తిరుపతిని తలపించేలా యాదగిరి గుట్టపై ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడే లక్ష్యంతో ఆయల పునర్నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతుంటే.. ఆలయ దర్శనాలు ప్రారంభమైన తరువాత అక్కడ సీన్ రివర్స్ అయ్యిందన్న విమర్శలు వినవస్తున్నాయి.
కేసీఆర్ లక్ష్యాలు, ఆశయాలకు తూట్లు పొడిచే విధంగా అక్కడి పరిస్థితి ఉందని యాదగిరిగుట్ట జేఏసీ ఆరోపిస్తున్నది. ఇదంతా ముఖ్యమంత్రికి తెలిసే జరుగుతోందా? లేక దేవాదాయ శాఖాధికారుల ఇష్టారాజ్యంగా సాగుతోందా అన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి.
గుట్టపైకి వాహనాల అనుమతి, దుకాణాలకు అనుమతి దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భారీ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నట్లు జేఏసీ ఆరోపించడమే కాకుండా ఉన్నతాధికారులకు లిఖిత పూర్వక ఫిర్యాదు అందజేసి సమగ్ర విచారణకు డిమాండ్ చేశారు. అయితే వారి ఫిర్యాదుపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలకూ ఉపక్రమించకపోవడంతో అంతా సీఎం కనుసన్నలలోనే జరుగుతోందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
యాదగిరిగుట్ట కొండపైన దుకాణాలు ఉండవద్దని కేసీఆర్ చెబితే..అదుకు భిన్నంగా అధికారులు దుకాణాలకు టెండర్లు పిలవడం, ఆ తరువాత వాటిని రద్దు చేసి వ్యాపార కేంద్రాల తెరిచేందుకు మౌఖిక ఆదేశాలివ్వడం,సీఎం వస్తున్నారనగానే వాటిని మూసివేయించడం మరల మూసివేయించడం, ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన ముగించుకుని వెళ్లగానే వ్యాపార కేంద్రాలను తెరిపించడం వంటి సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. జేఏసీ ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ వాస్తవాలు వెలికి తీసేందుకు ఉన్నత స్థాయి విచారణకు డిమాండ్ చేస్తున్నది. ఉన్నతాధికారులు తమ ఫిర్యాదుపై స్పందిచకపోవడంతో లోకాయుక్తను ఆశ్రయించాలని యోచిస్తున్నది. తెలంగాణ కీర్తి కిరీటంలో కలికితురాయి వంటి యాదాద్రి పవిత్రతను మంటగలిపే విధంగా అక్కడి కార్యక్రమాలు ఉన్నాయన్న భావన సామాన్య భక్తులలో సైతం కలుగుతోంది. ఆలయ పునర్నిర్మాణానికి ముందు ఒకింత ఇరుకుగా ఉండి అసౌకర్యం ఉన్నప్పటికీ భక్తులకు వసతి, సౌకర్యాల విషయంలో ఇప్పటి కంటే గతంలోనే ఎంతో మెరుగ్గా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కొండపై ఎండ బారిన పడకుండా తలదాచుకునేందుకు నీడ కూడా కరవైన పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రణాళికకు, ప్రకటనలకు భిన్నంగా జరుగుతున్న కార్యక్రమాలపై జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానం అధికారులు కొందరు బినామీల పేరిట శానిటేషన్, మరమ్మతులు, నిర్మాణపు పనులు చేపడుతూ దేవస్థానం నిధులను ప్రణాళికా బద్ధంగా దుర్వినియేగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కూడా ఆధారాలతో సహా లోకాయుక్తకు ఫిర్యాదు చేయనున్నట్లు జేఏపీ తెలిపింది. అసలింతకీ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందాల్సిన యాదగిరి గుట్టపై ఏం జరుగుతోంది? భక్తులలో, స్థానికులలో ఎందుకు ఇంత అసహనం వ్యక్తం అవుతోంది. గుట్ట విషయంలో భారీ స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? నిజంగానే గట్టు పునర్నిర్మాణం, అనంతర పనుల నిర్వహణలో భారీ అవినీతి జరిగిందా? ఈ అంశాలపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించి అవకతవకలు జరిగినట్లు రుజువైతే సంబంధితులపై తగిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ జోరందుకుంటోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/what-is-going-on-in-yadadri-jusj-opposit-to-what-cm-said-39-135300.html
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వైసీపీకి కోర్టులు, న్యాయమూర్తులు, చట్టం, న్యాయం వంటి విషయాలలో పెద్దగా పట్టింపు లేదని గతంలో పలుమార్లు రుజువైంది. అలాగే ఇప్పుడు కూడా కోర్టు తీర్పులు కోర్టువే, మా దారి మాదే అన్న చందంగా విజయవాడ వేదికగా వైసీపీ విద్యార్థి, యువజన విభాగాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి.
ఇప్పటి వరకూ గ్రామ పంచాయతీ స్థాయిలో సర్పంచులను మాత్రమే ప్రజలు నేరుగా ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటున్నారు. అయితే, మండల స్థాయిలో ఎంపీపీలు, జిల్లా స్థాయిలో జడ్పీ ఛైర్మన్లతో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఛైర్మన్లు, మేయర్ల ఎంపిక పరోక్ష పద్ధతిలోనే జరుగుతోంది.