2026 డీలిమిటేషన్ సెగ.. పార్లమెంట్‌లో ఓటమి.. బీజేపీ రాజకీయ విజయం?

Publish Date:Apr 20, 2026

Advertisement

దేశ రాజకీయాల్లో ఇప్పుడు  2026 డీలిమిటేషన్  ఒక హాట్ టాపిక్ గా మారింది. లోక్‌సభ స్థానాల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్),  మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన కీలక బిల్లులు పార్లమెంట్‌లో అవసరమైన మెజారిటీ లేక వీగిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రతిపక్ష కూటమి దీనిని కేంద్ర ప్రభుత్వ ఓటమిగా అభివర్ణిస్తున్నప్పటికీ, లోతుగా పరిశీలిస్తే ఇది అధికార బీజేపీకి వచ్చే ఎన్నికల కోసం ఒక బలమైన ప్రచార అస్త్రాన్ని అందించినట్లు కనిపిస్తోంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 81, 82 ప్రకారం..  ప్రతి జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగడం అనేది ఒక అనివార్యమైన ప్రక్రియ. ఇది ఏ రాజకీయ పార్టీ సొంత నిర్ణయం కాదు..  రాజ్యాంగబద్ధమైన విధి. గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో..  ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు.  అయితే, 2026 గడువు సమీపిస్తుం డటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది.  దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మహిళా రిజర్వేషన్ల అమలు కూడా డీలిమిటేషన్‌తోనే  ముడిపడి ఉంది.  2023లో ఆమోదించిన బిల్లు ప్రకారం, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళలకు 33 శాతం కోటా అమల్లోకి వస్తుంది.  దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యేమార్గంలా '  50శాతం సీట్ల పెంపు'ఫార్ములాను ప్రతిపాదించింది. అంటే..  అన్ని రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న సీట్లపై 50 శాతం అదనంగా కేటాయిం చడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గకుండా చూడాలనేది కేంద్రం వాదన. అయితే, దీనివల్ల బీజేపీకి మహిళా రిజర్వేషన్ క్రెడిట్ దక్కుతుందని, ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగి తమ పట్టు తగ్గుతుందని భావించిన డిఎంకె వంటి ప్రాంతీయ పార్టీలు, ఇండియా కూటమి దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతిపక్షాల అడ్డంకులతో ఈ 50 శాతం అదనపు సీట్ల ఫార్ములా తిరస్కరణకు గురైంది. 

అయితే, ఇదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారే అవకాశం ఉంది. ప్రత్యేక ఫార్ములాలు ఏవీ లేకపోతే.. ఇప్పుడు డీలిమిటేషన్ పూర్తిగా జనాభా ప్రాతిపదికన మాత్రమే జరుగుతుంది. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాలు దీనివల్ల సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. మరోవైపు..  జనాభా భారీగా పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలకు లోక్‌సభలో బలం పెరుగుతుంది. అంటే.. పార్లమెంట్‌లో బిల్లును అడ్డుకోవడం ద్వారా విపక్షాలు దీర్ఘకాలంలో దక్షిణాది గొంతుకను బలహీనపరిచాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలను బీజేపీ తనకి అనుకూలమైన నేరేటివ్‌గా మార్చుకునే పనిలో పడింది.  మేము మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తే ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని మహిళా ఓటర్లకు..  దక్షిణాది సీట్లు తగ్గకుండా మేము రక్షించే ప్రయత్నం చేస్తే విపక్షాలే చెడగొట్టాయి అని దక్షిణాది ప్రజలకు బీజేపీ వివరించే అవకాశం ఉంది. 

అలాగే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తమ ప్రాతినిధ్యాన్ని విపక్షాలు అడ్డుకుంటున్నాయనే భావనను కలిగించడం ద్వారా 2029 ఎన్నికల అజెండాను బీజేపీ ఇప్పుడే సిద్ధం చేసుకుంటోంది.  ప్రతిపక్షాలు పార్లమెంటరీ పోరాటంలో తాత్కాలిక విజయం సాధించినప్పటికీ, ప్రజాక్షేత్రంలో ఓటర్ల సెంటిమెంట్‌ను గమనించడంలో  మాత్రం ఘోరంగా విఫలమయ్యాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా మహిళా సాధికారతకు అడ్డుపడ్డారనే ముద్ర పడటం విపక్షాలకు నిస్సందేహంగా పెద్ద మైనస్ అవుతుంది. డీలిమిటేషన్ అనేది రాజ్యాంగబద్ధంగా ఎలాగూ జరుగుతుంది..  కానీ కేంద్రం ఇచ్చిన వెసులుబాటును కాలదన్నడం ద్వారా ప్రతిపక్షాలు ఇసుమంతైనా దూరదృష్టి లేకుండా వ్యవహరించి,  పార్లమెంట్‌లో ఈ బిల్లు పాసు కాకుండా అడ్డుకోవడం ద్వారా బీజేపీకి ఒక  ఎలక్టోరల్ గిఫ్ట్ గా మారే లా చేశాయని చెప్పవచ్చు.  

- సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా గాడిన పెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే, కుమారుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ తండ్రీకొడుకుల పనితీరు ప్రస్తుత రాజకీయాల్లో సరికొత్త స్ఫూర్తిని నింపుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన వంటి అంశాలపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ.. రెండూ కూడా రైతుల కష్టాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత మార‌నున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను బ‌ట్టి తెలంగాణలో ఈ రాజకీయ వేడి మరింత రాజుకునే అవకాశం క‌నిపిస్తోంది.
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.