ఎస్టీ విద్యార్థులకు విజ్ఞాన్ వర్సిటీ బంపర్ ఆఫర్

Publish Date:May 17, 2026

Advertisement

 

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక్క ఎస్టీ విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదన్నదే తమ లక్ష్యమని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన పల్నాడు జిల్లా ఎస్టీ విద్యార్థులకు నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్ కళాశాలలో ఘన అభినందన సభ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ .. వివిధ గ్రూపుల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రత్యేకంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇంటర్‌లో 600కు పైగా మార్కులు సాధించిన 287 మంది షెడ్యూల్డ్ తెగల విద్యార్థులకు విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉచితంగా సీట్లు కల్పించి పూర్తి విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.

 ఆర్థిక పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులు పిల్లల చదువును మధ్యలో ఆపేయకుండా ధైర్యంగా పై చదువులకు పంపాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 346 మంది ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా.. అందులో 287 మంది ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించడం గర్వకారణమని ఎంపీ కొనియాడారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులకు కూడా ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు.

కనీసం డిగ్రీ వరకు చదివించాలి

ఎస్టీ కుటుంబాల నుంచి ప్రతి గ్రామంలో కనీసం నలుగురు విద్యార్థులు ఉన్నత చదువులు పూర్తి చేసి మంచి స్థాయికి చేరుకోవాలని తమ ఆకాంక్ష అని ఎంపీ పేర్కొన్నారు. వారిని చూసి మరికొందరు విద్యార్థులు కూడా స్ఫూర్తి పొంది చదువులో ముందుకు వస్తారని అన్నారు. కనీసం డిగ్రీ వరకు చదివితే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మరింత సులభమవుతాయని, అందుకే తల్లిదండ్రులు పిల్లలను డిగ్రీ పూర్తయ్యే వరకు తప్పనిసరిగా ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

ఇదే కార్యక్రమంలో నరసరావుపేట పరిసర ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం కొత్త ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎంపీ .. నరసరావుపేటలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
 

By
en-us Political News

  
బండి భగీరథ్ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది.
తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.
తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది.
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ తీవ్ర రూపం దాల్చింది. 80 మందికి పైగా మరణించడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో తీవ్ర కలకలం రేపిన ఒక ఘోర సంఘటన స్థానికంగా పెను సంచలనంగా మారింది.
వాహనదారులపై ఇంధన ధరల భారం మరోసారి తీవ్రరూపం దాల్చింది.
హైదరాబాద్‌లో ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనుల దృష్ట్యా ఉప్పల్ రింగ్ రోడ్ చౌరస్తాను 3 నెలల పాటు తాత్కాలికంగా మూసివేశారు
తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథకు మేడ్చల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో వైద్య పరీక్షలు పూర్తి చేశారు.
బండి సంజయ్ తన కుటుంబంపై వచ్చిన వివాదాల మధ్య సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌లో ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు.
తన కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతో పోలీసుల విచారణకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.