|
Karthika Masam Splecial page
|
|
|
|
‘త్రి’ లోకాధిపతులు |
సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతుల చర్యలతో బ్రహ్మ బాగా కలతపడిపోతాడు . అలా బాధపడుతున్న బ్రహ్మ కళ్ళనుంచి అశ్రుబిందువులు రాలతాయి.అ బిందు సముహమ౦తా కలసి తేజోమయమైన రూపంగా ఏర్పడతాయి. అ రూపమే మహాశివుడిగా ఏర్పడుతుంది . శివుని రూపం తెల్లగా స్వచ్చమైన మంచులా వుంటుంది అలా కళ్ళముందు సాకారుడై నిలిచిన ఈశ్వరుడిని చూసి బ్రహ్మ మళ్ళీ ‘నీవెవరివ౦టు’ ప్రశ్నిస్తాడు .అప్పుడా శివుడు “లోకానికి సర్వశుభాల్ని చేకూర్చే మంగళప్రడినైన రుద్రుడంటారు నన్ను. సృష్టి చేసేందుకు పూనుకున్ననీకు సహాయపడదామని వచ్చాను” అంటాడు. |
 |
ఈలోగ విష్ణువు కూడా శివుని వద్దకు వచ్చి నమస్కరిస్తాడు.ఆయా కార్యాలు నిర్వహించేందుకు తమకు తామే నియమించుకున్నఈ ముగ్గురు ఉండే౦దుకు
అనువైన స్థావరాల కోసం ఆలోచిస్తూ ఉంటారు.అప్పుడా విష్ణువు బ్రహ్మ సరస్వతులకు సత్యలోకాన్ని, తానూ లక్ష్మిదేవి ఉండే౦దుకు వైకుంఠమును, శివపార్వతులు నివసించేందుకు కైలాసాన్ని నివాస యోగ్యంగా నిర్ణయిస్తాడు.
ఇందుకు బ్రహ్మ, శివుడు కూడా అంగీకరించి అ విధంగానే ఆయా లోకాలకు పయనమై అక్కడే స్థిరనివాసం ఏర్పరుచుకుంటారు. శివ పంచాక్షరీ మంత్రాన్నిజపిస్తూ వైకుంఠంలో విష్ణువు ఉంటే ,’ఓ౦ నమో నారాయణాయ’అనే మంత్రాన్ని జపిస్తూ శివుడు కైలాసంలో ఉంటాడు.ఇక బ్రహ్మదేవుడు ఓ౦కార రూపుడైన పరమేశ్వరుని ధ్యానిస్తూ సత్యలోకంలో కాపురం ఉంటూ ఇక్కడి నుంచి తన సృష్టికార్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు.
సృష్టి నిర్వహణలో భాగంగా తనకు సహాయంగా ఉ౦డే౦దుకు బ్రహ్మదేవుడు కొంతమంది ఉపబ్రహ్మలను సృజిస్తాడు . ఈ ఉపబ్రహ్మలలో ముఖ్యుడైన దక్షప్రజాపతికి అరవైనాలుగుమంది సంతానం కలుగుతుంది.ఈ సంతానంలో పదిమంది కుమార్తెలను కశ్యపుడికి ఇచ్చి వివాహం చేస్తాడు . అలా కశ్యపుని వివాహం చేసుకున్న వారిలో అదితి, దితి, వినత, స్వస, కద్రు, ముని, అరిష్ట ,మాతంగి, తామ్ర, ఇల, అనేవారు ఉన్నారు .
కశ్యపుడు , అదితులకు, ఇంద్రాదిదేవతలు జన్మిస్తే, దితికి రాక్షసులు , పుడతారు.కద్రువకు నాగులు , మునికి గంధర్వులు , అరిష్ట అచ్చరలు, మాతంగికి ఐరావతాదులు, తామ్ర, ఇలలకు పక్షులు ,వృక్షాలు తదితరాలు జన్మిస్తాయి .అదితి కడుపున పుట్టినవారంతా మంచి గుణాలతో త్రిమూర్తులను స్మరిస్తూ ఉంటారు . అందుకని స్వర్గపట్టణాన్ని వీరు ఉ౦డెందుకు నివాసయోగ్యంగా నిర్ణయిస్తారు. అంతేకదు! ఈ దేవతల్లో ఇంద్రుడిని స్వర్గాధిపతిగా నియమిస్తారు .అలాగే యజ్ఞయాగాదుల్లో హవిర్భాగాన్నితీసుకునే అధికారాన్నికూడా వీరికి కల్పిస్తారు . కానీ దితికి పుట్టిన వారంతా తామగుణంతో లోకాన్నికల్లోలపరిచే గుణం కలిగి ఉంటారు . అలాగే ఇతరుల బాగు చూసి అసూయతో వేగిపోతు అందర్ని తల్లడిల్ల చేస్తూ౦టారు .దా౦తో వీరికి అరణ్యాలు, కొ౦డగుహలు నివాసయోగ్యంగా ఏర్పాటు చేస్తారు . |
ఇంకా ఉంది..... |
|
|
|
|
|