ఏ దేశమేగినా దీదీ .. దీదీనే !

Publish Date:Mar 25, 2025

Advertisement

ఏ దేశ  మేగినా, ఎందు కాలిడినా .. మమతా బెనర్జీ.. మమతా బెనర్జీనే. ఆమె మారరు.ఆమె వేషం అసలే మారదు. అదే ముతక చీర, అవే స్లిప్పర్స్. అదే నడక, అదే పరుగు. సహజంగా రాజకీయ నాయకులనే కాదు, మాములు మనమే అయినా విదేశాలకు వెళ్ళినప్పుడు, వేషం మార్చేస్తాం. సూటూబూటులోకి మారిపోతాం.నిజానికి విదేశాలకే వెళ్ళ నక్కర లేదు,  పెళ్ళికో పేరంటానికో వెళ్ళినా అంతే. సందర్భాన్ని బట్టి డ్రెస్ కోడ్ మారి పోతుంది. ఇక ఆడ వారి విషయం అయితే చెప్పనే అక్కర లేదు. కానీ, మమతా దీదీ  అలాక్కాదు. ఇక్కడ ఉన్నా, ఎక్కడికైనా వెళ్ళినా అంతే. ఆమె వేషం మారదు.  

అవును. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు,  మమతా దీదీ ప్రస్తుతం లండన్‌  పర్యటనలో ఉన్నారు. పెట్టుబడుల కోసమే వెళ్ళారో, ఇంకెందు కోసం వెళ్ళారో ఏమో కానీ, పొద్దున్నే లేచి, ఆమె బస చేసిన హోటల్  కు దగ్గరలో ఉన్న హైడ్ పార్క్ లో వాకింగ్ కు వెళ్ళారు. అయినా.. ఆమె వేషం మారలేదు. అదే చీర, అవే చెప్పులు. ఆమె వెంట సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు కూడా ఉన్నారు. అయితే  ఆ  బృందంలోని  ఆడ, మగ సెక్యూరిటీ అధికారులు అందరూ అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా.. కోట్లు .. బూట్లు వేసుకుని నడిస్తే.. మమతా దీదీ మాత్రం మాములుగా చీరకట్టులో, స్వెటర్ మాత్రం వేసుకుని, కాళ్ళకు ఎప్పటిలానే స్లిప్పర్స్  మాత్రమే వేసుకుని కోల్ కతా వీధుల్లో నడిచిననట్లే చక చకా నడుస్తూ వాకింగ్ తో పాటు జాగింగ్ చేశారు. ఆమె వెంట ఇంగ్లాండ్ వెళ్ళిన  తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత కూనాల్ ఘోష్ మమతా దీదీ నడక వీడియోను తన అధికారిక ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది. ఇప్పుడే కాదుట, గతంలోనూ ఆమె విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా  వేషం ఎప్పుడు మార్చ లేదుట. 

అయితే  ఇలా ఏ దేశం వెళ్ళినా, మన దేశానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు సహా ఏ దేశాధినేత వచ్చినా, ఎక్కడ ఎవరితో ఉన్నా మున్నూట అరవై రోజులు వేషం మార్చని మరో ముఖ్యమంత్రి ఉన్నారు, ఎవరో తెలుసు కదా, ఎస్, మన ఆంధ్ర ప్రదేశ్ సిఎం  నారా చంద్రబాబు నాయుడు. ఆయన కూడా  అంతే. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అనేక దేశాల్లో పర్యటించారు.  బిల్ క్లింటన్ వంటి అనేక మంది దేశాధి నేతలతో దెశ విదేశాల్లో వేదికలు పంచుకున్నారు. అయినా, ఎప్పుడూ ఆయన వేషం మార లేదు. నిజానికి, చంద్ర బాబును మరో రూపంలో మరో వేషంలో ఉహించుకుందామన్నా నో ఛాన్స్. అవును, చంద్రబాబు మాములుగా అందరిలానే  ప్యాంటు,షర్టు ధరిస్తారు. షూస్ వేసుకుంటారు. కానీ, ప్యాంటు, షర్టు కలర్ మారదు. చిత్రం ఏమంటే కొలతలు కూడా  మారవు. అవును, 70 ప్లస్ లోనూ ఆయన శరీర కొలతల్లో పెద్దగా మార్పు కనిపించదు. బహుశా ఆయన పాటించే ఆహార నియమాలు, వ్యాయామం, జీవన శైలి, ఇందుకు కారణం కావచ్చును.

ఇదే కోవకు చెందిన మరో ముఖ్యమంత్రి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్. అయితే ఈయన కట్టేది కాషాయం. అవును, ఒకప్పుడు రాజకీయ నాయకులు, ముఖ్యంగా కాంగ్రస్ నాయకులు ఖద్దరు ఒక్కటే కట్టే వారు. ఇప్పడు టీ షర్టులు, జీన్స్ పాంట్స్ తో పార్లమెంట్’కు వస్తున్నారు. సరే అది వేరే విషయం అనుకోండి.  చివరగా, మనకు స్వాతంత్ర్యం తెచ్చిన  జాతి పిత మహాత్మా గాంధీ చివరి వరకు  కొల్లాయి మాత్రమే కట్టారు. అవును కొల్లాయి కడితేనేమి మా గాంధీ’ అనిపించుకున్నారు. ప్రాతః స్మరణీయులయ్యారు.

By
en-us Political News

  
తెలంగాణ  కొమురం భీం ఆసిఫా బాద్ జిల్లాలో ఓ యువకుడు పక్క పక్క గ్రామాలకు చెందిన ఇద్దరు యువతులను ఒకేసారి ప్రేమించాడు. ఇద్దరు యువతులను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు అనుకుంటే పొరబడినట్టే. ఇద్దర్ని ప్రేమించానని ఆ యువకుడు ప్రేమించిన యువతులకు చెప్పినప్పటికీ ఆ యువతులకు కోపం రాలేదు. మేమిద్దరం నిన్ను పెళ్లి చేసుకుంటామన్నారు.  లింగాపూర్  మండలం గుమ్మూర్ కుచెందిన సూర్యదేవ్   ఇద్దరు యువతులను ఒకే సారి పెళ్లి చేసుకుంటానని అనౌన్స్ చేశాడు.
తెలంగాణలో అత్యంత కీలకమైన ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలన్న ప్రతిపాదనను కేంద్రం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఆ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే అవకాశాలు ఇసుమంతైనా లేవని తేల్చేసింది. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇచ్చే ప్రశక్తి లేదని కేంద్రం స్పష్టం చేసింది.
దేశంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్రమోడీ నంబర్ వన్ గా నిలిచారు. ఒక ఆంగ్ల దినపత్రిక 2025 సంవత్సరానికి దేశంలో వంద మంది మోస్ట్ పవర్ పుల్స్ ఇండియన్స జాబితాను వెలువరించింది. ఈ జాబితాలో ప్రధాని మోడీ టాప్ లో నిలిచారు. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తరువాత వరుసగా మూడు సార్లు ప్రధానిగా ఉన్నది మోడీ మాత్రమే.
   హైద్రాబాద్ బంజారాహిల్స్ లో ఆకతాయి తుపాకీతో భయభ్రాంతులకు గురి చేశాడు. శుక్రవారం అర్దరాత్రి కొందరు యువకులు ఓ పెన్ టాప్ జీప్ లో చేసిన రచ్చ సృష్టించారు.  ఏకంగా జీపు డ్యాష్ బోర్డుపై తుపాకీకి ఉంచి చేసిన విన్యాసాలను చిత్రీకరించారు. ఈ విజువల్స్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వచ్చింది. సుమోటాగా స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలో సొంత ఇల్లు నిర్మించుకోనున్నారు. ఇందు కోసం ఆయన వెలగపూడిలో ఐదు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఈ6 రోడ్డుకు ఆనుకుని ఉండే ఈ స్థలానికి నాలుగువైపులా రోడ్డు ఉంది.
భారత రాజకీయాలలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనం. ఒక ప్రభంజనం. రాజకీయాలలోనే సంక్షేమ పర్వానికి తెరతీసిన సందర్భం. దేశంలోనే ప్రాంతీయ పార్టీలకు ఒక మోడల్. ఒక ఆదర్శం. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఎకఛత్రాధిపత్యానికి చరమగీతం. సరిగ్గా 43 ఏళ్ల కిందట ఇదే రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఆవిర్భావమే ఒక ప్రభంజనం.
వరుస ఎన్ కౌంటర్లతో ఛత్తీస్ గఢ్ దద్దరిల్లిపోతున్నది. తాజాగా శనివారం (మార్చి 28) ఉదయం చత్తీస్గఢ్ లోని దంతెవాడ, సుక్మా జిల్లాల సరిహద్దులో  జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 15 మంది మావోయిస్టులు మరణించారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఒకరోజు పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ గన్నవరం కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా కు పరిచయమ అవసరం లేదు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సోదరి. అంతే కాదు, గతంలో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన వయనాడ్ ( కేరళ) నియోజక వర్గం ప్రస్తుత ఎంపీ ప్రియాంక. 2024 ఎన్నికల్లో రాహుల గాంధీ వయనాడ్ తో పాటుగా ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా గెలిచారు.
అధికారం కోల్పోయిన తరువాత వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీ కీలక నేతలు ఒకరి తరువాత ఒకరుగా పార్టీకి రాజీనామా చేసి కూటమి పార్టీలలో సర్దుకుంటున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం (మార్చి 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 9 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
వైకాపా హయాంలో ప్రభుత్వ వేధింపులకు గురై మరణించిన వైద్యుడు సుధాకర్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి శుక్రవారం ఎస్సీ  ఎస్టీ కోర్టులో షాక్ తగిలింది. టిడిపి కార్యాలయంపై దాడి కేసులో నిన్న సిఐడి కోర్టు  వంశీకి బెయిల్ ఇవ్వడానికి   నిరాకరిస్తే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్దన్ కిడ్నాప్ కేసులో ఎస్సీ ఎస్టీ కోర్టు  ఇవ్వాళ వంశీకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. బాధితుడు సత్యవర్దన్ తరపు న్యాయవాది వంశీకి బెయిల్ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.