Top Stories

political-news-img

నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్‌లో రగడ..!

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంట్‌ను తీవ్రంగా కుదిపేసింది. నీట్ అక్రమాలపై తక్షణమే సమగ్ర చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో చేపట్టిన ఆందోళనలతో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. సోమవారం జులై 27వ తేదీన ఉదయం సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు నీట్ వివాదంపై చర్చకు పట్టుబట్టారు. దేశవ్యాప్తంగా కోచింగ్ సెంటర్లు, పరీక్షా కేంద్రాలలో వెలుగుచూసిన అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారాలు సాధారణ విద్యార్థుల కష్టాన్ని నీరుగారుస్తున్నాయని ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నినాదాలు, పోడియం వద్దకు దూసుకెళ్లిన వాతావరణంతో లోక్‌సభ మరియు రాజ్యసభలు రెండూ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ఈ ఆందోళనకు ప్రధాన కారణం కేవలం పార్లమెంట్ లోపల చర్చ జరపకపోవడమే కాకుండా, బయట విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలు కూడా ప్రధానాంశంగా మారాయి. నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా దేశ రాజధానిలో విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన 'పార్లమెంట్ మార్చ్' కార్యక్రమంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. విద్యార్థుల నిరసనను అణచివేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడం, కన్నీటి వాయు గోళాలు (టియర్ గ్యాస్) ప్రయోగించడం మరియు పెల్లెట్ గన్స్ ఉపయోగించడం పట్ల ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విద్యార్థులపై జరిగిన ఈ పోలీసు దమనకాండపై సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉభయ సభల్లో విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. సభలో చోటుచేసుకున్న ఈ గందరగోళంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభ నడవకుండా నినాదాలు చేయడం సమంజసం కాదని ఆయన సభ్యులకు స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన తర్వాత అన్ని ముఖ్యాంశాలపై విస్తృత చర్చకు అవకాశం ఇస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి అంశంపైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉందని, ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్ష ఎంపీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సభ నియమ నిబంధనలను ఉల్లంఘించి ఆందోళనలు కొనసాగించే సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ, విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గకుండా నినాదాలు హోరెత్తించడంతో స్పీకర్ లోక్‌సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేయక తప్పలేదు. అటు రాజ్యసభలోనూ సరిగ్గా ఇదే పరిస్థితి పునరావృతమయ్యాయి. నీట్ లీకేజీతో పాటు విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడిపై చర్చ చేపట్టాలని కోరుతూ విపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. రాజ్యసభ ఛైర్మన్ ఎంత నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వాతావరణం శాంతించలేదు. విపక్షాల నిరసనల హోరు మధ్య సభ నిర్వహణ అసాధ్యంగా మారడంతో రాజ్యసభను కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నీట్ వ్యవహారం దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఏళ్ల తరబడి కష్టపడి చదివే విద్యార్థుల భవిష్యత్తు లీకేజీల వల్ల అంధకారంలోకి నెట్టబడుతోందని ప్రతిపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు మరింత వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. NEET Paper Leak Controversy, Parliament Adjourned, Om Birla Speaker, NEET Protests Lathi Charge, Lok Sabha News Telugu, NEET UG Exam Scandal

Publish Date: Jul 27, 2026 1:05PM

political-news-img

నీట్ విద్యార్థులపై లాఠీచార్జ్.. పోలీసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..!

నిరసన తెలపడం రాజ్యాంగ హక్కు... విద్యార్థులపై లాఠీచార్జ్‌ను తప్పుబట్టిన సుప్రీం..! పేపర్ లీకేజీల రాక్షస క్రీడలో తమ భవిష్యత్తును వెతుక్కుంటున్న అభ్యర్థులు, ప్రతిభావంతులైన విద్యార్థులు రోడ్డెక్కితే ప్రభుత్వం స్వీకరించాల్సిన తీరు ఇది కాదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వీధుల్లోకి వచ్చిన విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన లాఠీలు, కురిపించిన టియర్ గ్యాస్ షెల్స్ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాజధాని వీధుల్లో న్యాయం కోసం నిరసన తెలిపిన అభ్యర్థులపై పోలీసుల బలప్రయోగం సరైనది కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అణచివేయడం ఏమాత్రం తగదని దేశ అత్యున్నత ప్రాంగణం పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేసింది. గత జూలై 20వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా 'సంసద్ చలో' పేరిట వేలాది మంది విద్యార్థులు, అభ్యర్థులు బృందాలుగా ఏర్పడి మహా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. తమ భవిష్యత్తుతో ఆడుకుంటున్న నీట్ పేపర్ లీక్ కేసులో తక్షణమే పారదర్శకమైన రీతిలో సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే అన్యాయానికి గురైన తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ విద్యార్థులు శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. అయితే, శాంతియుతంగా సాగుతున్న ఆ నిరసన ప్రదర్శనను అడ్డుకునే క్రమంలో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా విరుచుకుపడింది. విద్యార్థులపై నిర్దాక్షిణ్యంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు విచక్షణారహితంగా టియర్ గ్యాస్ ప్రయోగించింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడటమే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నించిన విద్యార్థులపై ప్రభుత్వ అణచివేత ధోరణిని నిరసిస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు, బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విద్యార్థులపై జరిగిన ఈ పోలీసు లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంపై స్వతంత్ర సంస్థతో సమగ్రమైన విచారణ జరిపించాలని, అలాగే అక్రమంగా ప్రవర్తించిన బాధ్యులైన పోలీసు అధికారులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన మరియు మార్గదర్శకమైన వ్యాఖ్యలు చేసింది. భారత రాజ్యాంగం ఈ దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి శాంతియుతంగా తన నిరసనను వ్యక్తం చేసే ప్రాథమిక హక్కును స్పష్టంగా కల్పించిందని ధర్మాసనం ఈ సందర్భంగా గుర్తుచేసింది. కేవలం నిరసన తెలుపుతున్నారు అనే ఒంటెద్దు పోకడ కారణంతో పౌరులపై లేదా విద్యార్థులపై బలప్రయోగానికి పాల్పడటం ఎంతమాత్రం సమర్థనీయం కాదని కోర్టు ఖచ్చితంగా తేల్చిచెప్పింది. శాంతియుత మార్గంలో సాగే పోరాటాలు ప్రజాస్వామ్యానికి జీవకర్ర లాంటివని అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు, విద్యార్థులు తమ ఆవేదనలను, హక్కుల పోరాటాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనలు అత్యంత ప్రధానమైన సాధనాలని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిధిలోనే విద్యార్థులు జూలై 20న సంసద్ చలో కార్యక్రమాన్ని నిర్వహించారని, అటువంటి సమయంలో చట్టాన్ని రక్షించాల్సిన పోలీసు యంత్రాంగం రాజ్యాంగబద్ధ హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ఉందనే విషయాన్ని మరిచిపోకూడదని న్యాయస్థానం ఉద్ఘాటించింది. విద్యార్థుల నిరసనలపై జరిగిన ఈ దమనకాండపై స్వతంత్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్న పిటిషనర్ల వాదనలను పరిశీలిస్తూనే, భవిష్యత్తులో దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు పరిమితులను పునరుద్ఘాటించింది. సుప్రీంకోర్టు చేసిన ఈ చారిత్రాత్మక వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థి లోకంలో కొత్త ఆశలను చిగురింపజేయడమే కాక, పౌర హక్కుల పరిరక్షణపై ఒక సరికొత్త చర్చకు దారితీశాయి. NEET Protest Lathi Charge, Supreme Court on NEET, Sansad Chalo Protest, Supreme Court Hearing, Student Rights India, NEET Paper Leak Controversy

Publish Date: Jul 27, 2026 12:40PM

political-news-img

ఆడపిల్ల పుడుతుందనే.. బలవంతపు అబార్షన్.. తల్లీబిడ్డల ప్రాణాలు బలి..!

తల్లి... ఈ ఒక్క పదంలోనే ప్రేమ, త్యాగం, ఆప్యాయత దాగి ఉంటాయి. కానీ అదే తల్లి తీసుకున్న ఒక నిర్ణయం... కన్న కూతురి ప్రాణాన్నే బలితీసుకుంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది."గర్భంలో పెరుగుతున్న శిశువు... ఆడపిల్ల అని తెలిసింది. ఆ క్షణం నుంచి ఆనందంగా ఉండాల్సిన ఆ ఇంట్లో... అమానుష నిర్ణయం తీసుకున్నారు. కూతురు, అల్లుడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. "ఆడపిల్ల వద్దు" అనే ఆలోచన... చివరకు ఒక కుటుంబాన్ని శాశ్వత విషాదంలోకి నెట్టింది. అక్రమంగా నిర్వహించిన గర్భస్రావం వికటించింది. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాల కోసం పోరాడిన శ్రావణి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఇంకా ఈ లోకాన్ని చూడని పసికందు కూడా... తల్లి ఒడిని చేరకముందే శాశ్వతంగా దూరమైంది. ఒక ఆడబిడ్డ పుట్టకూడదనే నిర్ణయం... చివరకు ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. ఒకటి గర్భంలోని చిన్నారి... మరొకటి ఆ చిన్నారికి జన్మనివ్వాల్సిన తల్లి. ఆడపిల్ల పుడుతుందనే కారణంతో ఓ తల్లి తీసుకున్న నిర్ణయం చివరకు కన్నకూతురి ప్రాణాలనే బలితీసుకుంది. కూతురు, అల్లుడి ఇష్టాన్ని ఏమాత్రంపట్టించుకోకుండా గర్భంలో ఆడ శిశువు ఉందని తెలుసుకున్న తల్లి, బలవంతంగా గర్భస్రావం చేయించింది. అక్రమంగా నిర్వహించిన ఈ అబార్షన్ వికటించి తీవ్ర రక్తస్రావానికి గురైన మహిళ చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఈ ఘటన జనగామ జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం జిల్లావ్యాప్తంగా చర్చనీ యాంశంగా మారింది. పోలీసుల వివరాల ప్రకారం మృతురాలు శ్రావణి గర్భవతిగా ఉండగా స్కానింగ్ ద్వారా గర్భంలో ఆడ శిశువు ఉన్నట్లుగా తల్లి శోభ తెలుసుకున్నారు. అనంతరం కూతురు, అల్లుడి అభిప్రాయాన్ని పట్టించుకోకుండా మృతురాలి తల్లి శోభ, జనగామలో ఏఎన్‌ఎంగా (ANM) పనిచేస్తున్న అనసూయ సహకారంతో ఈ నెల 21న ఆమె ఇంట్లో నే అక్రమంగా అబార్షన్ చేయించింది.అబార్షన్ అనంతరం 22వ తేదీ రాత్రి శ్రావణికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమించింది. తొలుత జనగామలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ ఆరోగ్యం మరింత క్షీణిం చింది. దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 25న శ్రావణి మృతి చెందింది. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మృతురాలి భర్త భాస్కర్ జనగామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి ఆర్‌ఎంపీ శ్రవణ్, స్కానింగ్ నిర్వహించిన ప్రవీణ్, ఏఎన్‌ఎం అనసూయ, మృతురాలి తల్లి శోభపై కేసులు నమోదు చేశారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 125, 89, 49తో పాటు మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (MTP) Act సెక్షన్లు 5, 5(3), 5(4), అలాగే ఫ్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నటల్ డయాగ్నొస్టిక్ టెక్నిక్స్ (PCPNDT) Act సెక్షన్ 23 కింద కేసులు నమోదు చేశారు. గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ ఎలా జరిగింది? అక్రమ అబార్షన్‌కు ఎవరు సహకరించారు? ఇందులో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు Forced Abortion, Female Foeticide, Sex-Selective Abortion, Gender Discrimination, Janagama district, Shravani, baby girl, Crime News, Shocking Incident, Medical Negligence, PCPNDT Act, MTP Act, BNS Case

Publish Date: Jul 27, 2026 11:40AM

political-news-img

కేంద్ర కేబినెట్ లోకి దగ్గుబాటి పురంధేశ్వరి.. విద్యాశాఖ అప్పగించనున్న మోడీ?

నీటి పేపర్ లీకేజీకి నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వరంలో ఉవ్వెత్తున ఎగసిన ప్రజా నిరసనకు తలొగ్గి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో కేంద్ర మంత్రి జోషీకి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు ప్రధాని నరేంద్రమోడీ. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు అనివార్యంగా ధర్మేంద్రప్రధాన్ చేత రాజీనామా చేయిం,చాల్సిన పరిస్థితి ఎదురుర కావడం మోడీ ప్రతిష్ట మసకబారడానికి కారణమైంది. కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు. అటువంటి ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా ఉండగానే విద్యావ్యవస్థలో అక్రమాలపై విద్యార్థులే ఉవ్వెత్తున ఉద్యమించారు. అదలా ఉంచితే.. నరేంద్ర మోడీ తాత్కాలికంగా జోషీకి విద్యాశాఖ అప్పగించారనీ, త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో విద్యాశాఖ బాధ్యతలు రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరికి అప్పగించే అవవకాశాలు మెండుగా ఉన్నాయనీ ఢిల్లీ వర్గాల సమాచారం. గతంలో క్యాబినెట్లో పనిచేసిన అనుభవం ఉండంతో ప్రధాని మోడీ ఆమెవైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయంటున్నారు. నీట్ లీకేజీ వ్యవహారంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట బాగా మసకబారిందనడంలో సందేహం లేదు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ మోడీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు, నిరసనలు ఎదురయ్యాయి. దీంతో ప్రధాని మోడీ నష్టనివారణపై దృష్టి పెట్టారంటున్నారు. ఇప్పటికే మంత్రివర్గాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ప్రధాని విద్యాశాఖను విద్యావంతురాలు, రాజకీయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే క్లీన్ ఇమేజ్ ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించాలని భావిస్తున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేసిన పురంధేశ్వరి సమర్థవంతమైన నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. 2014 ఎన్నికల కు ముందు బీజేపీలో చేరిన పురంధేశ్వరి..ఆ ఎన్నికలలో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లోఆమె రాజమహేందర వరం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను కేబినెట్ లోకి తీసుకుని విద్యాశాఖను అప్పగించాలని మోడీ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. Daggubati Purandeswari into union cabinet, Union Education Minister, Dharmendra Pradhan resignation, Rajahmundry MP, Modi Cabinet expansion

Publish Date: Jul 27, 2026 11:03AM

political-news-img

మాజీ మంత్రి రోజాకు నోటీసులు.. అరెస్టే తరువాయా?

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మాజీ మంత్రి, ఆర్.కె. రోజా అరెస్టు కాక తప్పదా? తాజాగా పోలీసులు రోజాకు నోటీసులు జారీ చేయడంతో రాజకీయవర్గాలలో రోజా అరెస్టు అవుతారా అన్న చర్చ జోరందుకుంది. ఒక పాత కేసు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులలో ఈ నెల 30 న విచారణాధికారుల ఎదుట హాజరుకావాలని, లేనిపక్షంలో అరెస్ట్ చేస్తామనీ పేర్కన్నారని అంటున్నారు. రోజా ఇటీవల కొంత కాలంగా రాజకీయంగా పెద్దగా క్రియాశీలంగా ఉండటం లేదు. తాజాగా పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడానికి, వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో అప్పటి మంత్రి రోజాను ప్రశ్నించడం కోసం నోటీసులు జారీ చేశారు. ; పోలీసు నోటీసుల మేరకు రోజా ఈ నెల 30న విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు కాకున్నా, విచారణలో అధికారులకు సహకరించకున్నా అరెస్టు తప్పదని ఆ నోటీసులలోనే పేర్కొన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మాజీ మంత్రి రోజా రాజకీయంగా పెద్దగా క్రీయాశీలంగా వ్యవహరించడం లేదు. కానీ గతంలో ఆమె విపక్షాలపై మీడియా సమావేశాల్లో, సభల్లో పెద్ద ఎత్తున విమర్శలతో విరుచుకుపడేవారు. ఆ సందర్భంగా ఆమె అనుచిత భాషా ప్రయోగం చేసేవారన్న ఆరోపణలున్నాయి. అయితే 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి, తాను కూడా స్వయంగా నగరి నుంచి పరాజయం పాలైన తరువాత నుంచి ఆమె మీడియా ముందుకు రావడం బాగా తగ్గించారు. పైగా ఎక్కువ సమయం తమిళనాడు రాజధాని చెన్నైకే పరమితమౌతూ వస్తున్నారు. ఒక సందర్భంలో ఆమె టీవీకేలో చేరేందుకు తెగ ప్రయత్నించారన్న వార్తలు కూడా వచ్చాయి. సరే కేసుల భయతోనే రోజా రాజకీయంగా దూకుడు తగ్గించారని పరిశీలకులు విశ్లేషణనలు కూడా చేశారు. గత కొంత కాలంగా చెన్నైకే పరిమితమైన రోజా.. నగరి నియోజకవర్గానికి వచ్చిన రెండు రోజులలోనే పోలీసులు ఆమె ఇంటికి వచ్చి మరీ నోటీసులు అందించారు. కాగా రోజాకు పోలీసులు అందజేసిన నోటీసులలో ఆడుదాం ఆంధ్ర అవకతవకలతో పాటుగా, అప్పట్లో రోజా మంత్రిగా వ్యవహరించిన పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన పలు కాంట్రాక్టులు, నిర్వహణ నిధుల వ్యయంలో జరిగిన కేటాయింపులపై కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఆడుదాం ఆంధ్ర పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ గతంలోనే దాఖలైన ఫిర్యాదుల ఆధారంగా విచారణ అధికారులు కీలక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. క్రీడా సామాగ్రి కొనుగోలు టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ప్రాథమిక నివేదికల ఆధారంగానే ఇప్పుడు రోజాకు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు.

Publish Date: Jul 27, 2026 11:03AM

political-news-img

ఆవనూనె లేదా ఆలివ్ నూనె.. గుండె జబ్బుల రోగులకు ఏ నూనె మంచిది తెలుసా.!

ఆవనూనె లేదా ఆలివ్ నూనె.. గుండె జబ్బుల రోగులకు ఏ నూనె మంచిది తెలుసా.! ఇంట్లో వంట చేయడానికి చాలా రకాల నూనెలను ఉపయోగిస్తారు. కొందరు వేరుశనగ నూనె, మరికొందరు కుసుమ నూనె, ఇంకొందరు నువ్వుల నూనె వాడుతుంటారు. అయితే ఇతర రాష్ట్రాలలో చాలామంది వంటల తయారీలో ఆవనూనె కూడా ఉపయోగిస్తారు. ఆవనూనె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే విదేశీయులు, ఆరోగ్య స్పృహ ఎక్కువ కలిగిన ధనవంతులు వంటల్లో ఆలివ్ నూనెను కూడా ఉపయోగిస్తారు. పైగా ఆలివ్ నూనె గుండెకు మంచిదని అంటారు. ఆవ నూనె వందల సంవత్సరాల నుండి భారతీయ వంటకాలలో వాడుతున్నారు. కేవలం వంటకాలలోనే కాకుండా ఆయుర్వేదంలో కూడా ఆవనూనెను ఉపయోగిస్తుంటారు. మధ్యధరా ప్రాంతంలో ఆలివ్ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆలివ్ నూనె గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. అయితే గుండె ఆరోగ్యానికి ఆవనూనె లేదా ఆలివ్ నూనె రెండింటో ఏది మంచిది? ఆహార నిపుణులు ఏం చెప్తున్నారు? వివరంగా తెలుసుకుంటే.. సరైన నూనె ఎంపిక ఎందుకు ముఖ్యం? ఒకప్పుడు నూనెలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయని, ఈ కారణంగా కొవ్వు ఎక్కువ వాటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెప్పేవారు. కానీ ఇప్పుడు మాత్రం పోషకాహార నిపుణులు చెబుతున్న విషయం వేరు.. కొవ్వులో రెండు రకాలు ఉన్నాయని, వీటిలో ఆరోగ్యానికి మంచి చేసే కొవ్వులు కూడా ఉంటాయి. పదేపదే వేడి చేసిన నూనెలు, ట్రాన్స్ ఫ్యాట్స్ , అధిక సంతృప్త కొవ్వులు గుండెకు హానికరం అని చెబుతారు. అయితే, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్ , ఒమేగా-3 వంటి అసంతృప్త కొవ్వులు కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి , రక్తనాళాలలో వాపును తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే గుండె ఆరోగ్యం గురించి చర్చించేటప్పుడు ఆవ నూనె , ఆలివ్ నూనె రెండింటినీ పరిగణలోకి తీసుకుంటారు. గుండె జబ్బులు ఉన్నవారికి ఆలివ్ నూనె లేదా ఆవనూనె? గుండె జబ్బుల రోగులకు ఆలివ్ నూనెతో వంట చేయడం మేలు చేస్తుందని చెబుతారు. ముఖ్యంగా మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు , ఒలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనె. ఇందులో పాలీఫెనాల్స్ అనే సహజ యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ ఒత్తిడిని , వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండూ ధమనులకు నష్టం కలిగించడంతో పాటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. ఎక్ట్రా వర్జిన్ ఆలివ్ నూనె మంచి కొలెస్ట్రాల్ ను మెరుగుపరచడంలో , చెడు కొలేస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతారు. చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణ ధమనులలో ఫలకం పేరుకుపోవడానికి కారణం అవుతుందని చెబుతారు. అధికంగా ఆలివ్ నూనె తీసుకునే వ్యక్తులకు గుండె జబ్బుల ప్రమాదం తక్కువగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆలివ్ నూనె అన్ని రకాల వంటలకు మంచిదా? ఆలివ్ నూనె వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, కానీ భారతీయ వంటకాలు చాలా ప్రత్యేకం. భారతీయులు ఆహారాన్ని నూనెలో బాగా వేయిస్తారు, పోపు వేస్తారు, లేదా ఎక్కువ సేపు అధిక వేడి మీద వండుతారు. ఇలాంటి పరిస్థితులలో, అధిక వేడి కారణంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ నూనెలో ఉండే హెల్తీ ఫ్యాట్స్, పోషకాలు తగ్గిపోతాయి. శుద్ధి చేసిన ఆలివ్ నూనె అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలిగినప్పటికీ, దాని యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలు తగ్గిపోతాయి. ఆవనూనె ఎందుకు ప్రత్యేకం.. ఆవ నూనె చాలా కాలంగా భారతీయ వంటకాలలో ఒక భాగంగా ఉంది. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులతో పాటు, ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) అనే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ కూడా ఉంటుంది. ఒమేగా-3 కొవ్వులు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి, అందువల్ల ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ఆవ నూనె వల్ల గుండెకు కలిగే సంభావ్య ప్రయోజనాలపై భారతీయ పరిశోధనలు కూడా జరిగాయి. సాంప్రదాయ ఆవ నూనెలో ఎరుసిక్ యాసిడ్ కూడా ఉంటుంది. అయితే ఆవ నూనెను మితంగా వాడాలి. *రూపశ్రీ.

Publish Date: Jul 27, 2026 11:02AM

MOVIE NEWS