వల్లభనేని వంశీ అరెస్టు ఓకే.. కొడాలి నాని వంతెప్పుడు?

Publish Date:Feb 13, 2025

Advertisement

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్టు వార్త గురువారం (ఫిబ్రవరి 13) ఉదయమే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన ముందస్తు బెయిలు కోర్టులో పెండింగ్ లో ఉండగా ఎలా అరెస్టయ్యారన్న అనుమానాలు వ్యక్తమైనా, గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో కాకుండా మరో కేసులో వల్లభనేని వంశీ అరెస్టయ్యాడని తెలియడంతో ఆ కేసేమిటా అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అయ్యింది. అనుమానాలన్నీ వల్లభనేని అరెస్టు వార్త వాస్తవం కాదేమోనన్న సంశయంతోనే తప్ప ఆయన అరెస్టుకు నిరసనగా కాదని, ఆ తరువాత ఆయన అరెస్టుపై జనస్పందన చూసిన తరువాత అర్ధమైంది.

ఇంతకీ వల్లభనేని వంశీ  గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి జరిగిందంటూ ఫిర్యాదు చేసిన తెలుగుదేశం కార్యాలయంలో డీటీపీ ఆపరేటర్ గా పని చేసిన సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో పోలీసులు వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసిన వల్లభనేని వంశీ, ఆ కేసు వెనక్కు తీసుకోవాలని బెదరించారన్నది పోలీసుల అభియోగం. ఈ విషయంలో  వల్లభనేని వంశీ అడ్డంగా దొరికిపోయాడు. దాడి కేసులో ఫిర్యాదు ఉపసంహరణకు సత్యవర్ధన్ ను వంశీ స్వయంగా కారులో తీసుకువచ్చిన ఫుటేజీలు ఉన్నాయి. దీంతో క్షణం ఆలస్యం చేయకుండా పోలీసులు వంశీని అరెస్టు చేశారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ఒక ప్రశ్న వినిపిస్తోంది. వల్లభనేని వంశీ అరెస్టు సరే.. మరి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని వంతు ఎప్పుడన్నదే ఆ ప్రశ్న. ఈ ప్రశ్న ఉత్పన్నం కావడానికి కారణం ఉంది. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ ఇరువురికీ ఓ ప్రత్యేకత ఉంది. ఇద్దరూ మంత్రి మిత్రులు. ఇద్దరి రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైంది. అంతకు ముందు ఇద్దరూ తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు.  కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కు మంచి మిత్రులు. ఇద్దరూ కూడా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో పని చేశారు. కొడాలి నాని గుడివాడ నియోజకవర్గం నుంచి 2004లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

వల్లభనేని వంశీ 2009లో విజయవాడ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో  పరాజయం పాలయ్యారు.  కొడాలి నాని మాత్రం 2009లో కూడా గుడివాడ నుంచే పోటీలో నిలిచి తెలుగుదేశం తరఫున విజయం సాధించారు.  ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగింది.  2014 ఎన్నికలు వచ్చే సరికి కొడాలి నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ గూటికి చేరారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా గుడివాడ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. వంశీ మాత్రం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. 2014 ఎన్నికలలో గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.  2019 ఎన్నికలో కూడా అదే జరిగింది. కొడాలి నాని గుడివాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. గన్నవరం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా వల్లభనేని వంశి గెలుపొందారు. ఇరువురూ పార్టీలు వేరైనా మంచి మిత్రులుగా కొనసాగారు.  2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై.. రాష్ట్రంలో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో వల్లభనేని వంశి జగన్ కు మద్దతు తెలుపుతూ  వైసీపీ గూటికి చేరారు. కొడాలి నాని జగన్ తొలి కేబినెట్ లో  మంత్రి పదవి దక్కించుకున్నారు.  

అప్పటి వరకు వేరే పార్టీలో ఉంటున్నా.. కొనసాగిన వంశీ, నానిల స్నేహబంధం, వంశీ తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరడంతో మరింత గట్టి పడింది. వాస్తవానికి కొడాలి నాని ప్రభావంతోనే వంశీ వైసీపీ గూటికి చేరారు.  ఆ తరువాత వల్లభనేని వంశీ, కొడాలి నాని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ టార్గెట్ గా ఇష్టారీతిగా విమర్శలు వ్యాఖ్యలూ చేస్తూ పెట్రేగి పోయారు. లోకేష్ పై అయితే ఆయన వ్యక్తత్వ హననమే లక్ష్యమన్నట్లుగా విమర్శలు, వ్యాఖ్యలూ చేశారు.  అక్కడితో ఆగకుండా చంద్రబాబు భువనేశ్వరిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.  

ఆ తరువాత 2024 ఎన్నికలో వైసీపీ ఘోరంగా ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబుబు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అప్పటి నుంచీ విరిద్దరినీ అరెస్టు చేయాలి అన్న డిమాండ్ తెలుగుదేశం వర్గాల నుంచే కాకుండా, వీరి దాష్టికాల కారణంగా బాధితులుగా మారిన ప్రజల నుంచి కూడా గట్టిగా వినిపించింది. అయినా గత ఎనిమిది నెలలుగా అదిగో, ఇదిగో అనడం తప్ప వీరి అరెస్టు జరగలేదు. ఒక దశలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేతకాని తనం వల్లనే కొడాలి నాని, వల్లభనేని వంశీ స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారని తెలుగుదేశం శ్రేణుల నుంచే విమర్శలు వినవచ్చాయి.  తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వీరిద్దరి మీద కేసులు తెరపైకి తెచ్చారు.  అయితే అరెస్టు మాత్రం చేయలేదు. ఈ నేపథ్యంలోనే వల్లభనేని అరెస్టు పట్ల తెలుగుదేశం వర్గాలలోనే కాకుండా గన్నవరం నియోజకవర్గ ప్రజలలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో వల్లభనేని వంశీ అరెస్టు సరు.. కొడాలి నాని వంతెప్పుడు అన్న ప్రశ్నలూ వినవస్తున్నాయి. 

By
en-us Political News

  
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవ‌ల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ త‌గిలి తీవ్రంగా ఇబ్బంది ప‌డ్డారు. కోలుకుని ఆయ‌న మండ‌లికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాద‌రంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడ‌లు బండ్లు అవుతాయి. బండ్లే ఓడ‌ల‌వుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవ‌స‌రం తీరిపోయిన త‌ర్వాత విసిరేసిన తెడ్డే.. చివ‌రికి ప‌డ‌వ బోల్తా ప‌డ్డ‌ప్పుడు దిక్క‌వుతుంది. అన్న‌దానికి జ‌గ‌న్ అప‌రిప‌క్వంతో కూడుకున్న రాజ‌కీయ విధానాలే ఉదాహ‌ర‌ణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జ‌రుగుతుందో పవన్ కల్యాణ్ విడ‌మ‌ర‌చి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫ‌కేష‌న్ జారీ చేయ‌గానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయ‌కుడు, మాజీ హోం మంత్రి మ‌హ‌మూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ త‌ర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవ‌రిని ఎమ్మెల్సీ చేయాల‌ని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం న‌రేంద‌ర్ రెడ్డి.. నేడు ఆయ‌న రాజ‌కీయ స‌ల‌హాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్ద‌ల స‌భ‌లోకి స‌గ‌ర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.