చంద్రబాబు పేరిట ఉన్నది 31.97లక్షలే
Publish Date:Sep 13, 2012
Advertisement
వై.ఎస్ బతికుంటే, ఆయన ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉండుంటే “డబ్బున్నోళ్లలో చంద్రబాబుది నిజంగా చాలా నిరుపేద స్థితి” అంటూ చంద్రబాబు మీద కచ్చితంగా సెటైర్లేసేవాళ్లు. ఇప్పుడాయనకు ఆ పదవీలేదు. రాజకీయాలమీద అంత ఆసక్తీ లేదు. ఏదో కృష్ణా, రామా అనుకుంటూ, వీలైనప్పుడల్లా లంకపొగాకు చుట్ట కాల్చుకుంటూ తమిళనాడు గవర్నర్ గిరీలో హాయిగా సేదతీరుతున్నారు. రాజకీయాల్లో పారదర్శకంగా ఉండాలన్న ఆలోచనతో తాను నిజంగా తనపేరిట ఉన్న ఆస్తుల్ని ప్రకటించానని చంద్రబాబు గట్టిగానే చెబుతున్నారు. సింగపూర్ లో ఉన్న ఆస్తుల వివరాలు కూడా ప్రకటిస్తే బాగుండేదంటూ చురకలు వేస్తున్న ప్రతిపక్ష నేతలకు బాబు దీటుగానే సమాధానం చెబుతున్నారు. నిజంగా సింగపూర్ లో తనకు ఆస్తులున్నాయని నిరుపిస్తే మొత్తం ఆస్తులన్నీ, నిరూపించినవాళ్లకే రాసేస్తానని సవాల్ చేస్తున్నారు. ఏతావాతా చంద్రబాబు ఈసారి ప్రకటించిన ఆస్తుల వివరాలమీద ఓ లుక్కేస్తే .. కుటుంబం పేరిట ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.35.59 కోట్లు. చంద్రబాబు పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 31.97 లక్షలు. 1985 నుంచి 1992 మధ్య కట్టిన ఇల్లు, కొనుక్కున్న కారు చంద్రబాబు పేరుమీదే ఉన్నాయ్. బాబు భార్య భువనేశ్వరి పేరుమీదున్న ఆస్తుల విలువ రూ.24.57 కోట్లు. కుమారుడు లోకేష్ పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 6.62 కోట్లు. కోడలు బ్రహ్మణి పేరిట ఉన్న ఆస్తుల విలువ రూ. 2.09 కోట్లు.
http://www.teluguone.com/news/content/chandrababu-naidu-declares-assets-24-17365.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





