వైకాపా కాంగ్రెస్ లో కలిసిపోతుందా...?
Publish Date:Sep 13, 2012
Advertisement
వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పరిస్థితి ఇప్పుడు ముందుగొయ్యి వెనక నుయ్యిలా తయారయ్యింది. పార్టీని తిరిగి కాంగ్రెస్ లో విలీనం చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో జగన్ వర్గం నేతల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయ్యింది. వై.ఎస్ మీద అభిమానంతో కాంగ్రెస్ పార్టీని ముక్కతిట్లు తిట్టి జగన్ పక్షాన చేరినవాళ్లకు ఇప్పుడు పరిస్థితి అర్ధంకావట్లేదు. ఒకవేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయితే అప్పట్లో అంతగా తిట్టిపోసి బైటికొచ్చిన నేతలు ఇప్పుడు ఏముఖం పెట్టుకుని తిరిగెళ్లాలో అర్థం కావట్లేదు. వైఎస్సార్ సీపీ నిజంగా కాంగ్రెస్ లో కలిసిపోతే జగన్ కచ్చితంగా సీఎం అయి తీరతాడన్న నమ్మకంతో వేరేపార్టీలనుంచి వలసొచ్చి వైకాపాలో చేరుతున్న వాళ్ల పరిస్థితి దారుణాతి దారుణంగా తయారవుతుందన్న భయాలుకూడా విపరీతంగా పెరిగిపోతున్నాయ్. ఉన్నపార్టీలో కాస్త నిమ్మళంగానే ఉన్నా సీటుకోసం జగన్ పార్టీవైపుకి దూకుతున్న నేతలు తీరావచ్చాక చేతికి చిప్పే మిగులుతుందేమో అన్న భయంతో వణికిపోతున్నారు.
పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, జగన్ వర్గం నేతలు బజారునపడి అధికార వ్యామోహంతో నడిరోడ్డుమీద బలాబలాలు తేల్చుకుంటున్న తీరునుకూడా ప్రజలు నిశితంగా గమినిస్తూనే ఉన్నారు. పార్టీ ఇప్పటివరకూ సంస్థాగతంగా పటిష్టం కాలేదని వై.ఎస్ సతీమణి విజయలక్ష్మి బలంగా నమ్ముతున్నారని, అందుకే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే దిశగా ప్రకటనలు చేస్తున్నారనీ వైకాపా నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఉపఎన్నికల్లో వైకాపా సత్తాని చాటగలిగినా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం డొల్లతనం బైటపడుతుందన్న భయం పై స్థాయిలో గట్టిగానే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ నేతలుకూడా అనుకుంటున్నారు. వై.ఎస్ జగన్ మాత్రం తన సత్తాని కాంగ్రెస్ కి ఇంకా గట్టిగా రుచిచూపించాలన్న ఉబలాటంలోనే ఉన్నారని, విజయమ్మ సలహాకి మొగ్గుచూపడం లేదని మరో టాక్ కూడా గట్టిగా నడుస్తోంది. ఇప్పుడు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే ప్రజల్లో వ్యతిరేకతవస్తుందన్న భావనని జగన్ గట్టిగా వెలిబుచ్చుతున్నట్టు సమాచారం. జగన్ కి కుర్చీని కట్టబెట్టడానికి సోనియా నుంచి గట్టి హామీ వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ ని తిరిగి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే సబబని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి గట్టిగా అభిప్రాయపడుతున్నారని విశ్వసనీయ వర్గాల భోగట్టా..
http://www.teluguone.com/news/content/ysrc-will-be-merged-with-congress-24-17367.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





