జవహర్‌నగర్ దోపిడీ కేసు ఛేదన...నేపాలి గ్యాంగ్ అరెస్ట్

Publish Date:May 16, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలోని జవహర్‌నగర్‌లో ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో పాల్గొన్న నేపాలి గ్యాంగ్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం... సుమారు 20 రోజుల క్రితం మమత, రమేష్ అనే నేపాలి దంపతులు ప్రొఫెసర్ దంపతుల ఇంట్లో పనిమనుషులుగా చేరారు. ఎంతో నమ్మకంగా వ్యవహరిస్తూ యజమానుల విశ్వాసాన్ని సంపాదించారు. ఇదే సమయంలో దోపిడీకి పక్కా ప్రణాళిక రచించినట్లు పోలీసులు తెలిపారు.

రెండు రోజుల క్రితం తన పుట్టినరోజు ఉందని మమత యజమానులకు చెప్పగా, వారు కేక్ తెప్పించి వేడుకకు అనుమతిచ్చారు. బర్త్‌డే పార్టీకి తమ బంధువులు వస్తారని మమత చెప్పడంతో ప్రొఫెసర్ దంపతులు కూడా ఒప్పుకున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న నిందితులు ముందుగా ప్రణాళిక ప్రకారం పార్టీ నిర్వహించారు. అనంతరం ఇంటి యజమానులు భోజనం చేస్తున్న సమయంలో వారిపై దాడి చేసి, చేతులు కాళ్లు కట్టేసి ఇంట్లో ఉన్న నగదు, బంగారం, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. పారిపోతూ ముందు దంపతులకు మత్తుమందు ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు.

కొంతసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు పరిసర ప్రాంతాల సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దర్యాప్తును ముమ్మరం చేశారు. చివరకు మమత, ఆమె భర్త రమేష్‌తో పాటు వారికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసి, దోపిడీకి సంబంధించిన నగదు, బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తుండటంతో పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇంట్లో పనిమనుషులను నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలని, ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల నుంచి వచ్చిన వారిపై పూర్తి ధృవీకరణ చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

By
en-us Political News

  
తన కుమారుడు బండి భగీరథ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపై గౌరవంతో పోలీసుల విచారణకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
దేశ ప్రగతిలో పిల్లలే అసలైన సంపద అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సాయి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
పోక్సో కేసులో నిందితుడైన బండి సాయి భగీరథ్ పరారీపై బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ యూజీ క్వశ్చన్ పేపర్ లీకేజీ మరియు పరీక్ష రద్దు వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సిఫార్సు మేరకు మంత్రులకు శాఖలను కేటాయిస్తూ లోక్ భవన్ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
హెల్మెట్ ధరించి రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్‌పై కూర్చున్న సీఎం చంద్రబాబు
దక్షిణాది రాజకీయాల్లో మరియు సినీ రంగంలో ఎప్పుడు ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో ఊహించడం కష్టం.
జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారాయి.
ప్రపంచ కుబేరుడు, స్పేస్ఎక్స్ మరియు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.
సమాజం తలదించుకునే అత్యంత హేయమైన, అమానవీయ ఘటన గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో వెలుగుచూసింది.
మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక అత్యంత కలకలం రేపిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
హర్యానా ల్యాండ్ డీల్ వివాదంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఊరట లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.