చలికాలంలో వీటిని తినకండి..కొలెస్ట్రాల్ పెరుగుతుంది.!

కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ చలికాలంలో కొన్ని ఆహారాలు మీ కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ఎలాంటి ఆహారాలు చలికాలంలో తినకూడదో ఇప్పుడు చూద్దాం. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు...ఇది మంచి కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ అని రెండు రకాలుగా వస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటిన్ , చెడు కొలెస్ట్రాల్ అయితే..అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటిన్ మంచి కొలెస్ట్రాల్ . హైర్ కొలెస్టెరోలేమియా అని పిలిచే అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ శీతాకాంలో కొన్ని ఆహారాలు మీ కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అవి ఎలాంటి ఆహారా పదార్థాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1.నెయ్యి: చలికాలంలో నెయ్యి చాలా ముఖ్యమైంది. మన ఆహారంలో రుచి, వాసనను పెంచేందుకు చేర్చే నెయ్యి మన శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. వ్యాయామం చేయనివారు నెయ్యి తీసుకోవడం తగ్గించాలి. 2. వెన్న: వెన్ను సాధారణంగా వేడి వంటల్లో ఉపయోగిస్తారు. వెన్నలో సంత్రుప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. 3. పనీర్: పనీర్ భారతీయ వంటకాల్లో ముఖ్యమైంది. పనీర్ టిక్కా వంటి చలికాలపు వంటకాల్లో ప్రముఖమైంది. అయినప్పటికీ అందులో సంత్రుప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. 4. రెడ్ మీట్ : రెడ్ మీట్ చలికాలంలో ఇష్టమైన మాంసాహారం. అయితే ఇందులో సంత్రుప్త కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 5. ఫ్రైడ్ స్నాక్స్ : శీతాకాలంలో ప్రతిఒక్కరూ వేడిగా ఉండే ఆహారాన్ని తింటుంటారు. సమోసాలు, బాగెట్లు, వడలు వంటివి వేయించిన చిరుతిళ్లను ఇష్టపడతాము. స్నాక్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేలా  చేస్తాయి.   

read more
సిగరెట్ వల్ల కాదు వీటితో కూడా క్యాన్సర్ వస్తుంది.!

క్యాన్సర్...ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్ పేరు వినగానే ప్రజలు జంకుతుంటారు. అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి.   2020 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, క్యాన్సర్ కారణంగా మరణించిన వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.  డేటా ప్రకారం, సుమారు 18 లక్షల మంది ప్రజలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా తీవ్రమైంది. సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ధూమపానం వల్ల మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ధూమపానం మాత్రమే దీనికి కారణం కాదు.అవేంటో చూద్దాం. నిష్క్రియ ధూమపానం: ఈ రోజుల్లో చాలా మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ధూమపానం చేయనివారిలో వస్తున్నాయి. అంటే జీవితంలో బీడీ, సిగరెట్ ముట్టుకోని వారు కూడా నేడు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీని వెనుక ఉన్న అతి పెద్ద కారణం పాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. నిజానికి, చాలా మంది సిగరెట్లు తాగరు. కానీ ఎవరైనా ఇంట్లో, ఆఫీసులో లేదా పరిసరాల్లో ప్రతిరోజూ 10-20 సిగరెట్లు తాగుతూనే ఉంటారు. అటువంటి పరిస్థితిలో, మీరు దానితో ఉండి, దాని పొగను పీల్చుకుంటూ ఉంటే, అది మీకు సమస్యగా మారవచ్చు. అటువంటి పరిస్థితిలో, సిగరెట్ తాగే ముందు మీ ఊపిరితిత్తులు ప్రతి స్పందించవచ్చు. బదులుగా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా, ధూమపానం చేస్తున్నప్పుడు ధూమపానం చేసే వ్యక్తి చాలాసార్లు పొగను బయటకు వదులుతారు. చుట్టుపక్కల ఉన్న వ్యక్తి దానిని పీల్చుకుంటాడు.ఇది కూడా ఒక కారణం. కాలుష్యం : కాలుష్యం పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ రోగులు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. చెడు గాలి నాణ్యత, వాహనాల పొగ, పరిశ్రమలు, ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం వంటి బహిరంగ కాలుష్యం మాత్రమే కాకుండా ఇండోర్ కాలుష్యం కూడా కాలుష్యానికి కారణం అవుతుంది. వంట చేయడం, బొగ్గు లేదా ఆవు పేడలపై రొట్టెలను కాల్చడం వల్ల  కలిగే ఇండోర్ కాలుష్యం నుండి వచ్చే పొగను బహిర్గతం చేయడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. జన్యు సంబంధం: ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు మూడవ అతిపెద్ద కారణం వ్యాధికి జన్యుపరమైన బహిర్గతం. నిజానికి, కుటుంబంలో ఎవరికైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే, అది మొదటి తరంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 30 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి, వ్యాధి సమయంలో అతను తండ్రి అయినట్లయితే, క్యాన్సర్ జన్యువులు అతని పిల్లలకు వ్యాపించి వ్యాధిని వ్యాపింపజేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

read more
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 లక్షణాలివే..!

ప్రపంచాన్ని వణికించిన మహా భూతం మళ్లీ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి తయారైంది. కరోనా ప్రపంచ దేశాలలో ఎంత మృత్యు తాండవం చేసిందో అందరికీ తెలిసిందే. దేశాలకు దేశాలు కరోనా కారణంగా ఆర్థిక, ప్రాణ నష్టాన్ని దారుణంగా చవి చూశాయి. 2020, 2021 సంవత్సరాలలో కరోనా వల్ల ఎదురైన సంక్షోభం అందరూ మర్చిపోకముందే మళ్లీ మళ్లీ కొత్త రూపాలలో ఇది ప్రపంచం మీద దండ యాత్ర చేస్తూనే ఉంది.  2023 ముగియడానికి ముందు ఇప్పుడు మళ్లీ ప్రాణాలను బలిగొనడానికి కరోనా సిద్దమైంది.  కోవిడ్ కొత్త వెరియంట్ JN.1 ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో యూఎస్ లో నమోదైంది.  అప్పటినుండి ఈ కేసులు పెరుగుతూ వస్తన్నాయి. అయితే ఇప్పుడు భారతదేశంలో కూడా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో  కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. గోవా నుండి వచ్చిన నమూనాలో 15కరోనా కేసులు కొనుగొన్నారు. చివరిసారిగా వచ్చిన కరోనా వేరియంట్ కంటే ఈసారి వచ్చిన వేరియంట్ ప్రమాదం ఉన్నట్టు చెబుతున్నారు. దీని కారణంగా ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. కరోనా కొత్త వేరియంట్ JN.1 లక్షణాలు..  సంకేతాలు.. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటే.. COVID-19 మహమ్మారి ప్రపంచానికి పరిచమైన నాలుగేళ్లు గడుస్తోంది. ఈ నాలుగేళ్లలో ఇది బలితీసుకున్న ప్రాణాలు ఎన్నో..  దీని గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇది రూపం మార్చుకుని  వ్యాప్తి చెందుతూనే ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో  తాజాగా బయటపడిన   JN.1 వేరియంట్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.Omicron XBB సబ్‌వేరియంట్ నుండి  JN.1 వేరియంట్ పుట్టిందని అంటున్నారు. ఈ వేరియంట్ సోకిన వారిలో  ముక్కు కారటం, గొంతు నొప్పి ,  పొడి దగ్గు వంటి చిన్న లక్షణాలు కనిపిస్తాయట. కానీ దీన్ని గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం  ముప్పు తప్పదని అంటున్నారు. JN.1  ప్రధాన సంకేతాలు,  లక్షణాలు.. కొత్తగా వచ్చిన JN.1 వేరియంట్  లక్షణాలు జ్వరం, దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట. ఈ లక్షణాలు ఫ్లూ,  ఇతర శ్వాసకోశ వ్యాధుల నుండి వేరు చేయలేవు. రోగికి ఈ లక్షణాలు ఉంటే  అవి తేలికపాటివి అయితే కేవలం  ఈ జబ్బులకు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. కానీ ఈ కొత్త వేరియంట్ పరిస్థితి విషమించితే మాత్రం  శ్వాస ఆడకపోవడం అనే ప్రమాదకర సమస్య ఎదురవుతుంది. కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకర లక్షణాలు తెలుసుకుంటే.. దగ్గు:  నిరంతరం  దగ్గు రావడం కొత్త వేరియంట్ లో సాధారణ లక్షణం. జలుబు :  ముక్కు కారడం, ముక్కులు మూసుకుపోవడం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి.   గొంతు నొప్పి: గొంతు నొప్పి లేదా గొంతులో అసౌకర్యం ఉంటుంది. తలనొప్పి: JN1 వేరియంట్‌తో బాధపడుతున్న వ్యక్తులు తలనొప్పి సమస్యను ఎదుర్కొంటారు. జీర్ణాశయ సమస్యలు.. అతిసారం, ఆహారం సహించలేకపోవడం, ఆకలి లేకవోవడం జీర్ణశయాంతర లక్షణాలు సంభవించవచ్చు. తేలికపాటి శ్వాస ఆడకపోవడం: కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు తేలికగా శ్వాస ఆడకపోవడం గమనించవచ్చు.   గతంలో కరోనా కారణంగా జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పై లక్షణాలలో ఏవైనా ఉంటే వ్యాధి వ్యాప్తి చెందకుండా క్వారంటైన్ లో ఉండటం ముఖ్యం. ఇప్పుడు కరోనా గురించి భయాందోళనలు పుడుతున్న పరిస్థితులలో  జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని  విస్మరించడం వల్ల ఆ వ్యక్తికే  కాదు, కుంటుంబ సభ్యులకు చుట్టుప్రకక్ల వారికి కూడా తీవ్రమైన హాని కలిగించే ప్రమాదం ఉంటుంది.   అంతేకాకుండా, రద్దీగా ఉండే ప్రదేశాలలో తిరగడం మానుకోవడం,  భౌతిక దూరాన్ని పాటించడం, బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం వంటి స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. ఎవరిని వారు కాపాడుకోవడానికి ఉన్న శక్తివంతమైన మార్గం ఇదే.. అదే విధంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు కూడా దాన్ని తీసుకోవడం ద్వారా కరోనా ప్రమాదాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది.                         *నిశ్శబ్ద.

read more
మద్యపానం చేసే అలవాటుందా? ఈ దారుణ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

శరీరానికి మత్తును ఇచ్చేవాటిలో మద్యపానం ఒకటి.  ధూమపానం, మధ్యపానం ప్రజలను ఎంతో వేధిస్తున్న అలవాట్లు. వీటి కారణంగా వైవాహిక బంధాలు, కుటుంబాలు కూడా విచ్చిన్నం అవుతున్నాయి. అయినా కూడా మద్యపానం మీద ఆసక్తి ఉన్నవారు దీన్ని తీసుకోవడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. పైపెచ్చు  అన్నింటికంటే తాగడమే ముఖ్యం అనుకుంటారు. వీరు మత్తుకు బానిసలైపోయి ఉంటారు. అయితే మధ్యపానం సేవించడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా వస్తాయని తెలిసిందే.  అయితే ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు మద్యపానం గురించి మరిన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. ఈ విషయాల గురించి తెలుసుకుంటే షాకవడం పక్కా.. మద్యపానం సేవించేవారు తమకు మత్తు వస్తుందని, దాని వల్ల ఎంతో సంతోషం కలుగుతుందని చెబుతారు. అయితే మద్యపానం తీసుకోవడం వల్ల మెదడు పరిమాణం తగ్గుతుందనే షాకింగ్ విషయం బయటపడింది. ఇది మాత్రమే కాకుండా మద్యపానం సేవించడం వల్ల ఆహారం ద్వారా శరీరంలో చేరే ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, విటమిన్-బి12, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం మొదలైన విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందవు.  ఆహారం ద్వారా శరీరానికి లభించే మినరల్స్  మెదడు పరిమాణాన్ని పెంచి హానికరమైన తెల్ల పదార్థాన్ని తగ్గిస్తాయి. కానీ మద్యపానం తీసుకోవడం వల్ల ఈ ప్రక్రియ కుంటుపడుతుంది.  దీని వల్ల శరీరం బ్యాలెన్స్ కోల్పోవడం, బలహీనంగా మారడం జరుగుతుంది. మద్యపానం ఎక్కువగా తీసుకునేవారిలో ఎక్కువగా మెగ్నీషియం లోపం ఏర్పడుతుంది. మెగ్నీషియం లోపాన్ని ఎలా నివారించాలంటే.. మెగ్నీషియం లోపాన్ని నివారించాలంటే ప్రతిరోజు సుమారు 450mg మెగ్నీషియం తీసుకోవాలి.  రోజూ 550 mg మెగ్నీషియం తీసుకునే వారి మెదడు 350 mg తీసుకునే వారి కంటే ఎక్కువ తెలివి తేటలతోనూ,  పదునుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.   చిన్నప్పటి నుంచి పుష్కలంగా ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, మతిమరుపు వంటి సమస్యలుండవు. ముఖ్యంగా చిన్నవయసు నుండే మెగ్నీషియం పుష్కలంగా తీసుకునేవారికి  40ఏళ్ళ  తర్వాత త్వరగా  మతిమరుపు రావడం అనే సమస్య అసలే ఉండదు.                                              *నిశ్శబ్ద.  

read more
ఇంగువతో బోలెడు ప్రయోజనాలు!

ఇంగువను మన వంటగదిలో ఆహారం రుచిని పెంచేందుకు వాడుతుంటాం.టెంపరింగ్ నుండి ఊరగాయల వరకు ఇంగువ వాడకం రుచిని పెంచడమే కాకుండా  మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఇంగువను తీసుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.ఇందులో మనం ఇంగువను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొట్ట సంబంధిత సమస్యలు దూరమవుతాయి:  కేవలం చిటికెడు ఇంగువను ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా, మీరు అనేక కడుపు సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు.ఉదయం సేవించడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. మీరు కడుపులో ఉబ్బరం లేదా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే, ఖచ్చితంగా ఇంగువ తినండి. ఇంగువను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రక్తపోటులో ఉపశమనం: మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే.. ఇంగువ తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఇంగువ నీరు త్రాగవచ్చు. ఇలా తీసుకుంటే రక్తపోటును తగ్గిస్తుంది. తలనొప్పి మాయమవుతుంది: మీకు తీవ్రమైన తలనొప్పి మొదలైతే ఇంగువ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండే ఇంగువ తీసుకోవడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.మీరు తరచుగా మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతుంటే, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఇంగువ తినండి. దగ్గు పోతుంది: యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇంగువలో ఉంటాయి. ఇది దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్ సమస్య నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. బరువు తగ్గడం: మీరు అధిక బరువుతో బాధపడుతుంటే. ఉదయాన్నే ఇంగువ నీటిని తాగండి. కొలెస్ట్రాల్ ను కరిగించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఇలా నిరంతరం తీసుకున్నట్లయితే మీ బరువు అదుపులో ఉంటుంది.

read more
షార్ట్ సైట్ కారణంగా దృష్టి సమస్యా...అయితే సిల్క్ సర్జరీ గురించి తెలుసుకోండి.!

ఈ మధ్యకాలంలో షార్ట్ సైట్ దృష్టి సమస్య చాలా మందిలో వేగంగా పెరుగుతోంది. ఈ సమస్యను వైద్య భాషలో మయోపియా అంటారు. చాలా సార్లు ఈ సమస్య పుట్టుకతోనే అభివృద్ధి అవుతుంది. అటువంటి పరిస్థితిలో, జీవితాంతం లెన్స్‌లపై ఆధారపడవలసి ఉంటుంది. మయోపియా సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది కంటిశుక్లం, గ్లాకోమా, రెటీనా డిటాచ్‌మెంట్ వంటి తీవ్రమైన కంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు అసలు కారణం, చికిత్స విధానాలు  ఏంటో తెలుసుకుందాం. ఈ కారణాల వల్ల సమస్యలు తలెత్తుతాయి: వైద్య నిపుణుల అంచనా ప్రకారం, మయోపియాకు అసలు కారణం జన్యు పరివర్తన కూడా  కావచ్చని చెబుతున్నారు. లాప్ టాప్ స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం, ఔట్‌డోర్‌ యాక్టివిటీస్‌ సరిగా చేయకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వంటివి కూడా ఇందుకు కారణం అయ్యే వీలుంది. మయోపియా చికిత్సలు ఇవే: మయోపియా సమస్యను అధిగమించడానికి అనేక దృష్టి దిద్దుబాటు ప్రక్రియలు ఉద్భవించాయి. అద్దాలు  కాంటాక్ట్ లెన్సులు పాత ఫ్యాషన్‌గా మారాయి, అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది ఈ సమస్యను అధిగమించడానికి శాశ్వత  అవాంతరాలు లేని ఎంపికను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, లేజర్ ట్రీట్ మెంట్ డిమాండ్ వేగంగా పెరిగింది. లేజర్-అసిస్టెడ్ ఇన్ సిటు కెరాటోమిలియూసిస్ (LASIK)  ఫోటోరేఫ్రాక్టివ్ కెరాటెక్టమీ (PRK) వంటి సాంప్రదాయ పద్ధతులు మయోపియా  ఆస్టిగ్మాటిజమ్‌ను సమర్థవంతంగా చికిత్స అందించవచ్చు. అయితే ప్రస్తుతం సిల్క్ లేదా స్మూత్ ఇన్సిషన్ లెంటిక్యూల్ కెరాటోమైల్యూసిస్ పేరిట నూతన విధానం అందుబాటులోకి వచ్చంది. మయోపియాను సరిచేయడానికి సిల్క్‌ టెక్నాలజీ చక్కటి ఫలితాలు ఇస్తోందని నిపుణులు చెబుతున్నారు. సిల్క్ ప్రక్రియకు సంబంధించిన ప్రయోజనాలు: 1. లాసిక్‌ సర్జరీతో  పోలిస్తే, ఆపరేషన్ తర్వాత సిల్క్ ప్రభావంతంగా పనిచేస్తుంది. దీని కారణంగా కార్నియల్ నరాలు ప్రభావితం కావు. దీని కారణంగా, తక్కువ అసౌకర్యం అనుభూతి చెందవచ్చు. 2. సాధారణంగా, ఈ ప్రక్రియ తర్వాత రోగి ఒకటి లేదా రెండు రోజులలో తన మెరుగైన దృష్టి ప్రయోజనాలను పొందడం ప్రారంభిస్తాడు. లెంటిక్యులర్ డిసెక్షన్ త్వరగా కోలుకోవడానికి అనుమతిస్తుంది. 3. ఈ ప్రక్రియలో, సాధారణంగా 3 మిల్లీమీటర్ల పరిమాణంలో లేజర్‌తో కార్నియాపై చిన్న కోత చేస్తారు. ఇది కార్నియా  రక్షణ  బలాన్ని నిర్ధారిస్తుంది. 4. సాంప్రదాయ లాసిక్‌కి సురక్షితమైన  ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా సిల్క్ ప్రక్రియ చక్కటి పురోగతిని సాధించింది.

read more
చలికాలంలో వచ్చే నాలుగు ప్రమాదకర జబ్బులు ఇవే!

చలికాలం వాతావరంలో మార్పులతో పాటు ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలను వెంటబెట్టుకువస్తుంది. ప్రతి ఏడాది ఇది  మామూలే కదా అని సులువుగా తీసుకోలేం.  ఎందుకంటే రాను రాను వేసవిలో ఎండలు, చలికాలంలో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. వీటిని భరించడం చాలా మంది వల్ల కావట్లేదు. వృద్దులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, చిన్న పిల్లలు చలికారణంగా ప్రమాదకరమైన జబ్బుల బారిన పడతారు. తగ్గిపోతాయని సాధారణ మందులు వాడేలోపే ఇవి చాలా ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.  చలికాలంలో చాలా మామూలుగా వచ్చి ప్రాణాలకు ముప్పు కలిగించే నాలుగు జబ్బుల గురించి తెలుసుకుంటే.. ఇన్ఫ్లుఎంజా.. ఇన్ఫ్లుఎంజాను ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఇది  వైరస్ వల్ల కలిగే అంటు వ్యాధి. ఇది ముక్కు  గొంతును ప్రభావితం చేస్తుంది. చలికాలంలో ఫ్లూ ప్రమాదం పెరుగుతుంది.   జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారటం, తలనొప్పి, అలసట,  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి దీని లక్షణాలు. పొడి దగ్గు  కఫం కూడా ఫ్లూ లక్షణాలలో ఉంటాయి. చలికాలంలో ముక్కు కారడం, తరచుగా తుమ్ములు,  దగ్గు చాలా సాధారణం. ఇది తేలికగానూ ఉండవచ్చు,  తీవ్రమైన సమస్యగానూ ఉండచ్చు. ఇది ఒకటి నుండి రెండు వారాల్లో నయమవుతుంది. అయితే  చాలా కాలం పాటు కొనసాగితే అది న్యుమోనియాకు దారితీస్తుంది. శ్వాసకోశ సమస్యలు.. జలుబు చలికాలంలో వచ్చే సాధారణ సమస్య.  ఇది శ్వాసకోశ సమస్యలకు మూలం. ముక్కు కారడం, తరచుగా తుమ్ములు, దగ్గు,  కఫం వంటి సాధారణ లక్షణాలన్నీ శ్వాసకోశ సమస్యలలో ఉంటాయి.  ఇవి మూడు నుండి నాలుగు రోజుల్లో నయమవుతాయి. కొందరిలో ఇది వచ్చినప్పుడు అన్ని లక్షణాలతోపాటు గొంతునొప్పి, తలనొప్పి కూడా కనిపిస్తాయి. కొందరికి జ్వరం కూడా రావచ్చు. బ్రోన్కైటిస్.. చలికాలంలో చల్లని  వాతావరణం బ్రోన్కైటిస్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఇది సాధారణ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. దీని కారణంగా ఊపిరితిత్తులలో వాపు ఏర్పడుతుంది. బ్రోన్కైటిస్ కారణంగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,  ఛాతీ నొప్పి వంటి లక్షణాలు  కనిపిస్తాయి. ఈ లక్షణాలే కాకుండా, కొంతమందికి ముక్కు దిబ్బడ,  జ్వరం మొదలైనవి కూడా ఉండవచ్చు. గొంతునొప్పి.. స్ట్రెప్ థ్రోట్.. స్ట్రెప్ థ్రోట్ అనేది పిల్లలలో సర్వసాధారణంగా కనిపించే ఒక రకమైన గొంతు సమస్య. ఇది స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా వల్ల వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ వల్ల గొంతులో మంట,  వాపు వస్తుంది. కొంతమందికి జ్వరంతో పాటు గొంతులో నొప్పి కూడా ఉండవచ్చు. కానీ కొందరు  స్ట్రెప్ థ్రోట్,  గొంతు నొప్పి మధ్య గందరగోళానికి గురవుతారు. కానీ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటుంది.  దానిని సరిగ్గా గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం. స్ట్రెప్ థ్రోట్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.  గొంతు నొప్పి సాధారణం సంక్రమణ. స్ట్రెప్ థ్రోట్  యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు.  అయితే గొంతు నొప్పి కాలక్రమేణా నయమవుతుంది.                                               *నిశ్శబ్ద.  

read more
చలికాలంలో ఫిట్ గా ఉండాలంటే  ఈ 5 రకాల కూరగాయలు తినాలంతే.!

చలికాలంను జబ్బుల కాలం అని కూడా అంటారు. వాతావరణంలో మార్పుల కారణంగా శరీరం ఇబ్బందులకు లోనవుతుంది. ఇదే కాకుండా చలికాలంలో బ్యాక్టీరియా, వైరస్ ల వ్యాప్తి ఎక్కువ జరగడం వల్ల అంటువ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చలికాలంలో చాలా బాధపడాల్సి ఉంటుంది. అయితే శరీరానికి మంచి రోగనిరోధక శక్తిని అందించి వ్యాధులు దరిచేరకుండా ఉండటానికి, శరీరం ఫిట్ గా ఉండటానికి ఈ 5 రకాల కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుంటే.. ముల్లంగి.. చలికాలంలో ముల్లంగి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.  దీంతో పుష్కలంగా ఫైబర్, నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. క్యారెట్.. చలికాలంలో క్యారెట్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.   ఇది వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాలకూర.. చలికాలంలో తప్పనిసరిగా తినాల్సిన ఆకుకూరలలో పాలకూర మొదటిస్థానంలో ఉంటుంది. ఇందులో ఐరన్ సమృద్దిగా ఉంటుంది.  జీవక్రియను మెరుగ్గా ఉంచడంలో కూడా పాలకూర సహాయపడుతుంది. బీట్ రూట్.. చలికాలంలో రోజూ బీట్ రూట్ తినడం వల్ల శరీరానికి చెప్పలేనంత ప్రయోజనం కలుగుతుంది. బీట్ రూట్ రక్తాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. బీట్ రూట్ జ్యూస్ ను ప్రతిరోజూ తాగుతుంటే స్టామినా పెరుగుతుంది. సొరకాయ.. సొరకాయ గురించి చాలామందికి సరిగా తెలియదు. ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు సొరకాయను వంటల్లో వినియోగించడం కంటే  జ్యూస్ చేసుకుని తాగడానికి ఎక్కువ ఉపోగిస్తారు. ఇది బరువు తగ్గించడం నుండి శరీరాన్ని డిటాక్స్ చేయడం వరకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. దీన్ని వంటల్లోనూ, జ్యూస్ గానూ తప్పకుండా చలికాలంలో తినాలి.                    *నిశ్శబ్ద.

read more
మలబద్దకం సమస్య ఎందుకొస్తుంది? తగ్గడానికి ఏం చెయ్యాలంటే.!

మలబద్ధకం అనేది చాలా మంది  ఎదుర్కొనే సాధారణ సమస్య. ఈ సమస్య  చాలా చిన్నదిగా అనిపించినప్పటికీ ఇది  దీర్ఘకాలికంగా మారితే అది చాలా ఇబ్బంది పెడుతుంది.  సరైన జీవనశైలి, నీరు తక్కువగా  తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుంది. తినే ఆహారమే  మలబద్ధకం సమస్యకు కారణం అవుతుంది. కొన్ని ఆహార పదార్థాలు దీర్ఘకాలిక మలబద్ధకాన్ని తగ్గించడంలో కూడా   సహాయపడతాయి.  ప్రాసెస్ చేయబడిన ఆహారాలు మలబద్దకం రావడానికి గల కారణాలలో  మొదటి స్థానంలో ఉన్నాయి. వీటిలో చక్కెరలు ఎక్కువగానూ,  ఫైబర్ తక్కువగానూ ఉంటాయి. ఇవి   జీర్ణవ్యవస్థను నాశనం చేస్తాయి.   పేగు కదలికలు సాఫీగా జరగడానికి సహాయపడే ఫైబర్ లేకపోవడం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంది. మలబద్దకానికి కారణమయ్యే ఆహారాలు.. పాల ఉత్పత్తులు.. పాలు, పాల ఉత్పత్తులు కాల్షియం,  ఇతర పోషకాల  గొప్ప మూలం.  అయితే కొంతమంది లాక్టోస్ అసహనం కారణంగా మలబద్ధకంతో బాధపడవచ్చు. జున్ను,  పాలు వంటి పాల ఉత్పత్తులు కొంతమందికి మలబద్ధకం కలిగిస్తాయి, దీనివల్ల అసౌకర్యం,  మలం విసర్జించడంలో  కష్టం ఏర్పడుతుంది. అరటిపండు ఆశ్చర్యకరంగా పోషక విలువలు సమృద్దిగా ఉంటాయని చెప్పుకునే  అరటిపండు అధికంగా తీసుకుంటే మలబద్ధకాన్ని కలిగిస్తుంది. వీటిలో  పొటాషియం,  ఇతర ముఖ్యమైన పోషకాలు  పుష్కలంగా ఉన్నప్పటికీ, అరటిపండ్లలో పెక్టిన్  ఉంటుంది. ఇది మలబద్ధకం కలిగించే ఒక రకమైన కరిగే ఫైబర్. రెడ్ మీట్.. ఎర్ర మాంసంలో  ప్రోటీన్,  ఐరన్  పుష్కలంగా ఉన్పప్పటికీ ఇది జీర్ణవ్యవస్థకు సవాలుగా ఉంటుంది. అధిక కొవ్వు,  ఫైబర్ లేకపోవడం మలబద్ధకానికి ప్రధాన కారణం. ఆల్కహాల్ అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది, ఇది మలబద్ధకానికి దారితీయవచ్చు. ఆల్కహాల్ అధిక వినియోగం శరీరం నీటిని నిలుపుకోవడాన్ని దెబ్బతీస్తుంది, దీని వలన మలం గట్టిపడుతుంది. మలబద్ధకాన్ని నివారించడానికి ఏమి తినాలి? తృణధాన్యాలు, బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్,  వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. కాయధాన్యాలు, శనగలు,  బీన్స్ వంటి చిక్కుళ్ళు చేర్చుకోవాలి. ఆపిల్, బెర్రీ, స్ట్రాబెర్రీ, నారింజ, బత్తాయి,  రేగు వంటి  ఉన్న పండ్లను ఎంచుకోవాలి. బ్రోకలీ, క్యారెట్లు, బచ్చలికూర, మొలకలు వంటి కూరగాయలను  తీసుకోవడం పెంచాలి. నీరు బాగా తాగాలి.                                            *నిశ్శబ్ద.  

read more
ఈ లక్షణాలు కనిపిస్తే శరరీంలో రోగనిరోధక శక్తి తగ్గినట్టే!

​శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోధక శక్తి చాలా అవసరం. చాలావరకు చలికాలంలో జబ్బులు, అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే అధికశాతం మంది రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి  కషాయాలు,  రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు, చ్యవనప్రాశ్ వంటి లేహ్యాలు వాడతారు. అయితే శరీరంలో రోగనిరోధక శక్తి  లోపిస్తే శరీరం కొన్ని లక్షణాలను వ్యక్తం చేస్తుంది. ఆ లక్షాలేవీ లేకుండా ఊరికే ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు, పానీయాలు అతిగా తీసుకోవడం కూడా సమస్యను తెచ్చిపెడుతుంది. శరీరం అసౌకర్యానికి గురవుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉందనడానికి కనిపించే కొన్ని లక్షణాలేంటో తెలుసుకుంటే.. ఒత్తిడి, నిరాశ.. ఒత్తిడి, నిరాశ మనిషిలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్లే సంభవిస్తాయి. ఒత్తిడి శరీరంలో తెల్లరక్తకణాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇవి శరీరానికి ఆర్మీ ఫోర్స్ లాంటివి.  ఇన్ఫెక్షన్లతో పోరాడి వాటిని విచ్చిన్నం చేసేది ఇవే. కాబట్టి ఒత్తిడి, నిరాశ అనేవి శరీరంలో తెల్లరక్తకణాలు తగ్గాయనడానికి సూచన,  తెల్లరక్తకణాలు లోపిస్తే రోగనిరోధక శక్తి లోపించింది అనడానికి సూచన. జలుబు, దగ్గు.. చలికాలంలో రెండు నుండి మూడు సార్లు జలుబు, దగ్గు రావడం సహజమే. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ వ్యాధులతో పోరాడే ప్రతిరోధకాలను ఉత్పత్తి చేయడానికి 3 నుండి 4 రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత శరీరం సమస్యల నుండి కోలుకోవడానికి 6 నుండి 8 రోజుల సమయం పడుతుంది. కానీ రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే ఎక్కువ రోజులు జలుబు, దగ్గు వేధిస్తాయి. చెవి సమస్యలు.. చెవి సమస్యలు చాలామందిలో వాతావరణ మార్పుల వల్ల కలుగుతుంటాయి. సంవత్సరంలో నాలుగు సార్లకు మించి చెవి సమస్యలు వస్తున్నా, సంవత్సరంలో రెండు సార్లకు మించి న్యుమోనియా వస్తున్నా రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉన్నట్టు లెక్క. ఇలాంటి సమస్యలు వస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యంగా ఉేండకూడదు. కడుపు సమస్యలు.. ప్రతి వ్యక్తి రోగనిరోధక శక్తి 70శాతం జీర్ణవ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. జీర్ణవ్యవస్థ వల్లే బాక్టీరియా, సూక్ష్మజీవుల ఇన్పెక్షన్ల  నుండి ప్రేగులను రక్షిస్తాయి. మలబద్దకం, అతిసారం వంటి సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటున్నట్టైతే  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉందని అర్థం. గాయాలు.. శరీరంలో గాయాలు నయం కావడంలో ఇబ్బందులుంటే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నట్టు అర్థం. చాలావరకు కాలిన, తెగిన, పడినప్పుడు తగిలిన గాయాల్లాంటివి  రోగనిరోధక శక్తి బాగుంటే అవే తొందరగా తగ్గిపోతాయి. కానీ రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఇవి తొందరగా మానవు. కొన్నిసార్లు అవి పుండ్లుగా మారి పెద్ద సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉండచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉందనడానికి ఇది కూడా కారణం.                                       *నిశ్శబ్ద.

read more
చలికాలంలో చిలగడదుంప తింటే ఎన్ని లాభాలో తెలుసా?

సీజన్ ను బట్టి పండ్లు కూరగాయలు అందుబాటులోకి వస్తాయి. అలాంటి వాటిలో చిలగడ దుంప కూడా ఒకటి. చిలగడ దుంప ఎంత రుచిగా ఉంటుందో అంతకు మించి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇది నారింజ, ఊదా, తెలుపుతో సహా వివిధ రంగులలో లభిస్తుంది. స్వీట్ పొటాటో స్పెషాలిటీ ఏంటంటే దానిని ఉడబెట్టి అయినా తినచ్చు, కూరల్లోనూ ఉపయోగించవచ్చు, పచ్చిగా కూడా తినవచ్చు. కొన్నిచోట్ల దీన్ని కాల్చి కూడా తింటారు. దీనివల్ల కలిగే ఉపయోగాలేంటో పూర్తీగా తెలుసుకుంటే.. పోషకాల నిధి.. చిలగడ దుంపను పోషకాల నిధి అని చెప్పవచ్చు.  కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి శరీరం తన విధులు సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడతాయి. ఫైబర్ మూలం.. చిలగడదుంపలలో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతుంది.  రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. బీటా కెరోటిన్ చిలగడదుంపలో  అధిక మొత్తంలో బీటా కెరోటిన్  ఉంటుంది. ఇది  శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రేచీకటి  నివారించడానికి,  మొత్తం కంటి ఆరోగ్యం నిర్వహించడానికి విటమిన్ ఎ ముఖ్యమైనది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది చిలగడ దుంపలలో  సహజ చక్కెరలు ఉన్నప్పటికీ  తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అంటే అవి చక్కెరను రక్తప్రవాహంలోకి నెమ్మదిగా విడుదల చేస్తాయి. ఇది బ్లడ్ షుగర్ ని మెరుగ్గా నియంత్రిస్తుంది. వెయిట్ లాస్  చిలగడ దుంపలో  ఫైబర్ తో పాటు  పోషకాలు ఉంటాయి. ఇవి రెండూ కలిసి ఎక్కువ ఆకలి నియంత్రించడంలో సహాయపడతాయి. అధిక కేలరీల తీసుకోడాన్ని నియంత్రిస్తాయి.  తద్వారా బరువు నిర్వహణకు సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యం  చిలగడదుంపలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహకరిస్తుంది.                                          *నిశ్శబ్ద.

read more
మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే..!

నేటికాలంలో చాలా మంది ఏదొక సమస్యతో ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల సమస్య పరిష్కారం కాకపోగా..ఇతర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే పెద్దవాళ్లు మాత్రమే కాదు..చిన్నారులు కూడా ఒత్తిడికి లోనవుతున్నారని పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులుగా మీరే..దానికి సరైన పరిష్కారం చూపిస్తారు. అయితే పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నట్లు మాకేలా తెలుస్తుందనే డౌట్ మీకు రావచ్చు. పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు కొన్ని రకాల లక్షణాలు వారిలో కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. అవి ఎలా ఉంటాయి? చిన్నారులను ఒత్తిడి నుంచి ఎలా బయటపడేయాలని..ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అనారోగ్యంతో ఉన్నారేమో గమనించాలి? కొంతమంది పిల్లలు ఒత్తిడికి లోనైనప్పుడు తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. అయితే ఇవిసాధారణంగా కూడా ఉంటాయనే సందేహం మీకు రావచ్చు. అయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని పిల్లల్లో తరచుగా ఈ సమస్య వస్తున్నట్లయితే..దానిని ఒత్తిడికిందే పరిగణించాలని నిపుణులు అంటున్నారు. టీచర్లు ఇచ్చిన హోం వర్క్ చేయలేకపోవడం, పరీక్షలకు సరిగ్గా సన్నద్ధం కాకపోవడం వల్ల ఒత్తిడికి లోనవుతుంటారు. ఇలాంటివి తల్లిదండ్రులకు చెబితే తిడతారన్న భయం కూడా వారిలో ఉంటుంది. ఇలాంటి సమయంలో వారిని మీరే దగ్గరకు తీసుకుని వారి సమస్యలేంటో అడిగే ప్రయత్నం చేయాలి. అలాగే వారికి ధైర్యం చెప్పాలి. సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించాలి. ఫోన్లో గేమ్స్ ఆడటం? సాధారణంగా పిల్లలు ఎక్కువగా ఫోన్లలో ఆటలు ఆడుతుంటారు. కొన్ని ఆటల వల్ల పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ కొన్ని మాత్రం పిల్లల్లో ఒత్తిడిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారన్నా విషయం  కూడా వారికి తెలియదు. అలాని వారిని అసలు ఫోన్లకే దూరం చేయడం కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ వారికి ఫోన్ ఇచ్చినా దానికంటూ కొంతసమయం మాత్రమే కేటాయించాలి. అలాగే వారు ఆడే ఆటలు చూసే వీడియోలపై కూడా ఓ కన్నేసి ఉంచడం అవసరం. ఏం తింటున్నారు..ఎలా తింటున్నారు? మనం ఆహారం తీసుకునే విధానంలో ఒత్తిడికి లోనవుతున్నామో లేదో సులభంగా తెలిసిపోతుందట. ఇది కేవలం పెద్దలకే కాదు..పిల్లలకు కూడా వర్తిస్తుందని నిపుణులు అంటున్నారు. మీ పిల్లలు అంతకుముందు కంటే ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం కానీ..తక్కువగా తీసుకోవడం కానీ జరుగుతుందంటే దానిని ఒత్తిడి కిందే పరిగణించాలని చెబుతున్నారు. వారు ఏదైనా విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తే ఇలా చేస్తారని అంటున్నారు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తుంటే వారి సమస్యను తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఏకాగ్రత? సాధారణంగా ఒత్తిడికి లోనైతే ఏ పనిని సరిగ్గా చేయలేం. ముఖ్యంగా చదువుల విషయంలో ఇది కనిపిస్తుంది. ఒత్తిడి అనేది ఎప్పుడూ బయటి అంశాలపైనే ఆధారపడదు. కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులను కూడా నిర్వర్తించినప్పుడు కూడా ఒత్తిడికి గురవుతుంటాం. అలాగే పిల్లలు కూడా చదువు విషయంలో వారు పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేనప్పుడు ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో వారికి అండగా ఉంటూ తగిన సహకారం అందించడం చాలా ముఖ్యం. తద్వారా వారిని ఒత్తిడి నుంచి బయటపడేయవచ్చు అంటున్నారు నిపుణులు.  

read more
పాలలో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే విషంతో సమానం..

ఆహారమే ఆరోగ్యం. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచి ప్రమాదకరమైన జబ్బులను సైతం తట్టుకునేలా చేస్తుంది. కానీ ఆరోగ్యం అనుకుంటూనే చాలామంది ఆహారం విషయంలో తప్పులు చేస్తారు. ఈ తప్పులు కాస్తా పెద్ద ముప్పులకు దారితీస్తాయి. చాలామంది సాధారణమేలే అనుకుంటూనే పాలతో కొన్ని పదార్థాలు మిక్స్ చేయడం లేదా పాలతో పాటు తినడం చేస్తుంటారు. అవి పాలతో పాటు తీసుకోగానే విషంతో సమానమైన నష్టాన్ని శరీరానికి కలిగిస్తాయి. ఆయుర్వేదం ఈ విషయాన్ని తెలిపింది కూడా.  ఈ ఆహారాలు కొన్ని అప్పటికప్పుడు వాటి ప్రభావం చూపకపోయినా అవి స్లో పాయిజన్ లా శరీరాన్ని, శరీరంలో అవయవాలను నిర్వీర్యం చేస్తాయి. పాలతో తినకూడని ఆ  ఆహారాలేంటో తెలుసుకుంటే.. పాలు.. చేపలు.. పాలు, చేపలు కలిపి వండటం, పాల ఉత్పత్తులైన పనీర్, పెరుగు, చీజ్ వంటి వాటితో కలిపి చేప వంటకాలను తయారుచేయడం అస్సలు చేయకండి. చేపలు, పాలు, పాల ఉత్పత్తులతో కలిస్తే ఆహారం విషపూరితం అవుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుంది. జీర్ణాశయాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. మరీ ముఖ్యంగా ఈ కాంబినేషన్ తింటే చర్మ సంబంధ సమస్యలు వస్తాయి. పాలు.. పుల్లని పండ్లు.. పుల్లని పండ్లను సిట్రస్ పండ్లు అని కూడా అంటారు. సిట్రస్ పండ్లలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా పాలలో కాసింత నిమ్మరసం పడితే పాలు విరిగిపోవడం గమనించే ఉంటారు. అలాగే పనీర్ తయారీకి చాలామంది పాలలో నిమ్మరసం పోసి తయారుచేస్తుంటారు. అయితే పనీర్ ను మళ్లీ వేయించడం లేదా ఉడికించడం చేస్తారు కాబ్టటి అది తిన్నా పర్వాలేదు. కానీ పాలు-సిట్రస్ పండ్ల కాంబినేషన్ చాలా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కడుపులో  గందరగోళం ఏర్పరుస్తుంది. జీర్ణాశయాన్ని దెబ్బతీస్తుంది. పాలు.. బ్రెడ్డు.. చాలామంది ఇష్టంగా తినే కాంబినేషన్ ఇది. ఉదయాన్నే కొందరు దీన్ని అలవాటుగా తింటే.. ఆరోగ్యం బాలేనప్పుడు పాలు-బ్రెడ్డు తింటుంటారు. అయితే బ్రెడ్డులో కూడా ఈస్ట్ బ్రెడ్డును పాలతో తినడం మంచిది కాదు. ఇది కడుపులో అసౌర్యం కలిగిస్తుంది. జీర్ణాశయాన్ని బలహీనంగా మారుస్తుంది. జీర్ణాశయ గోడలను మెల్లగా శిథిలం చేస్తుంది. పాలు.. అరటిపండ్లు.. పాలు, అరటిపండ్లు చాలా మందికి ఇష్టమైన కాంబో. గ్లాసుడు పాలు, ఓ అరటిపండు తింటే దాదాపు రెండు గంటల సేపు ఆకలి అనే మాట మాట్లాడరు. ఈ కాంబినేషన్ వల్ల పుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలు ఏర్పడకపోయినా గొంతులో కఫానికి దారితీస్తుంది. ఇది శ్వాస సంబంధ సమస్యలకు, రోజంతా చికాకుగా ఉండటానికి కారణం అవుతుంది. పాలు.. పుచ్చకాయ, కర్బూజ.. పుచ్చకాయ, కర్బూజ వంటి పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లను పొరపాటున పాలతో తీసుకోకూడదు. చాలామంది ఈ పండ్లకు పాలు కలిపి మిల్క్ షేక్ తయారుచేసుకుని తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇవి తీసుకోవడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు ఏర్పడతాయి. అంత ఈజీగా వదలవు. కేవలం పైన చెప్పుకున్నవే కాకుండా పాలతో పాటూ ఉప్పు, కారం, మాంసాహారం, ఆకు కూరలు వంటివి తీసుకోకూడదు.                                                          *నిశ్శబ్ద.

read more
ఆహారాన్ని పదే పదే వేడి చేస్తున్నారా?

సాధారణంగా మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టేస్తాం. కూరలు, పప్పులు అయితే తప్పకుండా పెడుతుంటాం. కావాల్సినప్పుడు వాటిని బయటకు తీసుకుని వేడిచేసుకుని తింటుంటాం. ఇలా చేయడం వల్ల ఆహారం వేస్ట్ కాకుండా చేశామని అనుకుంటాం. కానీ అనారోగ్యానికి కోరి తెచ్చున్నట్లు అవుతుందని మీకు తెలుసా? -మాంసాహారం, గుడ్లు, పప్పులు వంటివన్నీ మాంసక్రుత్తులు ఎక్కువగా ఉండే పదార్థాలు. వీటిని మళ్లీ మళ్లీ వేడిచేసినట్లయితే వాటిలో ఉండే మాంసక్రుత్తులు విచ్చిన్నమవుతాయి. ఆమ్లాలు ఉత్పత్తై తిన్న ఆహారం జీర్ణం కాకుండా చేస్తాయి. వీటిని తాజాగానే తినడం మంచిది. అస్సలు నిల్వ చేయకూడదు. -ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడిచేయడం వల్ల అందులోని విటమిన్, సి, బి వంటిపోషకాలు నశించిపోతాయి. ఆ ఆహారం తిన్నాకూడా శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. - అన్నం, పాస్తా వంటివాటిని ఎంత కావాలో అంతే వండుకోవాలి. మిగిలిదాన్ని ఫ్రిజ్ లో పెట్టి వేడిచేసి తింటే హానికర బ్యాక్టీరియాని స్వయంగా శరీరంలోకి ఆహ్వానించినట్లవుతుంది. -ఆలుగడ్డ లేదా బ్రెడ్ వంటి పిండిపదార్థాలను మళ్లీ వేడి చేస్తే క్యాన్సర్ కరకాలు ఉత్పన్నమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వాటిని తాజాగా ఉన్నప్పుడే తినాలి. ఎక్కువసేపు వండటం, ఫ్రిజ్ లో స్టోర్ చేయడం కంటే కావాల్సినంతే వండుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.   

read more
చలికాలంలో జలుబు,దగ్గుకు చెక్ పెట్టే అమృతసమానమైన కషాయాలు..!

చలికాలంలో విపరీతమైన దగ్గు,జలుబు కారణంగా గొంతులో కఫం ఏర్పడుతుంది.  కొన్నిసార్లు గొంతు లోపల పేలుతుంది. దీనికారణంగా   రక్తస్రావం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. దగ్గు నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ఆరోగ్యకరమైన కషాయాలను ఉపయోగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఈ కషాయాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్, ఇమ్యూన్-బూస్టర్ లక్షణాలు ఉంటాయి. ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా  వీటిని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే వీటిని బెస్ట్ మార్నింగ్ డ్రింక్స్ అంటారు. వాటిని ఎలా తయారు చేయాలో, వాటి ప్రయోజనాలేంటో తెలసుకుంటే.. అల్లం, పసుపు.. అల్లం  పసుపు కలపడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఇమ్యూనిటీ బూస్టర్ లక్షణాలు పుష్కలంగా ఉండే ఎఫెక్టివ్ డికాక్షన్ తయారవుతుంది. ఈ డికాషన్ జలుబుతో పోరాడటమే కాకుండా జీర్ణక్రియకు సహాయపడుతుంది. తయారు విధానం.. తురిమిన అల్లం, పసుపు, మిరియాలు,  దాల్చిన చెక్కను నీటిలో 10-15 నిమిషాలు ఉడకబెట్టాలి. వడపోసి త్రాగే ముందు, కొద్దిగా తేనె, నిమ్మకాయ రసం కలిపి తీసుకోవాలి. తులసి తులసిని ఆయుర్వేదంలో శక్తివంతమైన మూలిక అంటారు. తులసి కషాయం అద్భుతమైన డీకాంగెస్టెంట్‌గా పనిచేస్తుంది, కఫాన్ని తొలగించడం ద్వారా దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.  యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాల వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తయారు విధానం.. తాజా తులసి ఆకులను తీసుకుని, మిరియాలు, లవంగాలు,  అల్లం ముక్క వేసి  నీటిలో ఉడకబెట్టాలి. కాసేపు మరిగిన తర్వాత రుచికి సరిపడా బెల్లం వేసి తాగాలి. దాల్చిన చెక్క ఒక అధ్యయనం ప్రకారం దాల్చినచెక్కలో పాలీఫెనాల్స్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఏలకులు కూడా  ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాలను రక్షిస్తుంది. తయారు విధానం.. దాల్చిన చెక్క,  ఏలకులు, అల్లం ముక్క  కొన్ని లవంగాలను నీటిలో ఉడకబెట్టాలి. కాసేపు మరిగిన తర్వాత వడకట్టి అందులో ఒక చెంచా తేనె వేసి సిప్ బై సిప్ తాగాలి. ఆయుర్వేద త్రిఫల.. ఉసిరి, కరక్కాయ, తానికాయల  మిశ్రమాన్ని త్రిఫల అంటారు. ఆయుర్వేదంలో ఇది శరీరాన్ని శుద్ది చేసి శరీరానికి కొత్త శక్తిని ఇస్తుందని చెబుతారు. రోజూ దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తయారు విధానం.. ఒక చెంచా త్రిఫల పొడిని నీటిలో వేసి 5-10 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించాలి. మెంతులు,ధనియాలు.. ఈ కషాయాన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యాన్ని, రక్తంలో చక్కెరను కూడా బ్యాలెన్స్ గా ఉంచుతుంది.  టైప్ 2 డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర, పొట్ట కొవ్వు,  వేగంగా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తయారు విధానం.. మెంతి గింజలు, దనియాలు, మిరియాలు,  దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించాలి. దీన్ని కాసేపు ఉడకబెట్టాలి.  తరువాత ఫిల్టర్ చేసి తాగాలి.                                        *నిశ్శబ్ద.  

read more
ఉదయం బ్రేక్ ఫాస్టులో వీటిని తినకండి..ఈ సమస్యలు తప్పవు.!

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం అల్పాహారం ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. దీని వల్ల రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది.కానీ చాలా మంది అల్పాహారంలో అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటారు. వీటి వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.అంతేకాదు అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇవి శరీరాన్ని లోపల నుండి బోలుగా చేసి, వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందించవు. కాబట్టి, పొరపాటున కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినకూడదు. అల్పాహారంలో తీసుకోకూడని కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెడ్, జామ్: చాలా మంది ఉదయం అల్పాహారంగా బ్రెడ్, జామ్ తినడానికి ఇష్టపడతారు. అంతే కాదు చాలా మంది పిల్లల టిఫిన్‌లో బ్రెడ్, జామ్ కూడా ప్యాక్ చేస్తారు. కానీ, బ్రెడ్, జామ్‌లో కొవ్వు, చక్కెర అధికంగా ఉంటుంది.  ఇది భవిష్యత్తులో ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. అందువల్ల, మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటే, బ్రెడ్, జామ్ తినకండి. టీ, కాఫీలు తాగకూడదు :  ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరంలో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా మీకు గ్యాస్, బర్నింగ్ సెన్సేషన్, వాపు సమస్యలు ఉండవచ్చు. కాఫీలో పెద్ద మొత్తంలో కెఫీన్ ఉంటుంది. కెఫిన్ వినియోగం ఆరోగ్యానికి చాలా హానికరం. పాన్‌కేక్‌లు, స్వీట్లు: మీరు ఉదయం పూట పాన్‌కేక్‌లను అస్సలు తినకూడదు. నిజానికి అల్పాహారం కోసం తీపి పదార్థాలు తినకూడదు. ఎందుకంటే ఉదయం పూట తీపి పదార్థాలు తినడం వల్ల మీ షుగర్ లెవెల్ పెరుగుతుంది. భవిష్యత్తులో మీరు డయాబెటిస్‌తో బాధపడవచ్చు. క్యాన్డ్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌:  ఉదయం అల్పాహారంలో ఎప్పుడూ క్యాన్డ్ జ్యూస్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగకండి. నిజానికి, క్యాన్డ్ జ్యూస్‌లో చాలా చక్కెర ఉంటుంది. దీన్ని రోజూ తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఇది కాకుండా, ఈ ఎనర్జీ డ్రింక్ రక్తంలో చక్కెరను కూడా పెంచుతుంది.

read more
ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినచ్చా? చలికాలంలో ఈ నిజాలు తెలుసుకుని తీరాలి!

ఆహారం శరీరానికి శక్తిని ఇస్తుంది. మనిషి ఆయుష్షు చాలా వరకు  ఆరోగ్యకరమైన ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆహారం తరువాత వ్యాయామం, అలవాట్లు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. అయితే చలికాలంలో చాలామంది ఆహారం దగ్గరే పెద్ద తప్పు చేస్తారు. ఉదయం అయినా మధ్యాహ్నం అయినా వండిన ఆహారం అంతో ఇంతో మిగులుతూనే ఉంటుంది. చలికాలంలో ఆహారాన్ని చల్లగా తినలేక దాన్ని మళ్లీ వేడి చేస్తుంటారు. అయితే ఇలా వేడి చేయడం అస్సలు మంచిది కాదని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కింది ఆహారాలు అయితే పొరవాటున కూడా వేడి చేయకూడదని చెబుతున్నారు. ఈ ఆహారాల గోల ఏంటో తెలుసుకుంటే.. చలికాలంలో పొరపాటున కూడా మళ్లీ వేడి చేసి తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిలో పాలకూర, క్యారెట్లు, ఆకుకూరలు, బీట్రూట్ వంటి నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు ముఖ్యమైనవి. పాలకూరను చాలామంది పప్పుగానే వండుతారు. కొందర పనీర్ తో కూర చేస్తారు. వీటిని మధ్యాహ్నం వండితే చాలావరకు మిగులుతాయి. చూస్తూ వీటిని పడెయ్యలేరు. అలాగని చలికాలంలో వీటిని చల్లగానూ తినలేరు. అలాంటప్పుడు మళ్లీ వేడి చేసి వేడిగా తింటారు. మిగిలిన కూరగాయలు, ఆకుకూరలు కూడా ఇంతే.. రుచికరమైన, పోషకాలు కలిగిన ఆహారం కాబట్టి ముందు వెనుక ఆలోచించరు. కానీ ఇలా ఒకసారి వండిన ఆహారన్ని మళ్లీ వేడి చేస్తే వాటిలోని నైట్రేట్ లు వేడి వల్ల నైట్రోజినేస్ గా మారుతాయి. ఇవి శరీర కణాలకు హాని కలిగిస్తాయి. అన్నం గురించి అన్ని ఇళ్లలో కనిపించే సీన్ ఒకటే.. అన్నం మిగిలితే ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్, కలర్ రైస్ ఇలా చాలా రకాలు చేస్తారు. అయితే అన్నం ఒక్కసారి వండిన తరువాత మళ్లీ దాన్ని వేడి చేయకూడదు. ఫుడ్ స్టాండర్ ఏజెన్సీ ప్రకారం అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల పుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల అన్నంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది. మాంసాహారం పడెయ్యాలంటే ఎవ్వరికీ మనసొప్పదు. పైగా ఖరీదైన ఆహారం కూడా. మధ్యాహ్నం మిగిలితే రాత్రి, రాత్రి మిగిలితే దాన్ని ఫ్రిజ్ లో పెట్టి మళ్లీ మరుసటిరోజు కూడా తింటారు. అయితే చలికాలంలో మాంసాహారాన్ని వేడిగా తినాలనే జిహ్వ చాపల్యంతో  తిన్న ప్రతీ సారి వేడి చేసుకుని తింటారు. కానీ వండిన మాంసాన్ని మళ్ళీ వేడి చేస్తే చాలా ఈజీగా ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. పైపెచ్చు జీర్ణసమస్యలు కూడా పెరుగుతాయి. ఆహార నిపుణుల ప్రకారం అధిక ప్రోటీన్ ఉన్న ఆహారంలో నైట్రోజన్ ఉంటుంది. అది శరీరానికి హాని చేస్తుంది. చాలా మంది ఇష్టంగా తినే ఆహారాలలో బంగాళాదుంపలు ఒకటి. బంగాళాదుంపలను ఒకసారి ఉడికించాక మళ్లీ వేడి చేయకూడదు. అలా చేస్తే బంగాళా దుంపల్లో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది బంగాళాదుంపల్లో ఉండే విటమిన్-బి6, పొటాషియం, విటమిన్-సి వంటి పోషకాలను అన్నింటిని నాశనం చేసి శరీరానికి హాని కలిగిస్తుంది. పుట్టగొడుగులు మంచి పోషకాహారం. ముఖ్యంగా చలికాలంలో విటమిన్-డి కావాలంటే పుట్టగొడుగులు తినాల్సిందే. దీంతో చలికాలంలో పుట్టగొడుగులు బాగా తింటుంటారు. అయితే పుట్టగొడుగులను ఒకసారి వండిన తరువాత మళ్లీ వేడి చేయడం అస్సలు మంచిది కాదు. వీటిని ఒకసారి వండి మళ్లీ వేడి చేస్తే వాటిలో ఉన్న ప్రోటీన్, ఖనిజాలు విచ్చిన్నం అవుతాయి. అవి టాక్సిన్లను విడుదల చేసి శరీరానికి హాని కలిగిస్తాయి. జీర్ణవ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తాయి.                                               *నిశ్శబ్ద.  

read more