పిచ్చి అభిమానం.. త్రిషను చంపేశారు..
on Jan 14, 2017
సంక్రాంతి పండుగకు ఏపీలో కోడి పందాలు ఎలా సాంప్రదాయమైన క్రీడగా భాలిస్తారో.. అలాగే తమిళనాడులో జల్లికట్టును తమ సాంప్రదాయ క్రీడగా భావిస్తారు. అయితే ఈ జల్లికట్టుపై కోర్టులో ఎప్పటినుండో వాదనలు జరుగుతున్న సంగతి కూడా విదితమే. ఇప్పుడు ఈ జల్లికట్టు వివాదం కాస్త హద్దుమీరినట్టే కనిపిస్తోంది. ఎద్దులను హింసించి, రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారంటూ జంతు ప్రేమికులకు సంబంధించిన సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు జల్లుకట్టు నిషేధానికి కారణమైన 'పెటా' సంస్థపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సంస్థకు ప్రచార కార్యకర్తలైన నటీనటులపై అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో హీరోయిన్ త్రిష.. ఇక లేరు' అంటూ కొందరు పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని త్రిషానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. తనను ఉద్దేశించి కొందరు చేస్తున్న పోస్టులు చూసి షాక్ అయ్యానని... స్మార్ట్ ఫోన్ లో ఈజీగా పోస్ట్ చేసే అవకాశం ఉందికదా అని... ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతారా? అంటూ అసహనం వ్యక్తం చేసింది. జల్లికట్టుకు వ్యతిరేకంగా తాను ఎన్నడూ మాట్లాడలేదని చెప్పింది. ఒక మహిళను, ఆమె కుటుంబాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించడం తమిళ సంప్రదాయమా? అని ప్రశ్నించింది. తమిళులం అని చెప్పుకోవడానికి మీరు సిగ్గుపడాలి అని మండిపడింది.