ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అవినీతి ,అక్రమాలకు హద్దే లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది. అధికార వైసీపీ ప్రజా ప్రతినిధులు ఏ రంగాన్ని వదలకుండా అందినకాడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మైనింగ్, ఇసుక, మద్యం దందా మొత్తం వైసీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే జరుగుతుందని అంటున్నారు. అధికార పార్టీ నేతల అక్రమాలను బయటపెడుతూ టీడీపీ నేతలు ఎంతో పోరాటం చేస్తున్నారు. అయినా వాళ్ల తీరు మారలేదు. అయితే విపక్ష నేతలు కాకుండా సొంత పార్టీ నేతలే ఇప్పుడు బయటికి వస్తున్నారు. మా ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారంటూ ఓపెన్ గానే ప్రకటనలు చేస్తున్నారు. అక్రమాల చిట్టా కూడా బయటపెడుతున్నారు.
తాజాగా అధికార వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే అవినీతిని ఆ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతలే మీడియా ముందు విడుదల చేయడం కలకలం రేపుతోంది. కృష్ణా జిల్లా కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అవినీతి భాగోతం ఎంత భారీగా ఉందన్న విషయాన్ని వివరాలతో సహా బయటపెట్టారు ఆ నియోజకవర్గ నేతలు. రూ.250 కోట్ల అవినీతి వివరాల్ని వైసీపీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి బయటపెట్టారు. మాల మహానాడు అధ్యక్షుడు జగన్ బాబూరావు.. వైసీపీ బీసీ సెల్ సెక్రటరీ పాపారావు గౌడ్ లు ఈ ఆరోపణలు చేశారు. మాట వరసకు అవినీతి బురద వేసి.. వదలకుండా దానికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు.
తన ఎమ్మెల్యే పదవిని అడ్డు పెట్టుకొని దూలం నాగేశ్వరరావు రూ.250 కోట్లు అవినీతికి పాల్పడ్డరని చెప్పారు. కొల్లూరులో 1600 ఎకరాల బినామీ వ్యక్తులకు లీజుకు ఇచ్చి రూ.50కోట్ల మేర లబ్థి పొందారన్నారు. కైకలూరులో 80 ఎకరాలు.. పామర్రులో 40 ఎకరాలు.. రామోజీ ఫిలిం సిటీ వద్ద 50 ఎకరాలు.. విశాఖపట్నంలో 50 ఎకరాలు.. నడిపురులో 13 ఎకరాల భూమి ఉందన్నారు.గడిచిన రెండున్నరేళ్ల వ్యవధిలో తమ పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు చేసిన భూముల సంఖ్య ఇంత ఎక్కువగా ఉండటమా అని విస్తుపోతున్నారు. పార్టీ కోసంపని చేస్తున్న వారిని దూరం పెడుతున్నారని ఆరోపించిన వారు.. వచ్చే ఎన్నికల్లో కైకలూరు సీటును ఎస్సీ అభ్యర్థికి లేదంటే బీసీ అభ్యర్థికి కేటాయించాలని కోరారు. ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇస్తే మాత్రం ఓటమి ఖాయమని వారు స్పష్టం చేశారు.
ఒక ఎమ్మెల్యే అవినీతే రూ.250 కోట్ల వరకు ఉందంటే.. మరి.. మిగిలిన వారి సంగతేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదే అదునుగా రంగంలోకి దిగిన విపక్షనేతలు ఎమ్మెల్యేనే ఇంతలా వెనకేస్తే ఇక మంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఏ రేంజ్ లో దండుకున్నారో అని ప్రశ్నిస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు.. దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కాక కిందా మీదా పడుతున్నారు వైసీపీనేతలు. ఇప్పటికే పలువురు వైసీపీ ఎమ్మెల్యేల మీద సొంత పార్టీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలు తలనొప్పిగా మారిన వేళ.. తాజాగా తెర మీదకు వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి షాకింగ్ గా మారింది
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ycp-workers-cprruption-alligation-on-ycp-mla-39-129845.html
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్స్టార్ రజనీకాంత్తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.