోనే తగ్గిపోతుంది. అధికబరువు సమస్య ఇప్పట్లో పెద్ద తలనొప్పిగా మారింది. కానీ బరువు తగ్గించడంలో మునగాకు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఆహారంలో తీసుకుంటూ ఉంటే బరువు తగ్గుతారు. ఇందులో ఉండే పైబర్  జీర్ణాశయ పనితీరు మెరుగుపరుస్తుంది. మునగాకులో ఉండే పైబర్ అధిక బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి శక్తి అందించడంలో మునగాకుది అందె వేసిన చెయ్యి. దీన్ని తింటూ ఉంటే శరీరం బలంగా మారుతుంది. రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా మునాకును మధుమేహం ఉన్నవారిని తినమని సిఫారసు చేస్తారు. కాస్త వైద్యం మీద అవగాహన ఉన్నవారి నుండి నైపుణ్యం ఉన్న వైద్యుల వరకు అందరూ మునగాకును తీసుకోమని సమర్థిస్తారు. మునగాకు ఆహారం ద్వారా విడుదలయ్యే చక్కెరలను నెమ్మది చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఐరన్ లోపం ఉన్నవారు కూడా మునగాకు తినాలి. ఐరన్ లోపం దీర్ఘకాలం పాటూ కొనసాగితే అది రక్తహీనత సమస్యకు దారితీస్తుంది. ఐరన్ భర్తీ అయితే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. మునగాకు తింటే కలిగే మరో అధ్బుతమైన లాభం.. జుట్టు పెరుగుదల. చాలామంది జుట్టు పెరుగుదల కోసం తలకు హెయిర్ ప్యాక్ లు, షాంపూలు, నూనెలు ఉపయోగిస్తుంటారు. కానీ మునగాకును ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే చాలు. కేవలం నెల రోజుల్లోపే జుట్టు పెరుగుదల లోనూ, జుట్టు రంగు లోనూ, జుట్టు మందంగానూ మారుతుంది.                                                     *నిశ్శబ్ద.  

read more
ఉదయం లేవగానే మెంతుల నీళ్లు తాగుతే అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు..!

మెంతుల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఐరన్, మాంగనీస్‌తో సహా మంచి మొత్తంలో ఫైబర్, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం, రాత్రిపూట ఒక గ్లాసు శుభ్రమైన నీటిలో మెంతులు వేసి నానపెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని బాగా ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి. కావాలంటే మెంతి గింజలు కూడా తినొచ్చు. దీంతో శరీరంలో ఉండే టాక్సిన్స్ తొలగిపోతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది:  ఖాళీ కడుపుతో మెంతుల గింజల నీరు తాగితే  షుగర్ అదుపులో ఉంటుంది. మెంతులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే మెంతి గింజల నీటిని తాగవచ్చు. గుండెకు మేలు చేస్తుంది: మెంతి నీరు గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించే హైపోకొలెస్టెరోలెమిక్ మూలకాలను కలిగి ఉంటుంది.  తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వినియోగం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, మీరు రోజూ మెంతి నీటిని కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గుతుంది: మెంతి గింజల్లో ఫైబర్ ఉంటుంది.  ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే మెంతుల నీళ్లు  తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది: మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అజీర్ణం లేదా మలబద్ధకంతో సమస్యలు ఉన్నవారికి మెంతి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతిలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌లు ప్యాంక్రియాస్‌ను మరింత యాక్టివ్‌గా చేస్తాయి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది:  మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తాగుతే, మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ సమస్యను నయం చేయవచ్చు. మెంతి గింజల నీటిని ఒక నెలపాటు క్రమం తప్పకుండా తాగితే, హెచ్‌డిఎల్ అంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని భావిస్తున్నారు.

read more
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
చలికాలంలో ఆరోగ్య సమస్యలా.. నీటిలో ఒక్క చెంచా దీన్ని కలిపి వాడితే సెట్!

చలికాలంలో ముక్కు, చెవి,  గొంతుకు సంబంధించిన సమస్యలు చాలా వస్తాయి. వాటిలో జలుబు, గొంతు కింద వాపు ముఖ్యమైనవి. ఇవి టాన్సిల్స్ సమస్యకు దారితీస్తాయి. టాన్సిల్స్ కారణంగా ఆహారం తిన్నాలన్నా, తాగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి చాలా సింపుల్ గా చెక్ పెట్టవచ్చు. కేవలం ఒక్క చెంచా వంటింట్లో ఉండే పదార్థాన్ని నీళ్లలో  కలిపి ఉపయోగించడం వల్ల టాన్సిల్ సమస్య తగ్గుముఖం పడుతుంది. అసలు జలుబు, టాన్సిల్స్ సమస్య ఎందుకొస్తుంది? దీనికి కారణాలు ఏంటి? తెలుసుకుంటే.. చలికాలంలో చల్లని, పొడిగాలులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళలల్లో ఈ గాలులు ఎక్కువ. ఇలాంటి వాతావరణంలో ఉండటం వల్ల గాలుల ప్రభావం గొంతులో కణజాలాన్ని పొడిగా మారుస్తుంది. దీనికారణంగా గొంతులో చికాకును, వాపును కలిగిస్తుంది. ఇదే క్రమంగా గొంతు నొప్పి, జలుబు, సైనస్, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.  ఈ సమస్య ఏర్పడిన తరువాత తొందరగా సమస్యను గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే టాన్సిల్స్ కు దారితీస్తుంది. జలుబు వస్తే.. చలికాలంలోనే కాదు జలుబు చేస్తే ముక్కులు బ్లాక్ అయిపోతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనికారణంగా రోజంతా డిస్టర్బ్ అవుతారు. జలుబును లైట్ తీసుకుంటే శ్లేష్మం పెరుగుతుంది. గొంతులో వాపు కూడా వస్తుంది. దీన్నుండి ఉపశమనం పొందాలంటే గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. దీనివల్ల శ్లేష్మం తొలగిపోతుంది. ముక్కులు కాస్త రిలాక్స్ అవుతాయి. టాన్సిల్స్ వస్తే.. టాన్సిల్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆహారం తినాలన్నా, తాగాలన్నా కూడా ఇబ్బందే. దీన్ని పరిష్కరించాలంటే ఇంట్లో ఉన్న ఒక్క స్పూన్ ఉప్పు చాలు. లీటరు నీటిలో ఒక స్పూను ఉప్పు వేసి బాగా పుక్కిలించాలి. రోజులో ఇలా నాలుగైదు సార్లు చేస్తుంటే చాలు గొంతు నొప్పి, గొంతులో శ్లేష్మం తగ్గుతుంది. బ్లాక్ అయిపోయిన ముక్కులు రిలాక్స్ అవుతాయి. జలుబు, టాన్సిల్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్ లను కూడా ఇది తొలగిస్తుంది. దగ్గు సమస్య ఉంటే అది కూడా తగ్గిపోతుంది. ఉప్పు నీరుతో పుక్కిలిస్తేనే ఉపశమనం ఎందుకుంటుందంటే.. నీటిలో ఉప్పు కలిపినప్పుడు నీటి పిహెచ్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. దీని కారణంగా బ్యాక్టీరియా అభివృద్ది చెందదు. ఎందుకంటే ఆల్కలీన్ వాతావరణంలో బ్యాక్టీరియా ఎక్కువకాలం మనుగడ సాగించలేదు.                                                 *నిశ్శబ్ద.  

read more
స్వీట్ల మీద సిల్వర్  కోటింగ్ ఎందుకు వేస్తారో తెలుసా!

స్వీట్లంటే ఇష్టపడని వారు ఉండరు. ఇళ్లలో మహా అయితే రెండు మూడు రకాల స్వీట్లు రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ బయట షాపులలో బోలెడు రకాల స్వీట్లు ఉంటాయి. ఇవి వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో చూడగానే తినేయాలనిపించేలా ఆకర్షిస్తాయి. కొన్ని ఖరీదైన స్వీట్లను గమనిస్తే వాటి మీద సిల్వర్ కోటింగ్ ఉంటుంది. ఇలా వెండి పూత కలిగిన స్వీట్లు పెద్ద పెద్ద షాపులలో ఎక్కువ ఖరీదులో ఉంటాయి. ఈ వెండి పూతను వరాక్ అని పిలుస్తారు. చాలామంది అలంకరణ కోసం ఈ పూత వేస్తారని అనుకుంటారు. కానీ ఇలా స్వీట్ల మీద వెండి పూత వేయడానికి వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయి. మోతీచూర్ లడ్డూ, కాజూ కట్లీ, కాజూ పిస్తా రోల్స్ వంటి స్వీట్ల మీద వెండి పూత ఉంటుంది. పాలతో మాత్రమే చేసే వివిధ స్వీట్లకు కూడా ఈ వెండి పూత అప్లై చేస్తారు. స్వీట్ల మీద అప్లై చేసే వెండి పొరలో నిజంగానే శుద్దమైన వెండి ఉపయోగిస్తారు. శుద్దమైన వెండితో తయారైన వెండిపూత ఉన్న స్వీట్లు చాలా ఆరోగ్యం. వెండిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్దిగా ఉంటాయి. అలాగే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా స్వీట్ల మీద వెండి పూత వేస్తే స్వీట్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. లేకపోతే పాలతోనూ, నెయ్యితోనూ చేసిన స్వీట్లు    తొందరగా ముక్కిపోయిన వాసన వస్తాయి. మొట్టమొదట స్వీట్ల మీద వెండి పూత వేయడం మొదలైంది కూడా ఈ కారణంతోనే. అయితే వెండి అనేది ఖరీదైన లోహంగా మారడం వల్ల స్వీట్ల మీద వెండి పూత వేయగానే సాధారణ స్వీట్లు కూడా ధర కొండెక్కి కూర్చుంటున్నాయి. మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద షాపులు స్వీట్లు చాలా అట్రాక్షన్ గా కనిపించడం కోసం వెండి పూతను ఎంచుకుంటారు. .                                                   *నిశ్శబ్ద.

read more
చలికాలం పిల్లలకు న్యుమోనియా ప్రమాదం ఎక్కువ..సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు..!!

వాతావరణం ఒక సీజన్ నుంచి మరో సీజన్ కు మారుతున్న సమయంలో మన శరీరం ఒక రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. క్రమంగా వాతావరణానికి అలవాటు పడుతుంది. అయితే ఈ సమయంలోనే కొన్ని రకాల సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చలికాలం ప్రారంభ దశలో చాలా మంది జలుబు, దగ్గు, ఫ్లూ, న్యుమోనియా వంటి వ్యాధుల బారిన పడుతుంటారు. పెద్దవాళ్లు ఈ సమస్యల నుంచి సులభంగా కొలుకున్నప్పటికీ పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈమధ్య చైనాలో పెద్ద సంఖ్యలో పిల్లలు న్యుమోనియాతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇది సాధారణ సీజనల్ ఇన్ఫెక్షన్ అని అక్కడి వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం ఎక్కడైనా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున పిల్లల్లో న్యుమోనియా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. చలికి వాయు కాలుష్యం కూడా తోడవ్వడంతో పిల్లలు ఊపిరితిత్తుల సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే పిల్లల్లో న్యుమోనియా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం అందించాలి. దగ్గు, వేగంగా శ్వాసతీసుకోవడం, జ్వరం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. అలాగే న్యుమోనియాతో పోరాడే శక్తిని పొందేందుకు ఊపిరిత్తుల ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే... జలుబు: సాధారణ జలుబు లక్షణాలే న్యుమోనియా లక్షణాలుగా ఉంటాయి. జలుబు క్రమంగా న్యుమోనియాకు దారితీసే ఛాన్స్ ఉంటుంది. అందుకే జలుబు చేసినప్పుడు, మరింత తీవ్రమైన న్యుమోనియాగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే చికిత్స తీసుకుని మందులు వాడాలి. పరిశుభ్రత: న్యుమోనియా అనేది బ్యాక్టీరియా, వైరస్ లు , శిలీంధ్రాలు వంటి అనేక రకాల సూక్ష్మజీవులతో వస్తుంది. సాధారణంగా న్యుమోనియా అంటువ్యాధి కాదు..కానీ వేగంగా వ్యాప్తిచెందుతే అంటువ్యాధిగానే గుర్తించాలి. అందుకే బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరి. ఇంట్లోకి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వ్యాధి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు ముక్కు, నోరును ఎక్కువగా తాకకూడదు. దగ్గు: దగ్గు న్యుమోనియా సాధారణ లక్షణంగా చెబుతారు. బాధితులు దగ్గినప్పుడు రోగి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి వ్యాధి కారకాలు వ్యాపించే మార్గం ఇది. అందుకే దగ్గు వచ్చినప్పుడు నోటికి గుడ్డ అడ్డుగా పెట్టుకోవాలి. దీంతో ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు. వ్యాక్సిన్: న్యుమోనియాకు కారణమయ్యే సాధారణ బ్యాక్టీరియా, వైరస్ లను నిరోధించేందుకు వ్యాక్సిన్ తీసుకుంటే సమస్య ప్రభావం ఎక్కువగా ఉండదు. ఆసుపత్రిలో చేరేంత తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాన్ని వ్యాక్సిన్ తగ్గించేస్తుంది. ఇమ్యునిటీ లేనివారు న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. లైఫ్ స్టైల్: సీజనల్ ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తి శరీరానికి ఉండాలంటే ఇమ్యునిటీ బలంగా ఉండాలి. దీనికి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. వ్యాయాయం చేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లను మానేయాలి.   

read more
ఈఫుడ్స్ తో నెలసరి ఇబ్బందులకు చెక్!

ప్రతి ఆడపిల్లకూ నెలసరి తప్పనిసరి. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, పోషకాహారలోపం వంటి కారణాలతో అధిక రక్తస్రావం, కడుపునొప్పి, తీవ్ర భావోద్వేగాలు వంటికి కనిపిస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అవేంటో చూద్దామా. ఆకు కూరలు: ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని ఈ సమయంలో తింటే నొప్పులు తగ్గుతాయి. రక్తహీనత సమస్య అదుపులో ఉంటుంది. ఇందులోని మెగ్నీషియం మెదడుకి ఉపశమనం కలిగిస్తుంది. అరటిపండ్లు: ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇందులోని పొటాషియం ఒంట్లోని నీటిని నిల్వల్ను కోల్పోకుండా చేయడంతో డీహైడ్రేషన్ సమస్య ఎదురుకాదు. అంతేకాదు అరటిలో ఉండే ట్రిప్టోఫాన్ సెరటోనిన్ విడుదల చేస్తుంది. ఇది మెదడుకు ఉపశమనం అందిస్తుంది. డార్క్ చాక్లెట్ : నెలసరి సమయంలో ఒంట్లోని ప్రొజెస్టెరాన్ హార్మోన్ తగ్గడంతో ఈస్ట్రోజన్ పెరుగుతుంది. దీంతో ఒంట్లో చక్కెర స్థాయిలు తగ్గి నీరసం పెరుగుతుంది. దీంతో తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది. ఇలాంటి సమయంలో డార్క్ చాక్లెట్ తినండి. పెరుగు: చాలామంది నెలసరి సమయంలో పెరుగు తినకూడదని చెబుతుంటారు. కానీ ఇది ఆ సమయంలో మంచి ఆహారమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఉండే కాల్షియం, పొత్తికడుపు నొప్పిని తగ్గించి, మూడ్ స్వింగ్స్ కి దూరంగా ఉంచుతుంది.

read more
నిద్రలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటుకు సంకేతమా..?

మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. గుండె పనితీరు సజావుగా సాగితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మనకు ఎదురయ్యే కొన్ని సంకేతాలు గుండెకు సంబంధించి ఏదో సమస్య ఉందని ముందే చెబుతాయి. ఇటీవలి కాలంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. నేపథ్యంలో ముందే గుండె పోటును ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. గుండెపోటు ఎందుకు వస్తుందో మనం గమనిస్తే, గుండె కండరాలకు ఆక్సిజన్ అందని సమయంలో గుండె పోటు వస్తుంది. ప్రధానంగా మనం తినే కొవ్వు పదార్థాల ప్రభావం వల్ల రక్తనాళాలు కొలెస్ట్రాల్ రూపంలో మూసుకుపోతాయి. దీని వల్ల గుండెకు రక్తం, ఆక్సిజన్ అందడం లేదు. ఇలా అరగంటలోనే గుండె పనిచేయడం ఆగిపోతుంది. లక్షణాలు ఇవే… శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది: రాత్రిపూట ఊపిరి ఆడకపోవడం కూడా గుండె సమస్యలను సూచిస్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడమే దీనికి మూలకారణమని చెబుతున్నారు. దీంతో గుండెకు కూడా సమస్యలు వస్తాయి. రాత్రి చెమటలు: కొందరికి రాత్రి నిద్రిస్తున్నప్పుడు అకస్మాత్తుగా చెమటలు పట్టడం మొదలవుతుంది. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. ఇలా పదే పదే జరిగితే, అది క్రమంగా గుండె పోటుగా గమనించవచ్చు. విపరీతమైన దగ్గు: దగ్గు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. కానీ నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా దగ్గు రావడం కూడా గుండె సమస్యలను సూచిస్తుంది. ఎందుకంటే శ్వాస నాళంలో నీరు నిండి దగ్గు చికాకు కలిగించే అవకాశం ఉంది. విపరీతమైన గురక: కొంతమంది రాత్రి నిద్రలో ఎక్కువగా గురక పెడుతుంటారు. దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.అంతే కాదు గురకకు ప్రధాన కారణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. గుండె లోపల ఏదైనా సమస్య వచ్చినా, గాయమైనా ఇలా గురక పెడతారని నిపుణులు అంటున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. - గుండెపోటుకు సంబంధించినంతవరకు, దానిని నివారించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులను అనుసరించడం అవసరం. - ధూమపానం, మద్యపానం మానేయాలి -  ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి.   - మీ వైద్యునిచే మీ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. ఎలా నియంత్రించాలి? -శరీరానికి రోజువారీ వ్యాయామం అందించడం - డాక్టర్ సలహా మేరకు రక్తనాళాలు అడ్డుపడే అవకాశం ఉండకుండా ఉండేందుకు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మాత్రలు తీసుకోవడం. - మెనోపాజ్‌కు చేరుకునే స్త్రీలు ఈస్ట్రోజెన్ రీప్లేస్‌మెంట్ థెరపీ గురించి వారి వైద్యుని నుండి సమాచారాన్ని పొందాలి.

read more
ఏం తిన్నా నీరు తాగే అలవాటుందా.. ఈ పండ్లు తిన్నాక మాత్రం తాగొద్దండీ బాబూ!

ఆహారం శరీరానికి శక్తిని అందిస్తుంది. సాధారణంగా ఆహారం తింటున్నప్పుడు, తిన్న తరువాత నీరు తాగుతుంటారు. ఘనాహారం తినేటప్పుడు కొంచెం అయినా నీరు తాగాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ నిజానికి ఆహారం బాగా నమిలి తింటే అస్సలు నీరు తాగాల్సిన అవసరమే లేదని వైద్యుల నుండి పోషకాహార నిపుణుల వరకు అందరూ చెబుతారు. కానీ కొందరికి మాత్రం ఏం తిన్నా నీరు తాగే అలవాటు ఉంటుంది. టిఫిన్, స్నాక్స్, పండ్లు, భోజనం ఇలా ఏం తిన్నా నీరు తాగుతుంటారు. కానీ కొన్ని పండ్లు తిన్న తరువాత నీరు అస్సలు తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ ఆ పండ్లేంటో తెలుసుకుంటే.. బొప్పాయి.. బొప్పాయిలో చాలా మంచి పోషకాలు ఉంటాయి. వీటి ఆకులు, గింజలు, పండు అన్ని తింటారు. అయితే బొప్పాయి పండు తిన్నతరువాత  నీరు తాగకూడదు. ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చాలా ఆలస్యంగా జీర్ణం అవుతుంది. బొప్పాయి తిన్నాక నీరు తాగితే జీర్ణాశయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. మామిడి పండ్లు.. నోరూరించే మామిడి పండ్లు తినడం అందరికీ మహా ఇష్టం. కానీ మామిడి పండ్లు తినగానే మామిడి పీచు పండ్లలో ఇరుక్కుందని కొందరు, అలవాటులో మరికొందరు నీరు పుక్కిలిస్తూ తాగుతుంటారు. కానీ మామిడి పండ్లు తిన్నాక నీరు తాగితే నష్టాలుంటాయి. మామిడి పండ్లలో ఉండే విటమిన్-సి, పోషకాలు శరీరానికి అస్సలు అందవు. పైపెచ్చు అజీర్ణానికి కారణమవుతుంది. పుచ్చకాయ.. అధికశాతం నీరు కలిగిన పుచ్చ పండు తిన్నాక కూడా చాలామంది నీరు తాగుతారు. అదొక అలవాటు. పుచ్చకాయలో 90శాతం నీరు ఉంటుంది, మిగిలిన 10శాతం ఫైబర్, విటమిన్లు గట్రా ఉంటాయి.  అయితే పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తీ చేస్తుంది. పైనాపిల్.. తియ్యగా, పుల్లగా ఉండే పైనాపిల్ సిట్రస్ పండు కోవకే చెందుతుంది. దీన్ని తిన్న తరువాత నీరు తాగినప్పుడు  గమనిస్తే నాలుక మండినట్టు ఉంటుంది.  దీనికి కారణం పైనాపిల్ లో బ్రోమెలనిన్ ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి నాలుక మండటానికి కారణం అవుతాయి. కేవలం నాలుకే కాదు.. కడుపులో కూడా అసౌర్యం ఏర్పడుతుంది. పైనాపిల్ తినగానే నీరు తాగితే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అరటిపండు.. అరటిపండు పౌష్టికాహారంలో ఒక భాగం. వ్యాయామం చేసిన తరువాత, ప్రతిరోజూ పిల్లలు, పెద్దలు ఒక అరటిపండు తింటే మంచిదని చెబుతారు. అరటిపండులో కేలరీలు, పోషకాలు, చక్కెర శాతం ఎక్కువగానే ఉంటాయి. ఇక అరటిపండులో ఉండే పొటాషియం, మాంగనీస్ శరీరానికి ఎంతో అవసరం. కానీ అరటిపండు తిన్న తరువాత  నీరు తాగితే పండులో పోషకాలు శరీరానికి అందవు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పండ్లలో ఆల్రెడీ నీరు ఉంటుంది. అది శరీరాన్ని హైడ్రేట్ గా మారుస్తుంది. పండ్లలో ఉండే గుణాల కారణంగా పండ్లు తిన్న వెంటనే కొందరికి జలుబు కూడా చేస్తుంది. పండ్లను కూడా పూర్తీగా నమిలి తింటే అసలు నీరు తాగాల్సిన అవసరం ఉండదు.                                                     *నిశ్శబ్ద.  

read more
వ్యాయామం చేస్తూ ఇలా తినాల్సిందే..!!

ఆరోగ్యంగా ఉండాలన్నా..ఫిట్ గా ఉండాలన్నా..కేవలం వ్యాయామం చేస్తే సరిపోదు. వ్యాయామంతోపాటు కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి. - వ్యాయామాలు చేసేవారు ఏదొక తేలికపాటి భోజనంతో సరిపెట్టుకోకూడదు. ఆహారంలో తగినన్ని ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు ఉండేలా చూడాలి. అది కూడా ఒకేరకం పదార్థాల నుంచి కాకుండా ఇతర రకాల ఆహారాల నుంచి అందేలా చూసుకోవాలి. దీనికోసం అప్పటికప్పుడు ఆలోచించకుండా వారానికి సరిపడా డైట్ ప్లాన్ చేసుకుంటే మంచిది . - వ్యాయామం అయినా, ఆహారమైనా ఎంత అవసరమో అంతే తీసుకోవడం తప్పనిసరి. ఎలాగు కసరత్తులు చేస్తున్నామంటూ అతిగా తినడం సరికాదు. సన్నబడాలన్న తపనతో అసలు తినకుండా ఉండట కూడా మంచిది కాదు. వర్కవుట్స్ చేయడానికి ముందు తినే స్నాక్స్ లో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పడే తగినంత ఉత్సాహంతో వ్యాయాయం చేస్తాం. - కార్డియో ట్రైనింగ్ కు వెళ్లేవారు పొట్టను ఎంత వీలైతే అంత ఖాళీగా ఉంచుకోవడం మంచిది. ఒక కప్పు గ్రీన్ టీ తోపాటుగా ఏదైనా పండు తీసుకుంటే సరిపోతుంది. వర్కవుట్స్ తర్వాత త్రుణధాన్యాలతో చేసిన ఉప్మా, దోసె, కొవ్వు తక్కువగా ఉండే పాలు పండ్ల రసాలు, పెరుగు వంటివి తింటే కండరాలకు సాంత్వన లభిస్తుంది. -భోజనం తర్వాత వ్యాయామం చేయాలనుకుంటే కచ్చితంగా మూడు నుంచి నాలుగు గంటల విరామం తర్వాత జిమ్ కు వెళ్లాలి.  

read more
చామంతి పువ్వుల టీ ఎప్పుడైనా తాగారా? దీంతో ఎన్ని లాభాలంటే...

విదేశాల నుండి భారతదేశానికి వ్యాప్తి చెందినా భారతీయులు టీ, కాఫీలను గుండెల్లో పెట్టుకున్నారు.  అర్థరాత్రి, ఆపరాత్రి అనే తేడా లేకుండా కాఫీ, టీ లకోసం అర్రులు చాచేవారున్నారు. అయితే వీటిలో కెఫిన్ ఆరోగ్యానికి హానికరం. కానీ ఆయుర్వేదం సూచించే హెర్బల్ టీలు ఆరోగ్యానికి ది బెస్ట్ అని చెప్పవచ్చు. పువ్వులతోనూ, ఆకులతోనూ టీలు చేసుకుని వేడివేడిగా సిప్ చేస్తుంటే కలిగే అనుభూతి, ఆ తరువాత శరీరానికి చేకూరే ఓదార్పు మాటల్లో చెప్పలేనిది. పైపెచ్చు వైద్యుల దగ్గలకు వెళ్లి వేలు పోసి ఖర్చుపెట్టి తగ్గించుకునే ఎన్నో జబ్బులు ఈ టీలతో తగ్గుతాయి. ఇలాంటి పువ్వుల టీలలో ప్రసిద్ది చెందినది చమోమిలే టీ. చామంతి పూల టీ నే చమోమిలె టీ అని అంటారు. అసలు టీ వల్ల కలిగే లాభాలేంటి? ఈ టీ కోసం ఉపయోగించే చామంతులేవి? ఈ టీ ఎప్పుడు తాగితే బెస్ట్ ఫలితాలు ఉంటాయి?పూర్తీగా తెలుసుకుంటే.. చామంతి టీ.. చామంతి టీని చామంతి పువ్వులతో తయారుచేస్తారు. బాగా మరిగించిన నీటిని ఒక కప్పులో వేసి అందులో ఎండబెట్టిన చామంతి పువ్వులను వేస్తారు. దానిమీద మూత పెట్టి 3 నుండి 5 నిమిషాలు అలాగే వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల ఎండిన పువ్వులలో సారం నీటిలోకి చేరుతుంది. చామంతి పువ్వుల టీ సిద్దమవుతుంది. ఇది అచ్చం గ్రీన్ టీ తయారు విధంలానే ఉంటుంది కాబట్టి దీన్ని చేసుకోవడం సులభం.అయితే దీనికి సాధారణ చామంతులు పనికిరావు.  రెండు ప్రత్యేక రకాల చామంతులు ఈ టీ కోసం వినియోగిస్తారు. జర్మన్ జాతికి చెందిన చామంతి పూలు, రోమన్ జాతికి చెందిన చామంతులు మాత్రమే టీకి పనికొస్తాయి.. ఎప్పుడు తాగాలి?   చామంతి పువ్వుల టీ తాగడానికి సరైన సమయం రాత్రి. అన్ని టీలు ఉదయం, సాయంత్రం తాగితే ఈ టీ మాత్రం రాత్రి తాగితే మంచి ఫలితాలు ఇస్తుంది. చామంతి పువ్వుల టీ తాగితే కలిగే ఫలితాలు.. రాత్రి పూట చామంతి పువ్వుల టీ తాగితే నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే అది మానసిక ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల అసమతుల్యత, జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గుండె సంబంధ సమస్యలు, హైపర్ టెన్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటన్నింటికి చామంతి పూల టీ చెక్ పెడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ టీ తాగితే మంచిగా నిద్ర పట్టేలా చేస్తుంది. చామంతి టీలో యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. ఇది నొప్పులు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. నొప్పిని ప్రేరేపించే కారకాలు ఉత్పత్తి కాకుండా చేసి నొప్పులలో ఉపశమనం ఇస్తుంది. కడుపునొప్పి, మహిళలలో నెలసరి నొప్పులు, ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల వచ్చే కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. చామంతి టీ కేవలం టీ మాత్రమే కాదు. ఒక మంచి ఔషదం కూడా. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్లు, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ టీని క్రమం తప్పకుండా తాగుతుంటే హైపర్ టెన్షన్ కాస్తా బలాదూర్ అవుతుంది. రక్తనాళాలు, ధమనులు  పనితీరు సరిగా ఉండేలా చేస్తుంది. చామంతిలో క్వెర్సెటిన్ లు ఉంటాయి. ఇవి పాలీఫెనాల్ లు. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు  ఉంటాయి. ఇవి ఇమ్యునిటీ పవర్ ను పెంచుతాయి. యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా కూడా పనిచేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో మంట, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, పొత్తి కడుపు నొప్పి                                                  *నిశ్శబ్ద.  

read more
లైట్ వేసుకుని నిద్రపోవచ్చా... అసలు నిద్ర గురించి ఈ నిజాలు తెలుసా?

ఆహారం,  వ్యాయామం, విశ్రాంతి మనిషికి చాలా ముఖ్యం. కానీ చాలామంది ఈ మూడింటిలోనే తప్పులు చేస్తుంటారు. వీటికి తగిన కారణాలు చూపించి సమర్థించుకుంటారు కూడా. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఉరుకుల పరుగులతో సాగిన శరీరానికి రాత్రి మాత్రమే విశ్రాంతి లభిస్తుంది. కానీ కొందరి అవగాహనా లోపం వల్ల కనీసం ఈ రాత్రి కూడా సరైన విశ్రాంతి ఉండదు. నిద్రపోయే సమయం నుండి నిద్రించే పరిస్థితులు, ఎంత సేపు నిద్రపోతారనే విషయాల వరకు అస్సలు పట్టించుకోనే పట్టించుకోరు. నామ్ కే వాస్తి అన్నట్టుగా  నిద్రను కూడా సరిపెట్టేస్తుంటారు. అయితే నిద్ర గొప్ప ఔషదం. అది సక్రమంగా ఉంటే శరీర ఆరోగ్యం చాలావరకు బాగుంటుంది. మెదడు రిలాక్స్ అవుతుంది. ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నిద్ర గురించి ఉన్న అపోహలు.. సందేహాలు పటాపంచలు చేయాలంటే ఈ కింది విషయాలు చదివితే సరోపోతుంది.  రాత్రి నిద్ర.. రాత్రిళ్లే నిద్రపోవాలనే రూల్ ఉండటం వెనుక బోలెడు బయటి కారణాలు అయితే ఉండొచ్చు కానీ అసలైన కారణం వాతావరణమే. రాత్రి ప్రకృతి కూడా నిశ్శబ్దమైపోతుంది. ఆ సమయంలో నిద్రే  అందరికీ మంచిది. ఉద్యోగాల పేరుతోనూ, సరదాల పేరుతోనూ కోల్పోయే నిద్రకు భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. వాటి పుణ్యమే మానసిక సమస్యలు, మధుమేహం, రక్తపోటు నియంత్రణలో లేకపోవడం, అకాల వృద్దాప్యం మొదలైనవి. కాబ్టటి రాత్రి నిద్రే బెస్టు.  ఎంతసేపు..  ప్రతి ఒక్కరూ రోజుకు 6నుండి 8 గంటలు నిద్రపోవాలని చెబుతుంటారు. కానీ చాలామంది రాత్రి సమయంలో ఇంతసేపు నిద్రపోరు. ఎప్పుడో ఒంటి గంటకు పడుకుని ఉదయమే లేచి ఉద్యోగానికి పరిగెత్తుతారు.మరికొందరు అయితే ఇలా కోల్పోయిన నిద్రను సెలవు రోజుల్లో భర్తీ చేద్దాం అనుకుంటారు. అయితే ఇవన్నీ పిచ్చి చర్యలే.. రాత్రిళ్లు ఏకధాటిగా నిద్రపోతేనే శరీరం తగినవిధంగా రిలాక్స్ అవుతుంది. కునుకుపాట్లు.. చాలామంది కళ్లుమూసుకుని అలా కునుకుపాట్లు పడి నిమిషాల వ్యవధిలో మళ్లీ లేస్తారు. తాము నిద్రపోయామని అంటారు. కానీ అదసలు నిద్రే కాదు. నిద్రలో ఉన్నప్పుడు అసలు శరీర అవయవాల గురించి స్పృహే ఉండదు చాలామందికి. అందులోనూ ఇలాంటి కునికిపాట్లవల్ల మెదడు మీద ఒత్తిడి పెరిగి తలనొప్పి వస్తుంది. లైట్ వెలుతురులో నిద్ర.. అదేంటోగానీ రాత్రిపూట గదిలో చిన్న జీరో లైటో లేదా బెడ్ లైటో వేసుకోవడం మంచిదని అనుకుంటార. కానీ వెలుతురు కారణంగా నిద్రలో పదే పదే మెలకువ రావడం జరుగుతుంది. ముఖ్యంగా నిద్రలో ఇబ్బందులున్నవారు గదిలో బెడ్ లైట్ లేదా జీరో లైట్ వేసుకోకుండా నిద్రపోవడమే మంచిది. ప్రశాంతమైన నిద్ర కావాలంటే చీకటి గదిలో పడుకోవడం బెస్ట్.                                                *నిశ్శబ్ద.

read more
21రోజులు ఎర్ర అరటిపండ్లు కంటిన్యూగా తింటే జరిగేదిదే!

అరటిపండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. సమతుల్య ఆహారంలో పౌష్టికర ఆహారంలో అరటిపండుకు తప్పనిసరిగా చోటు ఉంటుంది.  ఇది అందరికీ అందుబాటు ధరలోనే అన్ని సీజన్లలో లభిస్తుంది. అయితే అరటిపండ్లలో రకాలున్నాయి.  వీటిలో ఎర్ర అరటి పండు ఒకటి. తొక్క ఎర్రగా, పరిమాణంలో సాధారణ అరటిపండ్లకంటే పెద్దగా ఉండే ఈ అరటిపండ్లు   సాధారణ అరటి పండ్లకంటే తియ్యగా ఉంటాయి. వీటిలో కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి.  ఈ ఎర్ర అరటిపండ్లు ప్రతిరోజూ క్రమం తప్పకుండా 21రోజుల పాటు తింటే చాలా షాకింగ్ ఫలితాలు ఉంటాయి. ఎర్ర అరటిపండ్లు 21రోజుల పాటు తింటే వేధిచే చర్మ  సమస్యలు తగ్గుతాయి. పొడి చర్మం,  దద్దుర్లు, చర్మం ఎర్రగా మారిపోవడం, సోరియాసిస్,  వంటి చర్మసమస్యలకు ఎర్ర అరటిపండు అద్భుత ఔషదం.  వీటిని  తినడమే కాదు, చర్మ సమస్యలున్న చోట పూతగా కూడా అప్లై చేయవచ్చు.  దీని వల్ల సొరియాసిస్ లాంటి దారుణమైన చర్మ సమస్యలే తగ్గుతాయి. ప్రస్తుతకాలంలో సంతానలేమి సమస్యతో ఇబ్బంది పడుతన్న జంటలు చాలా ఉన్నాయి. పిల్లల కోసం వైద్యుల చుట్టూ, గుడుల చుట్టూ తిరుగుతుంటారు.  అయితే ఎర్ర అరటిపండు క్రమం తప్పకుండా తీసుకుంటే పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా, ధృడంగా మారుతుంది.  సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి. మగవారిలో అంగస్థంభన సమస్య దూరం అవుతుంది. ఎర్ర అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు  ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నాడీ వ్యవస్థను బలంగా చేసి ట్యాక్సిన్లను డిటాక్సిపై చేస్తాయి.  నరాల సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు, పక్షవాతం, మూర్చలు వంటి సమస్యలున్నవారు రెగ్యులర్ గా ఎర్ర అరటి పండ్లు తింటూ ఉంటే నాడీ బలం పుంజుకుంటుంది. . ఎర్ర అరటిపండ్లలో సాధారణ అరటిపండ్లకంటే ఎక్కువగా పొటాషియం ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తింటూ ఉంటే మూత్రపిండాలలో  రాళ్ల సమస్య నుండి  బయటపడవచ్చు. ఎర్ర అరటిపండ్లలో విటమిన్స్, పొటాషియం, కాల్షియం సమృద్దిగా ఉంటాయి.  వీటిని రోజూ తింటే పంటికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి.  21రోజులు ఎర్ర అరటిపండ్లు తింటే  నోటి దుర్వాసన, చిగుళ్ల బలహీనతతో పాటు అన్ని రకాల పంటి సమస్యలు దూరమవుతాయి.                               *నిశ్శబ్ద.

read more
చలికాలంలో ఉసిరికాయలు తింటే ఇన్ని లాభాలా?

ఉసిరికాయలు భారతీయ ఆయుర్వేదంలో చాలా గొప్ప ఔషదం. త్రిఫలాలు అని పిలువబడే ఆయుర్వేద పండ్లలో ఉసిరి కాయ కూడా ఒకటి. చిన్నతనంలో వీటిని ఉప్పు, కారం అద్దుకుంటూ తింటూంటే ఎంతో మజాగా ఉండేది. ఇప్పుడు కూడా వీటిని చూస్తే పెద్దలు కూడా పిల్లలైపోయి నోట్లో లాలాజలం ఊరించుకుంటూ తింటుంటారు. ఒకప్పుడు సరదాగా తిన్న ఈ ఉసిరికాయలు గొప్ప ఔషదం అని తెలిశాక వీటిని దూరం పెట్టాలని ఎవరూ అనుకోరు. ముఖ్యంగా  ఉసిరికాయలను చలికాలంలో తింటే ఎన్ని లాభాలో తెలిస్తే  ఆశ్చర్యపోతారు. కార్తీక మాసంలో ఈ ఉసిరికాయలు లభ్యం కావడం మొదలవుతుంది.  సుమారు ఫిబ్రవరి నెల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ కాలంలో వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుంటే వీటిని మిస్ కాకుండా తినచ్చు. చలికాలంలో జీర్ణవ్యవస్థ చాలా నెమ్మదిస్తుంది. ఈ కారణంగా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది.  ఉసిరి కాయలో ఉండే ఫైబర్ ప్రేగులను చురుగ్గా పనిచేసేలా  చేస్తుంది. ఇది మలబద్దకాన్ని దూరం చేస్తుంది. జీర్ణవ్యవస్థలో పేరుకున్న మలినాలను బయటకు పంపేస్తుంది. రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే ఈ చలికాలంలో ఆరోగ్యం అంత బాగుంటుంది. లేదంటే చాలా సులువుగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఉసిరికాయలో ఉండే విటమిన్-సి, యాసిడ్ ఫాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ సహా చాలా యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. వాతావరణం చల్లగా మారడం వల్ల శరీరంలో కూడా మార్పులు వస్తాయి. బద్దకంగా అనిపించడం, పనులు చేయడంలో అనాసక్తి, క్రమంగా వీటి ప్రభావం ఒత్తిడిగా మారుతుంది. ఈ సమస్యలన్నీ తగ్గించడంలో ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో ఉండే గుణాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి బాగుండాలంటే విటమిన్-సి చాలా అవసరం. ఉసిరికాయ విటమిన్-సి కి  పెట్టింది పేరు.  ఉసిరి రసం తీసుకుంటే ఇమ్యునిటీ పెరిగి అంటువ్యాధుల సమస్యలు తగ్గుతాయి.  తెల్లరక్తకణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  సాధారణంగా సీజనల్ వారిగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను మంత్రించినట్టు మాయం చేస్తుంది. చలికాలంలో చర్మం, జుట్టు చాలా దారుణంగా దెబ్బతింటుంటాయి. వీటికి ఉసిరితో చెక్ పెట్టవచ్చు.  ఉసిరిలో ఉండే యంటీ ఆక్సిడెంట్ లక్షణాలు,  విటమిన్-సి  కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి. తలలో చుండ్రు, కురుపులు, చర్మ సంబంధ సమస్యలు అన్నీ దూరం అవుతాయి.                                                       *నిశ్శబ్ద.

read more
చలికాలంలో బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!

  శీతాకాలంలో జలుబు, దగ్గు, కీళ్లు పట్టేయడం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, చర్మం పొడిబారడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తుంటాయి. అయితే ఈ కాలంలో చాలా మంది బరువు కూడా పెరుగుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకు ఈ కాలంలో బరువు పెరగడానికి అసలు కారణాలు ఏంటి? అది తెలుసుకుంటే మన శరీరంలో అనవసరంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించుకోవచ్చు. చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడానికి శరీరం సహకరించదు. దీంతో ఫిట్నెస్ రొటిన్ అదుపు తప్పి...శరీరంలో క్యాలరీలు కొవ్వుగా మారుతాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. అయితే దీన్ని అధిగమించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యమని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ క్రమంలో మీ భాగస్వామి లేదాస స్నేహితుడిని ఫిట్నెస్ పార్టనర్ గా సెలక్ట్ చేసుకుని ఒకరికొకరు ప్రోత్సహించకుంటూ వ్యాయామం చేయండి. ఇదొక్కటే కాదు ఈ కాలంలో బరువు పెరగడానికి చాలా కారణాలే ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో చూద్దాం. ఎండ శరీరానికి తగలకపోయినా: వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం కోసం ఎండలో నిల్చుంటాం. ఈ క్రమంలో ఎండలో వ్యాయామాలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఈ కాలంలో కొన్ని రోజులు పొగమంచు కారణంగా ఎండ ఉండదు. ఇలా  చలికాలంలో శరీరానికి ఎండ తగలకపోవడం వల్ల సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ సమస్య తలెత్తే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక రకమైన డిప్రెషన్ వంటిదేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ఆహారపు అలవాట్లు, మోతాదుకు మించి ఆహారం తినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ అలవాట్లు అంతిమంగా బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయి కాబట్టి ఉదయం ఎండ లేకపోతే మధ్యాహ్నం పూట కాసేపు వీలు కుదుర్చుకుని ఎండలో ఉండటం మంచిది. అయితే ఈ క్రమంలో సూర్యకిరణాల కారణంగా చర్మ సమస్యలు తలెత్తకుండా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. హర్మోన్ల అసమతుల్యత: హర్మోన్ల అసమతుల్యత కారణంగా కూడా బరువు పెరుగుతారని మనకు తెలిసిందే. అయితే వాతావరణంలో మార్పులు వచ్చిన కొద్దీ హర్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగే ప్రక్రియను నెమ్మదిస్తుంది. ఆహారపు కోరికలను పెంచుతుంది. దీంతో బరువు పెరుగుతాం. అర్థరాత్రి ఆకలేస్తుంది? శీతాకాలంలో పగటి సమయం కంటే రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈక్రమంలో డిన్నర్ తొందరగా చేయడం, రాత్రి ఎక్కువ సేపు మెలకువ ఉండటం, రాత్రుళ్లు తేలికపాటి ఆహారం తీసుకోవడం..ఇలా కారణాలతో అర్థరాత్రి ఆకలేస్తుంది. అలాంటప్పుడు చాలామంది బిస్కెట్లు, చిప్స్, పాప్ కార్న్, కుకీస్, చాక్లెట్స్ తింటుంటారు. ఈ అలవాటును కొనసాగి్స్తే బరువు పెరగడం ఖాయమంటున్నారు నిపుణులు. వీటికి బదులుగా పండు, పండ్ల రసాలు, నట్స్ , డ్రైఫ్రూట్స్ తినడం మంచిదని చెబుతున్నారు.

read more
ఎప్పుడూ అలసటగా అనిపిస్తుంటుందా..అయితే ఇది తెలుసుకోండి!

అలసట.. చాలాసార్లు అలసట అనేది తీవ్రశారీరక శ్రమ చేసినప్పుడు కలుగుతూ ఉంటుంది. అలసట కారణంగా శరీరమంతా బలహీనంగా ఉంటుంది. ఏ పని మీద ఆసక్తి లేకపోవడం, ఏ పనులు  చేయాలన్నా చిరాగ్గా ఉండటం. బద్దకం వంటి సమస్యలు చుట్టుముడతాయి. చాలామంది అలసటగా ఉన్నవారిని బద్దకిష్టులు అంటూ  ఉంటారు. అయితే అది బద్దకం కాదు.. మనిషి శారీరక స్థితిలో మార్పు.  ముఖ్యంగా శరీరంలోపల హార్మోన్లు, అవయవాల పనితీరులో అసమతుల్యత ఏర్పడటం. దీన్ని గుర్తించి సరిచేసుకోవడానికి ప్రయత్నించాలి. అలసటకు కారణాలు.. అలసటకు ప్రధాన కారణం తప్పుడు ఆహారాలు తీసుకోవడం. ఆహారాల కారణంగా శరీరం ప్రభావితమవుతుంది. సరైన ఆహారాన్ని ఎక్కువరోజులపాటు తీసుకోకుండా దాని స్థానంలో తప్పుడు ఆహారం తీసుకుంటే అది శారీరక బలహీనత, రక్తహీనత వంటి సమస్యలకు కారణం అవుతుంది. దీన్ని పరిష్కరించాలంటే కింది నాలుగు రకాల ఆహారాలు తప్పకుండా తీసుకోవాలి. తృణధాన్యాలు.. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండే వారి రహస్యం తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం. ఓ ఇరవై ముప్పై ఏళ్ళ కిందట అన్నీ ఆరోగ్యకరమైన పంటలే ఉండేవి. ప్యాక్డ్ ఫుడ్స్, నిల్వ ఆహారాలు వంటివి  అప్పుడు తక్కువ. చాలావరకు చిరుతిళ్ళు కూడా తృణధాన్యాలతోనే చేసేవారు. అందుకే నాటికాలం వారి ఆరోగ్యం బాగుంటుంది. వీటిలో ఫైబర్ ఎక్కువ మొత్తం ఉంటుంది. విటమిన్లు కూడా మెండుగా ఉంటాయి.  శుద్ది చేసిన పిండులు, శుద్ది చేసిన బియ్యం వంటి వాటిని తగ్గించి తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. బ్రౌన్ రైస్, పొట్టు తీయని గోధుమలు, రాగులు, జొన్నలు వంటివి వినియోగించాలి. రంగురంగుల పండ్లు.. పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచివనే విషయం తెలిసిందే. పండ్లలో విటమిన్లు,ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్లు పుష్కలంగా ఉంటాయి. పండ్లు రంగురంగులో ఉంటాయి. కంటికి ఇంపుగా కనిపించే ఈ పండ్లు ఆరోగ్యం చేకూరుస్తాయి. అలసటను మంత్రించినట్టు మాయం చేస్తాయి.                                                          *నిశ్శబ్ద.

read more
శీతాకాలంలో పసుపు పాలు తాగితే ఎన్ని బెనిఫిట్సో!

మన ఇంట్లో పెద్దవాళ్లు పసుపు పాలు  తాగమని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే పసుపు పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వినియోగం ఎన్నో తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బయాటిక్, యాంటీ ఆక్సిడెంట్  వంటి అనేక లక్షణాలు ఉన్నాయి. ఇవి తీవ్రమైన వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది. అంతేకాదు  రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. అందువల్ల శీతాకాలంలో పసుపుపాల వినియోగం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. పసుపు పాలు చలికాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాకుండా, అనేక వ్యాధుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. పసుపు పాలు తాగడం వల్ల ఏయే వ్యాధులు నయమవుతాయో తెలుసుకుందాం. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి : చలికాలంలో పసుపు పాలు తీసుకోవడం వల్ల మన గుండె ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో..., ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో, ప్రతిరోజూ పసుపు పాలు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి:  పసుపు పాలు తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. వాస్తవానికి, పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును కరిగించి బరువును తగ్గిస్తుంది. నొప్పి, వాపు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది: పసుపు పాలు తీసుకోవడం వల్ల శీతాకాలంలో కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు..శరీరంలో ఎలాంటి నొప్పి,వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు నుండి ఉపశమనం: పసుపులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడతాయి. అంతే కాదు, ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని కూడా తగ్గిస్తుంది. శీతాకాలంలో పసుపు పాలు తాగడం వల్ల దగ్గు,  జలుబు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటుంది: పసుపు పాలు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుందని,  గ్యాస్,  ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాదు, దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.  

read more
ఈ డైట్ ఫాలో అయితే నెలలో 10 కిలోల బరువు తగ్గొచ్చు!

అందరూ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. నేటికాలంలో  చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. పెద్దా చిన్నా అనే తేడా లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. యువత కూడా దీని బారిన పడుతున్నారు. 25ఏళ్లకు పొట్టతో ఇబ్బంది పడుతున్నారు. పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఈ బరువు ఎలా తగ్గాలో అర్థం కాక రకరకాల డైట్ ఫాలో అవుతుంటారు. అయినా కూడా ఫలితం ఉండదు. అందంగా , ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటాము.  కానీ కొన్నిసార్లు మన శరీర ఆకృతి కారణంగా మనకు ఇష్టమైన దుస్తులను ధరించలేకపోతున్నాము. చెడు జీవనశైలి చర్మం, జుట్టును కూడా దెబ్బతీస్తుంది. బరువు తగ్గాలంటే ఈ డైట్ ఫాలో అవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం. కలబంద రసం: బరువు తగ్గడానికి ఉదయం 6:30 నుండి 7 గంటల మధ్య కలబంద రసం తాగండి. కలబంద ఆకులను కడిగి, జెల్ తొలగించి, జెల్,  1 గ్లాసు నీటిని మిక్సర్‌లో కలపండి. దీన్ని 4 నుంచి 5 రోజుల వరకు ఉపయోగించేందుకు సీసాలో నిల్వ చేయండి. త్రాగడానికి, ఒక గ్లాసులో మిశ్రమాన్ని కొద్ది మొత్తంలో తీసుకుని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని జోడించి త్రాగాలి. దీనితో 5 నానబెట్టిన బాదంపప్పులను తినండి. అల్పాహారం కోసం చిక్‌పీస్, అన్నం: ఉదయం 8 నుండి 8:30 వరకు చిక్‌పీస్, అన్నం తినండి. దీనితో మీరు పాలు, చక్కెర,  బెల్లం లేకుండా ఒక కప్పు టోన్ లేదా డబుల్ టోన్ టీని త్రాగవచ్చు. ఈ రుచికరమైన అల్పాహారం ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ల యొక్క అద్భుతమైన మూలం, ఇది రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. భోజనం కోసం అధిక ప్రోటీన్ సలాడ్: మధ్యాహ్నం 1, 2 గంటల మధ్య అధిక ప్రోటీన్ మొలకెత్తిన సలాడ్ తినండి. 1/4 కప్పు నానబెట్టిన నల్ల చిక్‌పీస్ తీసుకోండి. 1/4 కప్పు మొలకెత్తిన మొత్తం చిక్‌పీస్ తీసుకోండి. తరిగిన టొమాటో, ఉల్లిపాయ, దోసకాయ కూడా జోడించండి. ఉడికించిన బీన్స్ జోడించండి. కొన్ని పచ్చిమిర్చి, కొత్తిమీర వేయాలి. నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి, నిమ్మరసం కలపండి. రాత్రి భోజనం: సాయంత్రం 6:30 నుండి 7 గంటల మధ్య నెయ్యి, ధాన్యపు సూప్ త్రాగాలి. 1/4 కప్పు నానబెట్టిన పప్పు. నానబెట్టిన మసూర్ పప్పు 1/4 కప్పు తీసుకోండి. 3-4 వెల్లుల్లి రెబ్బలు, కొంత అల్లం జోడించండి. తరిగిన టమోటా జోడించండి. దానికి కాస్త ఉప్పు, పసుపు, నీళ్లు పోసి 3-4 విజిల్స్ వచ్చేవరకు విజిల్ వేయాలి. ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసి మళ్లీ మరిగించి త్రాగాలి. మీరు రుచికి నల్ల మిరియాల పొడి,  నిమ్మరసం జోడించవచ్చు. ఈ నియమాలు కూడా పాటించండి: ప్రతిరోజూ7 నుంచి 8గంటలు నిద్రించేలా చూడండి. రోజంతా 3 నుంచి 3.5 లీటర్ల నీరు తాగండి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. రాత్రి 7గంటలలోపు తినండి.  

read more