11 - 11 -11.. ఒక్క రోజు బాగోతమేనా?

Publish Date:Feb 11, 2026

Advertisement

వైసీపీ వ్రతమూ చెడింది.. ఫలమూ దక్కలేదు!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు గురువారం(ఫిబ్రవరి 12) వైసీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. బడ్జెట్ సమావేశాలకు జగన్ 11 టీమ్ హాజరౌతుందని వైసీపీ ఆర్భాటంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటన మేరకు వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు 11 మంది బుధవారం (ఫిబ్రవరి 11) సభకు హాజరయ్యారు. సరిగ్గా పద కొడు నిముషాలు సభలో ఉండి.. నినాదాలు చేసి వాకౌట్ చేశారు. దీంతో టీమ్ 11 అసెంబ్లీ హాజరు కేవలం అటెండెన్స్ కోసమే అన్న విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు ఆ విమర్శలు వాస్తవం కాదని చెప్పడానికైనా జగన్ అండ్ కో అంటే ఆయన, ఆయనతో పాటు 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలూ కనీసం 11 నిముషాల సేపు సభలో ఉండేలాగైనా సమావేశాలకు హాజరౌతారని భావించారు. అయితే  వైసీపీకి విమర్శలు పట్టించుకునే అలవాటు లేదనీ, వారు సభకు వచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమేననీ పరిశీలకులు విశ్లేషించారు. ఆ విశ్లేషణలకు అనుగుణంగానే వైసీపీ ఎమ్మెల్యేలు గురువారం (ఫిబ్రవరి 12) సభకు గైర్హాజరయ్యారు. 

ఇక అది పక్కన పెడితే ప్రతిపక్ష హోదా డిమాండ్ నుంచి వెనక్కు తగ్గి కేవలం హాజరు కోసం బుధవారం సభకు హాజరైన జగన్ కు, ఆయన పార్టీ ఎమ్మెల్యేలకూ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కలేదని అంటున్నారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాల తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ రోజు సభా హాజరు లెక్కలోకి రాదని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో వారు బుధవారం (ఫిబ్రవరి 11) సభకు వచ్చినా అది హాజరు కిందకు రాదు. ఇక గురువారం (ఫిబ్రవరి 12) నుంచి హాజరు లెక్కలోకి వస్తుంది. అయితే టీమ్ 11 సభకు హాజరు కాలేదు. మార్చి 7 వరకూ జరిగే ఈ సెషన్ కు ఇక వైసీపీ ఎమ్మెల్యేల హాజరు ఉండదని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ వర్గాల నుంచీ అదే వినిపిస్తోంది. ఈ సారి బడ్జెట్ సమావేశాలు మార్చి 7 వరకూ దాదాపు 17 రోజుల పాటు సాగనున్నాయి. ఈ సెషన్ మొత్తానికి గైర్హాజరైతే.. 60 రోజుల గైర్హాజర్ కంప్లీట్ అవుతుంది.. శాసనసభ్యత్వం రద్దౌతుందని అంటున్నారు. గతంలోలా దొంగ చాటుగా రిజిస్టర్ లో సంతకం చేసేసి వెళ్లిపోయే అవకాశం లేకుండా డిజిటల్ హాజరు విధానం అమలులోకి వచ్చింది. దీంతో జగన్ వ్రతమూ చెడింది, ఫలమూ దక్కని పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.  

అలా కాకుండా ఒక వేళ.. బుధవారం (ఫిబ్రవరి 11) వైసీపీయులు సభకు హాజరు కావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే.. మళ్లీ 60 పని దినాల వరకూ సభకు హాజరు కాకపోయినా వారిపై అనర్హత వేటు పడే అవకాశం లేదు. కానీ ఇక్కడ వైసీపీ తమ సభా బహిష్కరణకు చెప్పుకోవడానికి కారణం ఉండదు. ఎందుకంటే..  ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని జగన్ చేసిన శపథంపై ఆయన నిలబడలేదు. దీంతో ఇక వారి సభా బహిష్కరణ.. పలాయనం కిందకే వస్తుందని పరిశీలకులు అంటున్నారు.   

By
en-us Political News

  
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.