ఐటీ కంపెనీలో లైంగిక వేధింపులు...బలవంతపు మత మార్పిడి!

Publish Date:Apr 12, 2026

Advertisement

 

మహారాష్ట్రలోని నాసిక్‌లో గల ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయంలో చోటుచేసుకున్న లైంగిక వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. కార్యాలయంలో మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, వారిని మత మార్పిడికి ప్రేరేపించారనే సంచలన ఆరోపణలు వెలుగులోకి రావడంతో యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఉద్యోగులను కంపెనీ తక్షణమే సస్పెండ్ చేసింది.

ఈ వ్యవహారంపై నాసిక్ పోలీసులు ఇప్పటికే గట్టి నిఘా ఉంచారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఆరుగురు టీమ్ లీడర్లు సహా ఒక హెచ్ఆర్ (HR) అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా మహిళా ఉద్యోగులను టార్గెట్ చేస్తూ గత కొన్నేళ్లుగా ఈ అకృత్యాలు సాగుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ దారుణాలపై లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది.

బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కార్యాలయంలో కొందరు సీనియర్ ఉద్యోగులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, వారిని గొడ్డు మాంసం తినాలని, నమాజ్ చేయాలని ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపులపై గతంలోనే అంతర్గత ఫిర్యాదులు చేసినప్పటికీ, అప్పట్లో హెచ్ఆర్ విభాగం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించిన మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్, ఇది కేవలం వేధింపులకే పరిమితం కాలేదని, దీని వెనుక పెద్ద రాకెట్ ఉండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

టీసీఎస్ యాజమాన్యం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ సంస్థలో వేధింపులకు తావులేదని, ఉద్యోగుల భద్రతే తమకు ప్రాధాన్యమని స్పష్టం చేసింది. పోలీసుల విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం సిట్ అధికారులు బాధితుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేస్తున్నారు. 

ఈ ఉదంతంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. కార్పొరేట్ రంగంలో మహిళా భద్రతపై ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని ఐటీ ఉద్యోగుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

By
en-us Political News

  
ప్రపంచానికి పెద్దన్నగా తనను తాను అభివర్ణించుకునే అమెరికా ఇరాన్ సంబంధిత సైనిక చర్యల కోసం అక్షరాలా 37.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది. ఇది ఇండియన్ కరెన్సీలో  3.6 లక్షల కోట్లు.
నిరసనలో పదివేల మంది వరకు నిరసనకారులు పాల్గొనే అవకాశం ఉందని ఢిల్లీ పోలీసులు అంచనా వేశారా. అయితే ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ.. భారీ సంఖ్యలో యువత, విద్యార్థులు, మహిళలు రోడ్లపైకి రావడంతో రాజధాని వీధులు జనసంద్రంగా మారిపోయాయి.
డోనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా చేసిన ఈ ప్రకటన మేరకు వచ్చే నెల 1 నుండి రెండేళ్ల పాటు అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని రకాల జనరిక్ ఔషధాలపై సుంకం సున్నా శాతంగానే కొనసాగుతుంది. అయితే ఈ రెండేళ్ల వ్యవధి ముగిసిన వెంటనే, మొదటి ఏడాదిలోనే దిగుమతి సుంకాలను 100 శాతానికి పెంచుతారు. ఆ తర్వాత వచ్చే ఏడాదికి ఈ సుంకాన్ని 200 శాతానికి పెంచుతామని ట్రంప్ హెచ్చరించారు.
అలాగే బహ్రెయిన్‌లోని దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ ప్రధాన డేటా సెంటర్‌ను కూడా ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ దేశ పౌర వసతులపై అమెరికా దళాలు జరిపిన దాడులకు తగిన రీతిలో జవాబు చెప్పడానికే ఈ సాంకేతిక కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఈ ఆరోపణలు, క్షిపణి దాడి ఘటనను అమెజాన్ కానీ, బహ్రెయిన్ ప్రభుత్వం కానీ ధ్రువీకరించలేదు.
బాబాయ్ త్వరగా కోలుకోవాలంటూ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు క్షణాల్లో వైరల్ అయ్యింది. బాబాయ్ పట్ల ఎన్టీఆర్ చూపించిన ఈ ప్రేమాభిమానాల పట్ల నందమూరి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో గత కొన్ని నెలలుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ముంబై నటి కాదంబరి జత్వాని వ్యవహారం
తన ఆరోగ్యం, ఆసుపత్రి అనుభవాల గురించి తాజాగా నెట్టింట షేర్ చేసిన పోస్టు ఆయన అభిమానులను, సినీ వర్గాలనూ కలవరానికి గురి చేసింది. ఆసుపత్రి వాతావరణం, శస్త్రచికిత్స, అనంతరం ఐసీయూలో వైద్యుల నిరంతర పర్యవేక్షణ వంటి కష్టతరమైన దశలను ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో జరుగుతున్న శ్రీ జగదాంబికా అమ్మవారి బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు విస్తృత స్థాయిలో ట్రాఫిక్ బందోబస్తు చేపట్టారు.
ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించిన రాహుల్, ఖర్గే..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో జాతీయ రాజకీయం అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛలో సంసద్ పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఉత్తరాంధ్ర ప్రాంత ప్రగతికి ఊపిరి పోసేందుకు తమ జీవనాధారమైన భూములను ప్రభుత్వం సేకరించడానికి సహకరించిన రైతులకు కృతజ్ఞతగా, గౌరవంగా భోగాపురం విమానాశ్రయం నుంచి ఉచితంగా ఒకసారి విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు. ఈ మేరకు ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.