పరామర్శల పేరుతో బలప్రదర్శనలా?

Publish Date:Aug 6, 2026

Advertisement

ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగింది.  పరామర్శల పేరుతో వైసీపీ అధినేత  జగన్   రాజకీయం చేస్తున్నారంటూ  హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. పరామర్శను  రాజకీయ బలప్రదర్శనకు వాడుకోవడం ఎంతమాత్రం తగదని మండిపడ్డారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో   , జగన్ మోహన్ రెడ్డి పర్యటనల వెనుక ఉన్న అసలు నైజాన్ని వంగలపూడి వనిత  ఎండగట్టారు. జగన్ బయటకు అడుగు పెడితే విధ్వంసాలు, అరాచకాలు చోటుచేసుకుంటున్నాయని, అసలు ఈ రకమైన పర్యటనల ద్వారా సమాజానికి ఆయన ఎలాంటి సందేశాన్ని ఇవ్వాలని అనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

  తన విమర్శలకు బలం చేకూరుస్తూ..  జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను   వంగలపూడి అనిత ఈ సందర్భంగా  ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి  అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం  నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.   క్రికెట్ లేదా ఇతర ఆన్‌లైన్ బెట్టింగ్‌లలో డబ్బులు పోగొట్టుకుని  ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి విగ్రహావిష్కరణ మహోత్సవానికి జగన్ స్వయంగా హాజరవడం ఏ రకమైన సంకేతమని ఆమె ప్రశ్నించారు.  

వైసీపీ నేతలు,  కార్యకర్తలు   బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారన్న అనిత,  జగన్ పర్యటన సందర్భంగా ఒక వ్యక్తి ఆయన కారు కింద పడినా కనీసం పట్టించుకోకుండా, మానవత్వం లేకుండా కారును ఆపకుండా వెళ్లిపోవడం దారుణమన్నారు. ప్రజా రవాణాకు, అత్యవసర వైద్య సేవలకు  విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను ఆసుపత్రికి తరలించే అంబ్యులెన్స్‌లకు సైతం దారి ఇవ్వకుండా వైసీపీకార్యకర్తలు రహదారులపై హంగామా చేస్తూ ప్రజల ప్రాణాలతో  చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. పరామర్శల పేరుతో రోడ్లపైకి వస్తున్న సమయాల్లో అమాయక మహిళలపై దాడులు జరగడం, విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తూ బ్లాక్‌మెయిల్ చేసే ప్రయత్నాలు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు వంగలపూడి అనిత. 

జగన్  ఈ తరహా పరామర్శల పేరిట నిర్వహిస్తున్న రాజకీయ బలప్రదర్శనల వల్ల ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు అమాయకులు   ప్రాణాలను కోల్పోయారన్న హోంమంత్రి,   తన రాజకీయ ప్రయోజనాలు, ఉనికి కాపాడుకోవడం కోసమే ప్రజా సంక్షేమాన్ని, శాంతిభద్రతలను పక్కనబెట్టి వైకాపా నేతలు ఇలాంటి అరాచక పర్యటనలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి తన తీరు  మార్చుకుని బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలని, ప్రజల ప్రాణాలతో ఆడుకునే రాజకీయాన్ని స్వస్తి చెప్పాలని హెచ్చరించారు.

Home Minister Anitha, YS Jagan Mohan Reddy, AP Home Minister Anitha, YSRCP Paramarsha Yatra, Anitha Slams Jagan, AP Politics News

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.