Publish Date:Jul 18, 2025
ఏపీలో మాజీ సీఎం జగన్ పేరు తరచూ వినిపిస్తూనే ఉంటుంది. తన తండ్రి మరణించినప్పటి నుంచీ ఆయన ఏదో ఒక రూపంలో రాజకీయం చేస్తూ జనం నోళ్లలో నానుతూనే వస్తున్నారు. ఓదార్పు యాత్రలు, పాదయాత్రలు, ఇలా రకరకాలుగా హల్ చల్ చేస్తూనే వచ్చారు. అధికారంలోకి వచ్చాక అయ్యగారి అసలు స్వరూపం బయట పడింది. ప్రజావేదిక కూల్చివేతతో మొదలు పెట్టిన జ.. గన్ తర్వాత రాష్ట్ర రాజధాని నిర్మాణం నుంచి మొదలు పెడితే ఆర్ధిక పరిస్థితి చిందర వందర గందరగోళం చేయడం వరకూ ఆ రూటే సపరేటు.
క్విడ్ ప్రో కో అనే కొత్త విధానం ద్వారా ఏకంగా లక్ష కోట్ల అవినీతికి తెరలేపిన జగన్ తర్వాతి కాలంలో ఇవే కేసులతో జైలుకెళ్లి 16 నెలలు ఉన్నారు. బయటకొచ్చాక.. ఏపీ లో అనేకరకాల రాజకీయం చేసి.. అధికారం చేపట్టారు. ఆపై కొన్ని వందల కోట్ల రూపాయల మేర అవినీతి కార్యకలాపాలకు పాల్పడి.. భారీ ఎత్తున వెనకేసినట్టు చెబుతారు. శాండ్ వైన్ మైన్ అంటూ రంగమేదైనా రాబడి చూసుకోవడమే మెయిన్ కాన్సెప్ట్. ఆ మాటకొస్తే తాను అధికారులతో నిర్వహించే మీటింగులు కూడా ఓట్లా నోట్లా ఇవేవీ రాకుంటే నో అనేస్తారని టాకు. జగన్ ఒక్కడే కాదు ఆయనతో పాటు ఆయన మంత్రి వర్గంలో పని చేసిన వారు కూడా ఏదో ఒక రకంగా అవినీతిలో భాగమయ్యి తలా పాపం తిలాపిడికెడుగా బిహేవ్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో వీరంతా కలసి వరుస పెట్టున జైళ్లకెళ్తున్న దృశ్యాలు మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి.
ఇక్కడ తెలంగాణలో ఆ కొరత తీర్చడానికా? అన్నట్టు మరో జగన్ తయారయ్యాడు. అయితే ఆయన రాజకీయాల్లో లేరు కానీ వారికన్నా మించి అన్నట్టుగా చెలరేగిపోయినట్టు తెలుస్తోంది. కేవలం HCA అనే ఒక క్రికెట్ అసోసియేషన్ నుంచే ఆయన ఏకంగా 800 కోట్ల రూపాయల బీసీసీఐ నిధులను దుర్వినియోగం చేసినట్టు తెలుస్తోంది. ఇటు SRH నుంచి అదనపు టికెట్లను ఆశించడం నుంచి మొదలు పెడితే.. టీవీల కొనుగోళ్ల వరకూ అంతా అవినీతి మయంగా తెలుస్తోంది.
ఆ మాటకొస్తే తనకున్న రాజకీయ పలుకుబడి అండదండలను అడ్డు పెట్టుకుని అదిపనిగా.. ఈ జగన్మోహనుడు HCAలోకి రాంగ్ ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాదు.. పరి పరి విధాలా ఈ క్రికెట్ అసోసియేషన్ ని కంపు కంపు చేసినట్టు ఆరోపిస్తోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ఈ తెలంగాణ జగన్ కేవలం HCAలో ఉన్నందుకే ఇంత పెద్ద మొత్తంలో మేస్తే.. ఆయనే గనక రాజకీయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తే పరిస్థితేంటన్న ప్రశ్న వినిపిస్తోంది. అసలా పేరే అలాంటిది.. ఎటు నుంచి ఎటు చూసినా.. అవినీతిలో అందనంత ఎత్తుకు ఎదగాల్సిందే అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి సర్వత్రా.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-jagan-39-202236.html
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.