లైటెనింగ్ రాడ్ - విటమిన్ ఈ
మన శరీరానికి అన్ని విటమిన్లు అవసరమే కాని అందులో విటమిన్ 'ఈ' కి పెద్ద పీట వెయ్యాలి. ఇది మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది. అందుకే దీనిని లైటెనింగ్ రాడ్ అంటారు. అంతేకాదు యాంటి ఆక్సిడెంట్ లా ఉపయోగపడుతుంది. రక్తకణాలని వృద్ది చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పొతే విటమిన్ ఈ వల్ల వచ్చే లాభాలు ఎన్నెన్నో. విటమిన్ ఈ ముఖ్యంగా కొవ్వులో కరిగిపోయే విటమిన్. స్థూలకాయుల రక్తంలోనూ విటమిన్ ‘ఈ’ ఉంటుంది, కానీ కొవ్వు అధికంగా నిల్వ ఉండే శరీరాల్లో మాత్రం విటమిన్ ‘ఈ’ లోపించి ఉంటుందని పరిశోధకులు చెప్తునారు. ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే విటమిన్ ఈ వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దామా. ఊబకాయానికి: కొవ్వు అధికంగా ఉన్నవారికి విటమిన్ ‘ఈ’ అందిస్తే అధిక బరువు సమస్యను నియంత్రించవచ్చునని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.ఎందుకంటే దీనికి కొవ్వుని కరిగించే శక్తి ఉంది. ఇలాంటివారు పొద్దుతిరుగుడు ఉత్పత్తులు, తృణ ధాన్యాలు ఎక్కువ శాతం తీసుకుంటే మంచిది. చర్మ సంరక్షణకి: సాధారణంగా అన్ని సౌందర్య ఉత్పత్తుల తయారిలోనూ విటమిన్ ఈ ని వాడతారు. ఫ్రీ రాడికల్స్ తో పోరాడే శక్తి దీనిలో ఎక్కువగా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారు విటమిన్ ఈ ని తీసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది. విటమిన్ ఈ కాప్సుల్ ని మొహానికి రాసుకుని పావుగంట తర్వాత మొహం కడుకుంటున్నా మోహంలో నిగారింపు వస్తుందిట. యాంటి ఆక్సిడెంట్: దీనిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి. కేన్సర్ కారకాలను దూరం చేస్తాయి. రోగానిరోధకశక్తిని పెంచుతాయి. మతిమరపు సమస్య కూడా దూరం అవుతుంది. కంటి చూపు స్వస్థతకి కూడా ఉపయోగపడుతుంది. రక్తకణాల వృద్ధి కోసం: విటమిన్ ఈ తీసుకోవటం వల్ల ఒంట్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రక్త నాళాలలో రక్తం ముద్దగా కాకుండా చూసుకుంటుంది. అంతేకాదు మెనోపాజ్ స్టేజ్ లో మహిళలకు వచ్చే సమస్యలని కూడా తగ్గిస్తుందిట. కీళ్ళ నొప్పులకు: ఈ రోజుల్లో ఈ కీళ్ళ నొప్పులు అందరిలోనూ కామన్ అయిపోయాయి. దీనికి ప్రధాన కారణం విటమిన్ ఈ లోపించటమే. విటమిన్ ఈ ఈ నొప్పులను తగ్గించటమే కాదు కండరాలని కూడా ద్రుఢ పరుస్తుంది. వయసు పైబడుతున్నవారు విటమిన్ ఈ ని ఎక్కువగా తీసుకోవాలాట. అది ఎదిగే పిల్లలకు కూడా ఎంతో అవసర పడుతుందని చెప్తున్నారు నిపుణులు. ఆలివ్ నూనెలో, ఆకుకూరల్లో, పోద్దుతిరుగుడులో, నట్స్ లో, గుమ్మడికాయలో, చిలకడదుంప లో, రాక్ ఫిష్ లో, బొప్పాయి వంటి వాటిలో విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది. చక్కగా ఇవన్ని తిని ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ హాపీగా జీవిద్దాం. - కళ్యాణి
read moreఅమ్మో! అమీబియాసిస్
వర్షాకాలం వచ్చిందంటే చాలు నానారకాల క్రిములూ మన మీద దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. తినే తిండిలోనూ, పీల్చేగాలిలోనూ తిరుగుతూ మనకి ఎప్పుడు హాని తలపెడదామా అని ఎదురుచూస్తుంటాయి. అలాంటి వ్యాధులలో ఒకటి అమీబియాసిస్. అమీబియాసిస్ను చాలామంది తేలికగా కొట్టిపారేస్తుంటారు కానీ, దీనిని అశ్రద్ధ చేస్తే కలిగే ఉపద్రవం అంతా ఇంతా కాదు. ఇదీ కారకం! ఏక కణ జీవి అయిన Entamoeba histolytica ద్వారా అమీబియాసిస్ సోకుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తుల మలంలో సదరు జీవి తాలూకు అవశేషాలు నెలల తరబడి సజీవంగా ఉంటాయి. అలాంటి మలం నీటిలో కలిసినప్పుడు కానీ, కూరగాయల వంటి ఆహారపదార్థాలను తాకినప్పుడు కానీ.. వాటితో పాటుగా మనిషి శరీరంలోకి ప్రవేశిస్తాయి. దాడి ఇలా సాగుతుంది... శరీరంలోకి ప్రవేశించిన అమీబా ముందు జీర్ణాశయంలో తన స్థావరాన్ని ఏర్పరుచుకుంటుంది. నిదానంగా పెద్ద పేగులలోకి చేరుకుంటుంది. అక్కడి వరకూ ఫర్వాలేదు కానీ ఒకవేళ పెద్దపేగులను కూడా దాటుకుని రక్తంలోకి కలిస్తే మాత్రం ఉపద్రవమే! ఎందుకంటే రక్తంలోకి కలిసిని అమీబా, ఆ ప్రవాహంతో పాటుగా ప్రయాణిస్తూ, శరీరంలోని అవయవాలలో వేటి మీదైనా దాడి చేసే అవకాశం ఉంది. కాలేయం మొదలుకొని మెదడు వరకూ అమీబియాసిస్ ఏ అవయవాన్నైనా పాడు చేసేయవచ్చు. పసిగట్టేదెలా? సాధారణంగా అమీబియాసిస్ సోకినవారిలో ఓ 10 శాతం మందిలోనే ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. వారం నుంచి నెలరోజుల లోపే ఈ లక్షణాలు బయటపడతాయి. కడుపులో నొప్పి, విరేచనాలు ఈ వ్యాధిలో బయటపడే ఇబ్బందులు. ఒకోసారి అమీబా పెద్దపేగులను గాయపరిచినప్పుడు, రక్తంతో కూడిన విరేచనాలు కూడా ఏర్పడవచ్చు. పరీక్ష- చికిత్స అనుభవజ్ఞులైన వైద్యులు, మనం చెప్పే లక్షణాలను బట్టి అమీబియాసిస్ సోకినట్లుగా పసిగట్టేస్తారు. మరికొన్ని సందర్భాలలో మల పరీక్ష అవసరం కావచ్చు. ఒకోసారి వ్యాధిని నిర్ధారించేందుకు రక్తపరీక్ష కూడా అవసరం అవుతుంది. మన శరీరంలో అమీబా ఉనికిని బట్టీ, అది వ్యాపించిన తీరుని బట్టి, కలిగిస్తున్న లక్షణాలను బట్టి... చికిత్స ఉంటుంది. మెట్రోనిడజోల్ వంటి చవకైన మందులకి అమీబియాసిస్ లొంగిపోతుంది. అయితే అమీబా కనుక కాలేయం వంటి అవయవాలని పాడుచేసి ఉంటే ఒకోసారి చికిత్స కూడా అవసరం కావచ్చు. నివారణే మార్గం! మనం ఎంతో తేలికగా కొట్టిపారేసే అమీబియాసిస్ ఒకోసారి మరణానికి కూడా దారితీయవచ్చు. ఏటా దాదాపు లక్షమంది అమీబియాసిస్ కారణంగా చనిపోతున్నారని తెలిస్తే, ఇదేమంత ఆషామాషీ వ్యవహారం కాదని తేలిపోతుంది. అసలే అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలలోనే ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. పైగా అమీబియాసిస్ సోకిన తరువాత ఒకోసారి సంవత్సరాల తరబడి దాని తాలూకు ప్రభావం కనిపించవచ్చు. అందుకని అమీబియాసిస్ వచ్చాక బాధపడేకంటే పారిశుద్ధ్యం సరిగా లేని సందర్భాలలో, ముఖ్యంగా నీరూ ఆహారమూ కలుషతం అయ్యే వర్షాకాలంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచింది. - నీటిని ఎడాపెడా ఎక్కడపడితే అక్కడ తాగేయకూడదు. కాచి చల్లార్చిన తరువాతనో, ఫిల్టర్ చేసుకున్న తరువాతనో తాగాలి. ఇలాంటి అవకాశం లేని ప్రయాణాల వంటి సందర్భాలలో మినరల్ వాటర్ మీద ఆధారపడక తప్పదు. - పండ్లు, కాయగూరల వంటి పదార్థాలని శుభ్రంగా కడిగి లేదా చెక్కు తీసి వాడుకోవాలి. - వర్షాకాలంలో పాలు కూడా కలుషితం అయ్యే అవకాశం ఉంది కాబట్టి... డెయిరీ నుంచి కొనుక్కునే పాశ్చురైస్డ్ పేకెట్ పాలని వాడాలి. లేదంటే కనీసం పాలని బాగా మరిగించి ఉపయోగించాలి. - బయట ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పానీపూరీతో పాటుగా ఇచ్చే నీళ్లు, చట్నీలలో కలిపే నీళ్లు, జ్యూసులలో కలిపే ఐస్.... ఇలాంటివన్నీ కూడా అమీబాని మనకు అంటించగలిగే సాధనాలే అని గుర్తించాలి. అన్నింటినీ మించి... వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పి వంటి లక్షణాలు ఒకటి రెండు రోజులకి మించి విడవకుండా ఉంటే తప్పకుండా వైద్యుని సంప్రదించాలి. - నిర్జర.
read moreమీ ఇల్లు శుభ్రంగా ఉన్నాకూడా ఇది ఉంటే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది....!
మన ఇంట్లో మనకు తెలియకుండా హానిచేసే ఎన్నో కాలుష్య కారకాలుంటాయట. ఒక ఏజెన్సీ నివేదిక ప్రకారం, సుమారు 12 రకాల హానికారక కెమికల్స్ తో మనం నిత్యం సహజీవనం చేస్తామట. బయటి కంటే అయిదు రెట్లు హానికారక కెమికల్స్ మన ఇంట్లో ఉంటాయి అంటే నమ్మగలరా? ఆస్తమా లాంటి జబ్బులకి ఇంటి లోపలి కాలుష్యమే కారణమట. ఇందుకు సంబంధించి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=C8tNTxqY0yM
read moreపేరంటంలో శనగలే ఎందుకు! (శ్రావణ శుక్రవారం స్పెషల్)
శ్రావణ మాసం వచ్చిందంటే చాలు నోములు, వ్రతాలతో ప్రతి ఇల్లూ కళకళలాడిపోతుంటుంది. వీటిని ఆచరించడం కుదరనివారూ, ఆసక్తిలేనివారు కూడా ఎవరన్నా పేరంటానికి పిలస్తే వెళ్లి తాంబూలాన్ని అందుకుంటారు. ఆ పేరంటాలలో నాయకత్వమంతా శనగలదే! ఇక వరలక్ష్మివ్రతంలో అమ్మవారికి శనగపప్పుతో చేసే పిండివంటలను నివేదిస్తారు. ఇన్ని రకాల ధాన్యాలు ఉండగా శనగలకే ఎందుకంత ప్రాముఖ్యత అని తరచి చూస్తే ఎన్నో విషయాలు స్ఫురిస్తాయి. శనగలని పండించడంలో వేల సంవత్సరాలుగా మన దేశానిదే తొలి స్థానం. సింధునాగరికతకు సంబంధించిన తవ్వకాలలో కూడా శనగలు బయటపడ్డాయి. వేల సంవత్సరాలకు పూర్వమే ఇతరదేశాలకు శనగలను ఎగుమతి చేసిన ఘనత మనది. కానీ వాటిని జీర్ణం చేసుకోవడం అంత సులభం కాదు. శనగలను అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరంగా ఉండటం అందరికీ అనుభవమే. ఇక జీర్ణశక్తి సరిగా లేనివారు శనగపిండికి కూడా దూరంగా ఉంటారు. కందిపప్పు, పెసరపప్పులాగా శనగపప్పుతో కూడా పప్పుని వండుకోవచ్చు కానీ, అజీర్ణానికి భయపడి మనం సాహసించం. నిజానికి శనగలలో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవేమో! ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాల చిట్టా చాలా పెద్దది. మెదడుని చురుగ్గా ఉంచే మాంసకృత్తులు, శరీరానికి శక్తినిచ్చే పిండిపదార్థాలు కూడా శనగలలో పుష్కలంగా ఉంటాయి. అందుకే నవగ్రహాలలో ఒకటైన బృహస్పతిని శాంతింపచేసేందుకు, శనగలను దానం చేయాలని చెబుతారు. జ్యోతిషరీత్యా మేథస్సుకీ, విద్యకీ కారకుడైన బృహస్పతికి తగిన పోషకాలు అందిచగలిగేది శనగలే కదా! ప్రాచీన వైద్య విధానంలో కూడా శనగలది గొప్ప పాత్ర. చక్కెర వ్యాధికీ, కిడ్నీలో రాళ్లకీ శనగలు మేలు చేస్తాయని ఇప్పటి పరిశోధనల్లో కూడా తేలింది. శనగలలో ఉండే పోషకాలు పశువులకి కూడా ఉపయోగమే! శనగలని ఆహారంగా అందించినప్పుడు గేదెలలో పాలదిగుబడి ఎక్కువయ్యిందట. ఇన్ని ఉపయోగాలు ఉన్నా కూడా ఇతర పప్పుధాన్యాలతో పోలిస్తే శనగలు చాలా చవకగానే దొరుకుతాయి. అందుకనే కొన్నాళ్ల క్రితం కందిపప్పు ధరలు విపరీతంగా పెరిగిపోయినప్పుడు సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే, కందిపప్పు బదులు శనగపప్పుని వంటలో వినియోగించుకోమని ప్రకటనలు రూపొందించింది. అతి తక్కువ ధరలో అత్యధిక పోషకాలను అందించే శనగలను మనం ఎలా ఉపేక్షించగలం. వంటల్లోకి ఎలాగూ అంతగా వాడుకోం. కాబట్టి వాటిని నానబెట్టి కానీ, నానబెట్టినవాటిని సాతాళించుకుని కానీ తింటే బోలెడు ఉపయోగం. విడిగా ఎలాగూ మనం ఆ పని చేయం కాబట్టి శ్రావణమాసంలోని పేరంటాల సమయంలోనైనా శనగలని వినియోగిస్తుంటాం. శ్రావణ మాసంలో చలి, వేడి సమంగా ఉంటాయి. అలాంటి వాతావరణం కూడా శనగపప్పుని జీర్ణం చేసుకునేందుకు అనువుగా ఉంటుంది. అందుకనే శనగపప్పుతో చేసే పూర్ణంబూరెలు, కుడుములు వంటి పదార్థాలను కూడా అమ్మవారికి నైవేద్యంగా అందిస్తారు. ఇలాంటి సూక్ష్మమైన ఆరోగ్యసూత్రాలను వందల సంవత్సరాలకు పూర్వమే సంప్రదాయాలతో మిళితం చేసిన మన పూర్వీకుల మేథ అమోఘం కదా!!! - నిర్జర.
read moreకళకళలాడే యాలకులు...
యాలకుల టీ ఘుమఘుమలాడుతూ ఎంత రుచిగా ఉంటుందో కదా! అసలు ఇలాయిచికి ఉండే రుచే వేరబ్బా. స్వీట్ ఏదైనా సరే దానితో ఇలాయిచి పౌడర్ కలిస్తే చాలు దాని రుచి రెండింతలవుతుంది. పాయసంలో, టీలో, కిళ్ళీ లో, లడ్డూలో ఇలా చెప్పుకుంటూ పోతే దాని రుచి మాత్రం కంపల్సరిగా అన్నిటిలో ఉండాల్సిందే కదా. కేవలం రుచి కోసం మాత్రమే ఈ యాలకులు వాడతారు అనుకుంటే మాత్రం ముమ్మాటికి పొరపాటు పడ్డట్టే. ఇందులో విశేష ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా మన డైజేస్టివ్ సిస్టంకి ఇది ఎంతో మేలు చేస్తుంది. నోటి దుర్వాసన, ఇండైజిషన్, వోమిటింగ్స్ ఇలాంటి వాటిని కూడా దూరం చెయ్యగలదు. యాలకుల నుంచి వచ్చే నూనే కూడా అద్భుతాలు చెయ్యగలదు. అరోమా థెరఫీలో దీనికో ప్రత్యెక స్థానం ఉందిట. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఈ నూనే రాస్తే సెప్టిక్ కాకుండా కాపాడే గుణాలు ఉన్నాయని చెప్తున్నారు పరిశోధకులు. ఈ నూనే వాసన పీలిస్తే చాలు అలసట తగ్గటమే కాకుండా మంచి రిలీఫ్ వస్తుందిట. ఇది త్రోట్ ఇన్ఫెక్షన్ కి కూడా మంచి మందుగా పనిచేస్తుంది. ఇంకా ఇంకా ఈ యాలకులని దేనికి వాడచ్చో చూద్దామా. * పిల్లలలో వచ్చే కడుపునొప్పి,ఇండైజిషన్ కి వాముతో పాటు యాలకులు వాడచ్చు. * యాలకులు కషాయంలా చేసి నోట్లో పుక్కలిస్తే దంతాలు,చిగుళ్ళ బాధలు తగ్గుతాయట. * తినే ఆహార పదార్థాల పైన యాలకుల నూనే చల్లితే పిల్లలకు మంచిదని చైనీయులు విశ్వసిస్తారు. * యాలకుల ద్వారా కాల్షియం కూడా పుష్కలంగా లభిస్తుందిట. * వీటిని పొడి చేసి ఆ పొడితో పళ్ళు తోముకుంటే పళ్ళ మీదున్న ఎలాంటి మరకలనైనా పోగొట్టి తళతళ మెరిసేలా చేస్తుందిట. చూసేందుకు చిన్నగా తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పువ్వుల్లా కనిపించే యాలకులు అందించే లాభాలు ఎన్నో, అందుకే అనాలి వాహ్ ఇలాయిచి వాహ్! -కళ్యాణి
read moreఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటీ..?
ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఫుడ్ అన్న మాట విస్తృతంగా వినిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కూరగాయలను, పండ్లను పండించేటప్పుడు ఎదుగుదల కోసమో, క్రిములను నాశనం చేసేందుకనో విపరీతంగా క్రిమిసంహారక మందులు వాడుతున్నారు. అయితే ఎలాంటి పురుగు మందులు ఉపయోగించకుండా కేవలం సేంద్రియ ఎరువులతో పండించినవే ఆర్గానిక్ ఫుడ్. మరి ఈ రకమైన ఆహార పదార్ధాలను తినడం వల్ల కలిగే లాభాలేంటీ..? https://www.youtube.com/watch?time_continue=1&v=lsQH29XE2iI
read moreValue of Maintain Healthy Diet...!
ప్రొటీన్స్ అనేవి మన ఆహారంలో తీసుకోవాల్సిన ముఖ్యమైన న్యూట్రీషియన్స్. మోడరన్ లైఫ్ స్టైల్ లో ప్రొటీన్ శాతం డైట్ లో ఉండేలా చేసుకోవడం ఖచ్చితం. కండరాల పటుత్వం పెంచుకోవాలనుకున్నా, బరువు తగ్గాలనుకున్నా, ప్రొటీన్ లెవెల్స్ సరైన మోతాదులో తీసుకోవాలి. ఇంతకీ ప్రొటీన్ల ఆవశ్యకత శరీరానికి ఎంతో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=IZL1JYO0o24
read moreగాంధీగారి మేకపాలు కథ
మహాత్మాగాంధి సిద్ధాంతాలతో కొందరు అంగీకరించవచ్చు, లేదా విభేదించనూవచ్చు. కానీ స్వాతంత్ర్య సంగ్రామంలో ఆయన పాత్రని ఎవరూ కొట్టిపారేయలేరు. అహింసని సైతం ఒక ఆయుధంగా మార్చిన తీరుని మర్చిపోనూలేరు. తను ఏర్పరుచుకున్న నియమాల పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతే గాంధీగారిని మిగతావారికంటే భిన్నంగా నిలిపిందన్నది వాస్తవం. అది సత్యాగ్రహం కావచ్చు, అహింసా సిద్ధాంతం కావచ్చు. ఆయన జీవనశైలిని గమనిస్తే ఇలాంటి నియమాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో ఒకటి మేకపాలు తాగడం! ఎవరు ఎగతాళి చేసినా కూడా గాంధీగారు మేకపాలు మానేవారు కాదు. ఇంతకీ గాంధీగారు మేకపాలు తాగడం వెనుకనున్న కథ ఏమిటో, అసలు మేకపాలంటే కొందరికి ఎందుకంత అభిమానమో చూద్దాం... మాటకు కట్టుబడి! గాంధీ ఒకప్పుడు పూర్తిగా శాకాహారానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా మాంసమే కాకుండా ఇతర జంతువుల నుంచి వచ్చే పాలని కూడా ఆయన ముట్టుకోవడం మానేశారు. ఇలా ఒక ఆరేళ్లపాటు పాలకి దూరంగా ఉన్నారు కూడా! అయితే 1917లో ఆయనకు తీవ్రమైన అతిసార వ్యాధి పట్టుకుంది. మనిషి నీరసంతో కృశించిపోయాడు. అలాంటి స్థితిలో పాలు చాలా మేలు చేస్తాయని అందరూ సూచించినా, తన పాత నిర్ణయానికి కట్టుబడి ఆయన పాలని ముట్టుకోలేదు. ఒక ఐడియా! గాంధీగారి పరిస్థితి చూసిన ఒక వైద్యుడు ఓ ఉపాయాన్ని సూచించాడు. ‘మీరు పాలని ముట్టుకోను అని నిర్ణయించుకున్నప్పుడు మీ మనసులో ఆవు లేదా గేదె పాలే మెదిలి ఉంటాయి కదా! అలంటప్పుడు మీ మాటని కాస్త సడలించి మేక పాలుని తీసుకోవచ్చు కదా!’ అన్నాడు. దీన్ని గాంధీగారి భార్య కస్తూరిబాయి కూడా సమర్థించడంతో, అప్పటి నుంచీ ఆయన మేకపాలని తీసుకోవడం మొదలుపెట్టారు. నిజానికి గాంధీగారి దృష్టిలో పాలు అంత ఆరోగ్యకరం కాదు. వాటిద్వారా సదరు జంతువులలో ఉండే రోగకారకాలన్నీ మనకు అంటుకుంటాయని ఆయన అభిప్రాయం. అయితే శాకాహారులకు పూర్తిస్థాయి పోషకాలు అందాలంటే పాలు తప్ప మరో గత్యంతరం లేదని ఆయన తరువాత రోజుల్లో ఒప్పుకొనేవారు. మేకపాలు ప్రత్యేకమేనా! గాంధీగారు మేకపాలు తాగడం మాట అటుంచి, చాలామంది నిపుణులు గేదెపాలకంటే మేకపాలు శ్రేష్టమని వాదిస్తున్నారు. వారి వాదనల ప్రకారం మేకపాలలో చాలా సుగుణాలే ఉన్నాయి. - ఆవు/గేదెపాలకంటే మేకపాలలోని కొవ్వుకణాలు చిన్నగా ఉంటాయట. అందుకని ఇవి మిగతా పాలకంటే సులభంగా జీర్ణమవుతాయి. - కొందరికి పాలు సరిపడవు. కారణం! వాటిలో ఉండే లాక్టోజ్ అనే పదార్థం. మేకపాలలో లాక్టోజ్ చాలా తక్కువ స్థాయిలో ఉండి పెద్దగా ఇబ్బందిని కలిగించదు. కేవలం లాక్టోజే కాదు. పాలల్లో ఉండే ‘A1 కేసిన్’ అనే మాంసకృత్తుల వల్ల చాలామందికి జీర్ణసంబంధమైన వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. అయితే మేకపాలలో ‘A1 కేసిన్’ బదులు ‘A2 కేసిన్’ ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో జీర్ణసంబంధమైన ఇబ్బందులు దరిచేరవు. - గేదెపాలకంటే మేకపాలలోనే ఎక్కువశాతం ఖనిజాలు లభిస్తాయి. ఇక విటమిన్లు, కొవ్వు సంగతి చెప్పనే అక్కర్లేదు. మేకపాలు మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని పెంచుతాయంటున్నారు నిపుణులు. - మేకపాలలో ఎక్కువ పోషకాలు ఉండటమే కాదు. ఇతర పాలతో పోలిస్తే ఈ పోషకాలని మన శరీరం మరింత సులువుగా గ్రహించగలదట. - మేకపాలలో విటమిన్ A ఎక్కువగా ఉండటం వల్ల చర్మానికి కాంతినీ, మృదుత్వాన్నీ తీసుకువస్తుందట. పైగా చర్మానికి హాని కలిగించే బ్యాక్టీరియాను కూడా నివారించే శక్తి దీనికి ఉంది. అందుకనే కొంతమంది మేకపాలని చర్మానికి నేరుగా రాసుకుంటారు. మేకపాలతో చేసిన సబ్బులకు కూడా మంచి ఆదరణ ఉంది. - శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే సెలేనియం అనే ఖనిజం మేకపాలలో ఎక్కువగా ఉంటుంది. జుట్టు మొదలుకొని థైరాయిడ్ వరకూ ఈ సెలేనియం మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందట. ఇలా ఒకదాని తరువాత ఒకటిగా మేకపాల ప్రత్యేకతలు చాలానే కనిపిస్తాయి. గాంధీగారు చెప్పారని కాదు కానీ ఇప్పటికీ చాలామంది మేకపాలను మిగతా పాలతో సమానమైన విలువ కలిగనివా భావిస్తారు. ఇంత చదివిన తరువాత మేకపాల గురించి ఎలా ఎగతాళి చేయగలం! - నిర్జర.
read moreచెప్పులు శుభ్రంగా ఉంటే ఒబెసిటీ రాదు..
వినడానికి వింతగా ఉంది కాదూ! కానీ ఇదెవ్వరో దారిన పోయే దాన్నయ్య చెప్పిన మాట కాదు... పోర్చుగల్లో కొంతమంది పరిశోధకులు తేల్చిన విషయం. మనలో చాలామందిలో ఒళ్లు పెరిగిపోవడానికి కారణం- శారీరక శ్రమ తక్కువగా చేస్తూ, ఎక్కువ కెలోరీలు ఉన్న ఆరాహాన్ని తీసుకోవడం అని తెలుసు. కానీ ఈమధ్యకాలంలో ఒబెసిటీకి మరో కారణం కూడా కనుగొన్నారు. అదే obesogens! ఇవి మన శరీరంలో కొవ్వుని ప్రభావితం చేసే ఒక రకమైన కెమికల్స్. మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు ఈ obesogens పనితీరుని మార్చేస్తాయట. ఆహారపదార్థాలలో కనిపించే పెస్టిసైడ్స్, బ్యాటరీలలో ఉండే కాడ్మియం, బాత్రూం క్లీనర్లు, డియోడరెంట్లు... లాంటి నానారకాల కెమికల్స్ ఈ obesogens మీద పనిచేస్తుంటాయి. అలాగని వీటన్నింటికీ దూరంగా ఉండటం కష్టమే కదా! ఈ రోజుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ కెమికల్స్ మన చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. కానీ obesogensని తీవ్రంగా ప్రభావితం చేసే ఒక వస్తువుని మాత్రం మనం కంట్రోల్ చేయగలం. అదే చెప్పులు! చెప్పులతో మనం ఊరంతా తిరిగి వస్తాం. దాంతో వాటికి నానారకాల కెమికల్స్ అంటుకుని ఉంటాయి. చెప్పుల మీద పేరుకునే దుమ్ములో ఆ కెమికల్స్ భద్రంగా ఉంటాయి. అవి రకరకాల అనారోగ్యాలు ఎలాగూ కలిగిస్తాయి. ఇక obesogens మీద కూడా తమ ఎఫెక్ట్ చూపుతాయి. అందుకే చెప్పులని ఇంటి బయటే విడిచిపెట్టేయాలనీ, వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలనీ పోర్చుగల్ పరిశోధకులు సూచిస్తున్నారు. ఇంట్లో దుమ్ముని కూడా ఎప్పటికప్పుడు దులిపేయడం, కార్పెట్లులాంటివి వాడకపోవడం వల్ల కూడా కెమికల్స్ పేరుకోకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు. https://www.youtube.com/watch?v=clFCJAz2o_0 - Nirjara
read moreఆరోగ్యం బాగుండాలా! కాసేపు చెప్పులు తీసి నడవండి...
ఇంట్లో ఏ కరెంటు వస్తువు ఉన్నా... అది votage fluctuationsని తట్టుకోవాలంటే ఒక ఎర్త్ వైర్ పెడతారు. మరి మన body పరిస్థితి ఏమిటి? మన శరీరం కూడా ఒక బ్యాటరీలాంటిదే కదా! అందులో ప్రతి అవయవం పనిచేయడానికి ఎంతో కొంత విద్యుత్తు అవసరమేగా. అందుకే నేలతో శరీరానికి నేరుగా సంబంధం ఉంటే... ఒంట్లో వైబ్రేషన్స్ కూడా perfectగా ఉంటాయని చెబుతున్నారు. Earth నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడానికైనా, మన ఒంట్లో అధికంగా ఉన్న నెగెటివ్ వైబ్రేషన్స్ను వదిలించుకోవడానికైనా... చెప్పులు లేకుండా కాసేపు నేల మీద నడవడం మంచిదని సూచిస్తున్నారు. ఒకప్పుడు నేల మీద చెప్పులు లేకుండానే నడిచేవారు. రాత్రిపూట కూడా నేల మీదే పడుకునేవారు. దాని వల్ల భూమితో శరీరానికి నేరుగా సంబంధం ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. ఇంట్లో కూడా చెప్పులు వేసుకునే తిరిగేస్తున్నారు. బయటకి వెళ్లినా ప్లాస్టిక్ లేదా రబ్బర్ చెప్పులు వేసకుంటున్నారు. ఇవి నేల నుంచి శరీరంలోకి ఎలాంటి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటాయి. కాళ్లకి ఎలాంటి అడ్డూ లేకుండా నేల మీద నడవడాన్ని Grounding అని పిలుస్తారు. కేవలం Groundingతోనే రోగులను నయం చేసే Earthing Therapy అనే ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు పాపులర్ అవుతోంది. ఈ ధెరపీతో చాలా రకాల సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. - Grounding వల్ల ఒంట్లో వాపు, నొప్పిలాంటి సమస్యలన్నీ తీరిపోతాయట. ఒక నాలుగువారాల పాటు ఇలా నడిస్తే... వెన్నునొప్పి, మోకాలి నొప్పులు, పొద్దున పూట కీళ్లు పట్టేయడం లాంటి సమస్యలలో మంచి రిలీఫ్ కనిపించినట్లు రీసెర్చ్లో తేలింది. - Grounding వల్ల stress కూడా చాలావరకు తగ్గిపోతుందని తెలిసింది. మన శరీరంలో cortisol అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోనుని గమనిస్తే, ఒంట్లో ఎంత stress ఉందో తెలిసిపోతుంది. నేల మీద పాదాల ఉంచి నడవటం వల్ల ఈ cortisol చాలావరకు తగ్గిపోయిందట. - Grounding వల్ల blood circulation మెరుగుపడుతుందని చెబుతున్నారు. Blood circulation బాగుంటేనే మన ఒంట్లో ప్రతి అవయవానికీ సక్రమంగా ఆక్సిజన్, విటమిన్స్ అందుతాయి. దాంతో చర్మం దగ్గర నుంచి గుండె దాకా అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. - భూమిలో లెక్కలేనన్ని electrons, antioxidants ఉంటాయి. చెప్పులు లేకుండా నడవటం వల్ల ఇవి మన శరీరానికి నేరుగా అందుతాయి. చూశారుగా! Grounding వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అందుకే రోజుకి ఒక అరగంటసేపన్నా... గడ్డి, నేల, ఇసుక ఉన్న ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడిచి చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. - Nirjara
read moreRock Salt వాడి చూడండి – జీవితం మారిపోతుంది
ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే పసిపిల్లవాడు కూడా సముద్రం నుంచి అని ఠక్కున చెప్పేస్తాడు. కానీ గనుల నుంచి కూడా ఉప్పు దొరుకుతుందని చాలామందికి తెలియదు. దీనినే రాతి ఉప్పు- రాక్ సాల్ట్ అని పిలుస్తారు. రాళ్ల ఉప్పులో చాలా ఖనిజాలు ఉంటాయి. వీటితో సాధారణ ఉప్పు వల్ల ఏర్పడే చెడు ఫలితాలు రావు సరికదా... ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అవేంటో ఓసారి మీరే చూడండి... - ఉప్పు అనగానే మనకి బీపీనే గుర్తుకి వస్తుంది. సాధారణ ఉప్పులో ఎక్కువగా ఉండే సోడియం వల్ల, మన రక్తపోటు పెరిగిపోతుంది. కానీ రాక్ సాల్ట్ అలా కాదు. సాధారణ ఉప్పుతో పోల్చుకుంటే- ఇందులో సోడియం క్లోరైడ్ తక్కువగా ఉండి, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఉప్పుని వాడితే రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది. - రాతి ఉప్పులో 80కి పైగా ఖనిజాలు ఉంటాయని చెబుతున్నారు. అందుకని ఈ ఉప్పుని తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి, ఎలాంటి వ్యాధులూ మన దగ్గరకి రావని హామీ ఇస్తున్నారు. - అజీర్ణానికి ఉపయోగించే చాలా ఎంటాసిడ్స్లో మెగ్నీషియం ఉంటుంది. రాతి ఉప్పులోనూ మెగ్నీషియం ఉంటుంది. కాబట్టి ఇది ఒక నేచురల్ ఎంటాసిడ్లా పనిచేస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. గ్యాస్ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉంటే... కొంచెం రాతి ఉప్పుని, కాస్త జీలకర్రతో తీసుకుంటే సరి! - ఒంట్లో ఉన్న కఫాన్ని కరిగించేందుకు రాక్ సాల్ట్ అమృతంలా పనిచేస్తుంది. రాతి ఉప్పుని నీళ్లలో వేసుకుని పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి, పొడి దగ్గు, టాన్సిల్స్ వాపు తగ్గుతాయి. రాతి ఉప్పు వేసిన నీటిని ఆవిరి పట్టడం వల్ల సైనస్, ఆస్తమా, చెవి పోటు లాంటి తీవ్రమైన వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి. - రాతి ఉప్పుతో ఒళ్లు రుద్దుకోవడం వల్ల చర్మం మీద ఉన్న మలినాలన్నీ పోతాయి. ఇక ఒక చెంచాడు రాతి ఉప్పు నీళ్లో వేసుకుని స్నానం చేస్తే... ఎలాంటి ఒంటి నొప్పులైనా తగ్గిపోయి, హాయిగా నిద్ర పట్టేస్తుంది. - ఇప్పటి కూరగాయల్లో పెస్టిసైడ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయన్న విషయం తెలిసిందే! అందుకే వాటిని తరిగే ముందు రాతి ఉప్పు వేసిన నీటితో కడిగితే, కూరగాయల పై పొరల్లో ఉండే పెస్టిసైడ్స్ కొట్టుకుపోతాయని చెబుతున్నారు. - రాతి ఉప్పుతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. రక్తప్రసరణ మెరుగ్గా ఉంటే ఒంట్లో మెటబాలిజం కూడా బాగుంటుంది. దాని వల్ల మనిషి ఆరోగ్యంగా, చురుగ్గా పనిచేయగలుగుతాడు. ఇలాంటి శరీరంలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి. - డయాబెటిస్ ఉన్నవారు సముద్రపు ఉప్పుకంటే రాతి ఉప్పుని వాడటం మంచిదని సూచిస్తున్నారు. రాతి ఉప్పుని వాడటం వల్ల ఒంట్లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండి, ఇన్సులిన్ అవసరం కూడా తగ్గుతుందట. మన వంటల్లో రాతి ఉప్పు వాడటం వల్ల వాటి రుచి పెరుగుతుందే కానీ తగ్గదు. పైగా దీని ధర కూడా అందుబాటులోనే ఉంటుంది. మరి ఏ ఉప్పు వాడితే మంచిదో మీరే చెప్పండి! - నిర్జర.
read moreల్యాప్ టాప్ తో సంతాన లేమి
బ్రిటన్ లో ఓ జంటకి చాలాకాలంగా పిల్లలు పుట్టట్లేదు. 30 ఏళ్ల స్కాట్ రీడ్, పాతికేళ్ల లారా.. డాక్టర్ దగ్గరికెళ్లి అన్నిపరీక్షలూ చేయించుకున్నారు. మొగుడికి స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉందని తేలింది. అదికూడా సహజసిద్ధంగా ఉన్నది కాదు. ఎందువల్లో అతనికి స్పెర్మ్ కౌంట్ విపరీతంగా పడిపోతోందని డాక్టర్లు కనిపెట్టారు. రోజువారీ అలవాట్ల గురించి అడిగితెలుసుకున్నారు. అసలు విషయం బైటపడింది. శుక్రకణాలు బాగా తగ్గిపోవడానికి అసలు కారణం ల్యాప్ టాప్ ని తొడమీద పెట్టుకుని పనిచేయడమేనని తేలింది. ల్యాప్ టాప్ ని తొడమీద కాకుండా టేబుల్ మీద ఉంచి పనిచేసుకోమని డాక్టర్లు స్కాట్ కి సలహా ఇచ్చారు. కొన్నాళ్లపాటు గమనించి చూశాక స్మెర్మ్ కౌంట్ మాములుస్థాయికి పెరగడం కనిపించింది. అంతేకాదు.. అతి తక్కువ కాలంలో స్కాట్, లారాలు తల్లిదండ్రులుకూడా అయ్యారు. లారా పండండి మగ బిడ్డని ప్రసవించింది. అచ్చం తండ్రిలాగే ఉన్న పిల్లాడు తెగ అల్లరి చేసేస్తున్నాడుకూడా.. తమ అనుభవాన్ని అందరితోనూ పంచుకునేందుకు, ల్యాప్ టాప్ ని తొడమీద పెట్టుకుని పనిచేయడంవల్ల కలిగే అనర్ధాలగురించి వివరించి చెప్పేందుకు ఈ జంట పెద్దఎత్తున ఓ క్యాంపెయిన్ కి కూడా ప్లాన్ చేస్తోందట. ఏళ్లపాటు పిల్లలు పుట్టడానికి కారణం తెలీక అల్లాడి పోయిన స్కాట్, లారాలు చివరికి తమ దుస్థితికి కారణం ల్యాప్ టాప్ అన్న విషయాన్ని తెలుసుకుని తెగ నవ్వుకున్నారట.
read moreబబుల్గమ్ మింగితే ఏమవుతుంది?
బబుల్గమ్ని మింగితే అది కడుపులోనే ఉండిపోతుందన్నది చాలామంది నమ్మకం. పాశ్చాత్య దేశాలలో కూడా బబుల్గమ్ ఏడేళ్ల పాటు పొట్టలోనే ఉండిపోతుందని అనుకుంటారు. ఇది ఏమాత్రం వాస్తవం కాదంటున్నారు నిపుణులు. అలాగని అది అంత సురక్షితమూ కాదంటున్నారు. జీర్ణం కాని పదార్థాలు: బబుల్గమ్ని ఎంత నమిలినా కూడా అది కరగకపోవడానికి ముఖ్య కారణం అందులో ఉండే రెసిన్ అనే పదార్థం. మన పళ్లు ఈ రెసిన్ని నమిలినప్పుడు దాంతోపాటుగా ఉన్న చక్కెర వంటి పదార్థాలన్నీ కరిగిపోతాయే కానీ రెసిన్ మాత్రం అలాగే ఉండిపోతుంది. దాన్ని కనుక పొరపాటున నమిలేస్తే జీర్ణం చేసుకోవడం మన పేగుల తరం కాదు. అలాగని రెసిన్ మన శరీరంలో ఉండిపోతుందనుకుంటే పొరపాటే! మన శరీరంలో జీర్ణం కాని పదార్థాన్ని దేన్నైనా సరే, మన పేగులు నిదానంగా తోసుకుంటూ వెలుపలకి పంపేస్తాయి. అలా ఒక రోజులోనే మన కడుపులోకి చేరిన రెసిన్ మలం ద్వారా బయటకు వచ్చేస్తుంది. ప్రమాదం లేకపోలేదు: బబుల్గమ్ చాలా సందర్భాలలో బయటకి వచ్చేసే మాట నిజమే అయినా, కొన్ని అరుదైన సందర్భాలలో అది పేగులలో ఇరుక్కుపోవచ్చు. చీటికీమాటికీ బబుల్గమ్లను మింగేయడం, జీర్ణం కాని ఇతర నాణేలతో పాటుగా ఇది పొట్టలో పేరుకుపోవడం వంటి కారణాలతో ఇది పేగులలోనే ఉండిపోవచ్చు. అది ఒకోసారి కడుపులో నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలకు దారితీస్తుంది. అలాంటి సమయాలలో ఎండోస్కోపీ వంటి చిన్నపాటి ఆపరేషన్తో దీనిని తొలగిచాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త: బబుల్గమ్ మింగడం సంగతి అటుంచితే చీటికీమాటికీ దాన్ని నమిలేయడం ఏమంత క్షేమం కాదన్న వాదనలూ ఉన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ అలవాటు శృతిమించితే సమస్యలు తప్పవట. బబుల్గమ్లో ఉండే చక్కెర పదార్థాల వల్ల పళ్లు పుచ్చిపోవడం, అందులోని సార్బిటాల్ వల్ల విరేచనాలు, ఘాటు పదార్థాల వల్ల నోటిలో చర్మం దెబ్బతినడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయట. పైగా చిన్నపిల్లలు బబుల్గమ్ని తినేటప్పుడు నోరు కూడా తెరుస్తూ ఉంటారు. దీనివల్ల నోట్లోకి గాలి వెళ్లిపోయి అజీర్ణం కలుగుతుంది. - నిర్జర.
read moreHepatitis రావడానికి గల కారణాలు... తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
As soon as we hear about Hepatitis, we get scared thinking that it is a very big problem for Liver. But Hepatitis A and E are normal inflammation related to food infection during the rainy season says the Doctor..... https://www.youtube.com/watch?v=DrjW7UY9kyY
read moreఅవతలి వ్యక్తి జబ్బుని కూడా మెదడు పసిగట్టేస్తుంది!
మనిషి మెదడుకి ఉన్న సామర్థ్యం గురించి కొత్తగా చెప్పేదేముంది. సూపర్ కంప్యూటర్లని సైతం దాటేసే మెదడు శక్తి గురించి కొత్తగా వినేదేముంది. కానీ ఇన్ని విన్నా ఇంకా మెదడు గురించి ఏదో సరికొత్త విషయంతో ముందుకొస్తున్నారు పరిశోధకులు. తాజాగా వెలువడిన ఓ పరిశోధన ప్రకారం మన చుట్టూ ఉండేవారిలోని అనారోగ్యాన్ని మన మెదడు ఇట్టే పసిగట్టేస్తుందట. అలా అనారోగ్యం బారిన పడ్డవారి నుంచి కాస్త జాగ్రత్తగా ఉండమన్న హెచ్చరికలు జారీ చేస్తుందట. ఈ విషయంలో నిజానిజాలు తేల్చుకునేందుకు స్వీడన్కు చెందిన పరిశోధకులు ఓ ప్రయోగం చేశారు. ఇందులో భాగంగా కొందరికి, అంతగా హాని కలిగించని బ్యాక్టీరియాను ఎక్కించారు. ఆ బ్యాక్టీరియాను ఎదుర్కొనేందుకు సహజంగానే వారిలోని రోగనిరోధకశక్తి విజృంభించింది. ఒంట్లోకి చేరుకున్న బ్యాక్టీరియాను తరిమికొట్టే సమయంలో జలుబు, జ్వరం, నిస్సత్తువ లాంటి లక్షణాలు బయటపడ్డాయి. ఇలా వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తులని ఫొటోలు, వీడియోలు తీశారు. వారి వాసనలనీ ఒడిసిపట్టారు. వాటన్నింటినీ కొందరు సాధారణ వ్యక్తులకు చూపించి... వీరిలో ఎవర్ని చూస్తే మీకు దూరంగా ఉండాలనిపిస్తోంది అని అడిగారు. వందలాది ఫొటోల నుంచి వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తలు ఫొటోలను చూపించి- ‘వీరికి దూరంగా ఉండాలనిపిస్తోంది,’ అని జనం చెప్పారట. వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తుల తాలూకు వాసనని చూపించినప్పుడు కూడా ఇతరుల మెదడు చురుగ్గా ప్రతిస్పందించడాన్ని గమనించారు. మనకి దగ్గరగా ఉన్నవారిలో వ్యాధి లక్షణాలు ఉంటే వారిని మరింత జాగ్రత్తగా కాపాడుకునేందుకు, అపరిచితుల దగ్గర ఇలాంటి లక్షణాలు ఉంటే వారి నుంచి దూరంగా ఉండేందుకు మెదడు సమాయత్తమవుతోందన్నమాట! శరీరమంటే మనకి కేవలం పైకి కనిపించేది మాత్రమే కాదు! ఆ శరీరం సక్రమంగా పనిచేసేందుకు, రోగాల నుంచి తప్పించుకునేందుకు లోలోపల అసమానమైన యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. ఈ పరిశోధన అదే విషయాన్ని మరోసారి నిరూపించింది. - నిర్జర.
read more















.jpg)


.jpg)


.jpg)